Skip to main content

Full text of "Andhrula Sanghika Charithra Suravaram Pratap Reddy"

See other formats


Barcode - 9000000000373 

Title - Andhrula Sanghika Charithra -1 

Subject - LANGUAGE. LINGUISTICS. LITERATURE 
Author - Sri Suravaramu Prathapa Reddy 

Language - Telugu 

Pages - 440 

Publication Year - 1950 

Creator - Fast DL Downloader 

https ://github.com/cancerian0684/dli-downloader 
Barcode EAN.UCC-13 


||| | 


ఆంధ్రుల సాంఘక చరిత్ర 


శ్రీ నురవరము పతాప రెడ్డి 


Sole Distributors : 
HYDERABAD BOOK TRUST 
3ఈ 694, Himayatnagar, 
HYDERABAB.-.500 023. 


నురవరము (పతాపరెడ్డి 
సాహిత్య వైజయంతి (పచురణ 


హదరాబాదు ఎ 1, 
క్‌ 


3 Ba 
(ఓ న : 
రో i 
క ws ' గ్ల 
ఖ్‌ 
naw 0 
' 
| 
/ 
4 
‘ 
॥ 
ఇ 
4 
౭ 
ఎ 
CL న! 
స్ట my క 
॥ 
. 
ఇ న క 
శ్‌ కట్ట . .' 
ననన ఇ క శ 
| న ద... స 


వరము (ప్రతాపరడీ 


ప్రథవు ముద్రణ రిక 


పూర్వకాలమందు హిందువులాధ్యాత్మ చింతాసాగరనున తల మున్క-లు 
వేయుచు ఇహలోక విషయాలపై స్పృహ తప్పినవారై చరితలు (వాసి పెట్టు 
నాచారము లేనివారై యుండిరని యూరోపుఖండ పండితులు [వాయుట పరిపాటి 
యైపోయినది. తర్వాత వారి పరిశోధన మూలముననే అసంఖ్యాకములగు 
చరిత్రాత్మక (గంథాలు వెలువడెను. అనేక పుస్తకాల జాడ లీనాటివరకు పరి 
శోదకులకు కానరాలేదు, ముసల్మానువిజేత లనేక పు స్తకాలయనులను, దేవా 
లయములను, విద్యాపీఠ ములను ధన్షింసము చేయునప్పు డందలి [గంథిలను 
కాల్చిరి. ఈ విధముగా మన చర్మితకు ఆపారనష్టము కలిగెను. 


పాళ్చాత్యులు నేటివరకు [వాసిన చరితలు, రాజుల చరి +లు, ఎనిమిదవ 
హెసీకి ఏడ్లురు భార్యలనియు, ముప్రైయేండ్త యుద్ధము అముక శిథులందు 
జరిగెననియు ౧౭౪౮, హిందూస్తాన చరితలో (పసిర్ధి యనియు, కాతరీన్‌ 
రష్యా చక్రవర్తిని కింద రువభర్తలుండిరనియు చర్మితలో మరచిపోకుండా 
పాయుదురు. వాటివల్ల మన కేమిలాభం? రాజుల యుద్దాలు, తంశాలు, 
దౌష్ట్యాలు, సంఘానికి నష్టము కలిగించినట్టివే ఈ విషయము నిటీవల గురర్షించి 
పాళ్చాత్యులు సాంఘిక చర్మిత కెక్కుడు [ప్రాధాన్య మిస్తున్నారు. ఇదియే 
సరియగు పద్ధతి, 


రాజుల చరితలు మన కంతగా సంబంధించినవి కావు, సాంఘిక చరితలు 
మనకు పూర్తిగా సంబంధించినట్టివి ఆవి మన పూర్వుల చరితను మనకు 
తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో మన అవ్వలు ఎట్టి 
సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంక రణములతో నుండిరో, మన పూర్వులే దేవత 
లను గొలిచిరో, ఏ విళ్వాసాలు క లిగియుండిరో, ఏ యాటపాటలతో వినోడించిరో, 
దొంగలు, దొరలు దోవీడీలు చేసినప్పుడు శామాదీళ బాధలు కలిగినప్పు డెటుల 
రక్షణము చేసుకొసిరో, జాడ్యాల కే చికిత్సలు పొందరో, ఎట్టి కళఒందు (పీతి 
కలవార్రె యుండిరో, ఏయే దెళాలతో వ్యాపారాల చేసిరో రఒన్ని తలుసుకొన 
పలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి 


vi 


ముందు వచ్చువారు తెలుసుకొన నధిలషింతురు. తేలిన సారాంశ మేమన సాంమక 
చర్మిత మన చరిత్రయే ! మనముకూడ చర్విత కెక్క దగినవార మే !! అలాఉద్దీన్‌ 
లిల్లీ, బొరంగజేబు ఆసఫజా చర్మితలకంటే మన చరితలు మాాతము తక్కువ 
వై నవా? మనము వారివలె ఘోరాలు చేసినవారము కొము కాన బహుళ మనమే 
మెరుగేమో | 


థో సాంఘిక చరిత మానవ చర్మితి - ప్రజల చరిత, ఆది మన సొంతి 
కథ !! ఆది జనుల జీవ నమును (పతి శతాబ్దమం దెట్లుండెనో తెలుపునట్టిది.ళ 


pert hats Ee) స 


శా న Pe 


అది మన ౯ తాతముత్తాతల చరిత | వారి యిండ్లు, వారి కట్టు, వారి త్రిండి, వారి 


ఆటలు, వారి పాటలు, వారు = పడిన పాటులు, వారు మనకిచ్చిపోయిన మంచి 
చెడ్డలు, ఇవన్నీ తెలివి మనకు సవాయపడును. న 


ఇంగ్లీషువారు తమ దేశ సాంఘిక చరితను ౨౦౦ ఏండ్లనాడే |వాసిరి. 

నాటినుండి నేటివర కెందరో ఎన్నియో పు పుస్తకా లీ విషయమై (వాసిరి. ఆ పుస్త స 
కాలలో ౫౦౦ వండ్లనుండి తమ పూర్వు  లెట్టివారో, వారి పరి, శమ లెట్టివో 
తెలుపు పటాలు నరక ము|దించినారు. తమ దేశమును గురించియే కొక, 
[ప్రపంచమం చితరుల చర్మితలను గూడ వారు వాసి (పకటించినారు. మన 
చెంచులను గురించి, సహారా ప్రాంతపు నగ్నలను గురించి, ఆ(ఫికొ కాఫిర్హను 
గురించి, ఆసాం నాగులను గురించి కాంతి మహాసాగర మందలి కొన్ని దీవు 
లందలి మనుష్య భక్షకుల (రాక్షసుల! ను గురించి, ఉ త్రర|ధువ పాంతాలలో 
ఆరు నెలలు చీకటి ఆరు నెలలు ఎండలో జీవించు ఎసి మోలను గురించి యిట్టి 
సహ్మసాధిక విషయాలను గురించి తెలుసుకొనవలెనం టే మసకు ఇంగ్లీషు [శారద 
నీర దెందు) శారదయే ఉపాస్య యగును. ఆందలి సారస్వతమందు సర్వజ్ఞత 
కలదు. ఇంగ్లీషులో మానవజాతి కథ (5100 Of all nations) అనేక బృహ 
తృంపుటములలో సచ్మితముగా ముదింపబడి బహుకాల మయ్యెను. దానినై నను 
మనము తెనుగులోనికి తెచ్చుకొన్నామా? 


మన బళ్ళలో విద్యార్థులకు చదివించే చర్మితలలో చాలా కల్మషము 
కలదు. పాలలో విషముసి పడినది । ఇంగ్లీషువారు తమ ఘనతను భారతీ యుల 
కొంచెపుదనమును నిరూవీంచునట్టుగా చరితలు _వాసిరి. ముస్తిములలో పూర్వము 
ఫిరిషా అబద్ధాలతో తనచర్మితను ! నింపెను. బాబగు హిందూద్వేషముతో వా సెను. 
నేడును ఉస్మానియా విద్యాపీళమందును చిన్న తరగతులనుండి బి. ఏ. వరకు 


vii 


హిందూ దూషణగల హాషిమీ అనువానిచే రచితమగు హిందూస్థాన చరితను 
చదివిస్తున్నారు, హిందూ మతాభిమానులు [పపంచ మంతటను తమ పూర్వులే 
ఘనులని కొన్ని చరిితలను |వాసిరి. ఇవన్నియు పాక్షికము లగుటచే అనాదర 
ణీయము లగును. ఇటీవల సరియగు భారతీయ చరి|తిను |వాయించుటకై జాతీయ 
నాయకులు సమాలోచనలుచేసి ఆందు గు_ప్పరాజుల చర్మితను (పకటించిరి. 
ఆది యాదర్శమగు చరిత (గంధము. ౧౯౪౯ సంవత్సరముళో |పకటితమైన 
శీ మల్రంపల్లి సోమశేఖర శర్మ గారి“ రెడ్డిరాజా; ల చరి త”అను ఇంగ్పషు గంథము 
కూడ అట్టి దే. 


మన దేశమందలి ఆటవికులగు చెంచు, ముండా, గోండు, సంతాల్‌, 
నాగులు మున్నగువారిని గూర్చి బహు [గంథాలు కలవు. మన దేశములోని 
కులములను గూర్చి థర్‌స్టన్‌ (THURSTON’S Castes and Tribes of 
South India\ ఎడు పెద్ద సంపుటాలు పకటించెను. హై! హా! దాబాదు రాష్ట్ర మందలి 
కులాలను గూర్చి సిరాజుల్హ సన్‌ అనునతడు పెద్ద !గంథాన్ని పక టించెను. 
భారతీయ పాచీన జాతుల (Tribes of Ancient India) ను గూర్చి ఒక 
బెంగాలీ |వాసెను ఈ విధముగా కొన్ని |గంథాలు వెలువడెను కాని జనుల 
సాంఘిక చరితలు |పత్మేకముగా [ప్రకటిత మగుట అరుదు. 


' మన తెలుగులో సాంఘిక చరితలు లేవు. వాటిని వాయవలెనని పలు 
వురు సంక ల్పించినట్లున్నది. చిలుకూరు వీరభదరావుగారు ఆం|ధుల చరితము 
రెండవ భాగములో వెలమ వీరుల చరిత (పకరణాదిలో (పు ౨౭౧) పుట 
అడుగున నిట్లు వాసెను, 


“ఆం(ధుల సాంఘిక చరితము [పత్యేకముగా విరచింపబడుచున్నది. 
కావున నీ విషయమై (వెలమాది జాతుల విషయమై) యిందు సవి స్తగముగా 
జర్చింపబడును," 


అ చరితను నాయనేలేదేమో ! వాయ సంకల్పించియుందురు. అట్టి 
సిద్ధహస్తుని వాత మనకు లభింపదయ్యెను. ఆదే విధముగా పలువురు [వాయ 
సంకల్పించినట్ల్టున్న ది. శ్రీ నేలటూరు వేంకట రమణయ్యుగారి వ్యాస మింగ్లషులో 
ఆం[ధ చరిత్ర పరిశోధక సంఘ పత్రికలో కీ, శ. ౧౯౩౮లో ముదిత మైనది, 
నే నీ [గంథములోని నాల్లవ [వకరణము |వాయునప్పుడు దానిని చూడ దటస్థిం 
చినది, నేను నిర్ణయించుకొన్న మార్గములనే వారు సూటిగా వాటినే సూచించి 


viit 


నారు. ఆదే పద్ధతులపై (శ్రీ మల్లంపల్లి సోమశేఖరళర్మగారును తమ రెడ్డి రాజ్య 
చరిత్ర మందలి సాంఘిక చరిత భాగమును రచించినారు. పెదపాటి ఎర 
నార్యుని మల్హణ చరిత కావ్య పీఠికలో నిట్లు (వాసినారు. 


“కృష్ణరాయ యుగమునకు విమ్మట ఆంధుల పరాక్రమ పౌరుషము 
లెట్లు శ్షీణించినవో ఆదరాఖిరుచులును అట్లే కుంటువడినవి. ఆందువలన ఆ 
యుగమున (పఖవిల్లిన కావ్యసంతతి అత్యు త్రమమైనది కాక పోయినప్పటికిని ఆ 
యుగమందలి సాంమిక జీవనమును, పజాఖిరుచిని (పతిబింబించునట్టివి, ఈ 
దృష్టితో మనము చూడగలిగినప్పుడు ఏకవి రచించిన కావ్యమైనను శిధిలము 
కాకుండ రక్షించుట మన బాధ్యత యని తేటపడును.” 


పలువురు మన పూర్వుల సాంఘిక జీవనమును గూర్చి ముఖ్యముగా 
[కీడాఖిరామాధారముపైె కొన్ని వ్యాసాలు వాసిరి. కాని సమ[గమగు ఆం'ధుల 
చరిత ఇంతవరకు వెలువడలేదు. నేను మే నెల ౧౯౨౯ లో హైదాబాదు 
, మండి వెలువడుచుండిన “సుజాత” మాస పతికలో “తెనాలి రామకృష్ణుని కాల 
మందలి ఆం(ధుల సాంఘీక జీవనము” ఆను వ్యాసమును కేవలము పాండుకంగ 
మాహాత్మ్యమలోని వర్ణనల సమయ సందర్భములనుబట్టి విషయములను తేల్చి 
వాసితిసి, ఆ పద్ధతి నాకు సరిగా కనబడెను, ఆ జాడను బట్టుకొని అప్పు 
డప్పుడు కాకతీయుల కాలమందలి సాంఘిక చరిత, కృష్ణరాయల కాలపు 
సాంఘిక చరి] త్క కదిరీపతికాలపు సాంఘిక చర్విత, రెడ్డియుగపు సాంఘికచరి[త, 
ఆంధ దశకుమార చరితము తెలుపు తెనుగువారి సాంఘిక చరిత మొదలగు 
వ్యాసాలను (వా గస్సిని. తత్పరరవసానమే యీ.గంథము. 


ఆం(ధులకు | పత్యేక చరిత యేల? వారికి భారతీయ హిందువుల నుండి 
భిస్నించిన సంస్కృతి (Culture) కూడ కలదా? యని తెలంగాణము లో ఆంధ 
సభలో ౧౨ ఏండ్ల నా డొక వాదము బయళ౬దేరెను. అప్పుడు (కీ. శ, ౧౯౩౭ 
ఈశ్వర పుష్యము) ఆంధ సంస్కృతి యను వ్యాసమును [పకటించి యుంటిని. 
ఆందిట్లు వౌసితి. 


అ ఒర 


“ఆం(ధత్వ మాం|ధభాషా చ । నొల్పస్య తపనః ఫలం॥ ”" 
అని తమిళుడగు అస్పయ్య(ర్‌) దీక్షితులు |వాసిరి, ౩౦౦ వీండ్ర |కిందటనే 
తమిళ (పసిద్ధ పడితునికి ఆం|ధత్యమందు భిన్నత్వము కానవచ్చెను men 
సంస్కృతి యనగా నాగరికత, లలితకళలు, సారస్యతము, సభ్యత, దై నంది 


IX 


నాభివృద్ధి మున్నగును త్రమగుణము లన్నియు కలసిన విశిష్టగుణము, ..ఆంధు 
లకు (పత్యేక సంస్కృతి కలదు ఆం(ధుని, అరవను, బరీ పఠానును 
చూచిన వెంటనే వీరు వీరని వేరుపరుపవచ్చును. ఎందుకు? అది వారి వేష 
భాషలను బట్టియే ! అందుచేత ఆ సకల భాషావాగనుకాసనులు, స్వస్థాన వేష 
భాషా ఖిమతా ; సంతో రస|పలుబ్ర ధియః అని సెలవిచ్చిరి. ఆంధదుల నుండి 
వారి భాష, భాషలోని నుడికారము, వారి భావములు, వారి శిల్పకళ, వారి పల్లె 
పాటలు [01% Song)s, కథలు (Folk Tales), విశ్వాసములు, వారి చరత. 
వారి సాంఘీకా చారములు, తీసివేసిన, రేపే వారుఅడ విజాతులలో కలిసిపోగలరు. 
ఇతరులలోని ఉత్తమ కళలను స్వీకరించి తమవాటితో మేళవించి తమవిగా చేసు 
కొనుట నాగరిక లక్షణము. విజయనగర స|మాట్లులు, మధురా, త౦జాపురీ 
నాయక రాజులును, హిందూ మ సిం రిల సమ్మెళ నము గావించి (పత్యేకాం ధ 
శిల్పమును స్టాపించిరి. ఆం్యధులు తమ భాషకు శావ్యతను సమకూర్చి కర్ణాటక 
సంగీతమను పేరుతో ఖ్యాతిగాంచిన కళను దక్షిణాపథ్రము* కంతటికిని _పసా 
చించిరి, మళ .తనాళ్లములో కథాకళి, గుజరాతులో గర్భన్శత కము, ఉతర హిందూ 
స్థానములో రామలీల్క, కథక్‌ నృత్యము, ఆసాములటో మణీిపురీ- నృత్యము 
మున్నగు వశిష్ట వై వై ఐధ్య నృత్యాలు భారతదేశ మందలి నాన్నాపాంతాలలో నే విధ 
ముగా వెల సెనో | ఆంధు లందున కూచిపూడి భాగవతులచే పరిరక్షితమెన 
న ఎత్యమునకు పత్యేకత కలదు. రామప్ప గుడిలోని నృత్యశిల్పమ లు వ్రాయ 
సేనాని నృత్య రత్నాక రానికి ఉదాహర ణములు, 
హిందువు లందరికిని పండుగలు పబ్బమలు ఓకకు యన వీలులేదు. 
జొ త్తరాహులకు హోలీ, వసంత పంచమీ పత్యేకాభిమతములు. తమిళులకు 
పొంగల్‌ పండుగ ముఖ్యము. అటులే ఆ. (ధు౬కు ఉగాది, ఏరువాక పున్నమి 


భొరలి దేశమం వ్‌ కొటక్‌ ల [పాంతములో ఒకొక). విధమగు ఆటలు 
కలవు, తెనుగువారికి ఉప్పన బట్రైలాట, చిల్ల గొడె (బిల్ల గోడు) ఆటలు ముఖ్య 
మైనవి. “ఉప్పనబరధ్ది లాడునెడ నుప్పులు దెత్తురుగాక యాదవుల్‌" అని నాచన 
సోముడు (వాసెను, పులిజూదములు, దొమ్మరి ఆటలు తెనుగువారివే. ఇసి. 
ఆ నాడు తెలిపిన విషయాలలో కొన్ని, అనాటి భావములలో ఈ నా డేమియు 
మార్పు కలుగలేదు. పైగా ఆ భావాలు స్టిరపడినవి, 


X 


హిమాలయమునుండి కన్యాకుమారి వరకుండు వివిధ భాషావర్గముల 
వారిని చూచుచు వెళ్ళిన, అపారమగు వైవిధ్యము అడుగడుగునకు వ్య క్రమగును, 
మళయాళి, ఆరవ, మరాటి, పంజాబీ, బంగాళీ మున్నగువారిని చూచిన 
ఒకరీతో ఒకరు వేషభాషా విశేషములందు పోలినవారు కారు. ఆహార విహారము 
లందును భేదము కలదు. మళయాళీలు బియ్యము, టెంకాయలు తప్ప వేరే 
యెరుగరు. తమిళులకు బియ్యము, పులుసు బాలా యిష్టము. మరాటిలకు రొ భ్రైలే 
కావలెను. బంగాశీలకు బియ్యము, చేపలు కావలెను. కాశ్మీరీలు మాంసము 
లేనిది మాట వినరు. ఇట్టి బహుకారణాలచేత ఆం[ధుల సాంఘిక చర్మితయొక్క 
యావశ్యకత చాలా యవసరమని తోపక మానదు, 


రాజుల రాజ్యాల చరి[త _వాయుట అంత కష్టముకాదు, కాని, సాంఘిక 
చరిత (వాయుట కష్టము, దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, 
శాసనములు, స్థానిక చరి[తలు (కై ఫీయత్తులు), విదేశీజనులు చూచి (వాసిన 
[వాతలు, శిల్పములు, చి తరువులు, నాణెములు సామెతలు, ఇతర వాజ్మయ 
ములలోని సూచనలు, దానప[తములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, 
చాటువులు, పురావస్తు సంచయములు (Collections) = ఇవి సాంఘిక చరితకు 
పనికివచ్చు సాధనములు. 


కావ్య [పబంధాలలో నూటికి కాం పాళ్ళు సాంఘిక చర్వ్మితకు పనికివచ్చు 
నవి కావు. పురాణాలు, మధ్యకాలపు [పబంధాలు ఇందుకు పనికిరావు. ఎందరో 
మహాకవులు వసు మను చర్మితల వంటివి [వాసినవారు మనకు సాయపడరు, 


* గ్రేల్టీ నట చేహ కేకి కేకారవో! న్మేషంబు చెవుల దేనియలు చిలుక” 
(కవికర్ణ రసాయనము) 
వంటి వర్ణనలు మనకు సహాయపడవు, 


“గొంగడి ముసుగుతో గొల్పలు చ్మటాతి = పైని బందారాకు బరిచికొనగ” 
(శుకసప్తతి) 
అన్న వర్షర్తు వర్ణన మనకు చాలా పనికివచ్చును,. 
“తతనితంబాభోగ ధవకాంశుకములోని |; యంగదట్టపు కావిరంగువలన” 
(మనుచరి[త) 
ఆంటే మనకు సరిగా ఆర్థమేకాదు, 


Xt 


"చలువ దువ్వలువ కుచ్చెలయంచు ముత్తెముల్‌ పదనఖ పభకు సలాము 
చేయ” 
(శకస ప్రతి) 


& 1 


అనియంటే ఆ త్రీ కన్నులయెదుట నిలిచి సూర్యకాలమందు మన యువతుల 


విలాస మిట్లుండెనని తెలుపును, 


ఒక్కా క్కమారు కొన్నిపు స్తకాలు పూర్తిగా చదివిన మనకు పనికివచ్చు 
మాటలు రెండో, మూడో దొరుకును. అంతే ? 


సాంఘిక చరిత దృష్టితో జూచిన బహ్ముగంథాలు [వాసిన కూచిమంచి. 
తిమ్మకవి యేమియు సహాయకారి కాడు. మను వను చర్మితకన్న తాళ్ళపాక 
చిన్నన్న ద్వివద పరమయోగి విలాసము చాలా మేలుగా నుండును. ఇందొక్క- 
లావుసమాసము కూడా కానరాదు. కవిత్వము జటిలము, |పౌఢము కాదు. కాని 
అతని వర్ణనలే మన చర్మితకు చాలా ముఖ్యమైనవి, జక్కన విక్రమార్క. 
చరితలో “చక్కని వై దుష్యము” (పదర్శించెను. 


“"కల్పా ంత దుర్గాంత కలుషాంతక్‌ స్వాంత దుర్వారవహ్నికి నోర్వవచ్చు” 
అని '(పళయకాలాఖీలము' గా వాసెను. కాని అందు మన కేదియును పనికిరాదు. 
ఆవే కథలను కొరవి గోపరాజు “ద్వా; తింశత్సాలభ జికా కథలు" అను పేరుతో 
రచించెను. ఆ [గంథము మన కత్యంతముగా సహాయపడును. ఈ విధముగా 
పబంధాలను పరిశోధన చేయవలసి యుండును, ద్వా తింళత్సాలభంజికలో, 
శుకస ప్రతిలో. పండితారాధ్యములో, బసవపురాణములో, |కీడాభిరామములో, 
వెంకటనాథుని పంచతం[తములలో వాడిన చాలా పదాలు నిఘంటువులలో లేవు. 
అందుచేతను సాంఘీక చరితను [వాయుటలో కష్టము కలుగును. ఈ పదాలు 
తెలియకుండిన నేమాయె ననుటకు వీలులేదు. కవులు సాంఘికాచారములను 
వర్తి ంచు తావులందే [పాంతీయ వ్యావహారిక పదాలను, అప్పటి యాచారములను 
తెలుపువాటిని వాడినారు, అందుచేత అవి ముఖ్యమైన వగును 


శాసనములలో పర్వాలు దానాలు, తూకములు, భూమికొలతలు, పొలి 
మేరలు, ఆయములు మున్నగునవి మ్మాతమే తెలియును, స్థానిక చర్మితలో 
చాలా భాగము కల్పితములతో, ఆతిళయో క్రులతో, పుక్కిటి పురాణాలతో నిండి 
యుండును. విదేశియా|తికులు, వ్యాపారులు, రాయబారులు, కాకతీయ విజయ 


877 


నగర కాలాలలోని ఆంధులను గూర్చి కొన్ని [వాసిరి. ఆవి చాలా సహాయము 
చేయును. కాని అందు (వాసిన (వాత లన్నియు నిజ మని నమ్మరాదు. “విజయ 
నగర రాజులు ఎలుకల్క పిల్లుల, బల్లుల తినిర అని యొక్క యూరోపు 
య్యాతికు డానాడు (వాసెను. దీనిని నమ్మవచ్చునా? ఇది పూర్తిగా అబద్ధము. 
ఫెరిసా (వాసీన చర్మిత వలుతావులలో అబద్ధాలతో నిండినది. “గంగా దాస 
[పతాప విలాసము” ఆను సంస్కృత నాటకమందు రెండవ దేవరాయలు చని 
పోయిన వెంటనే అదే యదనని ఓఢ్రగజపతియు, బహమనీ నుల్తానును కలిసి 
విజయనగరముషపై బడిరనియు, అప్పుడు మల్లికార్జునుడు వారి నోడించి పార 
గొ ట్రై ననియు (వాసినారు, దీని ముచ్చట ఫెరస్తా |వాసిన చరిితలో లేనేలేదు. 
(Ancient India Vol. II. by 5. K. Tyengar, P. 40). ఫెరిసాయే దేవ 
రాయ లోడి తన బిడ్డను బహమనీ సుల్తాను కిచ్చి పెండ్లి చేసెనని [వాసెను. 
ఈ ముచ్చట దేశి విదేశి చరిత్రకారులు కాని, సమకాలికులు కాని, తర్వాతివొరు 
కాని యెవ్వరును [వాయలేదు. ఏ కై ఫీయత్తులో ఈ ముచ్చట కానరాదు. ఏ 
కవితలో కాని, చాటువులో కాని ఏ నూచనయు లేదు. 


చిత్తరువులను చూచి (వాయుదమన్న అవి తురకలచే ధ్వంసమయ్యెను. 
విజయనగరమందు రాజు మొదలుగ రౌతు వరకు, రాణి మొదలుగ సాని వరకు 
తమతమ యిండ్ల గోడలపై చిత్తరువులు [వాయించిరని అనేక నిదర్శనాలు 
కిలవు, చక్‌వరుల రాణివానము, వారికై దేశివిదేశి జనుల రూపాలు, నానావిథ 
జంతువులు, బహువిధములైనవి చితింపబడెను. ఆ భవనము లేవి? ఆన్నియు 
విజేతలగు సులానుల నెన్యాలు ఆరునెలల పోట్లతో మంట గలిపెను. శిలా శిల్ప 
ములు కు'డా ముప్పాతికకు పైగా చూర్ణమయ్యెను. ఓరుగంటి బోగ మిండ్లలో 
కూడా చి(తశాల లుండెను కదా ! ఆ నగరము జాడ లేకుండా ధ్వంసమయ్యెను. 


పూర్వపు జానపద గీతములను సేకరించినవా రరుదు. తందాన కథల 
నాదరించినవారు లేరు. అందుచేత తాళ్ళపాకవారి కవిత్వం కొంత నా పత్యం 
కొంత చేర్చి చదువు వచ్చీ రానివారో లేక కథ చెప్పే జంగాలో కథ లల్లరి. 
నాణెములను సేకరించినవారు కానరారు. |పభుత్వము కొంత పనిచేసెను. కాని 
కొన్నిటినయినా మనము చూడగలిగినాము. 


కొన్ని సంవత్సరముల [కిందట కృష్ణరాయల కాలమునాటి సాంఘిక 
చర్మిత అను వ్యాసమును సీద్ధముచేస్తిని, అదేపనిగా ఆముక్తమాల్యదను ఆయన 


0221 


కాలపు కవుల [గంథాలను పూరిగా చదివి అందు స్ఫురించిన యంశములను 
గుర్తుగా (వ్రాసుకొని తర్వాత సలటోర్‌ అనునతడు (వ్రాసిన విజయనగరరాజ్య 
సాంఘిక చరిత అను ఇంగ్లీషు సంస్తటముల రెంటిని చదివితిని. నేను గురుంచు 
కొన్న పలువిషయములును వాటిలో నివియును సరిపోయెను. పైగా ఆ [గంథ 
కర్రకు తెనుగు రానందున నా సం[గహమందు కొన్ని యెక్కుగా కానవచ్చెనుం 


“ఉరుసంధ్యాతప భోగం మృత్కలిత మై యొప్పారు 'బహ్మాండ మన్‌ 
గరిడిన్‌ కాలపుహొంతకాడు చరమాగ స),౦ధముం జేర్చు ని 
బృరవున్‌ సంగడమో యనన్‌ శ డిగెం |బాగ్ఫూమి భృతె ,తవే 
తర బాహా గపు సంగడం బనగ మారాండుండు దోచెన్‌ దివిన్‌” 
మనుచరితము. ౩. ౫౯. 


అను [ప్రాతఃకాల వర్ణనమునుండి ఆ కాలమందు సాము గరిడీ లుండెకనియు, 
అందు ఎర మల్లిని నింపిరనియు, అందు సంగోలా మున్నగు సంగడము లుండె 
ననియు, జెట్టి లీ విధముగా సిద్ధమగుచుండి రనియు (వా సీని. విజయనగర 
కాలమందు సామకూటములు విరివిగా నుండెననియు కృష్ణదేవరాయలే ఒంటికి 
నూనె పట్టించి జెట్టీలతో కుస్తీ పర్లైెడివాడనియు విదేశియాతతికులు [వాసినదాని 
వలన (ప్రాతఃకాల వర్ణనమునుండి తేల్చిన విషయము సరిపోయినది. ఈ విధముగా 
అడు గడుగునకు కవుల వర్గనలనుం౦డి మనకు కావలసిన విషయము తేల్చవలసి 
యుండును. 


సాంఘీక చరి[తకు పనికివచ్చు కావ్యాలలో [ప్రాంతీయ పదములను 
[పయోగించినారు. కదిరీపతి శుకనప్రతిలోని ఇంచుమించు ౧౦౦ పదాలు 
నిఘంటువులలోలేవు. (నేను నూర్యరాయాం[ధ నిఘంటువు జూడలేదు. కాన దాన్ని 
గురించి [వాయుటలేదు.) అందలి పదాలను కడప, అనంతపురము వారలను 
విచారించి తెలుసుకొనవలసి వచ్చెను. చంద శేఖర శతకములోని వ్యావహారిక 
పదాలు నెల్లూరువారి కథ్థ మగును, భాషీయదండక పదాలు కర్నూలువారి కర్థ 
మగును, ద్యా|తింశ త్సాలభంబికా కథ లందలి పదాలు తెలంగాణమువారి కర్ట్‌ 
మగును, క్రీడాలిరామ మందలి పదాలు కృష్టాజిల్లావారి కర్ణమగును. పాల్కురికి 
సోమనాథుని, నన్నెచోడుని పదాలు కొన్ని యెవరికిని అర్థము కావు. 


Xiu 


చెప్పటోయిన దేమన :. అర్థ ముకాని [పాంతీయ |[పాబంధిక పదాలను 
పట్టికగా ముదించి తెలిసినవారు అర్ధములను (వాసి పంపుటకై భారతి వంటి 
పత్రిక కృషిచేసిన, లేక (తెలంగాణా) ఆం[ధ సారస్వత పరిషత్తు వంటి సంస్థలు 
[ప్రయత్నించిన కాలగర్భమందు సమాధిపొందిన యెన్నియో సుందర భావస్పో 
రకములగు పదాలకు సుధా సేచనము చేసినట్టగును. నిఘంటు నిర్మాతలు [గాంథిక 
పదాలనే సేకరించుటకై మడిగట్టుకొన్నవా రగుటచేత వారి శ్రమ పూర్ణఫలదాయి 
కాక పోయినది. సూర్యరాయాం[ధ నిఘంటువు నించుమించు రెండు తరాలనుండి 
వాస్తూవచ్చినను వారు వ్యావహారికమన్న చీదరించుకొందురని వినుటచే వారి 
(శమ తగినంత ఫలవంతము కాదనవలెను. వి నిఘంటువై నను సరే ఎంతవరకు 
వ్యావహారిక [పాంతీయ పదాలను సేకరించదో అంతవర కిది కొరవడినద్దై 
యుండును, 


మన సాంఘిక చరిత్రకు పనికివచ్చు 
తెనుగు ప్రబంధాలలో ముఖ్యమైనవి 


పొల్కురికి సోమనాథుని బసవపురాణము, పండితారాధ్య చరితము, 
శ్రీనాథుని (వల్లభరాయని) యా క్రీడాభిరామము. 

క్రీనాథుడో (కాడో !) - పల్నాటి వీరచరితము. 

కొరవి గోపరాజు -- ద్వా(తింశ త్సాలభంజి5 లు. 

కృష్ణ దేవరాయల జా ఆము క్రమాల్యద. 

తాళ్ళపాక తిరువెంగళనాథుని -- ద్విపద పరమయోగి విలాసము. 
సారంగు తమ్మయ్య -- వైజయంతీ విలాసము. 

గౌరన -- హరిశ్చంద ద్విపద. 

కదిరీపతి -- శుకసప్తతి, 

వెంకటనాథకవి -- పంచతం[తము. 

శతకములలో -- వేమన, చంద్రశేఖర, కుక్కుటేశ్వర, రామలింగ, 
శరభాంక, వేణుగోపాల, వృషాధిప, సింవోది నోరసింహ, వెంకటేశ, 
గువ్వల చెన్న శతకాలు. 

భాషీయ దండకము. 


XY 
ఏనుగుల వీరాస్వామి -- కాశీయా[త* 


పాండురంగ విజయము, (శ్రీ కాళహ స్తీ మాహాత్మ్యము, శ్రీనాథుని 
చాటువులు, పీఠికలు కూడా కొంతవరకు సహాయపడును, 


న్ని 


శబ్దగత్నాకర నిఘంటు నిర్మాతలగు బహుజనపల్లి శీతారామా చార్యులుం 
గారు కవుల తారతమ్యములను నిర్ణయించి వారిని ఆరు తరగతులుగా విభజించిరి. 
అందు పె కవులకు వా రే సానమిచ్చిరనగా నా 


[పబంధము. తరగతి, 
పాల్కురికి పాండితారాధ చరిత x 
పాల్కురికి బసవపురాణము ౫ 
ద్వా తింళత్సాలభంబికలు ౪ 
ఆము కమాల్యద ల 
వై జయంతీ విలాసము ౫ 
శుకస ప్రతి ౫ 


కొన్ని (పణంధాలు వారి కాలాన ముదితములు కాలేదు. అయియుండిన 
వాటికిసీ కనిష్టము అయిదవ తరగతిలో సీట్‌ దొరకకపోయి యుండునా!? 


సాంఘిక చర్మితకు పనికిరాని కవిజన రంజనము, కవికర్ణ రసాయనము, 
జై మినీ భారతము, రామాభ్యుదయము, విక్రమార్క చరితము, విమ్షపురాణము, 
మనుచరితను వనుచర్శితను మూడవ తరగతిలో చేర్చినారు. 


అమృతాంజనమును, అమృత ధారను, బహునిఘంటువులను, వేదంవారిని 
చుట్టూ పెట్టుకొని చదువదగిన నై షధము, రాఘవ పొండవీయము, హరిశ్చం[ద 
నలో పాఖ్యానములకు రెండవ మూడవస్తాన మిచ్చినారు. 


నే నప్పుకప్పుడు ౧౯౨౯ నుండి వాసిన సాంఘిక చరిత వ్యాసము 
లను జూచిన మితులు ఆంధ సారస్వత పరిషత్తు స్థాపిత మైనప్పుడు ఆం|ధుల 
ంఘిక చర్మితను (వాయుమని తొందరపెట్టిరి. అంతటి [మకు అర్హతే 


xvi 


లేదనియు, చాలనివాడననియు ఆంగీకరింపక యుంటిని. కాని మా మిత్రులలో 
శ్రీ లోకనంది శంకరనారాయణరావు, శ్రీదేవులపల్లి రామాజనురావు, శ్రీ పులిజాల 
హనుమంతరావుగారలు చేసిన పోద్బలము తట్టకొనరానిదయ్యెను. తుది కొప్పు 
కోక తప్పదయ్యెను. అవసరమగు పరికరములు నాకు లభింపనందున నాకీ 
గంథము తృ వ్రినాసగలేదు, 


ఈ [గంథ ముదణమును, (పూపులను చూచుకొనుట మున్నగు (శ్రమకు 
లోనైన [పియమి[తులగు (శ్రీ దేవులపల్లి రామానుజరావు నా మనఃపూర్వకమగు 
కృతజ్ఞతలకు ప్యాతులై నారు. 


ద్వితీయ ముద్రణ పీఠిక 


నే నేమాతమును ఊహించనిరీతిగా ఈ [గంథము ప(తికాధిపతుల 
యొక్కయు, విద్వాంసుల యొక్కయు [_పళంసకు పాతమెనందులకు ధన్యుడ 
నని అనుకొన్నాను. ముఖ్యముగా ఆంధధ్యపళా సంపాదకులగు శ్రీ నార్ల 
వేంక టేశ్వరరావుగారికి నేను బుణపడినాను. ఈ [గంథముతో వారి పరి 
చయము నాకు రెండవమా రన్నమాట। వారి క్రీ[గంథము మెచ్చువచ్చినద. 
ఒక సంపాదకీయమును (వాసిరి. “మన తాత మ తాతలు” అన్న శీర్షికను నేను 
చూడగానే నా గంథము జ్ఞాపకమావచ్చి ఇది నా [గంథ విమర్శియై యుండునా 
అని తటాలున అనుమానించితిని, అనుమానము నిశ్స్పయమే అయినడి! వా 
రిచ్చిన యా [పకటన మూలమున (గంథ|పచార మెక్కువయ్యెను. తర్వాత 
వారొక సూచననుచేసిరి, ఇంగ్లీమలో సాంఘిక చరిత పద్ధతిగా ఒక్కొక్క విష 
యమును ఆమూలాగముగా ముగించుచు (వాసిన బాగుండుననిరి, కాని యీ 
[గంథమందలి మొదటి మూడు |పకరణాల ఉస్మానియా విద్యాపీఠమందలి 
ఏస్‌. పః విద్యార్థుల కొక పాఠ్యభాగముగను, ఆంధ సారస్వత పరిషత్తు వారును 
ఆదే భాగమును తమ ప్రవేశ పరీశా విద్యార్గులకును నిర్ణయించిన వారగుటచే 
(పకృతము మార్పుచేయుటకు వీలు లేక పోయినది. 


ఇతర పత్రికలలో [(గంథ విమర్శ వచ్చినదని వింటిని కాని నే నేదియు 
చూడలేదు. ఆంధ(పభా సంపాదకులకు నాపై (అనగా నా _గంథముపై) 
కలిగిన అఆవ్యాజ(పేమకు నేను కృతజ్ఞతాగుణబద్ధుడ నైనాను. శ్రీ నార్గవారి 
అభ్మిపాయమును [గంథాంతమందు ౧వ అనుబంధముగా ము దించినాను. 


మికతులును, సంగీత సాహిత్య విద్యాపారంగతులగు, తెనుగు వచన 
రచనలో ఆ(గ్మశ్రేణిలోని రచయితలును నగు శ్రీమాన్‌ రాళ్ళపల్లి అనంతకృష్ణ 
శర్మగారు, (పేమపూర్వకముగా (౨౨) విషయములను చర్చించి, ఒక విపుల 
మగు లేఖను |వాసినారు. అందు ఇంచుమించు ఆన్నింటిని సవరణలుగొ ఒప్పు 
కొని వారికి నా కృతజ్ఞతలను తెలుపుకొని వారి లేఖను ౨వ అనుబంధముగా 
ముదించుచున్నాను, 


గట??? 


* శ్రీ వేటూరి పభ్రాకరళాన్త్రి గారు గొప్ప విద్వాంసులు, పరిశోధకులు, 
విమర్శకులు, వారునా కిట్లాక కార్డు |వాసిరి, 


“మీ (గంథము = ఆంధుల సాంఘిక చర్మిత - చాలా ముచ్చట గొల్పి 
నది. మీరీ [గంథవఎు రచించుటకు ఎల్ల తెజిగులను సమర్ధులు, ఆదినుండి తుది 
దాకా ఒకతూరి స్ఫూలదృష్షితో చదివి యిది వాస్తున్నాను, ,.... చదివినంతలో 
మీరు (ప్రామాణికులై న సత్యరతులై న పవిత్రహృదయులని గు ర్తించినాను నేను, 
మీరీ గంథమును ఇంతకింకను నాల్హయిను రెట్లు విషయవిశేషములతో |పపంచించి 
పునర్ము[దణము చేయుటక్కు తోడ్పడ కుతూహలపడుచున్నాను = వేటూరి 
(ప భాకరళాన్త్ర, (తిరుపతి, ౨౮-౧౧-౪౯)” 


శ్రీ శాస్త్రిగారికి నేను వెంటనే జాబు వా స్తిని కాని అది వారి కందినట్లు 
లేదు. వారినుండి (పత్యుత్తరము రాక పోవుటయే నిదర్శనము. వారి ఆశీస్సునకు 
నానమోవాకములు, ఈ మూడు విమర్శలు తప్ప తక్కినవి నే నెరుగను 


ఈ తడవ ముదించినదానిలో కొన్ని మార్పులు చేసినాను. “తూర్పు 
చాళుక్య యుగము" అను నొక [కొత్త (పకరణమును చేర్చినాను. మొదటి 
[గంథము [వాసీనప్వుడు పాచికల ఆటను గురించి గ్రద్ధచేయలేదు, ఈ తడవ 
దానిని సమ్మగముగా [గహించి [వాసినాను. మొదటి పచురణ కాలమందు నాకు 
కొన్ని పదాలు సరిగా తెలియరాక సరిగా వాయకయో, సూచించి తప్పించు 
కొనుటయో లేక వదలివేయటయో జరిగెను, ఇప్పుడు వాటిని సరిగా [గహించి 
ఇందెక్కి.౦చినాను. ఆట్టివాటిలో బొమ్మకట్టుట, కనుమారి, గిల్లదండ (వీటి 
ఖీలనము), రణముకుడుపు, పురువుల కోవి, ముడాసు, తలముళ్ళు మొదలయి 
నవి చూడదగినవి, ముఖ్యపదముల అకారాదిసూ చి |గంథాంతమం దియ్యనై నది. 
దానినిబట్టి పై పదములను విద్వాంనులు పరికింతురని (ప్రార్థన. 


మొదటి _పచురణ కాలములో నేను శబ్దరత్నాకరము, ఆంధ వాచస్ప 
త్యంబును చూచి అందులేని పదాలకు నాకు తోచిన లేక తెలిసిన యర్థాలను 
[వా స్తిని. ఈ తడవ సూర్యరాయాం[ధ నిఘంటువును చూడగలిగితిని, అందు 
నకోరాంతమువరకు పదాల కర్థాలు కలవు. తక్కినభాగ మింకను మ్ముదితము 


*శ్రీ వేటూరి [పభాకరకాన్త్రిగా రిటీవలనే పరిమపదించిరి, వారి యీ లేఖ 
నాకు మొదటిదియు, తుదిదియు. 


Xix 


కాలేదు. (బహుళ మరొక తరములో పూ ర్రికావచ్చును). దొరికినంతవరకు నేను 
సిర్ణయంచిన యర్థాలే బహుపదాల కందు లభించినవి. ఇంచుమించు పది పదాల 
కెక్కుడుగా ఆర్థము లభించినది. కొన్ని పదాలకు పక్షీవిశెషము, | కీడావిశేష 
మనియే |వాసినారు. పకారమునుండి హకారమువర కుండు పదాల యర నిర్ద 
యము పూర్తిగా నేనే చేసినాను. ఈ తడవ రాజవాహన విజయము, గౌరన 
కృతులు, వేంకటనాథుని పంచతం|ము, కుమార సంభవము, వెలుగోటి వంళా 
వళి మున్నగు [గంథాలను చూడగలిగితిని, అందుచేత మరికొన్ని విశేషములను 
[గంథమందు జేర్చగలిగినాను, 


ఈ కాలములో ౭౦-౮౦ ఎండ్ల వృద్ధులకు వారి చిన్నతనమునాటి ఆచా 
రములు తెలిసినట్టివి మనకు తెలియవు. మనకు తెలిసినంతకూడా మన సంతతికి 
తెలీ మదు. ౨౦౦-౩౦౦ సంవత్సరాల (కిందటి మన పెద్దల ఆచార వ్యవహా 
రాలు మన మెరుగక ఆర్హము చేసికొనజాలకున్నాము. ఈ పుస్తకములో కొన్ని 
విషయములు తెలియరానివని |వాయవలసి వచ్చెను. మన పరిషత్తుల సంచా 
లకులు, గంథ పదర్శనము, కళా [పదర్శనము, పురాణ వస్తు[పదర్శనమును 
గావించుతున్నారు. కాని మనవారిలో పూర్వమందు ఆచార వ్యవహారములం 
దుండిన వస్తువులను సేకరించి (పదర్శించుట చాల యవసరము. పుస్తకిము 
లుంచి చదువుకొను కక్టైతో చేసిన వాళసపీట, తాటాకుల పుస్తకాలు, గంటములు, 
బొండకొయ్య, కోడెము, పొగడదండ, పూర్వపు చిత్తరువులు, నిటివంటివాటిని 
నిరూవీంచు పటాలు, పూర్వమువారి రూపాలను, దుస్తులను, వేషాలను తెలుపు 
పటాలు, [ప్రాచీన నాణముల్సుు గడియారపు కుడుక, పూర్వకాలపు చెండ్లు, కవిలె 
కడితము, పాచికలు, కోళ్ళ చరణాయుధాలు, ముక్కరవంటి మాయమగుచున్న 
శ్రీల యాభరణములు, బొందెల ఆంగీలు, చల్లాడములు, కుల్లాయి, కబ్బాయి, 
ఆయుధాలు. కవచములు, మసిబురలు, గలుగుకలాలు, పూర్వ |పముఖుల 
చేతి వాతలు, దొంగల పరికరాలు రంగులు బాలబాలికల కీడలు, రొక్క_పు 
జాలెలు, నడుము దట్టిలు, అసిమిసంచి, తోలుబొమ్మలయొక్క యు, యక్షగానాల 
యొక్కయు దృళ్యములు, గాజుకుప్పెలు, వివిధ పాంతాలలో పూర్వము సిద్ద 
మగుచుండిన సుందరవస్తుపులు, సంగీత పరికరములు మున్నగునవి సేకరించి 
(పదర్శించవలెను. వాటిని ఒక మ్యూజియములో నుంచవలెను, పైవాటిలో 
నగాని కెక్కువగా ఈ కాలమువారు చూచి యెరుగరు పె వాటిలో అనేక 


క్‌ు 


XX 


విషయాలు విశేషముగా తెనుగుదేశములో పూర్వము [పచారమం దుండినట్టివి, 
పరిశోధన చేసి వాటిని సమకూర్చకుండిన ముందుకాలమువారికి మన సాంఘీక 
చరిత లర్థ ము కానేరవు. 

ఈ (గంథ ముదణాదులను, (పూపఫులను సరిచూచి విచారించుకొన్న 
మితులగు శ్రీ దేవులపల్లి రామానుజరావు, బి. ఏ., ఎల్‌ఎల్‌. బి. గారికిని, 
శ్రీ పులిజాల హనుమంతరావుగారికిని మరల నా మనఃపూర్వక కృతజ్ఞతలను 
సమర్పించుకొంటున్నాను. 


ఇందు సిడి పటమును ముదించినాము. దానిని సంపాదించి యిచ్చిన 
శ్రీ కే, శేషగిరిరావు (పసిద్ద చితకారులకు) గారికి నా కృతజ్ఞతలు, 


ఇకముందు ఈ సాంఘిక చరిత పూర్వుభాగమును శాలివాహనుల కాలము 
నుండి రాజరాజ నరేదుని కాలమువరకు [వాయుటకు పూనుకొందును. 


అక్టోబరు, ౧౯౫౦ సు. (ప తాప రెడి 


తకు (పకరణము 
తూరు చాళుక్య రకర తేక 


మన వాజ్మయ చరిత్ర నన్నయభట్టుతో |పారంభమగుచున్నది. ఆతడు... 

తూర్పు చాళుక్యరా జగు రాజరాజనరేం, దుని కుల, బాహ్మణుడు. 
ఆ రాజు రాజమహేం దవరము రాజధానిగా వేంగిదేశమును [కీ శ. ౧౦౨౨ 
నుండి ౧౦౬౩ వరకు రాజ్యము చేసెను. మనకు తూర్పు చాళుక్యుల కొలప్య 
చరిత నరిగా తెలియదు. ఇచ్చట నన్నయ కాలమునుండి కాకతీయుల ప్రాబల్యము 
వరకు ఆనగా ఇంచుమించు కీ. శ. ౧౦౦౦ నుండి ౧౨౦౦ వరకు తెనుగుదేళ 
మం దుండిన ఆచార వ్యవహారములు తెలియవచ్చినంతవరకు చర్చింపబడును. . 


రాజరాజ నరేం|దునికి ౪౦౦ ఎండ్లకు పూర్ణమే తెనుగు దేశమున విరివిగా 
వ్యాపించిన బౌద్ధమత ము మాయమెహపోయెను. చాళుక్య రాజులు శైవులు. అందు 
చెత వారి రాజ్య మందు శైవమత వ్యాప్తియ, బబాహ్మణాధిక్యతయును ఎక్కు 
వయ్యను, నన్నయకు ముందు జనులు సనాటలు, పద్యాలు వౌసుకొని 
ఆనందించిరి, కాని కొన్ని శాననములందు తప్ప మరెచ్చటను మనకు నన్నయకు 
పూర్వపు పద్యాలు లభింప లేదు. చాళుక్యరాజు “పార్యతీవతి పదాబ్బధ్యానపూజా 
మహోత్సవమందు” (పీతి కలవా డని నన్నయ తెలిపినాడు. చాళుక్యులు 
తతియులు కానట్లున్నది. ఆయినను రాజవంశము లన్నియు సూర్య చందులకు 
లంకె పెట్టుకొని క్ష తియత్వమును పొందినట్లుగా చాళుక్య వంశము కూడ 
తతియ వంశమయ్యెను. పైగా “హిమకరు తొట్టిపూరు భరతేశకురు (ప్రభు 
పొందు భూపతుల్‌ (క్రమమున వంశకర్త లనగా మహినొప్పిన యస్మదీయ 
వంశము” అని నన్నయబచే చెప్పించు కొన్నాడు. కాని అతని పూర్వికులు తాము 
ద్రహ్మపార్థనాంజలిలో పుట్టిన ఒకమూల చాళుక్యపురుషుని సంతతివారమని్‌రి. 
మరియొకశాఖ మరొక విధముగా [వాయించుకొనెను ఆ కాలములో రాజు 
లందరును ఏదో యొక విధముగా సూర్యచం[ద వంశీయ తతియులుగా 
వాయించుకొన్నవారు. ఆ కాలమున శై వాలయములు సతములు రాజులు 
కట్టించిరి. (బ్రాహ్మణులకు అగహారములను మాన్యములను సంక్రాంతి లేక 


2 ఆం|ధుల సాంమీక చరిత 
(గహణకాలములందు దానములుచేసీరి, 


నన్నయ కాలము తర్వాతనే |బాహ్మణులలో వైదిక నియోగికాఖ లేర్ప 
డెను. ఆ విభేదము నన్నయ కాలమందు కాని, అంతకు పూర్వుమందుకాని 
లేకుండెను. నన్నయకు 100 ఎండ్లకు ముందు అమ్మరాజ విష్ణువర్ధనుడు 
రాజ్యము చేసెను. అప్పటివరకు తూర్పు చాళుక్యుల రాజధాని 'వేగీపురమై 
యుండెను. అమ్మరాజే రాజమహేంద్రవరమును రాజధానిగా చేసెను. కావున 
మన కీకాలమందు తూర్పుతీరమందలి (ఇప్పటి సర్కారులు) జిల్లాలలోని స్థితి 
౧ థి 

గతులు కొంతవరకు తెలియవచ్చును, 


త్యతియులమని అబద్ధం వా సుబద్ధంవా అని [వాయించుకొననొల్లని రాజు 
లను నోబినిండుగా కూదులని కవులును, పౌరాణికులును అనజాలకున్నను 
“చతుర్ధకులజులు, గంగతో బుట్టువులు ” అనిరి, ఇదేకాలమందు తెనుగుదేశ 
_ మందలి _పజలులను “నచ్చూ[దులు”” అనిరి. సత్యాది గుణంబులు శ్నూదు 
నందు కలిగెనేని వాడు సచ్చూదుండగు గాక” (ఆరణ్య. ౪-౧-౨౯) అని 
తెనుగు భారతమందు వ్యాసభారతమందులేని కులమును సృష్షించుటచే ఇది 
[పత్యేకముగా తెనుగుదేశాని కేర్పుడెనో యేమో ? 


[బాహ్మణజాతి మహ త్వమునుగురించి సంస్కృత భారతమందుకూడా 
విశేషముగా పలుమారు సందర్భర హితముగా కలదు. తెనుగు భారత మందును 
నన్నయ కొన్ని తన పద్యాలు ఎక్కువగా చేర్చి కొన్ని మూలములోనివి వది 
లెను. అనగా తనకు నచ్చిన విశేషములనే తన భారతమందు చేర్చెను. 
(చూ. ఆది. ౧.౧౩౮ ఆది. ౨-౬౧ మరియు ౬౩. ఇవి మూలములో లేనివి). 


నన్నెచోడుని కాలమునాటికే (|క్రీ. శ. ౧౧౫౦ 1పాంతమున) శై వముతో 
పాటు కౌళమార్గాది వామాచారములు దేశ మందు (పవేశించెను. దాని విధానమును 
కొంతవరకు నన్నెచోడుడు కుమారసంభవమం దిటుల తెలిపినాడు. “కొందరు 
మధుపాన గోవ్షికింజొచ్చి మండలార్చన దీర్చి (శ్రీ చ క్రపూజచేస) మూలజ 
వృక్షజ గుడమధుపీష్ట కుసుమవికారంబులగు సుగంధాసవంబులు కనకమణిీ 
మయానేక కరక చషకాదులన్నించి హర్షించి” గౌరిన్కి శివుని, భైరవుని 
యోగినులను, నవనాథులన్ను ఆదిసిద్ధులను కొలిచి ఆసవమును (తాగుచు దాని 
నిట్టు వర్టించిరి : 


తూర్పు చాళుక్య యుగము 8 


“ఆఅమరులు (ద్రావుచో నమృతమందురు దీని అహి (వజంబజ 
(సముగొని యానుచో నిది రసాయనమందురు, భూసురౌఘుమా 
గమవిధి సోమపానమని గెకొని యానుదురెందు, చ(క్రయా 
గమునెడ “వస్తువం' దురిది కౌళికులీసురపేర్మి వింత మే £” 


“దని యనేకవిధ మాంసోపదంశకంబు లాస్వాదించుచు మనోహృద్యం 
బులగు మద్యంబులు” సేవించిరి. (౯-౧౨౭ నుండి ౧౭౩౨ వరకు) సంస్కృత 
భారతమందు దక్షిణదేశమును గూర్చిన చర్చ లంతగా కానరావు. నన్న యభట్టు 
మూలనులో లేకున్నను అర్జునుని తీర్గయాత్రలో వేగీ దేశమును గోదావరిని 
కలిపి ఇట్లు వర్తించెను. 


దశిణగంగ నాదద్దయు నొప్పిన 
గోదా వరియుజగదాదియెన 
ఖీమేశ్వరంబును బెడగగుచున్న శ్రీ 
పర్వతంబును జూచి యుర్విలోన 
అనఘమై శిషా(గహార భూయిష్టమై 
ధరణీసురో త మాధ్వరవిధాన 
పుణ్యసమృద్ద మై పొలుచు వేగీదేళ 
విభవంబు చూచుచు విభుడు,.*,.., 
wee Se AU కృతార్థుడగుచు॥ 


= ఆది, ౮అ౦౨౯ా 


నన్నయకాలములో తెనుగుసీమలో ఫీమేశ్వరము, [శ్రీపర్వతము, (ప్రసిద్ధ 
తీర్గస్థ్గలములై యుండెను. వేగీదేశమందు అగ్రహారము లెక్కువగానుండెను. 


నన్నయకాలమందలి తెనుగుభాషా స్థితినిగూర్చి అనేక చర్చలు జరిగినవి. 
అవి యిచ్చట అపస్తుతమగుటచే నూచనమాతము చేయనై నది. నన్నెచోడుడు 
జాను తెనుంగును గురించి తెలిపినాడు. “సరళముగాగ భావములు జాను 
తెనుంగున” (కుమా.౧-౩౫) దీనినే అతడు “వస్తుకవిత' అనెను. 
కన్నడములో “జాణ్‌నుడిఅని యంతకుముందే వాడిరి. దానినే ఇతడు 
(ప్రచారము చేసినట్టున్నది (చూడుడు. [శీ కోరాడ రామకృష్ణయ్య గారి పీఠిక 


4 ఆం[ధుల సాంఘిక చరిత 


కుమారసంభవము, మదాసు యూనివర్సిటీ పచురణము) ఈ జాను 
తెనుగునే పలుమారు పాల్కురికి సోముడు తన కృతులందు వర్ణించి తన 
వృషాధిప శతకములో అదెట్టిదో ఒక పద్యముతో నిరూపించెను. అందే 


. మలి పవాళము అను ఒక విధమగు సంస్కతాం|[ధ సమ్మిళిత రదనను 


నిరూపించి రెండు పద్యాలు వాసెను. అతని తర్వాత మణీ పవాళము 
తెనుగులో లేకపోయెను. ఆది తమిళములో కలదని క్రీ కోరాడ రామ 
కృష్ణయ్యగారు తమ భారతవ్యాసములంధదు తెలిపి వారు. 


కవితలో దేశికవిత, మార్గకవిత యను భేదముండెనని నన్నెచోడుడు 
మొదట తెలిపెను. కవితయందేకాక నృత్యమందును, సంగీతమందును ఇదే 
భేదముండెనని [శీనాథుని కాలమువరకు సూచనలు కలవు, మార్శవిధానము 
అనునది. సంస్కృృతమర్యాద. వాల్మీకి రామాయణమందే తర్వాతివారేమో 
కుళలవులు రామకథను “ఆగాయతాం మార్షవిధాన సంపదా” ఆని [వాసి 
నారు, దెశీమార్గభేదములు దక్షిణదేశమందు సంన్క్భతమునుండి భిన్నించిన 
భాషానంగీత నాట్యవిధానములకు |క్రీస్తుశకము ౯వ _శలాబ్ద్బమునుండి నిర్జ 
యించిన స్వరూప మనవచ్చును, 


చాళుక్ళరాజులే దేశిక వితను ఆం; ధ దేశమందు సిలిపిరని నన్నెచోడు 
డనెను, (కుమా. ౧-౨౩) తన కాలమందు దేశిసత్క వు అుండిరనెను. 
(కుమా. ౧-౨౪) కుమారసంభవమె మన మొదటి (పబంధ మనవచ్చును. 
అష్టాదశవర్ణనలు, నవరసములు ౩౬ అలంకారములు ఉత్తమ కావ్యలతణా 
లనెను, (కుమా.౧-౪౫) జనులలో ఊయలపాటలు (౪-౮౯) గౌడుగీత 
ములు (౬-౪౫) [ప్రచారములో నుండెను. జనుల విద్యాభ్యాసము “ఓం 
నమఃశివాయ" తో పారంభమగు చుండెను (కు. ౩-౩౪). ఆ కాలములో 
వేదపఠనము, కాస్త్రపథనము విశేషముగా నుండెను నన్నయ సహో 
ధ్యాయియు, భారతరచనలో నీతనికి తోడ్పడిన వాడును వానసవంశీయు 
డగు నారాయణభట్టు సంస్కృత కర్ణాట (పొకృత పెశాచికాం[ధ భాషలలో 
కవిశేఖరుడు. అష్టాదళావధాన చకవరి వాజ్మయధురంధరుడు. రాజరాజు 
నరేం[దుని యాస్థానమందు “అపారళబ్ద ళాస్త్రపారగులైన వైయాకరణులును, 
భారత రామాయణాద్యనేక పురాణ (పవీణులైన పౌరాణికులును, మృదుమధుర 
రసభావభాసురనవార్థ వచన రచనా విశారదులై న మహాకవులును, వివిధ తర్క 


తూర్పు చాళుక్య యుగము 5 


విగాహిత సమస్త శాస్త్రసాగర గరీయః (పతిభులైన తార్కికులును నొదిగా 
గలుగు విద్వజ్జ్ఞనంబులుండిరి. ఆది, ౧-౮ 


వేదము తర్కము, న్యాయము మీమాంస మున్నగు ళాస్తాాలు నేర్పు 
టకు విద్యా కేంద్రము లుండెను, వాటికి రాజులేకాక ధనికులు, ఉద్యోగులు, 
విశేషముగా భూదానములు చేసిరి, పా దాబాదు రాజ్యములోని వాదే స్టేషన్‌కు 
సమీపమందు పూర్వము నాగవావి అను స్థలముండెను. దానినిప్పుడు ““నాగాయి 
అందురు. అచ్చటి శాసనములు కొన్నింటిని ఆర్షళాఖవారు _పకటించినారు? 
వాటినిబట్ట రీ. శం ౧౧౦౦ పాంతములందచ్చట ఒక గొప్ప కళాశాల యుండి 
ననియు, అందు శై వాగమములు, తర్క న్యాయములు, వేదములు, శాస్త్రములు" 
మున్నగునవి బోధించుచుండిరనియు, విద్యార్దులకు, ఆచార్యులకు అందే వస 
తులు నిర్మి ంచిరనియు, అధ్యాపకుల జీవనార్థ మె కొంత భూమిని (పత్యేకించి 
విద్యార్థులభు డికి మరికొంత భూమిని (పత్యేకించిరనియు, అందు (గంథా 
లయముకూడ నుండెననియు, ఇట్టి యపూర్వవిోషములు దానినుండి విశద 
మగును. ఆతి (పచారమువలన తక్షశిల, నాలందా విద్యాపీఠములను గురించి 
విద్యావంతులు తెలుసుకొన్నారు. కాని “నాగాయి” పేరె తినవారు లేరు. ఉత్తర 
హిందూస్థానములో ముసల్మానుల దాడు లంతవర కే [ప్రారంభమై (పసిద్ధ విద్యా 
వీకములను, (గంథాలియములును ధ్వంసింపబడెను, దక్షిణ హిందూస్థానమునకు 
౧౩౨౩ వర కీ బాధలు లేకుండెను. 


వై దికాబారములకు భిన్నముగా దక్షిణ హిందూస్థానమందు పాచీ 
నము నుండియు అనేక [దావిడాచారములు జనులందు నిలిచిపోయెను. ఈ 
ఎభిన్నాచబారములను బట్టి ఆర్య దావిడ విభాగమును అంగీకరింపవలని వచ్చును, 
అటులే _దావిడ భాషలపై సంస్కృత (పభావము అత్యంతముగా కలిగినను 
అవి భిన్న భాషలే యనవలెను. తెలుగువారిలో పెండ్రిండ్లు నాలుగు 
దినముల _ వరకు జరుగుచుండెను. ఉతర పెండ్లి అయిన తర్వాత 
“దినచశుష్ణయానంతర మున” బంధువులు వెడలిపోవుచుండిరి. (ఉద్యోగ. 
౧-౨ ఈ విషయము సంస్కృతమూలమున లేదు.) మేనమరదలి సెండ్డాడు 


8B ఆం|ధుల సొంఘీక చరిత 


ఆచారము తెనుగువారిదే. అర్జునుడు సుభదను “తన మేనమరదలి ధవళాక్షి 
దోడొని చనియె (ఆది. ౮.౨౦౮) సంస్కృత భారతములో లేనివియు, 
తెనుగులో హెచ్చుగానుండు విషయములే భారతోదాహరణములం దంతటను 
(గహాంపబడుతున్నవని యెరుగవలెను.) చ్రైలు మషైలు ధరించుట తెనుగువారి 
యోచారమే వెదికపదతిలో లేదు. 5 “*ణలితంబులగు మర్టియల చప్పుడింపార 
నంచకై వడి నలనల్లవచ్చి” (విరాట ౨-౬౪) అనుట క [పమాణము* 
నన్నయ తిక్కన్నల కాలములో పురుషులుకూడ మట్టియలను కాలివే9ళ్ళకు 
పెట్టుకొనుచుండిరి. నేటికిని ఆంచందు సకృత్తుగా కొందరు పురుషులు మ బైలను 
పెట్టుకొనుట కాననగును. కీచకుడు న _ర్తనాగారమునకు పోయినప్పుడు “మట్టియ 
లొండొంటి బిట్టు దాకగనేల నందంద మునిగాళ్ళ నప్పళించుచు”" సోయెను 
(విరాట ౨-౨౫౦). వధువును పెద్దలు చూచుట, బాంధవ్యము నిశ్చయించుట, 
అట్టి “నిశ్చితార్థములో* కన్యకకు “ముదారోహణము” చేయుట అనగా తలపై 
పేలాలుంచుట ఆ కాలమందలి తెలుగువారి యాచారమై యుండును. 


(కుమా. ౭-౧౩౯) పెండ్రియెన తర్వాత బంధువులు రంగులతో వసంత 
మాడుట నేటికిని విరివిగా జరుగు ఆచారమే. నన్నెచోడుని కాలమందును అట్టి 
వసంతము లాడుచుండిరి “తనరారు [కోళ్ళను (|కోవిచిమ్ము డుగొ ట్టము) నొతు 
కుంకుమారుణా కీర్ణజలధార లమరెో “వరచందన పంకమున దిరముగ 
మురాటలాడిరి.” “ఆవనీరు” చల్లుకొనిరి. (కమా. ౯-౫౯ మరియు, ౬౦ 
మరియ ౬౭) భటవృ త్రిలోనుండు కులాలలోను ఆంతతక్కువ కులాలలోను 
విడాకులిచ్చు ఆచారముండెను. “నేడాలము చేసి నన్ను పెడయాకులబెచై 
మనః|పియుండుో (కుమా. ౧౧-౫౫) అని ఒక యుద్ధభటుని భార్య 
వాపోయెను, 


వివాహములకు సంబంధించిన అవైదిక దాకీణాత్యాచారములను 
సోమేశ్వరదేవు డను పశ్చిమ చాళుక్యరాజు (కీ, శం ౧౧౩౦లో తన అఖిలషి 
తార్థచింతామణిలో సంస్కృతమందు చక్కగా వివరించెను. ఆ రాజు కర్ణా 
టకుడైనను ఆతడు తెలిపిన యాచారములు తెలుగువారిలోను ఉండినం 
దున ఆ [గంథము మనచర్చకు చాల యుపయోగకారి, అతడిట్లు తెలిపి 
నాడు; “"వివాహమంటపమును తోరణములతో, పుష్పములతో నలంకరింప 


_ శూర్పు చాళుక్య యుగము 7 


వలెను. re బియ్యము “పోలు” పోయవలెను. దానిపై వధూ 
వరుల కూర్చునబెట్టపలెను. ఇద్దరి చేతులలో జీలకర్రతో కూడిన స 
నుంచ వలెను. వివాహావిధానము ముగియగానే వధూవరులు పరస్పర మా 
జీరికాయు క్ర తండులముల చల్లుకో వ లెను. వివాహోత్పవములను నాలుగుదినాలు 
చేయవలెను. నాల్గవది నేజ్‌ రాత్రి వధూవరులను రథాలపై (లేక ఏనుగుల పై) 
నుంచి ఊరేగింపు చేయవలెను. (దానిని ఇప్పుడు మెరవణి యందురు). తక్కిన 
వన్నియు వై దికాచారములై యుండెను (ఆభిలవి. పకరణము ౩ అధ్యాయం 
౧౩ శోకము ౧౪౮౩ నుండి ౧౫౧.౨ వరకు), నేటికిని తెనుగుదేశ మందలి 
వివాహపద్ధతులలో ఒకొక్క కులములో ఒక విధమగు వేదభిన్నాచారములు 
కానవచ్చును. ఇవన్నియు దావిడాచారములే! తా? (తాడి) బొట్టు-తాటికమ్మలు 
CR) దావిడాచారములే ! 


వ్యాపారము బండ్ల పెనను, ఎద్దుల పైనను, దున్నలపైనను చేయుచుండిరి. 
పళువుల పె వేయు ధాన్యపు సంచులను పెరికలనిరి. వాటిని పశువుపై అడ్డముగా 
వేసి తీసికొని పోయడివారు (కుమా. = -23) ఎక్కువ హం ల నాటే 
గుర్తునకై వాటిపై ముద్రలు కాల్చి గుర్తు వేయుచుండిరి. (కుమా. ౪-౧౧). 
జనులలో కొందరికైనా అభిచారము సె (చేతబడి) పె విశ్యాసముండెను 
(కుమా. ౪౯౧), ఇం[దజాలము (గారడి) బాగా వ్యావించియుండేను (కుమా* 
౬-౭౭). ధనాంజనము మున్నగు అంజనములను బోకిపెంచులపై మంతించిన 
కాటుకనుపూసి పలువుర చేతికిచ్చి చూపించగా అందొకరిద్దరికి కోరిన విషయ 
ములు కినబడెడివి “కర్పరఖండంబున మంత కాటుకతగ౯ ఫాలాతు 
గూర్చింప నగ్గిరిరాజాత్మ జప ధి" (కుమా. ౬-౯౬)" నేటికిని మన దేశమందు 


కన్నుగల బోకిపెంచును తెప్పించి దానికి సిద్ధము చేసిన ఒక విధమగు. 


కాటుకను పూసి స్థలశుద్ధిచేసి దీపధూపారాధన చేసి చెంకాయకొట్టి కొన్ని 
మం|తాలు చదివి అంజనము పట్టింతురు. ఇనుమును బంగారుచేయు రసవాదము 
నేటిదా? బహుప్రావీనముది. ఐహుళా నాగార్జును డ్మీపయత్నములో పారివీన 
(పసిద్ధవ్య క్రిచై యుండును. నన్నెచోడుని కాలమం దీవిద్యను పలువురు 
సాధింపబూనిరి (కుమా. ౬-౧౪౬), అపత్కాలములందు నమ్మినదేవునికి 
ముడుపులు కట్టుచుండిరి (కుమా. ౮-౬౪), భరత కాస్త్రముతో థిన్నించిన 
నాట్యపద్ధతి మనలోనుండిను, “దండలాసక విధమును కుండలియు బెంక్కణంబు 


టి 


ప్ర ఆం ధుల సాంమిక చరిత. 


తెరంగును బేరణంబు” ఉతర నేర్చెనని తిక్కన ఖ్రోటక్టులదులేని వివరములు 
తెలిపినాడు. మరులు మందులు నాటికిని నేటికిని  రీందరున్రీ లందందు 
పెట్టినట్లు వినుచుందుము. వీటివలన లాభమలేకష్లోణ్లీ' నష్టము, [పాణవిని 
కలుగునని |దౌపది సత్యభామతో చెప్పెను. (isl Aor మొక), 


నన్నెచోడుని కాలములో “తప్పుచేసిన వారిని చి శ్రకీచీ తముగా హింసించు 
చుండిరేమో ; 


ఏ ఎ తమ శ సర్యవ 

ధ్యుం డెడ సేయకుండు శివదూషకు నాలుక గోసి యుప్పు నింపుండు 
(దపు(ద్రవంబొడల బూయుడు లోహముగాచి నోర బోయుండు 
దురాత్ము చర్మపట మొల్వుడు గన్నులు మీటు డుక్కరన్‌” 


(కుమా. ౨-౮౪) 'ఉరుముపె జీడిని రి యచ్చ తివిడిచె' (కుమా, ౪-౧౬.) 


బాలికలు చిల్క. బొమ్మలును, దంతపుబొమ్మలు, మలిగాజు బన్నరు 
లును, [మానిచొప్పికిలు. ..బొమ్మరిండ్ల్ర జేయనగు కూళ్లును వండుచు బొమ్మ 
పెండ్లి" చేసిరి (కుమా. 3-3౬). తోలు బొమ్మలాట భారితమందు కూడ 
సూచితము (విరాట. 3-౧౬౪) 5 


ఆనాటి జనుల వినోదాలలో పెక్కు నేటికిని ఆచార మందున్నవి, 
“అంకమల్ల వినోదము” కోళ్ళపందెము. లావకపిట్టల కొట్లాట, మెషమహిష 
యుద్ధాలు, పావురాల పోట్లాట. శ్యనములవేట, గీతవాద్య నృత్యములు, కథలు 
(తందానవంటివి), _పహేళక్క చతురంగము, పాములాటలు, గౌడీ, మాధ్వీ, 
పెష్షీసురలసేవ ఇట్టి వినోదముల ననేకములను అభిలషితార్థ చింతామణిలో 
వర్ణించినారు, 


(శిల్పములు విశేషముగా దక్షీణదేళమందే వృద్ధియయ్యె ననవచ్చును. 
మయాదులు, ఆర్యేతరులు మయుని పేరుతో (పసిద్ధమైన వాస్తుకాస్త్రములు 
కలవు రాజ పాసాదములను గురించి అభిలషితార్థ చింతామణిలో కొంత 
వరణ కలదు. ఇండ్లకు స్తంభములుండుట దకీణదేశ గృహనిర్మాణ విశిష్టత 


తూర్పు చాళుక్య యుగము 9 


కాబోలు. అంతేకాకచతుక్ళాల, (త్రికాల, ద్విశాల, ఏకళాల అను భేదాలతో 
నిండ్లు కట్టు చుండిరి. చతుళ్శాలతో చతుర్ద్వా రములతో గూడిన యింటిని 
సర్వతో భ|దమనిరి. అటులే నంద్యావ ర్రం, వర్ధమానం, స్వస్పికం, రుచికం, 
మున్నగు పేరులు గల యిండ్లుండెను. ఇండ్డు కట్టుటలో చే చయ వలసిన విధులు 
ఇ=డ్డు పూ_ర్రియెన "తర్వాత చేయవఃసిన వాస్తుపూజాదికములు విపులముగా 
వర్ణింపబడినవి, శ్రీరామచం! దుడు పర్లకుటిని నిర్మించు కొన్నప్పుడు ఒక 
జింకను గృహాధిదేవతకు బలియిచ్చెను. ఇప్పు డా యాచారము (దాహ్మణెతరుల 
లోనే కానవచ్చును. 
(అభి. ప్ర. ౧. అధ్యా ౩) 


రా. వివాదములను, విచారించుట క పంచాయతీ సభ లేర్పా చె 
యుండెను, ఇది అతి పానీన భారతీయ సంవదాయము. ఇదే నిజమైన |పజా 
(పభుత్యము. (పపంచ రాజనీతిలో పంచాయతితో సమాన మైనది మరొకటి 
సృష్షికాలేదు. ఇంగ్లీషు కోర్టులు వచ్చిన తరాాతనే లా పేచీలు, థానూను 
ట్‌ ౧ లు యం 

చిక్కులు, బారీకులు తర్కకుతర్కాలు, కూటసాజ్యులు అ్యపమాణాలు, 
అబద్ధాలు, పారమందెను. ఆ విషయాన్నే ౧౮౫౮ విష్ల్రవములో బందీయెన తుడి 
ఢిల్లీ పాదుషాయగు బహదూరుషా ఇట్లు కవనము చెప్పెను 


ర హే థె ఇస్‌ముల్క్‌ మ పీరఠరోవలీషాంషో ఖమర్‌ 
జబ్‌ ఘుసీఫొజేన సారా హర్‌వలీ జాతారహా॥ 


“ఈ దేశమందు మునులు, బుషులు సూర్యచం దులు _పకాశమానులై 
యుండిరి. కాని ఇంగ్రీషువారి సేన లీ దేశమంకు జొరబడగానే సత్పురుషు 
లందరును మాయమైపోయిరి. 


ముందు [పకరణాలలో పంచాయతులను గూర్చి వివరింతును, ఇందు 
పశ్చిమ చాళుక్య రాజు తన రాజ్యమందలి పంచాయతీసభల దృష్టిలో నుంచుకొని 
తన యఖిలషితార్థ చింతామ్‌ణిలో వాసినవి సం|గహముగా తెలుపుదును. 


“పంచాయతీ సభలోని సభ్యులుగా నుండదగినవారు వేదశాస్తార్థ 
త త్వజ్ఞులుగాను, సత్యసంధులుగాను, ధార్మికులుగాను, మి తామి|తులందు సమ 
దృవ్టికల పారుగాను, రీరులుగాన్కు అలోలుపులుగాను, పలుకుబడి కలవారుగాను, 


10 ఆం|ధుల సాంఘీక చరిత 


లౌకిక వ్యవహార కోవిదులుగాను, వి|పులుగాను నుండవలెను. అట్టివారిని రాజు 
నియమింపవలెను. వారు కాని, లేక వారి సహాయముతో రాజు a వివాదముల 
పరిష్కరించుచ్కు పంచాయతీ సభలో అట్టివారు అయిదుగురు కాని, ఏడుగురు 
కాని యుండవ కతు: కలీకులుగా, (ఆరం ధనికులుగా, వయోధికులుగా, 
అమత్సరులుగానుండు వైశ్యులును సభ్యులుగా నుండవచ్చును. సభాపతిగా 
అర్జకాస్త్ర విశారదుడు, లౌకిక జ్ఞాని, పాడ్వివాకుడు, ఇంగి తజ్ఞాడు, ఊహా పోహ 
విజ్ఞాని, ఆయిన బాహ్మణుడు నియుక్తుడు కావలెను, ఆతడే పాడివాకుడు 
(జడ్జి) అనబడును. రాజు లేని కాలమం దతడే విచారణ కర్త, విప్రుని 
అభావములో కులీనుడగు నితరు నేర్పాటుచేయవచ్చును. ఎవరినై నను సభాపతిగొ 
చేయవచ్చును కాని ఎన్నటికిని హాదుని చేయరాదు! 


అభియోగములు ( కేసులు) రెండు విధాలు కలవి. బుణదానము 
(అప్పులు), నిషేపములు, అస్వామిక వికయములు, ఉంకువలు, వాటి అప 
_ హరణములు, జీతమియ్యకపోవుట్క (క్రయవికయ వివాదములు, స్వామిభృత్య 
వివాదములు, సీమావివాదములు, వాక్పారుష్యం (అవమానకరమగు తిట్టు), 
దండపారుష్యం, దొంగతనమ్ము స్రీ సంగహణము, దాయభాగము, జూదము 
ఇట్టి వన్నియు పంచాయతిలో విచారింపబడుచు వాది సభ్యుల యదుట 
నిలబడగా - నీకేమి బాధ, నిర్భయముగా చెప్పుము - అని వారడుగుదురు. 
' వాని అభియోగము విని పత్యర్థిని ((పతివాదిని) పిలిపింతురు. వాడు రోగియె 
లేక యితరములగు ఇబ్బందులలో నుండిన సభకు రాకంకుట దూష్యముకాదు. 
కులీనులను, పర భార్యలను, యువతులను |పసూతికలను, రజస్వలలను సభకు 
వీలిపించరాదు. ఆర్థిపత్యర్థి వాదములను విని సభవారు వాటి? వాయింతురు, 
వాటికేమి సాక్ష్యములు కలవని విచాగింతురు. ఈ విచారణ స్మృతిశాస్తా9ను 
సారముగా నుండవలెను, ఒకవేళ సాక్షులు లేకండిన అవసరమగుదో “దివ్యము” 
ఇయ్యవలెను. అనగా అగ్నిపరీక్షల వంటివి చేయింతురు. హత్యచేసిన వారికి 
వధాదండ మిత్తురు అంతకు తక్కువగు నేరములకు ఛేదదండము నితురు, 
అనగా చెవులు, ముక్కు, (వేళ్ళు, కాళ్ళు నాలుక మున్నగునవి నరికించుట, 
చిన్న నేరములకు శ్లేళదండ మిత్తురు. ఆనగా బెత్తముతో కొట్టుట, కఠినముగా 
మందలించుట వంటివి. అర్థహరణమునకు ౨౦౦ నుండి ౧౦౦౦ పణముల వరకు 
[దవ్యదండము నిత్తురు ఈ విధముగా న్యాయ విచారణ జరుగును, 

(అలి. ౧. ప, ౨ అధ్యా) 


తూర్పు చాళుక్య యుగము 11 


కర్ణాట దేశములకు సంబంధించిన దె నను పశ్చిమ చాళుక్యులను తర్వాతి 
కాకతీయు అనుకరించి న వారగుటచెే సోమేశ్వరుడు తెలిపిన పన్నుల విధాన 
మును బట్టి తెనుగు దేశమందును కొంత సాదృళ్యముండెనని ఊహించుకొన 
వచ్చుమ, 

“పపహిరణ్యములపై ౫౦ వ భాగమున్నూ; ధాన్యములో ౬, ౮ లేక 
OS భాగ మైనను; వక్కలు, నేయి రసగంధొషవములు, పుష్పఫలములు, 
గడ్డివ్నాతలు, చర్మమలు, మట్టివ్మాతలు, ఏటిలో ఆర వభాగమున్నూ తీసుకొన 
వలను, గో తియ, బాహ్ముణులనుండి పన్ను తీసుకొనరాదు. పశుపుల మేపు 
టకై కొంత భూమిని [గాయికాన్‌ ) వదలవలెను ””. 

(అభి, (ప, ౧ అధ్యా ౨.) 

దక్షిణ దేశమందు అంధ కర్ణాటకులలో లలితకళలణరు [పాధాన్య ముం 

డెను. నాట్యభంగిమములు, వాద్యవి శఇషములు కొన్ని దకశ్షిణమందు భిన్నముగా 
నుండెను, “సృ తగీతాదికములు ద్విజన్ముల ధర్మముకాదు" అసి తా పముద 
నిషేధ విచారమందు చెప్పిరి (అభి-పీఠిక). (పతిమాశిల్పములు, చిత్తరువులు 
సూదుల కళల్లై యుండెను (ఆభి-వీరిక). కాకతీయ కాలమందును సాధారణ 
జనులు కూడ ఇంటిగోడలపె చిత్తరువులు [వాయించుకొనిరి. అందుచేత అభి 
లషితార్థములో తెలుపబడిన చిత్రలేఖన విద్యావిషయమునకు చాల (పాముఖ్యము 
కలదు. ఆలఖ్యకర్మ అను పేరుతో ౧౦౦ పుటలవర కిందు వివరించినారు. 
చితిరువులను గురించి మన [వాచీన వాజ్బయము లంతగా కానరావు, విషు 
ధర్మో తర మను పురాణమందు (అద్‌ బహుశా కీ. శ, రంం౦=౧౦౦౦ [పాంత 
ములో రచింపబడెనమో) కొంత పిపులచర్చి కలదు. దానినే మైకా (కమిష్‌ 
అను రష్యాకిన్యక ఇంగ్లీషిలోని కనవర్తించెను. కాని దానికన్న ఎన్నియో 
రెట్లు ఉత్తమముగానుండు చ్మితకళాళాస్త్రము, ఈ సో మేశ్యరునిదే యనవలెను. 
బహుశా ఇంతకన్న మేలైన చితలేఖన శాస్త్రము మనలో లేదనవచ్చును. ఈ 
భాగము నంతయు తెనగులోనికి పరివరింపజేయుట బాగని తోచును. ఇందు 
చేతిచితముల కవసరమగు రంగులను సిద్ధము చేసుకొనుటను మొదలు తెలిపి 
నారు. గోడపై మంచి గట్టిగచ్చుతో చదును చేయవలెను, దున్నపోతు తోలు 
క త్రిరించి ముక్కలుచేసి నీళ్ళలో అవి మె త్రనగువరకు కొన్ని దినాలు నానబెట్టి 
దాని మడ్డిని తీసుకొని వెన్నవలె మెత్తబరిచి దానిని లేపనముగా వాడుకొన 
వలెను. నీఅగిరిలో లభించు శంఖచూర్గమును దానిలో కలుపవలెను, సన్నని 


12 ఆం ధుల సాంఘిక చరిత 


వెదురు కొనకు రాగిపొన్ను వేసి దానిని వర్తికగా (బష్‌గా) వాడుకొనవటెను, 
వివిధమగు రంగులలో శ్వేతము, రక్తము, లోపాతము, గెరికం, శీత్రము, 
హరితాళము, నీలము, మున్నగునవి కలవు, వాటి నెట్లు సిద్ధము చేసుకొనవలెనో 
వివరముగా తెలివీనారు. వివిధ దేవతలు, మానవులు జంతువులు ఏయే [సమా 
ణాలలో నెట్లుండవలెనో చాలా వివరముగా తెలిపినారు. 

(చూడుడు. అలి. ప, 8 అధ్యా ౧) 


నన్నెచోడుని కాలములో ఇంకేమైన లక్షణ గ్రంథాలు, చిత్తరువులక్రై 
యుండినేమో. “చి త్తసాధనంబులుగొని పలకఘట్టించి మెరుంగిడి _తివటించి 
తిట్టంబుకొలదికిం దెచ్చి బుజాకగతంబున రేఖనూల్కొ లిపి ప్యతిక విందు 
నిమ్నోన్నతాపాంగ మానోన్మానంబు లలవరచి సలక్షణంబుగా చి తించెదనని"” 
ఆందు వర్ణించినారు (కమా. ౫-౧౧౮). ఇండ్ల ఇడుపులపై చిత్రములు 
(వాయచుండిరి (కుమా. ౮ ౧౩౫). (శ్రీనాథుడు శృంగార నై షధమున 
(ఆళ్వాసం ౭) ఇడుపులపై ఎట్టి చిత్తరువులు వాయుదచుండిరో తెలిపినాడు. 
పాల్కురికి, గౌరనాదులున్నూ తమతమ రచనలలో ఈ విషయమును తెలిపి 
నారుః 


యుద తం[తము 
ణు 

తర్వాతి కాకతీయాదుల కొలమం దుండిన యుద్ధతం త్రమే యీ కాల 
మందున నుండెను. సీమాంతములందుండు దుర్గములను రక్షించుట క్రై పాలెగాం 
డ్గుండిరి. నిర్ణయమయిన సైన్య ముంచుకొని అవసరమెనప్పుడు రాజు శీవలో 
తమ సైన్యముతో సేవ చేయటక్రై వారికి “జీతపు టూళ్ల” నిచ్చుచుండిరి? 
సంస, గ్రా ఎగ ములయందు లేసి జీత పుటూళ్ళను తిక్కన పేర్కా నెను 
(విరాట 8 = ౧౧౯), 


నన్నెచోడుడు దేవదానవుల యుద్ధాన్ని వర్ణింప నెంచి తుదకు తనకాలపు 
యుద్ద విధానమునే విపులముగా వర్దించెను. ఏకాదళద్వాదళాశ్వాసములు రెండును 
దినిచేతనే నిండిపోయినవి. ఆ యుద్దములో స్‌ కింది విషయములు వెల్లడి 
యగును. 


కుమారస్వామిని దేవతా సైన్యమునకు అధిపతినిగా జేసి పట్టాభిషేకము 
చేసిరి. వెంటనే ఆతడు (పస్థానభేరి వేయించెను, 'సెన్యమంతయు యుద్ధనన్నద్ధ 
మయ్యెను, ఎలగోలు సైన్యమును (Advance army) ముందు పంపిరి. ధన 


తూర్పు చాళుక్య యుగము 18 


భండారమును సెనిక వ్యయమునకు వెంటదినుకొనిరి. గుజ్జము దళముల 
"సెన్యా[గ అద నడిపిరి. ధారలు (బాకాలు), చిందములు (శంఖములు) 
(మోయిందిరీ. ఎనుగులదళమును “సెన్యమువెంట నడిపిరి. సేనానులయొక్కయు, 
రాజు యొక్కయు, మంతుల యొక్కయు, ముఖ్యుల యొక్కయు అంతః 
పురములు సైన్యమువెంట కదలను. అంతఃపుర న్ర్రీలను కాచుటకై కొంత 
సేన (పత్యేకించిరి (కుమా, ౧౧-౫) (హిందూరాజుల యొక్కయు, ముస్తిం 
నవాబుల యొక్కయు యుద్ధయాతలలో అంతఃపుర స్రీ లుండుట హిందూ 
స్థాన చరితలో సర్వసాధారణమై యుండెను.) ధ్వజంబు లె త్తిరి). దుందుభులు, 
విరమద్దెలలు, త ప్పెటలు. కొమ్ములు, ఢక్క-లు _మోయించిరి. పెద్దల ఆశీర్వా 
దము లందిరి, సైన్యమునకు ముందు దిక్కునను, [పక్కలను, వెనుక భాగము 
నను సేనానులు నడిచిరి. 'సెనికులు కుంతములు, ఈటెలు, ఛురియలు, బల్లె 
ములు, కత్తులు, అంబులు, గడలు ధరించియుండిరి. కొందరు “వీరసన్యాసు 
లయిరి”; కొందరు ఇక మరల (బదికివత్తుమో లేదో అని ముందుగానే తమ 
ఆస్తిని దానము చేసి “సర్వస్వదానులయిరి". ఈ విధముగా సిద్ధమై అశ్వదళము? 
గజదళము, కాల్బలము, రథబలము అను చతురంగములతో శ తువులపెబడి 
యుద్ధము చేసిరి. చీకటి పడగానే యుభయ సైన్యములు యుద్ధము చాలించెడి 
వారు. (ఇది హిందువుల యుద్ద ధర్మము. ముసల్మానులు దీనిని బాటింపక పలు 
మారు రా, తివేళ హాందూ సె భున్యమలబ సెబడి ఘఘోరవధలు చేసి యుద్ధముల 
గెలిచిరి) ర్నాతీ విరామమందు యుద్ధభూమిలో చచ్చిన తమవారిని వెదకు 
వారును, గాయములకు కట్లు కట్టించుకొని మందులు తీసుకొనువారునునె 
యుండిరి. మరల తెల్లవారగనే యుద్ధము పారంభమయ్యెను. ఉభయ బలంబులు 
పోరాడిన. శ్యతుసంహార మయ్యెను. జయజయ ధ్వానములతో సైన్యము 
మరలెను, 


ఇవి కుమారసంభవ మందలి యుద్ధ వర్ణనలలోని సం గహ విషయములు. 
అభిలషితార్థ చింతామణిలో రాజుల యుద్ధ యాతా పద్దతిని గురించి విపుల 
ముగా కలదు. ((పకరణము ౧ అధ్యాయము ౨. పుటలు ౧౧౭ నుండి ౧౭౨ 
వరకు) యుద్ధ మునకు శరత్కాలముకాని వసంతముకాని ఉత్తమము. యుద్భ 
యా తకు ముందు నిమి త్రములను, శకునములను చూడవలెను. పంచాంగళుద్ధిని 
చూచి ముహూ ర్రమును పెట్టించవలెను. చతుర్విధోపాయములను ప్రయోగింప 


14 ఆం(ధుల సౌంఘ్‌క చరిత 


వలెను. సైనికులను యుద్ధమందు (ప్రోత్సహించి శతువులను నాశనము చేయ 
వలెను, ఆని చాల విపులముగా మై [గ్రంథమందు [(వాయబడివది. చాళుక్యుల 
యుద్ధ పద్ధతిన ండి కాక తీయాది |పభువుల యుద్ధ విధానమును కొంత తెలుసు 


నవచ్చును,. 
ల 


పశ్చిమ చాళుక్యులు యుద్ధములో గుజ్జిముల [పాముఖ్యమును గమనించి 

యుండిరి. సోమేళ్వరు డిట్లు (వాసెను. “యవనదేశ మందును కాంభోజదేళ 

మందును (ఆఫ్‌ మనిస్థానము) పుటిన గుఅములను యుదమం దెటుపయోగింప 
| థి ట గ్‌ థ్‌ గొ 

వలెనో ఆ శికణము పొందిన సైనికులు సాధించి యుండిన ఆ గుబ్దిపు బలము 

ఉత్రమమైనదగును. శతువుబు సుదూరమం దుండినను ఆ దళమువారిని 

జయించి రాగలదు. గుత్టాలచే కీర్తి లభించును, ఎవనికి ఆశింక బల ముండునో 
వాని రాజ్యము స్థిరముగా నుండును (యస్యాళ్వాః తస్యభూస్థిరా) 


(అభి: షి, ప౧. అ ౨. పుట ౯౯) 


ఆ కాలమున రాజులు సంపన్నులు. ఏ విధముగా భోగము లనుభవించిరో 
అభిలషి తార్థమునుండి (గపాంపవచ్చును. అందలి విషయాలు నతి సంగహ 
ముగా సూచింతును, 

స్నానగ్భహము మెరిసే స్తంభాలతో, స్ఫటిక వేదికతోను, కాచకుట్టిమ 
ములతోను, చ్మితములతోను కోభించునదై యుండెడిది. దినము మార్చి దినము 
అభ్యంగ స్నానము చేయవలెను, డ్వితియా, దశమీ, ఏకాదశీ దినాలు వర్జ్య 
ములు. గేదంగి, జాజికాయ, పున్నాగము, చంపకము, యంతసంపీడితమగు 
తిలతైలమందు కాచి శిరస్సాషనమునకు వాడవలెను. నలుగులో కోన్టము, 
తకో).లము, ము సలు, మాచిష్కతి, తగరం. మాంసీ, వాయింట, మెట్టతామర 
దుంప ఏటి గడ్డలను తీసుకొని నీడలో ఎండించి సిమ్మ, తులసి, ఆర్డకము, 
పీట్రి ఆకులు వాటితో కలిపి ఏలక్క జాజి, సర్షపము, తిలలు కొ త్రిమిరి, 
తగిరిస, లవంగము, లో[ధ, శ్రీగంధము, ఆగరు మొదలయినవి కూడా కలిపి 
సిద్ధము చేయవలెను. 


వారి తాంబూలము అసాధారణ మైనది. వక్క లను క ర్పూరమునీటితో 
తడివీ (శ్రీఖండమును కస్తూరిని కలిపి ఎండించి ఇంకా ఇతర ద్రవ్యాలతో శుద్ధి 
చేయవలెను. పిడకలతో పుటముపెట్టిన ముత్యనుల భస్మమును సున్నముగా 


తూర్పు చాణక్య యుగము 1b 


వాడవలెను. పచ్చకరూ. రమున్సు కన్రూరీ చూర్ణమును, ఘనసార చూర్చమును, 
ఆకులలో నుంచవలెను. తకో్క్కోలము, జాజి మున్నగునవి నూరి గోలీలుగా చేసి 
వాడుకొనవలనసు, 


అ కొలమందు రాజులవద్ధ్ద వస్త్రభాండారము లుండెను. వాటిపై ఒక అధి 
కారి నియుక్తుడి యుండెను. నానా |పాంతములందు సిద్ధమ యిన వస్త్రములను 
_ తెప్పించెడి వారు, పోహలపురము, చీకపల్సి, అవంతి నాగపట్టణము, సాండ్య 
బేశము, అర్లీకాకరమ్ము సింహళము, గోపాకము, సురాపురము (ఉత్తర నర్కా 
రులలోని సురపురము అనునది.) గుంజణము, మూలస్థానము (ముల్టాన్‌ ఖా 
తోండిదేశము (తుండీరము-మదదాసుకు దక్షిణ (పాంతము), పంచపట్టణము, 
మహాచీనము (చెనా), కళింగము, వంగము ఈ |పాంతాలనుండి వ స్త్ర ములు 
తెప్పించెడివారు. నానావిధమగు రంగులబట్ట లుండెడిన. మంటజిష, లక), 
కొసుంభ (రంగుపూలు), సీందూర్క హరిద, నీలి మున్నగు రంగు లందు 
ముఖ్యమైనవి), చీరలు, ఘుట్టక ములు, సెల్లాలు, దుప్పట్లు, ఆంగీలు (అంగికాః), 
ఉష్టిషములు, టోపీలు (టోపికాః , వివిధ వస్త్రములు వాడుకలో నుండెను. 
అంగిలు, బొందెలు ఆంగీబయియుండును. ఈ పదము ఆనాటికే వాడుకలోకి 
వచ్చెను. టోపీ అన్న పదమును ఇక్క డ మొదటిసారి వింటున్నాము. నసంత 
కొలమందు నూలుబట్టలు, సిదాఘమందు సన్నని, తెల్బనిబట్టలు; వర్ణాకాలమంమ 
ఉన్నివి ధరించవలెను. రాజులు ఎల్లకాలములందు ఆంగీ 3, టోపీని ధరించి 
యుండవలెను, 

అన్న భోగము, ఆసనభోగము, ఆస్థానభోగము మున్నగునవి ఆతి విపుల 
ముగా నీ [గంథమందు తెలిపినారు, వానినిబట్టి ఆకాలవు రాజుల వై భవాలు 
(గహించుకొనవచ్చును. 


ఈ [పకరణమునకు ముఖ్యాధార ములు 


కుమారసంభవము - నన్నెచోడుడు. ... 
తెనుగుభారతము - విరాటపర్వాంతము వరకు, 
అభి౯షితార్థ చింతామణి - చాళుక్య సోమేశ్వరుడు. 
(మైసూరు విద్యావీళ _పచురణము మొదటి సంపుటము.) 


% వ (పకర అము 
కాకతీయుల యుగము 


(ఓరుగంటి కాకతీయ చ|కవరులు ఇంచుమించు (కీ! శ ప నుండి అకకల్‌ 

వరకు రాజ్యము చేసిరి. మన యాదికవియగు నన్నయభట్టు kn శ॥ ౧౦౫౮ 
[ప్రాంతములో నుండునట్టివాడు. అతడు తూర్పుచాళుక్యుల కవి. కావున చాళుక్య 
కాలము, కాక తీయకాలము రెండను కలిసినవి, 


నన్నయకన్న పూర్వము తెనుగు దేశములోని మనకు తెలిసిన ఆ కొలది 
పాటి విషయాలు తెలియనివాటితో సమానమే. నన్నయకాలమందలి పరిస్థితులు 
కూడా మనకు సరిగా తెలియవు, మనకు కొంతవరకు తెలిసినభాగము కాకతీ 
యుల కాలమే. 


కాకతీయ సా[మాజ్యముం గూర్చిన సాధనములు-శాసనములు, రచనలు, 
శిల్పములు, విదేశ చారి|తకుల [నాతలు, నాణెములు కథలు, సుద్దులు-మనకు 
లభించిన వరకు ఉపయు క్రములై యున్నవి వీని యాధారముచే మన యాది 
చారి తిక యుగమందలి. [పజలయొక్క రాజకీయ నెతిక విద్యావిషయిక , 
తం ne లెట్టివో మనకు కొంత కొంత విశద మగుచున్నవి. (కాకతీ 
యులు శాలివాహన శకారంభమునుండియే రాజ్యము చేయుచూవచ్చిరని |పతాప్ప 
రుుదచర్శిత మను (పాచీన (గంథములో వౌసినారు. కొని అది అబద్ధము. 
(| తకు bres మొదటి షష ప్రోలరాజు) కావున ఈ 
| పకరణమున (కీ॥ శ దం౫రీనుండి కీ! శ వ వరకు ఆనగా ఓరుగంటి 
పతనము వరకు తెలియవచ్చిన ఆం|ధుల సాంఘిక జీవనమును గూర్చి 
చర్చింత ము, 


మతము 


మనకు మతము |పధాన జీవనవిధానము. అత దాన్ని గురించియే 
మొదట విబారింతము. ఆ కాలములో తెనుగు దేశమందు బౌద్ధమత మీంచు 


కాకతీయుల యుగము 17 


మించు నామావశిష్ట మయ్యెను. కాని జై నమతము _పబలముగానే యుండెను. 
శ్రీమచ్చంకి ర భగవత్సాదులదెబ్బ తెనుగుసీమ పె పడినట్టు కానరాదు. పైగా 
ఆతనికి సరిజో డైన కుమారిలభట్టుదే తెనుగు నాట .పైచేయిగా నుండెను. 
కౌమారిలదర్శనమును |వచారమునకు తెచ్చిన పభాకరుడు ఓ ఢదేశమువాడు. 
కుమారిలు డాం ధుడు. గంజాముజిల్లాలో జయమంగళ  గామమువాడు. 
కౌమారిలులుకూడా జైనులకు |పబల శ|తువులు. అయినను జైను లను వారు 
రూపుమాపజాలినవారు కారు, ఆంధ కర్ణాట దేశాలలో జైనులను నిజముగా 
[పధ్యంసము చేసినవారు _ వీర శై వులే, వారు శాస్త్రచర్చతో ఎక్కు.వగా పని 
తీశుకొన్నవారు కారు. (జై నమతమందలి వర్హరాహిత్యమును తమ ముఖ 
సిద్ధాంతముగా ౭వులు స్వీకరించిరి. కాని కాస్త్ర్రచర్చవల్లగాని ఆచార వ్యవహార 
స్వీకరణములవల్లగాని జైనులు లోబడనప్పు డా యహింసా వాదులపై వీర 
శెవులు హింసను |పయోగించుటకు వెనుకాడ లేదు) రాజులను వళపరచుకొని 
వారికి వీర క్రై వదీక్ష నిచ్చి, వారిగురువులై, మం;తులై, దండనాయకులై, 
రాజ్యముల వళశీకరించుకొని కథలతో, కత్తులతో, కల్పనలతో, బహువిధ విధాన 
ములతో, పరమత నిర్మూలనముతో ఏరవిహారము చేసినవారు ఎరశైవులేః జైన 
వ్మిగహములను లాగివేసి వాటిస్థాసములో లింగాలను బెట్టిరి. నగ్నజైన వి,గవా 
లకు కొన్నిటిని బహుళా ఏవరభ్యదులగా చేసికొని యుండిన చితము కాదు. 
నేటికిని కొన్ని తావులలో గుడిబయటి భాగమందు జైనవిగహాలుండుట 
ఆందందు చూచుచున్నాము, ' గద్వాలలోని పూడూరు [గామములో ఊరిబయటి 
గుడిముందట నగ్నజైన విగవోలను పెట్టి వాటిని “పూడూరి జయటిదేవర్దు” అని 
యందురు. ఆచ్చటనే ఊరి ముందట “ జెనళాసనము” అను శీర్షికతో చెక్కబడిన 
లీరు ఏండ్లనాటి శాసనము కలదు" అదేవిధముగా : వేములవాడలో జినాలయము 
శివాలయముగా మారి, పావము ఆడిజైన విగహాలు గుడి కావలిబంట్లవలె 
దేవళము బయట దరిదాపు లేనివైనవి., తెనుగు దేశములో అనేక స్థలములం దిట్టి 
దృశ్యము లుపలబ్ధమగును. జైననగ్న విగహాలను హిందువులు చూచిన, 
_ వాటిపై మట్టి బెడ్డలు వేసి నగ్నతను కప్పుట కేమో బట్ట పేలిక నో, దారమునో 
వెసి పోవుదురు. జోగిపేట యనున దొక కాలములో పూర్తిగా జైన (జోగుల) 
బస్తీ, అచ్చట యిప్పటికి, జనులున్నారు. కొలనుపాకలో సుప్రసిద్ధ వైనాలయము 
కలదు. హై|దాబాదు నగరములోనే _పాచీన జెనాలయములు కలవు. వరంగల్‌ 
లోను హనుమకొండలోను, హనుమకొండ గట్టుపైెనను జైనవిగహాలు బాల 


19 ఆం|ధుల సాంఘిక చరిత 


కలవు, ఈ లెక్క చొప్పున తెలంగాణములోనే జెశమత వ్యాప్తీ యెక్కువగా 
నుండెను. 


కాకతీయుల కాలములో జైన, శైవ, వైప్లవ మతములు పరస్పర 
పాబల్యవ్యాపులకై పోరాడుచుండెను మూడింటిలోను కులభేద నిర్మూలనము 
ఒక సామాన్యధర్మముగా వ్య క్తమవుతున్నది. కవి్మిశయమువారే ఒక విధముగా 
తెనుగుదేశమందలి వర్గాశ్రమాచార స్థిరతను నిలబెట్టుటకు [ప్రచారము చేసినవా 
రనవచ్చును. ) నన్నయభట్సు భారతము |బాహ్మ ణాధిక్యతను |పచారముచేసెను. 
తిక్కన యజ్ఞదిక్షితుడై కుండలీం|దుడయ్యెను. బుధజనవిరాజి సోమయాజి 
యయ్యెను, (కాని, హకతీయయుగములో మాత్రము వారిపచారము జైన, శైవ, 
వైష్టవ [పవాహములో కొట్టుకొనిపోయెను. ఈ మూడు మతాలవారును సంఖ్యా 
బలమును సమకూర్చు కొనుటకును యథార్థముగా ఆర్యజాత్ర్యాక్యత కవసరమగు 
కులత త్త నిర్మూలనముచేసి, సర్వవర్హ ముల వారిని ఎకవర్ణ ముగా మార్చ [పచా 
రముచేసిరి. ) 
(మొదట జైనమతవ్యావ్ని హెచ్చుగా నుండెను, ఓరుగంటి ఆది రాజులు 
జైనులు.) అప్పుడు బస వేళశ్వర నాయకత్వమున బిజ్ఞలుని కల్యాణి రాజ్యమందు 
తలయె త్రిన వీరశైవ గుంయూమారుతము తెనుగడ్డపైెకి వీవదొడగెను, 


“ఒకనాడు శివభక్తు లోరగంటను స్వయం 
భూదేవు మంటపమున వసించి 
బసవపురాణంబు పొటించి వినువెళ 
హరుని గొల్వ |పతాపు డచటి కేగి 
ఆ సం|భమం బేమి యనుడు భక్తులు బస 
వని పురాణం బి వినద రనిన 
విని యా పురాణంబు విధ మెట్లొకో యన్న 
ధూ ర్తవి[పు డొకండు భ ర్రజేరి 
పాలకురికి సోమ పతితు డీనడుమను 
సెనచె మధ్యవళ్ళు పెట్టి ద్విపద 
య్మ్యవమాణం బిది యనాద్యంబు పదమన్న 
నరిగె రాజు, భక్తు లది యెరింగి,'” 


కాకతీయుల యుగము 19 


పాల్కురికి సోమనాథుని కెరింగించి రనియు ఆ *ధూ ర్తవి[వులు 
కొందరికి శ్రైవవెషములువేసి ఓరుగంటికి వెళ్ళుచున్న సశిష్యుడగు సోమనాథు 
నెదుటికంపగా ఆ కుహనాశ్రైవులు నిజమగు శై య! రనియు విడుప రి 
సోమనాథుడు (కీ. శ టఉ౬ం౦౦ న సన. వాసెను. పెవర్ణనలలో అనేక 
విషయాలు వ్య క్రమవుతున్నవి. (దేవాలయాలలో సతత తు చదువుట,) 
జనులు భక్తిశద్దంతో గుమికూడి వాటిని వినుట్క (నూతన వీరశె వులను పతి 
ఘటించిన వారిలో “వపులే” ప్రాముఖ్యము వహించుట్క అందుచేత వీరశైవ 
సాం| పదాయ పవర్తకులకు బాహ్మణులతో పలుమారు సం ఘర్షణములు 
ఇప ఖ్‌ పులను _బాహ్మణులు “పతితులను'గా నిర్ణయించుట, బౌద్ధమత 
(ప్రచారానికి జనసామాన్య భాషయగు పాలీని సాధనముగా గొనినట్టు సీరళై వులు 
తమ పురాణాలను సంస్కృతములో వాయక కర్ణాటాంధభాషలలో (పచారము 
చేయుట, అందులోను నన్నయ నాటినుండి నిరాదరముపొంది తుదకు వేయి 
గోవాల శతకకారుని కాలమువరకు అనగా (క్రీ శ. ఉక్షంం వరకు “ద్విపద 
కావ్యుంటు ముడిలంజ, వ! ౦తి” అని యు నొక టే యనివిందుకొన్న ద్విపద 
లోనే, అందులోను పాసయతితోను, aan “శివకవిత' నెగ 
డించి [పచారముచెయుట, అందుచేత “ఈ నడుమ, పె+చె మధ్యవళ్ళుపెట్టి 
ద్విపద” అను తిట్టునకు గురియగుట, ఓరుగంటిరాజులు జై నమును వదలి, 
“హరుని గొల్వ' శివాలయమునకు పోపుట) “ఈ నడుమి వెలువడిన శివపురా 
ణాలను విందమను నాన క్రీ కొంతవరకైన |పభువులలో కానవచ్చుట, ఈ 
పద్యము వల్ల మనకు స్ఫురించుచున్నవి. జనులను నాగాహింసలపాలు చేసి 
నట్లు పాల్కురికి సోమనయే తెలిపినాడు. జనులను రాళ్ళతో కొట్ట హింసించిరి. 
"జిన సమయస్థులను తాటోబుపరిచి”నట్టు క తావులలో పాల్కురికి 
సోమనాథుడు వర్జించెను( ఈ విధమగా క్రీ శ. దటరెం వరకు జైనము క్షీణించి 
దాని స్థానములో వీర శ వము నెలకొనెను.) 


+ “జైన” బౌద్ధ చార్వాక దుష్పథ సమయములు, మూడును నిర్మూలన 
ముగ జేయుదనుక్క మూడురాలను వైతు ముప్పొద్దు నిన్ను. 
(బసవపురాణం-పాల్కురికి పు. ౧౮౦) 
నసుధలో జినులనువారి నందరన్ను నేలపాలుగ జేసి, 
(పాల్కురికి జన పు. ౧౯౨) 


20 ఆం|ధుల సాంఘిక చరిత 


7 (ఆదేనమయములో తెనుగుసీమలోనికి వై ష్షవము ఏీరావేళముతో వీర 
£ వనమున కెదురొడ్డి వీరవై వ్లవముగా విజృంభింప నారంభించెను) వైష్ణవము 

శె వము కొ త్రగా ఏర్పడినవికావు. ఆవి ఆరవదేశ మందు |పాదీనము నుండియే 
సిరపడియు=డెకు. వె వైష్టవముకన్న శ్రైవమే అకవదేశ మందు (పాచీనతరమైనట్టిది . 
ఆ రెండు మతాలు తెనుగుదేశములోనికి వచ్చెను. (్రభయమత |పబోధకులును 
పరస్పరస్పర్థతో శూదాది జనసామాన్యమునకు మూఢభ _క్తిని ఒంటబట్టించి వారు 
మరల జారిపోకుండుటక్రై శివలింగాలు కట్టి లేక వైష్షవము[దలువేసి నామాలు 
పెట్టించిరి. గోన బుద్ధారెడ్డికూడ రామాయణమును ద్విపదలో |వాయుట, 
చె_ష్ట్షవ [పచారమునకె “ శేసన శై ౩ వానుకరణమే.) తర్వాతికాలములో “చిన్నన్న 
ద్విపద కెరుగును అను విఖ్యాతిగాంచిన తిరువేంగళనాథుడు కేవలము శివనిరస 
ననుతో విష్ణుభ క్రిని ప్రచారము చేయుటకై “పరమయోగి విలాస మను ద్విపద 
పురాణమును వా సెను, 


చి 


(జైనులు రంగమునుండి దిగజారిపోయిన తర్వాత మతోన్మాద గదా 
యుద్ధమునకు వీరశైవ వీరవైష్షవులే మిగిలిరి.) వీరు పరస్పరము తిట్టుకొన్న 
తిల్లే ఒక చేటభారతమగును. వీరు గుళ్ల్ళలోని విగహాలనుగూడ శక్తికలిగి 
నప్పుడు మార్చిరి.(సుపసిద్ధమగు తిరుపతి వేంక టేశ్వరుని విగహము మొదట 
పీరభ్యద విగహమనియు, దానిని వైష్ణవ విగహముగా చేసిరనియు కాకతీ 
యుల కాలపు వాడగు శ్రీపతి పండితులు తమ శ్రీకరభాష్యములో తెలిపినారు 
“ఈ బలవత్సరివ ర్రకము చేసినవారు శ్రీమ దామానుజాచార్యులవారని శ్రీపతి 
పండితులు తెలిపినారు. 


( (ప్రాణాంతక మైనను సరే, జై నాలయములలోనికి పోరాదన్నట్లుగా శవ 
వైన్షవలు ఒకరినొకరిని చండాలురనుగా, అసభ్యముగా దూషిందుకొగిరి. మా 
దేవు డెక్కువ, మా దేవుడే యెక్కువని, నిరూపించుటకు కథలను పురాణము 
లను సృష్షంచిరి. (ఈ 2 జన, శైవ, వైష్షవ ద్వేషాల కాక తీయాం|ధరాజ్యాల 
పతనమున కొక కారణమయ్యెను, ) 


*“నను వేంక టేశ్వర విర్ధలేశ్వరస్థానే విష్టోరశ్వర శబ్ద శ్రవణాత్‌ ...... 
వేంక టేళ్వర స్యాభాస విష్ణుత్యం, తదంగే నాగభూషణాది ధర్మాణాం ద్యోతనాత్‌, 
మూల విగహే శంఖచ[కాది లాంఛనానా మదర్శనాత్‌..,కించ తత్సాణ్యధో 
దేశే శివలింగ దర్శనాదీశ్వరళట్లో వ్యవ [హియతేం” 


కాకతీయుల యుగము 21 


(శైవ. వైష్ణవ భేదము లెట్లున్నను వా రిరువురును కులనిర్మూ లనమునకై 
కృషిచేసిరి. ) లింగము కట్టినవారందరి దొకే లింగవంత కుల మనిరి. సమా, 
యణమను ముద్రలు వేయించుకొని ఊర్థ్యపుండధారు లైనవారందరును ఒకే 
కులమువా రనిరి, 


పల్నాటి వీరచరి,తములో |బవ్మానాయుడు |జాహ్మణాది చండార 
పర్యంతము నానాకుల స్రీలను పెండ్తాడెననియు, తనకు ముఖ్యుడైన కన్నమ 
నీడ్తు (బహ్మనాయుని తండిగా చెప్పుకొనుటయు, యుద్ధరంగ మున మాల, 
మాదిగ, వెలమ, కమ్మరి, వడ్ల, కుమ్మరి మున్నగు కులాల వార ద రును 
చైష్షవ సాం పదాయమువారై. ఏకపం క్రిలో 'చాపకూడు' కుడుచుటయు ముఖ్య 
ముగా గమనింపదగినది. వెలమలు సంఘసంస్కాారు లగుట, రెడ్డు పూర్వాచార 
పరులగుట కానవసున్నది. ఈ దాపకూడు కూడా పల్నాటియుద్దాని కొక ముఖ్య 
కారణ మయ్యెను. * 


వెలమలచర్చ వచ్చినందున ఇచటనే వారినిగూర్చి సూత్ర పా యముగనే 
నాలుగు మాటలలో తేలుపుదుము. వెలమ లెవ్వరన్నది నేటికిని తేలినది కాదు. 
లెడ్షైకు వెలమలకు ఓరుగంటి పై రుద మదేవికాలములో తురకల దండయా[తా 
కాలములో స్పర్థలు _పారంభమై నిత్యాభివృన్ధి కాంచి, ఉభయుల రాజ్యాల నాళ 
నమనకు దారితీసెను. రుదమదేవి వెలమలకు ఒక విశిష్టతను రెడ్లకిచ్చిన 
విశిష్టతనేమో కల్పించెను. వెలమలు వీరవైష్టవు లై.నట్లును, రెడ్లు వీరళై పులుగా 
నుండినట్లును కానవస్తున్నది. కొండవీటి రెడ్డికాజులను పరమ శ్రైవాచార పరా 
యణులుగా శ్రీనాథుడు వర్ణించెను 


“ఇచ్చోట బోరిరి యిలపణంబుగ గొల్లసవతి తల్పల బిడ్డ లవనిపతులు” 
అన్న కీడాభిరామ వాక్యమన కేమర్ధము ? 


*” ఆరువల్లి నాయురాలి దుర్శం|తంబు 
కోడిపోరు, చాపకూటి కుడువు, 
[పథమకారణములు, పల్నాటి యేకాంగ 
పీరపురుష సంహారమునకు” 
(క్రీడాభిరామము 


22 అంధుల సాంఘిక చరిత 


వెలమలు వెలమలేకదా ! అందులోనూ జ్ఞాతుళకదా పల్నాటియుద్ధమును 
చేసిరి! వారు “గొల్లసవతితల్దుల బిడ్డలు” అని కవి యేల వర్చించెను? నాకు 
స్ఫురించున దేమన, వెలమలు తెనుగు డేశమువారు కారు. ఆ లెక్కకు రెడ్డును 
అంతే! ఒకరు దక్షిణమునుండి, రెండవవారు ఉ త్రరమునుండి వచ్చినారని 
తలంతును. రాష్ట్రకూటులు రెడ్డ యిరి. దశ్నిణ తమిళ డేశమునుండి తెనుగు 
సీమకు గీ. శ. ౧౧౦౦ [పాంతములో వచ్చి కాకతీయుల సేనలో చేరిన 'వెల్లాల' 
అను జాతివారే వెలమల యుందురు. వెల్లాలవారే వెలమలని వెల్లాలజాతిని 
గూర్చి చర్చించుచు థర్‌ స్టను వాసెను.* (కొత్తగా వచ్చినందున వారిని రెడ్డు 
తక్కువగా చూచి, వారితో ద్వేషము సంపాదించుకొనిరి, శ్రీనాథుని కాలములో 
వెలమలు రెడ్డతో సమానులుగా పరిగణింపబడిరి. పల్నాటి వీరచరితలో 
హైహయదాయాదులు పోరాడిరి. వారు గొల్లవారై యుందురు. ఆందుచేత కవి 
యట్లు వర్ణించియుండును, 


వైష్టవులు కులభేదాలను ధ్వంసించిన దానికన్న హెచ్చుగా వీరశైవులు 
ధ్వంసము చేసినవారు. పెగా వారికీ బాహ్మణులతో నీ ఏిషయమందు కల 
హించు పరిస్థితు లేర్పడెను. అందుచేత “కోపం శేషేణ పూరయేత్‌' అన్న నీతి 
నాధారముగా కొన్ని, కొన్ని మారులు వాదమును వదలుకొని “త్యం శుంఠ స్వం 
శుంఠ8' అని తిట్టిపోసిరి. 


“శూలిభ కుల కెత్తు కేలది (తాటి 


మాలల కెత్తుట మరి తపు గాదె” (1) 
“అసమాక్షు గొలువని య|గజుండై న 

వనుధ మాలు (2) 
“నా మాలకుక్కల నర్చింప దగునో (8) 


(ఇచ్చట వైష్ణవుల నుద్దేశించి తిట్టియుండును.) 
* THURSTON —Castes and Tribes of South Indla. 


(1) పాల్కురికి బసవపురాణము పు ba 
ల పు ౫డీ 
( ) 9) ?9 ఇ ౨౦౭ 
(83 » పు సెక 


I se ఆ పు పెకీ 


కాకతీయుల యుగము 23 


*.. . వేదభవ[కాంతు లనగ 
బడిన 'బాహ్మణ గార్థభంబులతో డ” (4) 


ఇంతటితో ఆగలేదు. క ర్మ చండాలురు, (వతభమ్టలు, దుర్దాతులు, పశు 
కర్ములు, బాపనకూళలు అని నానావిధముల [(బాహ్మణులను తిట్టినారు. హిందువు 
లను కలకాలము వదల నొల్లని కులత త్రము ఈ శై వవైప్లవులవలన కాకతీయ 
రాజ్య పతనానంతరము స్థిరపడి, మరికొన్ని కొ త్రకులముల కూనల లేవదీసెను, 
౩ వులలో లింగాయళతులు, బలిజలు, జంగాలు, తంబళ్ళు మున్నగు రులా లేర్చ 
డెను. వైప్టవలలో నంబులు, సాత్తానులు, దాసర్లు మున్నగు వారేర్పడిరి. కె వులు 
మతము పేర బసివిరాం|డను జన్నవిడిచిరి. బసవనిపేర గ్రీలను పెండ్రిచేయక 
వదలి వారిని వ్యభిచారిణులనుగా జేసిరి. వై ష్ణవులుకూడా ముదలు వేసి దేవదాసీ 
లను సిద్ధము చేసిరి. కాకతీయానంతర కాలములో శైపులు చాలామంది వైష్టవు 
లరి. అందు ముఖ్యులు రెడ్లు. 


(కాకతి పోలరాజు వరకు కాకతీయులు జై నులై యుండిరి. [పోలరాజు 
కుమారుడు శె వుడయ్యెన్సు కాకతి యే దేవతగా నుండెనో ఆకాలమునాడే సరిగా 
ఎరుగరు. *కాకత్యాః పరాళ కేః కృపయా కూష్మాండవల్లికా కాచిత్‌ | పుత్ర 
మసూత తదె తత్కుల మనఘు కాకతి సంజ్ఞమ భూత్‌ ॥” అని కలువ చేరు శాసన 
ములో |వాసిరి. కాకతీయులు త తియులు కారని విద్యానాథుడే (వాసెను.* 


కాకతీయులు శెపులైన తర్వాత జైనులను హింసించి యుండవచ్చును. 
“ఆనుమకొండ నివాసులయినట్టి బౌద్ధజైనుల రావించి వారిని తిక్కన ముక 
తోడ వాదింపజేసెను.” అని గణపతి దేవు9 గూర్చి సోమదేవ రాజీ యములో 
నున్నది. తిక్కన తన నెల్లూరి [పభువగు మనుమనిద్ధికి సహా'మార్థమె ఓరు 
గంటికి వెళ్ళి గణపతిరాజు సాయము వేడెననియ ఆ సందర్భములో నతడు 
జైనబౌద్దుల నోడించె ననియు పై (గంథము తెలుపుతున్నది. తిక్కన సోమ 
యాజి పటువాక్య శ క్రికి గణపతి మెచ్చుకొని “ జినసమయార్థుల శిరముల 
దునిమి విద్వేష బౌద్ధుల విలుమాడి...”+ నానాహింసలు చేసెనట. ఈ విషయ 
ములను బట్టి ఈ (పకరణాదిలో తెలిపినట్లుగా కవ్మితయమువారు కేవల ఖాషా 


*అత్యరేే ందు కుల పళ స్తీ మస్ఫజత్‌ '. ,,పతాపరు దీ నము. 
0 పండితారాధ్య చరిత, మొదటి భాగం, పుటలు ౫౦౬, ౫౦౭+ 


24 ఆంధ్రుల సాంఘిక చరిత్ర 


శాసకులే కాక, పొరాణికులే కాక, మధ్యకాలమం దేర్పడిన కులత త్త | పచారకు 
లుగా గూడ నుండినట్లు ఊహింప వీలగుచున్నది. 


కాకతీయుల కాలములో జైన బౌద్ద సమయముల (సాం|పదాయముల) 
వారే కాక యింకను పలుసమయముల వారుండిరి. అదైె తవాదులు, |బహ్మ్య 
వాదులు, పాంచరాత్ర |వతులు, ఏకాత్మవాదులు, అభేదవాదులు, శూన్య వాదులు, 
కులవాదులు, కర్మవాదులు, నాస్తికులు, చార్వాకులు, (పకృతి వాదులు, బ్ర 
బహ్మపరులు, పురుషతయైవాదులు*ి, లోకాయతులు-+, మున్నగు మతావలంబు 
లుండిరిం 


ఎ. | కాకతీయ కాలమందు తెనుగు సీమలో వీరశై వులు తమ మతప్రచారార్థమై 
గోళకి మఠఘుల నేర్చాటుచేసిరి ఈ మథఠమువారిలో కొందరు మహాపండితులై , 
గురువులై, విద్యాటోధకులై వెలసిరి. గోళకీమఠములందు శెవసాంపదాయ 
బోధను థా స్త్ర విద్యను సంస్కృత భాషలో నేర్పించుచుండిరి. ఒక విధముగా 
నవి వీరశెవుల గురుకులముగా పరిణమించియిండెను. 


గోళకీమఠాల పోషణక్రై రాజులు [గామాలన్తు ధనికులు భూములను 
దానముచేసి శాసనములు (వాయించిరి. తర్వాతి కాలములో జంగాల మఠా 
లుండెను. కాని 'గోళకి' పేరుమ్మాతము మృగ్యమయ్యెను. పాలమూరు జిల్లా 
లోని గంగాపురములో ఆతిశిథిలమ లై దిబ్బలై_ మిగిలిన రెండు గుళ్ళు కలవు. 
వాటిని సానికులు “గొలక్క గుళ్ళూ” అంచురు. శబ్ల్బసామ్యముపై నొక వెరి 
@ ౧ Pa అ. 
కతను కల్పించిరి ఒక గొల్పవన్నెలాడిని అచట శివుడు కామించి భోగించి, 
(పతిఫలముగా పట్టిన పిడికెడు అనుదినము బంగారషుగునట్టు వరమిచ్చెనట : 
అంత నా “గొల్లికి లేక గొల త ఆ గుళ్ళను కటించెనట ; యథార మేమన, 
0 ౧౧ ట ® 
అవి గోళకీమళఠములై యుండును. లీదా వాటి సమీపమున నా కాలమునందు 
గోళకీమఠాలుండెనేమో : గోళకీనుథ గురువులు శివదీతీ నొందిన (_బాహ్మణు 
లుగా కానవసున్నారు. 


* సిదేశ్వర చరి[త 
స్టో 
+ పండితారాధ్య చరిత మొదటి భాగం పు॥ ౫౧౧. 


కాకతీయుల యుగము 25 


“ఏరి యుద్చోధచేతనే కాబోలును _పతాపర్నుదుని కాలమున నాం|ధదేళ 
శివాలయములో బెక్కి._ంట తమ్మళ్ళు తొలగింపబడి వెలనాటి వారు పూజారుగా 
నిలుపబడిరి.” (1) వ. 


శం గా 


అ. ఆవ! 
TT ము. . 


“ దేవళములం దర్పకులుగా నుండు తంబళ్ళకు “జియ్యలు” అని వ్యవ 
హారము.” (ల) పూర్వము శివాలయము లన్నింటిలో తమ్యాళ్ళ పూజారులుగా 
నుండిరి. 


“మును శివు డిచట బుట్టిననాట నుండి 
చెనసి తమ్మ? భజించిన చొప్పులేదు" 


అని యొక భకుడు వాపోయెను. నేటికిని కొన్ని శివాలయములలో 
తంబళ్ళ పూజారులై నారు, 


కాకతి గణపతిరాజు గోళకీమఠమునకు చెందిన విశ్వేశ్వర శివా 
చార్యులవద్ద శివదీక్ష పొంది గోళకీమఠమును కృష్టాతీరమందలి “మందడి 
(గామమున నెలకొల్పెను. విశ్వళశ్వరుడు విద్యామంటపవ ర్తి” (4) 


“మందడు [గామభోక్త అయి దక్షిణరాఢానుండి వచ్చిన కాలాముఖుల 
తోడ్పాటుతో వెలగపూడి మఠాదుల్లో విద్యాశాలలు సాగించి ఆంధదేశములో 
విజ్ఞానాన్ని వ్యావీంపజేసిన వి శ్వేళ్వర ౩ వాదార్యులవంటి విద్యాసంపన్నులు 
ఈ కాకతీయుల కాలములోనే వర్థిల్ల గలిగినారు. కాకతీయ గణపతిదేవుడు 
గణ పేశ్వర దేవాలయము కట్టింవి ఆక్కడ అనేకులను విద్వాంసులను స్థావించా 
డని కుమారస్వామి తెలుపుతున్నాడు. ఏరినే “రాజన్నేతే గణ పేశ్వరసూరయ:ః ” 
([పతాపరు దీయం) అనేచోట గణపెళ్వర సూరులని విద్యానాథుడు పేర్కొ 
న్నాడు”. 


కాకతీయుల కాలములోనే కొన్ని |పాంతాలలో శైవ వైష్ణవ సమన్వయ 
మునకై కాబోలును హరిహరమూ ర్తి పూజలు జరుగుచుండెను) నెల్లూరిలో అట్టి 
మూరి యుండె నందురు. తిక్కన సోమయాజి తన భారతములోని మొదిటి 
(1) దః పభాక రశా స్రీ గారి బసవపురాణ వీఠిక, పు ౭౬, (2) పుట ౧౧౪ 
(8) బసవపురాణము (పాల్కురికి) పు ౭౩. (ఉ)వే, (ప. కాన్ర్రిగారి పీఠిక.పు ౭౨౫ 
*పల్నాటి వీరచరిత; ద్వితీయ భూమిక, అక్కిరాజు ఉమాకాంతంగారి పీఠిక. 


28 ఆం|ధుల సాంఘిక చరిత 


పద్యములోని “శ్రీ యనగౌరినా బరగు చెల్యకు చి త్సము పల్పవింప భ దాయిత 
మూర్తియై హరిహరంబగు రూసముదాల్చి” అని వర్ణించెను. అతనివలెనే గు క్రీ 
[ప్రాంతము వాడగునాదన సోమన తన ఊఉ త్తర హరివంళమును హరిహర నాథునకే 
అంకిత మిచ్చెను. 


నాచన సోముని కాలములో (కీ, శ, ౧౩౦౦ ప్రాంతము) శైవవైసష్టన 
ద్వేషా లుండినందుననే అతడిట్లు |వాసెను. 


మ॥ పరివాదాస్పద వాదమోద మదిరా 

పానంబుచే మత్తులై 

హరి మేలంచు హరుండు మేలనుచు నా 
హా కొంద రీ పొం దెరుం 

గురు కైలాస నగంబునందు మును లే 
కత్ర్వంబు భావించి రా 

మురవైరం బురవై రి బాపుట మహా 
మోహంబు |దోహం బఐగున్‌.* 


వి[గహారాధనము, వివిధ సాం(పదాయములు, హిందువులను భిన్నించి 
దుర్చలులుంగా జేసిన వనవచ్చును. సామాన్య జనులు శ క్రిఖదములని అంటు 
జాడ్యాలకు దేవతలను ఏర్పాటుచేసిరి, భక్తులను దేవతలగా పూజించిరి. కాక 
తీయుల కాలములో ఈ [కింది దేవతలను పూజిస్తూయుండిరి. 


(౧) ఏకవీర-ఈ దేవత శైవదేవతయై యుండును. 'కాకతీమ్మకు 
సైడోడు ఏక వీరి(1) అని వర్ణించిన పద్యమునుబట్టి యీ దేవత రేణుక (పరశు 
రాముని తల్లి) యని స్పష్టము. ఈమె మాహూరము అను (గామమున నెలకొన్న 
దగుటచే మాహురమ్మ యనియు పిలువబడెను. ఈదేవత నగ్నదేవత(2)- ఈమెనే 


* ఉత్తర హరివంశము, ఆ ౨ ప ౬౮. 
1 [కీడాభిరామము, 
ప “ఏక వీరమ్మకు మాహురమ్మకు అధో[హింకోర మధ్యాత్మకున్‌ 
'కీడాభిరామము, 
“| వీడాహూన్య కటీరమండలము దేవీళశంభశీ (వాతమున్‌” కీడాలి 
రానమము, 


కాకతీయుల యుగము బి7 


యిప్పుడు తెలంగాణములో, రాయలసీమలో ఎల్లమ్మ దేవర అనీ యందురు. ఈ 


ఏకవీర గుడి “నింబపల్చవనిక రంబ సంధానిత వంద నమాలికాలంకృత ద్వారము” 
కలది.! 


( ఓరుగంటి యెల్లమ్మ అని (పసిద్ధ దేవత కలదు. ) ఓరుగంటి నగరములో 
ఎల్లమ్మ బజారు అకునది కలదు. అది |పాచీనపుదిగా తోస్తున్నది. అయితే 
ఓరుగంటిలో నగ్నదేవత యగు యెల్హ్లమ్మ వి(గహమెం దయిన కలదో లేదో 
తెలియదు. కాని ఆట్టి వి|గహము ఆలంపూరులో కలదు. దక్షిణ కాశి అనియు, 
శ్రీశైల పశ్చిమద్వార మనియు దీనికి ఖ్యాతి గలదు. నవబహ్మల ఆలయములు 
బహు పాచీనపువి అందు కలవు. అస్టాదళ శ కులలో నొకటి యగు జోగుళాంబ 
అందే కలదు. ఆయితే జోగుల అంబ అనుటచే ఆమె జైన దేవతగా నుండి 
శె వమతమును బలవంతముచే పుచ్చుకొన్నడిమో ! అట్టి యాలంపూరులోని 
(బబ హ్మేశ్వరాలయములో తలలేని మొండెము, నగ్న త్వముతో నున్న ఒక్‌ న్గూల 
దేవతా శిల్పమును స్థానికులు ఎల్లమ్మ యనియు, రేణుక యనియు పిలుతురు. 
తం[డియాజ్జచే తల్లియగు రేణుక తలను పరశురాముడు నరుకగా తల యెగిరి 
మాలవాడలో బడెనట. మొండెము మాత మే అచట నిలిచెనట. ఆమె గొడాం 
డకు పిల్లల నిచ్చు దేవత యని ఆలంపురీ మాహాత్మ్య మను స్థానిక లభ్యమాన 
లిఖిత పు స్తకమందు వర్ణితము, 


ఈ ఎల్లమ్మ కథను రేణుక కథగా నేటికిని రాయలసీమ పల్లెలలోను, 
పాలమూరు జిల్లాలోను బవనీండ్డు (మాదిగజాతివారు) జవనిక (జమిడిక) 
వాయించుచు కథగా రెండుదినాలు చెప్పుదురు. (కాకతీయుల కాలమునాడును 
బవనీలును మాదిగ శ్రీలును ఎల్టమ్మ కథను వీరావేళముతో చెప్పుచుండిరి.) 

ల | 
వారు | మోయించు జవనిక “జుక జుం జుం జుక జుం జుం జుమ్మ నుచు సాగుం 
గడున్‌ వాద్య ముల్‌ ”2 


"వాద్యవై ఖరి కడు నెరవాది యనగ 
ఏక ఏరా మహాదేవి యెదుట నిల్చి 
పరశురాముని కథ లెల్ల పొఢి పాడె 
చారుతరకీ రి బవనీల చక్రవ ర్తి” 


1 2 లి [కీడాభిరా మము, 


28 ఆం|ధుల సాంమిక చరిత 


(౨) మెలారుదేవుడు-ఇతడు ఏక వీరవలెనే జైనదేవుడై తరువోత శ్రే వు 
డయ్యెనేమో ! “భైరవునితోడు జోడు మైలార దేవుడు” మైలారను [గ్రామమున 
వెలసి మైలారుదేవు డయ్యెను.! 


(3) ఇతర దేవతలు-భై రవుడు, చమడేశ్యరి, వఏీరభ|దుడు, మూసా 
నమ్మ, కుమారస్వామి, పాండవులు, స్వయం భూదేవుడు (శివుడు) ముద్దరాలు 
ముసానమ్మ .2 


(౪) వీరగుడ్డ ములు--నేటికిని చాలా గామములలో వీరగుడ్డములు కలవు. 
ఏదో వీరకృత్యము చేసియుండిన స్థానిక వీరుని పూజసేయుట ఆచారమై 
యుండెను. పల్నాటివీరుల యుద్ధము (క్రీ. శ, ౧౧౩౨ (పాంతముదని ఉమా 
కొంతముగా రన్నారు. ఆ వీరుల పూజను నేటికిని వల్నాటిలో చేయుచున్నారు. 
ఆ యుద్ధము ముగిసిన నాటినుండియే వీరపూజ (పారంభమయ్యెను. ఓరుగంటి 
లోను, : 


“పలనాటి వీర పురుష పరమ దై వత శివలింగ భవన వాటియుండెను.శీ 


“కులము దైవతంబు గురిజాల గంగాంబ 
కలని పోతులయ్య చెలిమికాడు 
పిరికికండ లేని యరువది యేగురు 
పల్లెనాటి ఏరబాంధవులకు”క 


కలని పోతులయ్య, గురిజాల గంగమ్మ ఆను (గౌమ దేవతలును 
ఉండిరి, 


(౫) మాచెర్ల చెన్నడు--చెన్న కేశవుడు అను దేవత “మాచెరల చెన్నడు 
భ్రీగిరి లింగముం గృపాయత్తత జూడ” అన్నందున చెన్న కేళ వుడనవలెను, 


పల్నాటి కథలో బాలచందుని తల్లి సంతానమునకై నోచిన గజనిమ్మ 
నోములో చెన్న కేళవుని పూజ మాచర్లలో చేసినట్టు తెలివినందున మాచర్ల 
చెన్నడు చెన్న కేళవుడే యని దృఢపడినది. 


షే 2, క్క * కీడాభిరామము, 


కాకతీ యుల యుగము 29 


ఇంకను నిట్టిదేవతలకు కొదువ లేకుండెను. మతమునకు సంబంధించిన 
కులాలను గూర్చి యిచ్చటనే కొంత తెలుప్పదును. 


ఆష్టాదళ సంఖ్య కేలనో ప్రాధాన్యము కలిగినది. హిందువులలో దఢీ 
కులముల వారు ముఖ్యులుగా నుండిరని నాగులపాటి శాసనములో! నిట్లు (వాసి 


చారు. 


(“ఆ యూరి పదునెన్మిది నమయాల సమస్త (పజానురంగభోగానికై ” 
దానము చేయబడెను. ఆండీ కిందిజాతులు పేర్కొనబడినవి-కోమట్లు, ఈదుర 
చారు, గొల్లవారు, ఆక) లవారు (ఆగసాల), సాలెవారు, మంగలులు, కుమ్మర 
చారు. ఈ కులాల విషయము చర్చింప నవసరములేదు. కాని కోమట్ల విషయము! 
మాత్రము కొద్దిగా చర్చింతును. కోమటిపద మెట్రేకృడెరో సరిగా జెప్పజాలము* 
గోమఠమనుండి గోమశఠేశ్వరుడను జైన తీర్థంక రునినుండి యేర్పడినదని కొంద 
రూహచేసిరి. అంగస్వరూప థా స్త్రమును (Ethnology) బట్టి వారిలో ఆర్యలక్ష 
ణాలు కొనరావని తచ్చాస్త్రవేత్త లభి పాయపడుటకు ఏలున్నది. తెనుగు దేశ 
ములో మొదటిసారి కోమటిపదము క్రీ. శ* ౧౧౫౦ కి లోనుగా నుండినట్లు 
థ్రీ మానపల్లి రామకృష్ణకవిగారిచే నిర్ణయింపబడిన భ|దభూపాలుని నీతిశాస్త్ర 
ముకావళిలో కొనవప్వ్తున్నది.॥ తర్వాత నీశబ్రము పల్నాటి ఏరచరితలో కాన 
వస్తున్నది, పల్నాటియుగ్ధము [క్రీ శ ౧౧౭౨ లో జరిగెనని శ్రీ అక్కి రాజుగా 
రన్నారు. 


తర్వాత పాల్కురికి సోమనాథాదుల కృతులలో బహుళమయ్యెను. 
కోమటికి పర్యాయపదము బేరి!, బచ్చు, నాడెకాడు£ అని పూర్వులు (వాసిరి. 
ఇంతకుమించి (వాయలేడు, కాని ఒక ముఖ్యమగు పర్యాయసదమును మా[తము 
పూర్వులు |వాసినవారుకారు. కోమట్టను గౌరులని, చెట్టు (సెట్టి) అనియు 


"పలలనాలోంలానినితతనిా నినన సపనననతనపుమనననునులనపటసులులనాతనానోనునుననముననుల కుకు UNNI 
* “బద్దెనితింమ కోమటి పడుచునోళ్ళ, కతన దబ్బర పాఠంబు గదియ'. 


గవులు, తప్పు లెడలింప నెంతయు నొప్పు భువిని.”'--నీతిశాస్త్రము ౧వ 
పద్యము, 

ఓ ఆం(ధనామ సం[గపహము, మానవవర్గు, 

* సాంబనిఘంటువు, మానననర్సు, 


80 ఆం[ధుల సాంఘిక చరిత 


నందురు. చెట్టి, సెట్టి అను పదములు చాళుక్య కాకతీయుల కాలములో వీర 
శెవులగు బలిజలకు కులబిరుదముగా నుండెను. నేటికిని బలిజ సెట్టి అని వాడు 
కలో నున్నది. తర్వాత కోమట్లు ఆ బీరుదమును శెవముతోపాటు స్వీకరించి 
నట్టున్నది. గౌర శబ్దమును Ut శ, ౧౬౦౦ పాంతమందుండిన శుక స!పతికారు 
డగు పాలవేకరి కదిరీపతి | పయోగించెను. 


(కోమట్లు బెంగాలులోని గౌడదేశమునుండి కీ. శ. ఆరు ఏడు శతాబ్బము 
లలో ఆనాటిరాజుల దుష్టపాలనకు తాళజాలక సముదముపై వచ్చి తెనుగుతీర 
ములలో దిగి గౌరలై, తర్వాత జై నమతావలంబులై , గోమఠానుయాయులై , 
కోమటులై యుందురు. వారి కులదేవతయగు కన్యకాంబను విష్ణువర్ధనుడను 
రాజు బలాత్కరించెనన్న కథనుబటియు వారు (కీ, శ. ఆరేడు శతాబ్దుల కొల 

ల్‌ య 
మందు వచ్చిరని యనవచ్చును, 


వీరుకొక మరికొన్ని జాతులవారు ఈ కాలపు వాజ్ఞుయములో పే పేర్కాన 
బడినారు. (బోయవారు ఆను జాతి కొంత సందిగ్గమునకు తావిచ్చును. విజయ 
నగరకాలములో బేండర్‌ బోయ అను జాతి యుండెను. బోయలు వేటకాండ్లని, 
ఆటవికులన్కి |కూరులని విజయనగర కాలమునుండి కవులు వర్ణిన్తూ వచ్చినారు. 
కరీంనగరు, నల్లగొండ బీల్లాలలో పధానముగా నివసిస్తున్న భోయీలు అను 
జాతివారు కలరు. భోజశబ్రభవులు వీరే అని కొందరన్నారు. ఇంగ్లీషువారు 
మదాసులో దిగినకాలములో వారివద్ద ఈ భోయీలే నౌకరులై నందున వారు 
వీరిని బాయ్‌ (B0y) అని పిలిచినందున ముసలి నౌకర్ణనుగూడ ఇంగ్లీమవారు 
బాయ్‌ అనియే యందురు. 


పలనాటి వీరచరితలో బాలచం!దునితో దెబ్బలుతిని పారిపోయినవారిలో 
కొంద రిట్లు పలికి తమపాణాలు కాచుకొనిరి, 


“*టోయవారము మేము పూర్యంబునందు 
బుజములు కొయలు పూని క నానుడి” 


భోయీలు నిన్న మొన్నటివరకు పల్లకీలను (మేనాలను) మోసినవారు, 
కావున |క్రీ. ఈ, ౧౧౭౨ (ప్రాంతములో ఏరు ఆదేవృత్తిలో జీవించినవారు. పైగా 


కాకతీయుల యుగము 81 


నల్లగొండ సరిహద్దులోనే కార్యంపూడి ఆం|ధ్ర కురుక్షేతముండెను. అందుచేత 


కర్ణాణ కిరాతులుగా బరిగణింపబడిన బోయలు కాకతీయ కాలములో 
లేరన్నమాట. వారు కర్ణాటదేశీయులు కాన విజయనగరకాలమందే వారు కని 
పించినారు. రాయచూరు జిల్లాలోని సురపురము అను “బేండర్‌” (బోయ) 
సంస్థాన ముండెను. సీపాయివిప్లన మను అభాసనామము కల (కీ. శ, ౧౮౫౭ 
నాటి స్వాతం త్య విప్ణవముతో ఆ సంస్థానము మాయమయ్యెను. ఆస మయమున 
దాని విచారణక గగా నుండిన మెడోన్‌ చెయిఅర్‌ అను ఆంగ్రికో తముడు తన 
స్వీయచరితలో ఆ రాజరికపు బోయలకు బావులలో దేవాలయములలో _పవే 
ము లేకుండెననియుు, వారినిఅంటరానివారినిగా హిందువులు పరిగణించిరగియు 
వ్రాసెను. నూరేండ్ల లోపలనే ఆ బోయజాతి అంటరానితనము మాయమయ్యెను. 


(రుంజలు ఆనువా రుండిరి. వారు నగారావంటి రుంజ వాద్యమును 
(మాయించువాథ యుండిరి. వారిని పల్నాటి వీరచరితలోను, పాల్కురికి 
రచనలలోను పేర్కొన్నారు. \ 


పిచ్చుకుంట్ల వా రను నొక తెగవారు కలరు. నేడు వాగు రెడ్డగో|తాలను 
తంబూరాపై పాటలుగా చెప్పుచుందురు. పాల్కురికి కాలములో వీరు వికలాంగు 
లైన దిచ్చగాండ్డు ! 


ష్‌ సుష + మాకు 
ఏవంగ చేతులు లేవయ్య, నడచి 
పోవంగ గాళ్ళును లేవయ్య, ఆంధ 
కులమయ్య, పిచ్చుకగుంటులమయ్య” 


“దాన మొసంగరే ధర్మాత్ములార' అని వారు బీచ్చమడిగినారు * 
పంబల, బవన్మి మేదర, గాండ్ల మున్నగు కులాలు చాలా గలవు. కాని 
అవన్నియు వృత్తులనుబట్టి యెర్పడినందున వృత్తుల చర్చలో వారినిగూడ 
చర్చించ వచ్చును? 


* పండితారాధ్య చరిత్ర, ౨-న భాగము, పుట 8౪౮ 


82 ఆంధుల సాంఘిక చరిత 


హిందువులు మతాంతరులను స్వీకరింపలేదని |క్రీస్తుశకము ఆయిదవ 
శతాబ్దినుండి వచ్చిన కట్టుబాట్లనుండి కొంద రూహించినారు. కాని భద్ధిచేయుట్క, 
మతాంతరుల స్వీకరించుట, మత|[పచారము చేయుట, హిందూబౌద్ధులనుండియ 
కై9స వేస్తాములు నేర్చుకొనెను. (కీ. పూ. ౧౫౦ ఏండ్లనాడు హెలియోడోరస్‌ 
అను (గ్రీకువాడు వాందువై థీల్సాస్రేషన్‌ సమీపనుందలి బెస్నాగర్‌లో గరుడ 
స్తంభ మెత్రించి శాసనము [వాయించి తాను భాగవతమతమును స్వీకరించినట్లు 
తలుపుకొనెను, తురకలు సింధుదేశ మును లాగుకొన్న తర్వాత బలవంతముగా 
తురః లై నవారిని శుద్ధిచేసి హిందువులను చేయుటకై దేవలస్మతి ఇంచుమించు. 
కీ. శ ౧౧-వ శతాబ్దములో పుప్రెను. ఓరుగంటి రాజ్యమును ధ్యంసించిన 
కాలములో తెనుగుసీమవారును శుద్ధిసంస్కా దమును తొలిసారి [పారంఖించిరి. 
విచ్చితొగ్టాకు వరంగల్‌ను జయించిన తర్వాత ఆం(ధదేశ ములో చాలమందిని 
బలవంతముగా ముస్టిములను జేసిరి. ముఖ్యులైన ఆంధులను తురకలుగా జేసి 
ఢిల్లీకి తీసుకొనిపోయిరి. అందొకడు కన్నయ నాయకుని బంధువు. ఆ నవ 
ముస్టిమును క ంవిలిరాజుగా తొగ్గా కంపెను, వాడు కంపిలికివచ్చి ““మహమ్మ 
దీయ మతమును వదలిపెట్టి పితూరీ చేసేను.” ఇదీ (క్రీ, శ. ౧౩౪౫లో జరిగిన 
మాట! | 


“౨ - సంఘ సంస్కారము 


హిందూమతమును సంస్కరించు నుద్దేళముతో శైవ వైష్ణవ మతములు 
[ప్రబలియుండెను, కాని ఆవి యెక్కువగా అవకారమే చేసినవి జైనులలో చాలా 
గొప్ప తార్కికులుండిరి, వారు |వాసిన సంస్కృత తార్కిక చర్చలలో కుల 
తత్వమును బాల సుందరముగా దిట్టముగా ఖండించిరి. అట్టి జైనులవల్లనే సంఘ 
సంస్కారము తేనుగుదేశములో బౌద్దులతోపాటు మొదలయ్యెను. కాకతీయ 
కాలములో అనులోమ ,పతిలోమ వివాహములు చాలాజరిగెను. రుదమ్మరాణి 
బ్రాహ్మణ మం్యతియగు ఇందులూరి అన్నయ రుద్రమయొక్క రెండవ 
కూతురగు రుయ్యమ్మను వివాహమాడెను. రాజవంశమందే కులము కట్టుబాట్లు 
లేనప్పుడు జనసామాన్యములో మా(త ముండునా ? పల్నాటి యుద్ధములో చాప 
కూటిని గురించియు, _బహ్మనాయడ: బహుకులములతో బాంధవ్యము చేయుటను 
గురించి యు నిదివర కే చర్చింపబడిగది, పాఠం అనుపదము దకీణమందే 


కాకతీయుల యుగము 98 


వాడుకలో నుండెను (పాలెకును (సీమను) రక్షించు వారు పాలెగార్ట.) వారి సేనతో 
మాలమాదుగులు విశేషముగా నుండిరి.) నేటికిని మాలమాదుగుల ఇండ్ల పేళ్ళలో 
పింజలవారు త ప్పెటవారు, కొమ్ము వారు, కఠారివారు అను పేరులు వారి 
పూర్వపు జాడలను తెలుపుతున్నవి. 

శెవమందు చాకలి, మంగలి మాల, మాదిగ మున్నగు జాతుల 
వారందరును కలిసిరనుటకు పాల్కురికి సోమనాథ బసవపురాణమం దనేక 
నిదర్శనములు కఠలవు.' ఇప్పుటి కాలములో సత9భోజనములు బాహ్మణులకే 
(పత్యేకింపబడినవి.(కాకతీయుల కాలమున కొన్ని తావులలో అన్ని వర్ణముల 
వారికిని భోజనములు పెట్టుచుండిరి. శైవ సాంపిదాయానుసరణముగ చండాలు 
రకుగూడ అన్న వస్త్రదానములను సత9ములం దేర్చాటు చేసియుండిరి. ౫ 


[పతాపరుదుని కాలమువాడగు ఎకొ!మనాథుడు తన వచన (వతాప 
చరీత్రములో నిట్లు |వాసెను* 


“మరియు నొక్కనాడు సంతూరను [గామంబున క 
తమ్ము డనంతాచార్యులు రజక న్రీతో గూడను. ఆ రజకు డిద్దరిని 
బొడిచెను. ఆంత వారు మరణించిరి. ఆ వురి విపులది. శూదపీనుగుతో 
గూడియున్నది కనుక మేము మొయ్య మనిరి, ఆది విని కృష్ణ మా 
చార్యులు తనమదిని విచారించి, వాసుదేవ మూ రిని కీ ర్రించెను. శవంబు 
దనంతట తాను కాష్షంబువరకు జరిగి పోయెను.” 


వీరశె వులును వె ష్టవులును కొంతవరకు సంఘసంస్క ర్రలే కొని వారు 
అసహనమున్క, మతోన్మాదమును హిందూసంఘమందు (పవెశ పెట్టినవారై రి. 
జనులలో మూఢభ_క్త్‌ యెక్కువయ్యెను. ఇది మతమును గూర్చిన చర్చ. 


ఇక యితర విషయములనుగూర్చి తలుసుకొందము, 


.. యుద తంతము 
ఖత @ 


rer 


హిందువులలో శార్యసాహసా లుండెను. కాని యుద్దపరికరములను 
వారు కనిపెట్టినది తక్కువయే* [కొత్త మేలైన మారణయంతాలను తురక 
లుపయోగించిరి. తర్వాత యూరోపువారు మనపై యుపయోగించి దేశమును 


* మల్కాపురళాసనము (తెలంగాణా శాసన (గంథము,) 
(5) 


84 ఆం(ధుల సాంఘిక చరిత 


గలుచుకొనిరి. ఆం ధులకు బల్లము, క తియ పధానమగు అయుధ ముక? 
యుండెను, ఆనా డిట్ట పరికరా వత. కోటల యవసరముండెను. సం 
దేవుడు మొదట ఓరుగంటి కోటను కి ట్లైను. దానిని రుదమదేవి పూర్తిచేసెను 
లోపలి రాతి కోటను పెద్ద కోట యనియు, బయటి మట్టి పాకారమును భూమి 
కోట యనియు పిలుచు చుండిరి. మట్టికో ట్ర సామాన్యమైన ది కాదు, అల్లావుద్దీన్‌ 
బిల్లీ Er శ॥ ౧౨౯౬లో మలిక్‌ కాఫిర్‌ సేనాసిని ఓరుగంటి పై దాడిచేయ 
సియోగించెను. ఈ మలిక్‌ కాఫిర్‌ ఎవడు? ఇతడు మొదట హిందువు, 
ఆస్పృక్యుడు. తర్వాత ముసల్మానై, మహాసే నాసియై, వేలకొలది హిందుపుల 
చంపి, హిందూరాజ్యముల నాశనముచేసి, తన కసితీర్చుకొనెను. వాని 
సైన్యము మట్టికోట పై బడి దానిని పడ గొట్టజూచెను. “కాని ఉక్కు బర్హిము 
లతో దానిని బొడిచినను, బేటు (పెడ్డ) కాడా రాలకుండెను. గుండ్ల ను దానిపై 
వేయించినను అవి విల్హలాడుకొను గోలీలవలె వెనుకకెగిరి పడుచుండెను.” * ఊ 
కోటగోడ వైశాల్యము ౧౨౫౪౬ అడుగులట! 


ఓరుగల్లుకోటనుండి ముట్టడివేసిన తురకలపై నిప్పుతో కరిగిన వేడి 
[దవమును పోయిచుండిరట. తురకలు *మాంజనీకులుి ఉప మోగించిరి. 
£౬ఓరుగంటివారు ఆరద్ద లుపమోగించిరి. ఈ రెండును రాళ్ళు రువ్వుటకై 
యేర్పాటుచేసిన వడి సెలవంటివై యుండెను. ఏలన, ఖుసూ వాటిని గురించి 
యిట్లు వాసెను. “మునల్మానులరాళ్ళు వేగముగా అకాశిమం దెగురుచుండెను. 
హిందువులగుండ్లు (బాహ్మణుల జందెములనుండి విసరబడిన వానివలె బల 
హీనములై యుంచెను.”, ఈ మంజనీకులు పాశ్చాత్యదేశాల నుండి దిగుమతియె 
యుండెను. వాటిని ఉభయ సైన్యము లుపయోగించెను. 


అగ్నితోడియుద్ధము మొదట వరంగల్లు పైననే (ప్రమోగింపబడెను, 
ఇది తర్వాత ఫీరంగీలక్కు తుపాకులకు నాంది పస్తావన యనవచ్చుమ. 
'ఆతిష్‌ మీ రేఖ ంగ్‌, (ఉభయులును అగ్నిని చిమ్ముచుండిరి) అని ఫార్సీ చరిత్ర 
కారుడు వాసెను, ఆంధ'సెన్యములో సోతపాఠకులు తమనేర్పును జూపు 
చుండిరి. వారిని “బర్దులు” అనుచుండీరి. 


* ఖజానుల్‌ పుతూహె అమీర్‌ ఖు[సూ, 
థీ తారీఫ పీరోజ్‌ షాహి ఖా బర్నీం*. 


కాకతీయుల యుగము 85 


“కతాబాతె హిందూ కె గోయంద్‌బరిష్‌” బర్హ్‌ అనేది తెనుగె యుండ 
వలెకదాః సో తపాఠకులను వంగి, భట్టు అని యందుము. ఈ రెంణిలో నేదే 


నొకదాని యెపభంశముగా బర్‌ అనున దేర్పడియుండును. 

ఆ కాలమం దాం|ధు లెట్ట ఆయుధముల నుపయోగించిరో కొంతవరకు 
(పతాపరు[దద యళోభూషణము వలన తెలియగలదు. కాని అవన్నియు నిజ 
మెనవో లేక కవికపోలకల్పితములందు కొన్ని కలవేమో చెప్పజాలము. (పతాప 
రుదీయముపె రత్నా పణవ్యాఖ్య కలదు, అందిట్టున్న ది. 


తోమరః=దండవిశేషః 
కౌర్నేయకాః=ాఖడ్తాః 


ముసుందయః=ాదారుమయాయుధ విశేషః (కజ్దతో చేసిన ఒక విధమగు 
ఆయుధము.) 


కుంతాః=పరంపరయా కష్లేపణీయా ఆయుధ విశేషాః (వెను వెంట విసరి 
వనెడు ఒకవిధమగు ఆయుధాలట!) 


పట్టపః=లోహదండః, య సీక్షధారక్షరోపమః (వాడిధార కల ఇనుప 
దండమట! బహుశా పట్టాక తియై యుండును. )* 
కత్తులు మంచివిగా నుండుటకి నాలుగు లోహములతో చేయుచుండిరి. 
“విను మినుమును, రాగి, యి తడి, కంచు 
పెట్టి చేసినయట్టి బిరుదులు కలవు”, 
(ఇచ్చట బిరుదులన ఆయుధములు) పల్నాటి యుద్ధములో, 
“కుంతములును గం|డగొడండ్లు, గదలు, 
a గొ 
ముసల ముద్గరములు, మొనల కటార్లు 


* పల్నాటి వీరచరిత పుట ౨౮, 
+ (పతావరుదియము, నాయకపకరణము, ౧౧-వ కోకం* 


86 ఆం|ధుల సాంఘీక చరిత 
చ|క్రతోమరములు, కార్జ సంఘంబు 
౧ 


ఛురికలుు బాణముల్‌* కూలచయమ్ము 
మొదలైన శస్తాంస్త్రములు...”* వాడిరి. 


శత్రువులు డండెల్తి వచ్చిన కోటలను భ దము చేసుకొనుచుండిరి. 
ఆ విధానమును కొంతవర కీ [కింద పద్యమునుండి (గహింపవచ్చును. 


“కోట సింగారించి కొ తళంబుల నెల్ల 
నట్టళ్ళు పన్నించి యాళువరికి 

పందిళ్ళు పెట్టించి వెకొమ్మ లెగయించి 
గుండు దూలము వసికొయ్య గూర్చి 
యగడితలీత నీరలవడ (దవ్వించి 
వెలిజుట్టును ఎదురు వెలుగు వెట్టి 
దంచనంబులు దద్దడంబులు నె_లింది 


పలు గాడితలుపులు బలువు చేసి 


గీ॥ బాళిములు వెట్టి కొంకులు (బద్ద పరులు 
కతిగొంతంబు లొడి సెళ్లు( గ త్రళములు 
నారసములును విండులు నగరిలోన 
బెట్టి పెటుడు నడు నెటి మటిలావు."** 
అ ట్‌ లు 
యుద్ధయ్యాతకు ఆంధ సెనికు లెట్టు చెడలుచుండిరో, యుద్ధరంగమున 
నెట్లు [ళమిస్తుండిరో, యుద ధర్మము లెట్లివే యుండెనో పల్నాటి వీరచరిత్రము 
య ఆతి 09 (AX 
తెలుపు చున్నది. 


యుద్ద మునకు వెళ్ళువారు తమ కోటకు తగురత్షణ లేర్పాటు చేసి 
భూసుర పురోహితులచే జయముహూ_ర్తము పెట్టించి పయాణ భేరి వేయించి 
వెడలుచుండిరి. (1) సేన వెంట గొల్టెనలు, పట కుటీరములు,  బల్లాకి 
Sem అ క దలకు లక కకారనాడాాాలి 


a 


*పల్నాటి ఏరచరి\త, పుట ౧౦౫. 
శశనాచన సోముని ఉతర హరివంళము, అ ౨, ప ౯౫ 
1. పల్నాటి వీరచరిత, పుటలు ౩, ౪, 


కాక తీయుల యుగము ఫ్ర? 


"పి'పైలు (?), మంచములు, తమ్మపడిగెలు, బొక్క సముళు, బోనకావళ్ళు, 
పల్లకీలు మున్నగునవి తీసుకౌనిపోవుచుండిరి. (2) 


ఆ కాలమందు తప్పెట్లు, కాహళములు, కాలికొమ్ములు, డమాయీలు, 
బూరలు, శంఖములు, సన్నాయీలు, డోళ్ళు, రుంజలు, చేగంటలు అన్నీ కలిని 
గందరగోళముగా అప ుతితో ధ్వనించుచుండిరి, (శ) (రుంజలు అనునవి 
నగారావంటి వాద్యములట) గొల్లెనలు ఆన్న బట్టల డేరా లని యర్థము. కాని 
వపటకుటీరములును డేరాలేకదా! ఈ రెంటిలో ఖేదముండెను. పటకుటిరములను 
డేరాలనియు వాడిరి. గొల్లెనలు మధ్య సంభము మీద మ్మాతమే గోళాకారముగా 
నిలిపినట్టివి. నడిమి కంబము కూలితే డేరా యంతయు కూలి పడెడిది (+) 
యుద్ధకాలములో ఓడిన వారు సంధి చేసుకొందు మనియు, యుద్ధము నావవలసిన 
చనియు తలుపుటక్రై కొమ్ము పట్టించి ధ్వనించెడి వారు, దానిని ధర్మధార 
యనిరి, (5) యుద్ధ ము జరుగుచుండగా (పతిపక్ష వీరుల కత్తి పోటులనుండి తల 
గాచుకోదలచిన వారు పాగిణదానము పలువిధముల వేడుచుండిరి. మేము పల్లకీ 
బోయోలమే కాని భటులము కొదనువారును, చచ్చినట్లుగా రణరంగముపై 
పడియుండు వారును, చచ్చిన శవాలను మీద వేసుకొని దాగువారును, “పెండ్లాల 
తలచుక బిర్లేడ్చువారు"ను పలుతెరంగులై యుండిరి. (6) 


అంతేకాదు, 


“వల్మీకముల మీద వసియించువారుు, 
గడ్డిలో జొరబడి కదఅనివారు. 
వేళ్ళు చీకెడివారు, వెన్నిచ్చువారు. 
వెం[డుకల్‌ విప్పుక విదలించువారు.”” ౫ 


2, పల్నాటి వీరచరెత, పుటలు ౩, ౪+ 
8 న్‌ ల పు ౪, మరియు ౧౦౮. 
4 బాణము ఘనమైన గొల్రెనక ౦బంబు దాక, ఆదియంత తునుకలై యవ 
నిపై బడెను. పల్నాటి పు ౩౭, 
ర *పోరించి...ధర్మధార పట్టించుచు నున్నవాడు. కీడాఖిరామము, 
6 పల్నాటి వీరచరిత పు ౧౧౦. 
* పల్నాటి వీ చ. పు ౧౧౦. 


88 ఆం|ధుల సొంఘిక చరిత 


ఇట్టివా రందరు కతి పారషేసిస వారగుటచే [పతిపక్షులు వారిని చంప 
కండిరి. గడ్డికరుచుట్క ఐదు పది సేయుట=(అనగా రెండు చేతులు జోడించి 
(మొక్కు. ట- కాని ముందు కాలిని వెనకకు పెట్టి రెండు కాళ్ళను జోడించుట 
అని యొకరన్నారు.) వెన్నిచ్చుట, వెనుకంజ వేయుట అన్న పదాల యర్గము 
కూడ యిట్టిదే. 


అనాటి యుద్ధాలలో ఎనుగులు, గుణములు, ఎద్దులు ఎక్కువగా విని 
యోగ మవుచుండెను. దొరలు వల్లకీలలో యుద్ధానికి వెళ్ళుచుండిగి. ఆంధుల 
సైన్యములో [కమశితీణము, యూనిఫారం, మెలైన మారణ యంతాలు 
తక్కువగా నుండిను, సంఖ్యాబలము పెననే ఆధారపడినవారు పలుమా రోడి 
నారు. పల్నాటి యుద్ధములో భాలచందుని కోతలకు నిలువలేని వారిలో కొంద 
రిట్లనుచున్నారు. 


“పగవారు మిముగని పారిపోవుదురు 

మీ కేమి భయ మని మెలత నాగమ్మ 
బాగుగా నమ్మించి పంప వచ్చితిమి 
బీవముల్‌ దక్కిన చిన్నల గలిసి 
బలుసాకు తీనియైన |బతుకంగ గలము.” 


ఇట్టి వెట్టిమూక లేనా జయము పొందునది ; ఆయితే (క్రమశిక్షణ మిచ్చిన 
సెనికులు లేకుండి రని కాదు. వారు చాలా తక్కువ. ఓరుగంటి నగరములో 
“మోహరివాడ” (Military Cantonement వంటిది) యుండెను. బహుశా 
ఆ “సెనికులకు మాతమే మిలిటరీ యూనిఫారం దుస్తులు కుట్టుటకు కు[టపువా 
రేర్పాటైయుండిరేమో, ఆనాటి సెనిక యూనిఫారంలో ఆంగీ, చెల్లాడము. 
నడుముపట్లి చేరినట్లుండెను. కాకతీయ రాజులకు ౯ లక్షల సైన్యముండెను' 
“నవలక్ష ధనుర్జిరాధినాథే, పృథివీం శంసతి వీర రృుదదేవే” అని విద్యానాథుడు 
వర్ణించెను. ఈ సైన్యములో ఎక్కువ భాగము సరిహద్దుల కాపాడు పాలెగార్లు 
లేక సామంతరాజులవద్ద నుండెను. ఈ పాలెగారు పద్ధతియే ఆం(ధరాజ్యాల 
నాశనమునకు కారణమయ్యెను. పాలెగార్లు కేంద పభుత్వ బలహీనత క్రై చూపెట్టు 
కొని సమయము దొరకగానే తిరుగుబాటు చేయుచుండిరి. మొత్తముపె 


+ పల్నాటి వీ, చ. పు. ౧౧౦. 


కాకతీయుల యుగము 89 


అం[ధుల యుద్దతం తము తురకల యుద్ధతంతముక న్న చాలా వెనుకబడి 
లొపభూయిష్టమై యుండెననుటటో సందేహములేదుం 


క్ర నా యు ౪ 


నిర్మాణ శిల్పము, విద్యలు, చ్నితలేఖనము, చెతిపనులు, కళలుగా 
బరిగణింపబడి యిందు [వాయనయినది. కాకతీయ కాలములో ఆం[ధుల 
ఉ తమోటత్తమ శిల్పములు బయలుదేరె ఏ. అంతకుముందు (సాక్చ్పశ్చిమ. చాళుక్య 
రాజులు అనేకశివాలయములను కట్టించి, ఉన్నవాటిని సవరించి వాటివి భూ 
దానములు చేసి యుండిరి. ఓరుగంటి రాజులును వారి సామంతులును అనేక 
దేవాలయములను సర్మించి శాసనములను |వాయించిరి. కాకతీయుల రాజధాని 


తెలంగాణ మందుండుటచే అచ్చటనే దేవాలయ శిల్పము లెక్కు.వగా లభిస్తున్నవి, 


ఓరుగంటి నగరమును ఆం|ధవగర మని పిలిచిరి. మరేనగరమునను 
ఇట్టిపేరు లీకండుటను జూడ ఓరుగంటి రాజులకు ఆం[ధాభిమానము 
చాలా ఉండెననవచ్చును,. ఆ నగరమునకు ఏడుకోట లుండెనందురు. లోపలి 
రాతికోటలో చ:కవంర్తి వసించుచుండను ఆ కోటకు బయటిభాగమున 
చిన్నకులములవారి మైలసంత వారమున కొకమారు జరుగుచుండెను. లోపలి 
భాగములో మడిసంత జరు/నచుండెను. రాజవీథులు కొన్ని, సందులు కొన్ని 
యుండెను. పరిఖ, పాకారము, వంకనార, గవని, కల ఆ కోటలో రథ, 
“ఘోట, శకట, కరటి యూధసంబార ముండెకు. * “రాజమార్గంబు వారణఘటా 
ఘోటక శకటికాభటకోటి సంకలంబు; కింత |తోవల నొండు కలకలంబులు 
లేవు; వేశ్య వాటిక మధ్యవీధి, (1) మధ్యభాగములో స్వయం భూదేవాలయ 
ముండెను. దాసిని తురకలు ధగ్టింసము చేసిరి. డానికి నాలుగుదిక్కుల హంస 
శిఖరములతో నుండిన పెద్ద శిల్ప శిలా స్తంభముల మహాద్వారము లుండెను. 
ఆందిప్పుడు రండుమా[తమే మిగిలినవి. నగరము చాలా నుందర నిర్మాణము 
లతో నిండినట్టు కావలసినన్ని నిదర్శనములు లభిస్తున్నవి. |క్రీ. ఈ. దోవలో 
తురక సేనాని యగు అలూఫ్‌ భాన్‌ ఒకమిట్టపై నెక్కి ఓరుగంటిలోని 
భాగమును పరీకింపగా నాతనికిట్లు కనబడెనట! 
త ర సతత న తు 


శ (1) క్రీడాభిరామము. 


ళో 
శ్‌ 


40 అంధుల సాంఘీక చరిత 


“ఏ దిక్కు. చూచినను రెండు వెళ్ళ పొడవున నీటి నాళములును 
(Fountains), తోటలు నుండెను. వౌటిలో మామికి, అరటి, పనస 
లుండెను, పువ్వులన్నియు హిందూపుష్పాలే. చంపకము, మొగలి, 
మల్లెపూ లుండెను, |) నగరము పేటలుగా విభజింపబడి యుండెను. 
అక్క లవాడ, బోగంవీధి. ఐలిపాశెమ్కు మేదరవాడ, మోహరివాడ, 
దేవాలయములు, రాజభవనాలు పూటకూ టియిండ్లు మున్నగున 
వుండెను.” 


(కాకతీయుల జైనులుగా నుండినప్పుడు వైన దేవాలయములు. కట్టించిరి, 
హనుమకొండ గట్టురాళ్ళపైన కూడా పెద్ద జై నతీర్గంకరుల వి గహాలను చెకి,రి, 
ఆదే గుట్టపై పద్మాక్షి దేవాలయము కలదు దానిస తర్వాత శైవులు లాగుకొని 
తమ దేవతగా పూజలు చేయించుతూ వచ్చినారు. గుట్టవద్దగల చెరువులో అనేక 
జైన వ్మిగహాలు మంచివి విరిగినవి, శకలములు నేటికిని కుప్పగా వెయబడినవి 
కానవచ్చును. 


(తర్వాత కాకతీయరాజులు శె వులయిరి. అప్పుడు వారు హనుమకొండ 
లోని వేయి స్తంభాల దేవాలయమును నిర్మించిరి.) అదిగాక ఆం[ధనగరములో 
ఆనేక సుందర శిల్పసమాయుక్త దేవతాయత నములు నిర్మాణమయ్య్యును. కాని 
తురకలు వాటిని నాశనము చేయగా మనకీనాడు విచారము, దుఃఖము, శిల్పళక 
లములు, మాతమే మిగిలినవి. ఓరుగంటికి ౪౦ మైళ్ళ దూరమున “రామప్ప 
గుడులు” కలవు. వాటిని (కీ. శ. ౧౧౬౨లో రుద సేనాని అను రెడ్డి 
సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగహములు, స్తంభాలపై శిల్పములు, 
ముఖ్యముగా దేవాలయ మంటపముబ కోణములందు నాలుగుదిశలందు నిలిపిన 
పెద్ద నల్లరాతి నాట్యక తెల విగహాలు అతి సుందరములు, ఆ విగహాలపె 
సొమ్ముల ఆలంకరణములు, వాటి [తిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే 
మోహింపజేసినట్టున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూరర్తిగా 
[పసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నముగా తీర్చిదిద్ది ఆనం 
దించినారు. దేవాలయములోని సంభాలపె నాట్యభంగిమములు మృదంగాది 
వాద్యములనారి రేఖలు చి తింపబడినవి, ఆ కాలములో జాయ సేనానియను 


(2) నూహెసిపెహర్‌ ఆమీర్‌ ఖుసూ. 


కాకతీయుల యుగము 41 


నతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రమును |వాసెను. ఆది తంజావూరి లిఖిత 
పు సకాలలో నున్నది, కాని, దానిని ముదించుట కెవ్వారును పూనుకొనరయిరి 
జాయప గంథమునకు ఉదాహరణము లా సంభాలపై నాట్యముచేసున్న సుందరీ 
మణులే యని యందురు ఆ శాస్త్రాన్ని ఆ విగహాలను వ్యాఖ్యతో ము[దించిన 
ఎంత బాగుండునోకదా! 


పాలమూరుకు సమీపములో బూమపూరు అనునది కలదు. (బహుళా 
అది గోన బుద్దా రెడ్డి పేర కట్టిన బుద్ధాపురము।) అందు శిథిలములయిన ఆలయ 
సులు కలవు. వాటిపై తురకల సు తెపోట్లు పడినవి, ఒక దేవాలయాన్ని 
మసీదుగా చేసుకొనిరి. ఆ మసీదులో నేటికిని కాసనా లున్నవి. వాటిని గోన 
బుద్ధా రెడ్డి కూతుగును, మల్యాలగుండ దండ నాయకుని భార్యయు నగు కుప్పమ్మ 
కట్టించెను, కుప్పమ్మయు, గుండయ్యయు పాలమూరుజి ల్లా నాగరు కర్నూలు 
తాలూకాలోని వర్ధమానపురము ఇప్పటి వడ్జెమానులోను కొన్ని సుందర శివా 
లయములను కట్టించిరి. దానికి ౧౫ మైళ్ళ దూరమున వనపర్తి సంస్థానములో ని 
దగు బుద్దాపురం అను [గామము కలదు. ఆది యు బుద్ధా రెడ్డి పేర కట్టించినదే. 


నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట తౌలూకాలో పిలలమరి యను 
[గామములో బపు మనోహరమగు దేవాలయములను నామిరెడ్డి కట్టించెను, 


కాకతీయుల కాలపు శాసనాలు ఆలంపూరులో కానవచ్చును. కాని అందు 
పూర్వదేవాలయములకు దానాలు చేసినట్లు కానవచ్చును. నాగుల పాటిలోను 
కొన్ని నిర్మాణములు కలవు. కాకతీయ శాసనములు కర్నూలు జిల్లాలోని 
తిపురాంతక ములో కలవు. అందు 'విమానములుి నిర్మించినటుల తెలిపినారు, 
విమానములు అనగా ఎత్తయిన గోపురములు కొండపరి మున్నగు [ప్రాంతాల 
లోను నిర్మాణములు కానవస్తున్నవి. 


విద్యా వ్యాపకము 


కాకతీయుల కాలములో అంతకి పూర కమందుండినటుల అనేక 
[పాంతాలలో కళాళాలలుండెను. వాటియందు మతబోధ, వేదములు, గీర్వాణ 
భాషలోని కావ్యములు, న్యాయమీమాంసాది శాస్త్రములు బోధించుతూ యుండిరి. 
విద్యార్థుల కుచిత భోజన వసతులుండెను. వాడీ స్టేషన్‌ సమీపమందలి నాగవావి 


(6) 


492 ఆం|ధుల సాంఘిక చరిత 


(ఇప్పుడు నాగాయ్స అనుచోట ఇట్టి విద్యాపీఠ ముండెను, గోళకీమఠము 
లన్నియు విద్యా కేందములే. ౮8 విధముగా రొజులు, భకులు, ర కులు విద్యా 
సంస్థలను పోషిస్తూవుండిరి. 


నేటికిని తెనుగు అక్షరాలను “ఓనమాలు” అని దేశమంతటను అందురు, 
శైవుల |పాబల్యమె తేకుగుదేశాన కుండినదనుట కీ ఓసమాలే సాత్ష్యమిస్తున్నవి. 
“ఓం నమః శివాయ” అను షడక్షరీ శివబుం తముతో విద్య పారఠరంభమగుచూ 
వచ్చినది. ఉత్తర వాందూస్థానమ లోను, మళయాళములోను “శీ గణేశాయ 
నమః” అని అక్షరాభ్యాసము చేతురు, కాని మన తెనుగు దేశమందును, కర్ణాట 
మందును ఓం నమళ్శివాయయే కాక “సిద్ధం నమః' అనియు |వాయింతురు. 
మొదట జైనమత వ్యా వియె జెనులే విద్యాబోధకు లగుటచేత నారు “ఓం 
నమః సిదేభ్యః” అని అక్షరాభ్యాసము చెయిసూ వుండిరేమో ! షేమం, దుడు 
తన “కవికంఠాభరణము' అను (గంథములో వర్ణ మాలను చమత్కారముగా 
కోక బద్ధముచేసెను అందు మొదటి ళ్లోక మిట్లున్నది. 


“ఓం స్వ సంకం సుమః సిదమంతర్వాదంమిలిప్పితం 
అలాని దీ © లి €౬ 
ఉద్యదూర్జ పదం దేవ్యా టుబూా "గాని గూహనం” 
తుదిలో ఇట్లనెను. 


“ ఏణాం నిమః సరస్వత్యాయః | కియామాతృకాం జపేత్‌” 


పై శ్లోకములో “స్తుమః సిద్ధం” అను పదాలు గమనింపదగినవి. 
క్షేమేందుడు కాశ్టీరకవి, కాశ్మీర శైవము తమిళ శైవముతో భ్రిష్నించి 
సట్టిదని తదజ్జుల అభీ పాయము. పాచీశములో దేశమందంతటను “ఓం నమః 
శివాయ” యనియు, “ఓం స్వన్యుంకం స్తుమః సిద్ధం” అనియో లేక “స్తుమః 
సిద్దం” అనియో విద్యాభ్యాసము చేయుచుండిరేమో సమః సిద్ధం అనునదే 
“నమః సిద్ధం” అని తెనుగుదేశములో మారెనేమో అని పై విషయము కూడ 
సూచింప నెనది. 
నేను మొదటి ముదణములో (పకటించిన పై విషయమును ఒకరు 
క సభలో నాక్షేపించుచు “సిద్ధం నమః” అనుట వ్యాకరణశాస్త్ర విరుద్ధమని 
యుపన్యసించిరి. వ్యాకరణ విరుద్ధమనియు “నమః సీద్ధెభ్యఃకి అని యుండు 


£o 


కాకతీయుల యుగము 43 


ననియు నేనే [వాసితికదా! “సిద్ధం నమః” అనునది జై నులనుండి వచ్చియుండు 
ననియు (వాసితి. గాథా స్తళతిలో ౨ వ శతకములోని ౯౧ వ కోక 


మిటున;, ది. 
Md ఈ 
“వర్ణావశీమప గ్రజానంతో లోకాలోతై రొరవాభ్యధిళాః 
సువర కొరతులా ఇవ నిరక్షరా అవిస్క ౦ధై రుద్యంతే.” 


దీని నిపె Mla భట శ్రీ మధురాగా నాథళాద్రిగారు (జయపూర్‌ ) 
తు వొ 


ట్ల ఏకో ్యనించిరి. “జతె 8 ఓం నమః సిద్ధం సిద్ధినన్తు ప్ల కఇత్యార భ్యాం 
వర్ణమాలా మప్యజానంతో లోకాః గౌరవాభ్యధికాః స్ట న ఇతి 
త్వా నిరక్షరా అపి నిర్విద్యా అపి సువర్గకారతులా ఇవ స,౦ధ్రైరుద్యంతే 
సాదరం నీయంత ఇత ర్ధ 8 సావాత్యాచార్యులు కూడ “ఓం నమః సిద్దం" అని 
జనులు పిద్యా ,భ్యాసారంభవ మున కేశా కదా; ఆట్లనుటరూడ తప్ప 'ందురా 
యేమి అక్షేపకో లుఃః సాహిత్యాచార్యులు ఉత్తర హిందూస్థానమువారు.. వారు 
“సిద్దం నషఃి అను దేళాచాశకమును తెలుపుటచేత అది తెనుగువారిలోనే కాక 
ఇర భారతీయ భాషలలో కొన్నింటియందురూడా ఉండె ననుకొనవలెకో లేక 
గాథాసప్తశతి దక్షిణదేశ కవిత కాన దాక్షిణాద్యాచారమని వారు భావించి 
వ్యాఖ్యానించిరో తెలుపజాలము.* 


tp 


LEN 


మొతానికి తప్పో ఒప్పో అపాణినీయమో, అపాతంజలీయమో దేళ 
మంతయు తప్పునే వాడిన ఆ వాడుకను వాణినీయాది సిద్దాతములు కొట్టివేయ 
జాలపు. భాష మారేకొలవి వా ర్రికములు, భాష్య ములు పుట్రవలసి వచ్చెను. ఆంతే 
కాని ఒకరి శాసనాలకు భాష కట్టు ఐడీ యుండదు. ఈ లెక్క చొప్పున “సిద్దం 
నమః” అను దానిని సరియైనదిగా నంగీకరింప వలసి యుండును. ఇట్టి 
కృత్యాద్యవస్థ మన పిల్లల కీనాడును తప్పినదికాదు. 


En కాలమందే తిక్కన సోమయాజి, ఆతని శిష్యుడగు మారన, 
కేతన, మ్‌ంచెన, గోన బుద్ధుడు, పాల్కురికి సోమసోథుడు, భద్ర భూపాలుడు, 
రావిపాటి తిప్పన్న, నాచన సోముడు. భాస్కరుడు, మల్లికార్జున పండితారాధ్యులు 
మున్నగు మవోకవు లుండిరి. | అదే విధముగ సంస్కృృతమందు అగ,శేణికి 
చెందిన పండితకవు లుండిరి. అందు విద్యానాథుడు పభ్యాతుడు (క వి 
పండితులను గూర్చి వివరించుట కవుల చర్వితగా మారునని సూచించి వదలి 
వేయబడినది). 


44 ఆం(ధుల సౌంఘిక చరి త 
చితి లేఖనము 


మన పూర్వులకున్న కళాదృష్షి మనలో కానరాదు, చిలుకనో పువ్వునో 
చెక్కని చెంబు బోడిచెంబే ! అంచులేని యుడుపుల ధరించుట అమంగళమని 
తలంచిరి. ఇండ్ల గోడలపై చిత్తరువులు |వాయిస్తూవుండిరి. ద్వారముల 
చౌకట్ట పై చక్కని జంతపుపని యుండెడిది. బట్టల పై ఆద్దకముతో బొమ్మలను 
వేయుచుండిరిన ధనికులు పటములను [వాయించెడివారు. కాకతీయుల కాలములో 
చిత్తరువులు జనసామాన్యమందును ఆదరణీయముగా నుండినట్లు కానవచ్చును. 
ఇండ్లముంగిళ్ళలో ముగ్గులతో బాలా చక్కని చి[తములను పడుచులు తీర్చు 
చుండెడువారు. (ప్రతాపర్నుదుని యుంపుడుగ త్రెయగు మాచల్లేవి యింటి 
నెట్లలంకరించినడో గమనించుడు. 


“రందనంబున కలయంపీ చల్రినారు 
(ముగ్గు లిడినారు కాక్మిరమున ముదమున 
[వాసినా రిందయ రజమున రంగవల్లి 
కంజముల దోరణంబుల గట్టినారు” + 


ఎందుకనగా, మాచల్లేవి “ది తకాలా |పవేళంబు చేయుచున్నయది. 
పుణ్యాహవాచన కాలంబు,'’= ఏవిధమగు చిత్తరువులు [వాయుచుండిరో అవియు 
తెలియవచ్చినవి. దారుకావనములోని శివుడు, గోపికాకృష్ణులు ఆహల్యా 
సం్యకందనులు, తారా చం[దులు, మేనకా విశ్వామ్మితులు మొదలైనవి (వాయిస్తూ 
వుండిరి. చిత్తరువులను “మయ్యెరితో వాసిరి. (మయ్యెర అను 
వెం|టుకలతో చేసిన బపు అయి యుండును-మైర్‌ ఆన అరవములో 
వెం!టుక అని యర్థము). ఊరుగల్పున “చి త్తరువులు [వాసే యిండ్లు 
౧౫౦౦' అని ఏకా[మనాథుడు _వాసెను. టోగమువారు తమకు తగిన 
పటాలను [వాయించుకొనిన ఇతరులును (వాయించుకొన్న వారు కారు. |(పజలు 
తమతమ అభిలాషల కొలది వాయించుకొను చుండిరి. వీర పూజ కోరువారు 


వీరుల చి(తాలు (వా ముంచిరి, 


+= క్రీడాభిరామము. 


కాకతీయుల యుగము 4b 


కోలదాపున (దిక్‌, టి గూడియున్న 
గచ్చుచేసిన చ్మితంపుగద్దె పలక 
(వాసినా రది చూడకా వైళ్యరాజ 
శీల (బహ్మోడి వీరనాసీర చరిత” + 


“కర్టమ[దవము' మషీరసము, హరిదళము, ధాతురాగమ్ము మున్నగు 
వర్ణముల (రంగుల) ను తూలిక (కుంచె) తో చితరువులు వాయుట కుపయో 
శించెడివారు (కాశీఖండము ౧-౧౨౩). 


చెతిపనులు” 


తెనుగుసీమ పాదీనమునుండి సన్నని నూలుబట్టలకు పసిద్ధి. మసూరి ! 
(మచిలీ బందరు) లో లభ్యమగు సన్నని బట్టనుండి ఇంగ గ్‌ష్పుట్రో మస్ఫిన్‌ పద. 
మేర్పడెను. కాకతీయులకాలము లో ఎన్ని విధములగు వస్తాంలు సిద్ధమవుతుండెరో - 
పాల్కురికి సోమనాథుని వివరణను చూచిన ఆశ్చర్యము కలుగును. 


“వెంజావళశియు, జయరంబియు, మంచు 

పుంజంబు, మణీపట్టు, భుఃతిలక ౦బు, 

శ్రీవన్నియయు, మహోచీని, చీనియును 

భావజతిలకంబు, పచ్చని పట్టు, 

రాయశేఖరమును, రాయవల్లభము, 

వాయుమేఘుము, గజవాశంబు గండ 

పడము, గాపులు, సరిపట్టును, హంస 

పడియు, వీణావళి, పల్పడదట్టి. 

బారణాసియు, జీకువాయు, కెందొగరు, 

చొరిగనయమును, తశరోదకంబు, 

పట్టును, రత్నంబుపట్టును, సంకు 

పట్టును, మరకతపట్టు, పొంబట్దు, 
“క్రీడాభిరామము. (పల్నాటి వీరచరితలో “శ్రీరామకథలును,. |శీకృష్ణ 
కథలును పన్నుగా |వాసిన పటములను దెచ్చి” అని (వ్రాయటచే చీత్రలేఖన 
చరిత మరింత్యప్రాచీనము దగుచున్నది. [చూ* పల్నాటి, పు, ౧౬ ] 


46 ఆం[ధుల సాంఘక చరిత 


నెరవటు, వెలిపట్టు, న్మేతంబుపట్టు, 


యు? 


మరి తవరాజంబు, Eee 


ఇంకా ౨౦ విధాల బట్టల పేర్లను తెలివినాడు. దేవుని యెదుట (లిపు 
రాంతకమలో పంచలోహ సంభమును పొతియుండిరి. ఆది “ఇనుము, పిత్త 
కంచు, హేమ, తా మమల, పంచలోహముల''తో సిద్ధము చేయబడినట్టిది. బహ్మ 
నాయుడు దాని నర్చించెను. + లక్క- బొమ్మలను చేయుట విరివియై యుండెను. 
“పూచిన కింళుకం బనగ పు తడిలత్తుక బొమ్మవోలె' ఆని నాచన సోముడు 
వర్థించెను, () “చెతి జం|తంపు బొమ్మ 'లనుకూడా చేయుచుండిరి. జం|తమనిన 
యం[తము, చేతజం[తపు బొమ్మలనిన బొమ్మ లాటయై యుండును.! ఓరుగంటి 
మైలసంతలో 'సుసరజేత్‌ి' అను 'సరఖేదనము”" చేయు వాందును అమ్మిరి.2 
దానిని “పెద్ద దంతంబు'పటై'లో పెట్టి యమ్మిరి. దంతపుపనలు చాలా హెచ్చుగా 
నుండుటచే; మాలమాదిగలుకూడ వాటిని వాడుకొనుచుండిరి. సైన్యమునకు 
కావలసిన వివిధాయుధములను. యుద్ధభరీలను ఆటపాటల కవసరమగు వాద్య 
విశేషములు, శ్రీల అ౯ంకరణమునకు కావలసిన యాభరణములు, రంగులు 
మున్నగునవి చేయువారు, వాటిచే జీవించువారు చాలామంది యుండిరి. ధనికులు 
పలకీలలో పోవుచుండిరి. వాటిని చేయు వ్యడంగులు నానావిధములగు సుందర 
శల్పములతో క ట్రైలమై పనితనము చూపించెడివారు. 


మదైవ౫ఃడ అను పేరు అచ్చట మట్టెలుచేసి యమ్ముటచేత ఏర్పడిస 
దందురు. ఓరుగంటిలో మంచి మంచి యున్ని కంబళములు సిద్ధమగు' 
చుండెను ,8 ఓరుగంటిని లాగుకొనిన తురకిలు రత్నకంబళముల వృ కిసిగూడ 
లాగుకొనిరి. తర్వాత వారు “ తివాసీల "ను చేయు కళను వృద్ధి చేసుకొనిరి. 
ఛేటికిని వాటిని ఓరుగలు కోటలోని తురకలే సిర్ధముచెబ్యన్నారు. 


ననన 
* బసఎపురాణము పు ౫౬. 


‘ పల్నాటి పీరచరి త, పు ౬, 

() ఉతర హరినంళము, పు ౧౮౦ 

1 నాచన సోముని ఉతర హరివంళము, ఆ ౫ ప ౨౧౨. 

2 కీడాభిరామము. 

8 “హాహా నృపాల సింవోసనాధిష్టాన రత్నకంబళ కాభిరామరోమ” 


(కీడాభిం 


కాకతీయుల యుగము క్ష? 


మహారాణీ రుద్రమదేవి కాలములో (ప్రపంచ సంచారియగు మార్కో 

పోలో అను జినీవావాడు వరంగల్‌ రాజ్యవిశేషములను గూర్చి యిట్లు |వాసెను. 
కాకతీయుల రాజ్యములో గోష్టమె నన్ననై నట్టి వస్త్ర ములు నేయుదురు. వాని 
[కయము చాలా పీయము., నిజముగా ఆ బట్టలు సాలెపురుగు జాలవలె 
నుండును. వాటిని ధరింపనొల్లని రాజుకాని, రాణికాని పపంచమందుండరు.” 


గిరుల కత్తులు ఆపి (పసిద్ధికల కత్రులుండెను. నిర్మలకు నప 
వమవంగుండు కూన సము[దముతో వాటిని సిద్ధము చేయుచుండిరి. న్‌ర్మల నుండి 
కిత్తులను ఇనుమును డెమన్తన్‌ స్‌ (దిమిషు) పట్టణాని కంపుచుండరి. 


(పజలకు సౌకర్యములు 


లేపు. విరశైవ బోధకుల 


చారు పజలను వ్‌3ంచిన మెదును నూచనలు 
లొ 
వలస పరర. సొరి పదముల. ౩ మన నష్టకష్టములు స్టైలు ఓరుగంటి 
వ. 4 ; | క 


రాజుల |పజలకు SS Pe; (ప్రసూతి గృహ సంస సృతమును 
వెద వేదాంగములను బ్‌ తల కళాశాలలను స్థావి ంచిరి. శా॥ శ॥ ౧౧౮౩లో 
రుదమదేవి వెలగపూడి అఎ |గామమును  పజాహతమునకై నకె దానము చేసెను, 
అందు ఒక మఠమును, జక స తమును కద్దంచెను. స తమందు వంటకై 
ఆర్గురు (బబాహ్మణపాచకులే స్పాటబురి. జనుల ఎరోగ్య విచారణకు చికిత్సలకు 
ప కాయస్థ వైద్యు నేర్పాటుబేనిరి. న ౧౦ మంది “వీర 
భ|దులు' [గామ భ;దతకు బాధ్యులగు ప రభటులు) ఉండిరి. ౨౧ మంది 
భటులు (తలార్దు) ఉండిరి. వీరిని వీరముష్షివారని పిలుచుచుండిరి. (ఈనాడు 
ఏరము్షి యను నొక హీనకులము వారు కేవలము కోమట్లను యాచించి 
జీవింతురు. కాని ఆనాడు శబ్బార్థమను బట్టి చూడ గామసేవ చెయుదు 
(గామజనుల మవ్షిదానమునకు ఆర్హత కలిగినవారు వీరముష్టి వారని 
యూవాంపవచ్చును. | 'గామములో pn సోచ్భవ దుష్టాక్యములను (ఫొజ్జారీ- 
క్రిమినల్‌ ) చేయు వారిని ఆధికారుల యాజ్ఞ పకా రము కొరడాలకో కొట్టుట లేక 
నానావిధములగు హింసలు పెట్టుట లేక కాలో చేయో నరకుట లేక తలనే 
నరకుట, యను విధులను నెరవేర్చుచుండిరి. + (పభువులే గాక వారి యధికారు 


+ మల్తాపుర కాసనము, 1. A. H. R.5. సం శీ పు 147-162. 


£3 ఆం|ధుల సొంఘ్‌క చరొత 


లుమ, వారి సామంతులును. ధనిక వ్యాపారులును అనేక తటాకములను 
నిర్మించి. వ్యవసాయాభివృద్ధికి తోడ్చడిరి. గణపతి సేనానియగు ర్నుదుడు 
పాభాల చెరువు కట్టించెను. కొాటసముదను కాట చమూపతియు, చౌడ సము 
[దమును చౌడచమూపతియును సబ్బిసముగమను గౌర సముదమును కోమటి 
చెంయివు అను వాటిని నామిరెడ్డియు, ఎలుక సము[దమును ఎల్లిక సానమ్మ యు 
కృట్టించిరి. ఇవికాక చింతల సము[దము, నామా సముదమ్ము విశ్వనాథ సము 
[(దమును కట్టించిరి. * ఈ చెరువుల [కింద చెరుకు తోటలు ఆకు తోటలు 
పండించిరి. () 


జగత్తేసరి సముద మను మరొక తటాక మీ కాలమందే నిర్మింప 
బడెను. అంబదేవుడు అను కొయస్మడు భూమిని కొలిపించి పన్నుల నేర్పాటును 
చేయించెను. భూమిని కొలుచుటకు “పెనుంబాకమాన దండము అనునది 
సుపసిద్ధమై యుండెను. 4 


కాకతి (ప్రభువులు బంగారు వెండి నాణెములను |పచారము చేసిరి" 
ఆ నాణెముల విలువ యిప్పటి నాణెములలో ఎంతో సరిగా జెప్పజాలము- 
ఏకా[మనాథుడు సువర్ణ నిషములను మాట పలుమారు వా సను. (పోలరాజు 
కాలములో తూకము లిట్లుండెను, 


౧౨౦ గురిగింజలు=౧ తులము; 
౧౨౦ తులములు =౧ వీసె; 


౧౨౦ వీసెలు = బారువా, 


వరహాలు కూడా ఆప్పుడే యేర్చడెను, వరాహలాంఛనమును బట్టి వరహా 
యేర్చడెను. ఒక కర్ణాట వేళ్ళ తన రేటు శాటీహాటక నిష్కము' అని 
చెప్పెను.! (శాటి అనగా “సాడీ”=చీర.) మరొక జారిణి రెండు సొన్నాటంక 
ములు కోరెను. వరహాల సూచన నాగులపాటి శాసనమందు కలదు. భూములను 
కుదువబెట్టుటలో రూకలతో వ్యవహారము జరుగుచుండెను, 


జ నాగులపాటి కాపనము. 

() నాగులపాటి శాసనము. 

0 మలాపుర కాసనము (తెలంగాణా శాసన (గంథము) 
1 పండితారాధ్య చరిత, ౨వ భాగము, పుట ౩౦౭ 


కాకరీయుల యుగము 49 


“అహి పెట్టతి జొన్నగడ్డాగహార వృతి 
ఏనూరు నూకల వృ తమునకును."! 


ఓరుగంటిలోని ఖాన్‌సాద్‌ తోటలోని శాసనములో చిన్నమును రెండు 
మూడు మారులు పెర్కొనినారు. అన్నిటికన్న చిన్న నాణెము బహుళా “తారి 
మేమో. “తార మొసంగరే ధర్మాత్ములార” అని యొక వీచ్చుకుంట బిచ్చ 
గాడు (పార్థించెను.* మాడలు అనునవి సాధారణ వ్యవహారమున నుండు 
నాణములు, 


“మా కలంబున ఓలిమాడలు కలవు.” 
అని బాలచం[దు డనెను. వెలమలలో ఆనాడు ఓలి యుండుట గమనింప 
దగినది. 


తురకల పరిిళమ యగు 'మఖుమల్‌' బట్టలు దేశములో వ్యా ప్తీలో 
నుండెను. 


ధాన్యం కొలతలలో ఇరుస, కుంచము, తూము అనునవి యుండెను. 
(చూడు, బసవపురాణముు పుటలు ౧౪౯, ౧౫౨.) 


వ్యాపారము 


కాకతీయ కాలమందు వ్యాపారము చాలా అభివృద్ధి నొందెను. తూర్పు 
దీవులనుండి పశ్చిమ పాంతాలనుండి సరకులు రాజ్యములోనికి వసుండెను. 
రేవులవద్ద సుంకములు తీసుకొనచుండిరి. ఆ సుంకములు [పజలకు తెలియు 
నట్లుగా శాసనములపై చెక్కించి యుంచిరి. 


ఓరుగంటి కోటకు బయటిభాగమున మైలసంత సాగుచుండెమ. అచ్చట 
సుంకములు నిర్ణయము చేసిన శాసనముంగెను, ఇప్పటికిని నందే కలదు, 
ఆ స్థలము నిప్పుడు భాన్‌ సాహెబ్‌ తోట యందురు, ఆ శాసనమునుబట్టి యచ్చట 


1 కీడాభిరామము, 
వ్‌ పండితారాధ్య చరిత, ౨ వ భాగము, పుట ౩౦౭+ 
8 ““మఖుమల్లుగుడ్డలు" వల్నాటి పు ౧౦. 

(7) 


50 ఆం|ధుల సాంఘిక చరిత 


ఆకులు, కూరగాయలు, "టెంకాయలు, మాదీఫలములు, మామిడిపండ్లు, చింత 
పండు, నువ్వులు, గోధుమలు, పెసలు, వడ్డు, జొన్నలు, నూనె, నెయ్యి, 
ఉప్పు, బెల్లము, ఆవాలు, మిరియాలు, తగరము, సీసము, రాగి, చందనము, 
కస్తూరి, మంబిష్ట, దింతమ్ము పట్టు, పసుపు, ఉల్లి, అల్లము ఆమ్ము చుండిరి. 


ఒకతె “ఓరుగంటి పురంబులో ఓర|గంత బెద్దయెలు౨గున నమ్మె 
_ సంపెంగనూనె"! ఆ కాలములో మోటుపల్లియు, మచిలీపట్నమున్ను టపసిద్ధ 
' మగు ఓడరేవులు. అచ్చటికి పర్షియా, ఆరేదీయా, చీనాదేశముల సరకులు వచ్చి 
' దిగుచుండును. మోటుపల్లి రేవు కీరములోకూడా సుంకములు తెలుపు శాసనమును 
స్థావించిరి. దానినిబట్టి ఆంధదేశములోనికి కర్పూర, చందనాది సుగంధవస్తువు 
లును, దంతములు, ముత్తెములు, పటుబట్టలు విశేషముగా దిగుమతి యగుచుండె 
నని తెలియును. ఆ శాసనము గణపతి దేవునిచే వేయించబడెను. 


[గామాలలోకూడా సుంకములను తీసుకొనుచుండిరి. పుల్లరి, అంగటి 
ముద సుంకము మున్నగునవి లీసుకొనిరి, 


పజల వినోదము 


నన్నయకు పూర్వమం దుండిన జనుల భాషలోను, కవితారీతులలోను, 
నన్నయ మార్పుచేసి తెనుగును విశేషముగా సంస్కృతమునకు లంకె పె బైను. 
ఆతనికి పూర్వము మధ్యాక్కరలు, ద్విపద, (తిపద, షట్సద, రగడ వంటివి 
రబించి, జనులు గాగము చేసినట్లున్నది. నన్నయ తర్వాత ౨౦౦ వఏండ్డ్లకే 
ద్విపదకు గౌరవము తగ్గినట్టయ్యెను. అందుచేత పాల్కురికి సోమనాథుడు 
ద్విపద [పాశ స్యమునుగూర్చి [పత్యేకముగా వాదించెను. 
ఉరుతర పద్య గదో్యో కుల కంటె 
సరసమై పరగిన జానుదెనుంగు 
చర్చింపగా సర్వసామాన్య మగుట 
కూర్చెద ద్విపదలు కోర్కి దై వారం£ి 
శ క్రీడాభిరామము ౭. 
౧2 బసవ పురాణము పు ౫. 


కాకతీయుల యుగము ర్‌ 


మరియు ఆతని కాలములోను అంతకు పూర్ణ మందును తుమ్మెద పద 
ములు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, వాలేజ పదాలు, 
వెన్నెల పదాలు మున్నగున వుండెను.! ఈ పదా లన్నియు [కమముగా నిం 
చుటచేత జనసామాన్యములో విద్యాపచారమున కవకాళములు తక్కు వయ్యెను. 
జనులలో పాటలకే పాముఖ్య ముండెను, వారు బహువిధములగు పాటలు పాడు 
కొనుచుండిరి. 


“మేటియై చను భ క్రకూటువలందు 
పాటలుగా గట్టి పాడిడువారు 
(పస్తుతోక్తుల గద్య పద్య కావ్యముల 
విసారముగ జేసి వినుతించువారు 
ఆటుగాక సాంగ భాషాంగ కియాంగ 
పటునాటకందబుల నటియించువారు 
మునుమాడి వీరు వారననేల కూడి 
కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడెదరు”2 


భ _క్రకూటువలు (భజన మండలుల వంటివి) ఉండుట, ఆందు పాటలు 
కట్టి పాడుకొనుట్క రోకటి పాటలు పాడుటయు, ఆవి నేటికిని పామరజనులలో 
నిలిచి యుండుటయు గమనింపదగినవి. 


“ఏ. రోకటిపాట లట్ల వేదములు 
పనుగొన మా శివభక్రుల యిండ్ల" 


అని కవి రోకటిపాటల [ప్రాధాన్యము నొ త్రి చూవినాడు. 
నాచన సోముడు జాజరపాటను గూర్చి ఇటుల |పసావించెను, 


““వీణాగానము వెన్నెలతేట 
రాణ మీరగా రమణుల పాట 
పాణమైన పిన |బాహ్మణ వట 
జాణలు మెత్తురు జాజజపాట” 
1 పండితారాధ్య చరిత ౨-వ భాగము. 


2 బసవ పురాణము, పు ౧౨౪, 
లీ ఖసవ పురాణము, పు ౨౧౬. 


ర్‌లి ఆం|ధుల సాంఘిక చరిత 


ఇది అతని వసంత విలాసములోని దని పూర్వు లుదహరించిరేకాని 
ఆ (గంథము మనకు లభింపలేదు. అందు పెన తెలిపిన జాజజపాట అంటే 
యేమో? పూర్వులకు (క్రీ. శ. ౧౬౫౦ వరకు వాటి స్వరూపము తెలినియుండె 
మో । బహుళాశ్వ చరి|తములో దామెర వెంగళ భూపాలుడు జాజజపాట 
పేరుమ్మాతము [వాసెనుకాని దానివలన మన కేమియును తెలియరాదు. 
(బాహ్మణఏటనే జాజజపాటను మెత్తు రన్నందున అది 
ఎక్కువ వ్యా ప్రిలో నుండెనో ఏమో? 


జి 
(బాహ్మణులలో 


ఈ సందర్భములోనే జాజజను గురించిన రెండు విషయముల తెలుపుట 
బాగుండును. శ్రీనాథుడు జాజటనే “జాదరి'' అని యతిస్టానమందుంచి వాడెను. 


'“జాదర జాద రంచు మృదుచర్చరి గీతలు వారుణీ రసా 
స్వాదమదాతిరేకముల చం,దిక కాయగ దక్షవాటికా 

వేదుల మీదటన్‌ కనక వీణలు మీటుచు పాడి రచ్చరల్‌ 

మోద మెలర్పగా భువన మోహన విగహు ఫీమనాథునిన్‌,''! 


నాచన సోముడు |బాహ్మణవీట జాజజపాట రాణీంచెననగా శ్రీనాథుడు 
బోగమువారు ఏణెల మీటుచు జాదర జాదర అను పల్లవితో మృదువుగా పాడి 
రని వర్ణించెను, వెన్నెల రాతులలో ఇది మరీ ఆవ్హాదకరమై యుండెడిదేమో ? 


జాజరీ, జాజరీ అను పల్లవితో తెలంగాణ మందు నేటికిని సేద్యము 
చేయునప్పుడు కూలీలు కొన్ని తావులందు పాడుచున్నట్టు తెలియ వచ్చినది. 
వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకాలోని దని ఒకరు నా కీపాటను తెలిపిరి. 


“జాజీరి జాజీరి జాజీరి పాపా 
జాజూలాడవె గాజూల పాపొ 
తూర్పునుండి వచ్చెరా తుప్పతలనక్కా 
పడమటినుండి వచ్చెరా పర్వతాలనక్కా 
ఆనక్క యీనక్క- తోడెరా బొక్కా 


1 ఫీ మేశ్వరఖండ ము, ౫-౧౦౩ 


కాకతీయుల యుగము 53 


జోగయ్య నాకు కొన్ని జొన్నగింజ లిచ్చె 

ఎటియొడ్డున సేడ్యంబు చేస్తే 

ఈడ్చికొడితే ఇరవై పుట్లు 

అర్బికొడితే అరవై పుట్టు 

అస్నీ కొంచటోయ ఆప్పయ్యదొరా 

శఇసుకో ఉసుకో ఇద్దుమె వుంచే 

తాలో తౌడో తవకడె వుంచే 

మన్నో మెలో మానెడె వుంచే 

ఉప్పులెనీ గంజి తాగీతిమయ్యా 

చొప్పకట్టలోలె సోలీతిమయ్యా 

కుక్కి మంచములో కూళలీతిమయ్యా 

జాజీరి జాజీరి జాజీరి పాపా 

ఎక్క_డనుండో సాహుకార్లు వచ్చి అప్పు లిచ్చి రైతుల కొంపలు 

తీయుట, నాగులకు, ఆప్పులకు, వద్దీలకు ఇచ్చి పంట పండినవెంటనే కల్పము 
లోనే ధాన్యాన్ని దొరలు లాగుకొనిపోవుట, వీదరై తులు వారి కూలీలు, 
ఆకలితో కూలబడుట, ఇట్ట యవస్థలన్నియు తెలంగాణమందు నిత్యజీవనము 


లోనివి. వాటినే జాజిరి పల్పవిలో సరరహితులగు రైతులు పాడుకొని తృప్పి 
పడినారు, 


“కలమాట లాడుచు, మొలపుండ్ల మల్టి, బాడుచు” 1 


అని కేతన వర్ణించుటనుబట్టిచూడగా ఆనా డది జనసామాన్యములో 
పాడుకొను పాట యెమో ? 


బొమ్మలాట మన యాదివాజ్మయమందు కానవచ్చుటచేత అది |పాచీన 
మైనదేకాని ఆధునిక కాలములో ఆ యాట మరాటీవారి వశ మైనది, * పతిమల 
నాడగ బట్టినయట్లు” అని పల్నాటి వీరచరితలో వర్డించినారు. 
“యంతకు డాడించి యచని డోచిన [వాలు 
బొమ్మలగతి రథపూగములును 2 


1 దశకుమార చరిత, 
ఏ జ, హరివంశము, పు ౨౮౧. 


ర్‌శీ ఆం ధుల సాంఘీక చరిత 
అని నాచన సోమన ఉపమించినాడు. “ 


మన వాజ్మయములో పాలకురికి సోమనాథుని కాలమునుండి తంజా 
వూరి రఘునాథ రాయలవరకు బహుకవులు బొమ్మలాటను పేర్కొనిరి, 
బొమ్మలాట యనగా తోలు బొమ్మలాట, భారతీయులలో ఏ యే పదేశాలలో 
నిది కలదో తెలియదుకాని తెనుగువారిలోను, కర్గాటకులలోను ఇది చాలా 
[పాచీనమునుండి వచ్చినట్టి యాట. సన్ననివస్త్రమును తెరగా కట్టి దానిలోపల 
పెద్దదివటీలు వెలిగించి తోలుబొమ్మల కాళ్ళకు చేతులకు, తలలకు దారములు 
కట్టి మధ్య నొక దబ్బతో ఆ బొమ్మనుపట్టి నిలబెట్టి అవసరమగు దారములను 
లాగుతూ వదులుతూ బొమ్మ లాడించెడివారు. ఆట కనుగుణ్యముగా తాళము 
వాయించుతూ కథకు సంబంధించిన పాట పాడుదురు. రామాయణకథకు గోన 
బుద్ధారెడ్డి రామాయణములోని ద్విపదలను పొడుదురందురు. బొమ్మలను సూత 
ములతో నాడించువా డగుటచేత అట్టి [(పదర్శకుని “నూతధారుడు అని 
యందురు, సంస్కృత నాటకములలో నాటకమును (పారంభించునప్పుడు 
'సూతధారుడు' (ప్రవేశించి |పదర్శింపనున్న నాటకమును గురించి కొన్ని 
మాటలు చెప్పిపోపును. కాని తోలుబొమ్మలాటలో ఆదినుండి తుడివరకు సూత్ర 
రారుడు లేనిది బొమ్మ లాటయే యుండదు. కాన నాటకాలకన్న బొమ్మలాటకే 
సూతధార పదము సరిపోవును. ఆట్టగుచో తోలుబొమ్మ లను చూచి నాటకాల 
వారు సూ[తధార పదమును నాటక నాట్యవిధానమును సవరించుకొనిరా లేక 
నాటకాలను జూచి బొమ్మలాటగాం[డు నేర్చుకొనిరా అనునది చర్చనీయాంళ 
మగును, 


తోలుబొమ్మ లప వాలిసు|గీవులు, రావణుడు, సీతారామలక్ష్మణులు, 
రాజులు, భటులు మహాభారత వీరులు, మున్నగు వేషాలన్నియు వివిధ రంగు 
లతో తీర్రురు, | పేక్షకులు బొమ్మల చూడగనే ఇది యీ వ్యక్తిని నిరూపించు 
బొమ్మ అని పోల్చుకొను సాం[పదాయ మేర్పడినది, ఈ బొమ్మలలోని వేషాలు 
పూర్వపు రాజులు రౌతులు మున్నగువారి వేషములను ఊహించుటకు తోడ్పడ 
వచ్చును. ఈ బొమ్మళాటలో మధ్య మధ్య హాస్యపదర్శనము చేయుదురు, 
ఆది చాలా అసభ్యముగా నుండును. సినిమా ఆసభ్యాలను నిషేధించే |పభు 
త్వము వీటిని తొలగించినదికాదు. 


కాకతీయుల యుగము 55 


ఆనాడు జనులిక్కి గియన తిరిగిన రంకురాట్నం నేటికిని ఆదరణీయమై 
యున్నది. 


*చటిల సంసృతి జీవఘట చ|కవర్మీ 
పటు పరివర్తన [భమణంబు గహర్చి 
కీలువొందించి యాకియ రాటనముల 
వాలి యాడించు నా వ|డంగి యతడు"! 


శెవ సాంపదాయములో నందికోల ఆట యుండెను. అది నేడును 
కార్తీక మాసమందు జరుగును, 


*రోల్రాపే మను బాత గొండ్రి వేరణియు 
గేశిక జోకయు లీల నటింప”? 


అనుటచే కోలాటము, గొండ్రి (గర్భనృత్యము), పేరణి కుంభముపె 
నృత్యము మున్నగునవి యుండెనని తెలియును. ఇవే విషయములను నాచన 
సోమనయు తెలిపినాడు. పేరిణము, కోలాటము, గొండ్లి, [పేంఖణము అను 
వాసిని అతడ పేర్కొ. నినాడు.+ గోండు ఆను ఆటవికుల కుండలాకార 
నృత్యమును చాళుక్య సోమశళ్వరుడు (అభిలవి తార్థ చింతామణి కర్త) ౧౧౫౦ 
_పాంతమందు తన రాజ్యమందు (పచారము చేయగా ఆది జనసామాన్యమందు 
విరివిగా వ్యాపించెను. రెండు ఆటలు (పత్యేకముగా తెనుగు ఆటలై పోయెను. 
ఒకటి ఉప్పనపఫేలాట, రెండవది గిలదండ ఆట. ''ఉప్పన పట్రై లాడునెడ 
నుప్పులు దెత్తురుగాక యాదవుల్‌'”* నేటికిని ఈ యాట నాడుదురు. ఉప్పు 
సము[దతీరమునుండి లోభాగాల కందువరకు దొంగలనుండి, పరరాజ్యముల 
సుంకాలనుండి, దొర్ణన్యపరుల నుండి తప్పించుకొని వచ్చుటలో నుండు కష్టాలను 
ఆటగా చేసుకొని యాడిరేమో ? 


1 పాల్కురికి బసవపురాణము. పు ౧౦౨. 
20 0 0 ఎనీ 

8 నాచన సోముని ఉ త్రర హరివంశము పు ౧౭౨. 
4 నాచన సోముని ఊఉ. హరివంశము పు ౧౫౮, 


56 ఆం'ధుల సాంమ్‌క చరిత 


గిల్లదండను బిల్లంగోవి దండుగులి, చిరాగోనే, చిల్లగొడె అని 
యెన్నెన్నో పేరులతో వ్యవహరింతురు. ఇది మన [కికెటు ఆట అనవచ్చును ౪ 
ఒక జేనెడుక బై చిలను మూరెడు పొడవుండుక వైతో కొట్టదురు. ఆ యాటలో 
పెద్దక రైతో కొలుతురు. ఆ కొలతకు ఒకటి రెంచు అనక కన్ను, రెండార్చి, 
మూలముంజి, గెరగేర, అని వడువరకు చెప్పుదురు. ఏడువరకు మారుపదము 
లను ఈ యాటలోనే యేల సృవ్షించిరో! బుద్ధ ఘోషకవి ఇంచుమించు ౧౪౦౦ 
ఏండ్లనాడు అతడు తన కావ్యాలలో నొకచోట “ఘటికా ఖేలనం” ఆని వర్జించి 
నాడు. ఘటిక అనగా చిన్న క[రపుల్లను పెద్దక్యరతో కొట్టుట ఆని యతడు 
వివరించినాడు. దీనినిబట్టి మరికొన్ని పాంతాలలో నీయాట యుండినట్లున్నదిం 
మహాభారతములో కౌరవ బాలురు చిన్నగిల్లను కటబైతో కొట్టి యాడిరి. “చిరు 
తలు తీరైన గొడెలు” వీటితో బాలచందు డాడెను. చిరుత అన చిల్లగొడె 
(గోడె) అన చిల్తను కొట్టుకటై. పాండవ కౌరవ బాలు రాడిన గిల్లదండ 
యాటను భారతమం దిట్టు వర్ధించినారు. 


“దోణుండు: హ సినాపురంబునకు వచ్చె నప్పు డపురబహిర౦గణం 
బున ధృతరాష్ట్ర) పాండునందను లందరు కందక |క్రీడాపరులై వేడుకతో 
నాడుచున్నంత నక్కా ౦చన క ందుకం బొక్క నూతంబడియె'” అని తెనుగు 
భారతములో (ఆది. ౫-౨౦౬ ) కలదు. అందు కందుకము అనుట పొరపాటు 
నకు తావిచ్చినది. సంస్కృత మూలమం దిట్టున్నది. 


“కీడంతో వీటయా తత వీరాః పర్యచరన్‌ ముదా 
పపాత కూపే సా వీటా తేషాం వై కీరీడతాంతదా”” 


ఇచ్చట ఏటకశబ్దము'పె మూలమం దిట్లు వివరించినారు : “పీటయాయవా 
తారేణ |ప్రాదేశ మాతకా షేనయత్‌ హస్తమా(త దండేన ఉపర్యుపరి కుమారాః 
[పాకీపంతి'” జేనెడు క 'టైగిల్లను మూరెడు కట్టెతో కొట్టి ఆడెడు ఆటకు వీటా 
భేలన మనిర్‌, 


మహారాష్ట సాహిత్యచరితలో ఇట్లు (వోస్‌నారు. ““పూర్వము మవి 
రామ్టఏలలో చిల్బగోడె౪ఆట లేకుండెను. ఆ యాట నిప్పుడు మరాటీలో “విటి 
దండు” (విటి-వీట, దండు-దండ), అందురు. ఈ యాటలో ఏడువరకు 
దండముతో కొలుచుట కలదు. ఆ యెడుసంఖ్యలను మరాటీ బాలురు ఒకటి 


కాకతీయుల యుగము 57 


రెండు, మూడు అని (తెనుగుమాటలలో) కొలుతురు, డీ. ఈ, ౧౩౫౦ [పొంత 
మందు మవోరాష్ట్రములో ౧౨ ఏండ్ల కరువురాగా లక్షల జనులు తెనుగు, 
కన్నడ, తమిళ పాంతాలకు వలసవెళ్ళి కరువు తీరినతర్వాత తమదేళానికి తిరిగి 
వెళ్ళిరి. అట్టి వలసలో తెనుగు దేశమునకు పోయినవారు తెనుగువారి ఆటలను, 
బాలబాలిక పాటలు నేర్చుకొని వెళ్ళిరి. నేటికిని చిల్లగోడె ఆటయు ఆందలి 
తెనుగు వదాలును, పిల్లల పాటలలో తెనుగు పాటలును (పదారమందున్నవి."' 
(ఈ విషయమును నాగపూరు వారగు పొఫెసర్‌ గర్దెగారు నాకు మరాటి 
సాహిత్య చరిత వినిపించి తెలిపిరి). 


పాచికల ఆట 


పాచికలఆటను మొట్టమొదట వర్ణించిన తెనుగుకవి నాచనసోమనాథుడు. 
ఆతడు తన ఉ త్రరహరివంశములో రుక్మి ణీకృష్ణు లిద్దరును ఆడినట్లు వర్ణించిన 
పద్యము రీ కింద నుదాహృతములు. “చతురంతాసనంబుననుండి సకలలోక 
నాథుండు సత్యభామకు సాక్షీపదం బొసంగి (౮౫18౦) 


రుక్మిణి సమ్ముఖంబుగా సమాసీనుండె న నద్దెివియు, 


సీ. జోగిణి గొనరి బై సుక వెట్టి పలకపై 
సారెలు పోయించి సరము చూచి 
న తనకు లాగయిన నెత్తంబుగై కొని పన్ని 
పాసికల్‌ దాళించి పాచెరింగి 
లోహటంబులుమాని లులిగన్న బడకున్న 
పరదాళమని పోవు పలక లిచ్చి 
తప్పారు జూరెండు రాయంబులును గని 
వారింపకము పోటు[వాలు గలవు 
ప౧తమడిగిన నీవలె భాగమింత 
బోర పెద్ద దాయంబాడి పోరువుచ్చి 
వెచునది ధనమునకు పోవచ్చు ననుచు 


బేరుకొని పాటు తరిసరిజేసి యడిగి 
(6) 


58 ఆం ధుల సాంఘీక చరిత 


క్ర, అ త్రీవంచ తిగదుగయు 
సత్తాదచ్చాక వంచి చౌవంచీరై 
దిత్రిగ యిద్దుగ ఐ((దలు. 
చితంబున దలచినట్లు బేతికి దెచ్చున్‌ 


(ఉ త్రరవారివంశము, అ, ౩. వ ౧౨౦-౧౨౧, ఈ సందర్భములో 
౧౦౯ గుండి ౧౨౯ వరకు ఈ పాచికల ఆటను వగ్గించినది చదువుట అవస 
రము, ఈ పద్యాలలో పెక్కుపదాల అర్థముకాని వై పోయినవి.) 


ఈ యాట మన తెనుగు వారిలో విశిష్టతతో నిలిచిన దనవచ్చును. 
నేటికిని ఈ యాటను రెండు పాదికలతో వైదిక (దాహ్మణ స్రీ పురుషులు 
పలువురాడుచున్నారు. తక్కిన వర్ణములవారు పాచికలకు మారుగా ౬ కాని ౭ 
కాని గవ్వలను లొడివేయుచు ఆడుదురు, ఆయాటను పబ్సిస్‌ అందురు. ఆనగా 
మన “నె తపు” ఆటను ముసల్మానులు స్వీకరించరనియు, మరల వారి నుండి 
వారి మాటలతో మనవారు దానిని స్వీకరించిరనియు [గపింవవలెను, దస్‌, 
బారా, పచ్చీస్‌, తీస్‌ అను పదాలను తెనుగువారును వాడుచున్నారు. మొద లి 
పద్యాలలోని వర్ణ నమును తెలునుకొందము. ఆట [పారంభించువారు “వోేగిణి” 
దేవతకు |మొకుు._ కొందురు. ఒక క ర్లుపలక పె కోపుబలముతో ఇండ్లను గీయు 
దురు. ఆటగాండ్లు “నరము” (సూర్యచం దనాడులను నాసికాశాకసముల 
శాస్త్రమును) చూచుకొని పారంఖింతురు. [పారంభమందే ఎంతెంత పందెము 
ఆని నిర్భ్ణయించుకొందురు. ఈ విధముగా రుక్మి ణీకృష్తులు నెత్తము నారం 
భించిరట,. 


ఈ యాటకు గల సంకేతములు గమనింపదగినవి. దుగ, తుగ, సత్తా, 
బలు మున్నగు పేరులు పెట్టుకొనిరి. బ(ద్ర అను పదమువద్ద శబ్దరత్నాకర 
మందీ వివరణ నిచ్చినారు. బద అన పన్నెండు. “సొగటాలాటయందు పాచికలు 
రెండు. ఆ పాచిక లొక్కక్కటికి నాలుగు పక్కలు, ఒక్కొాక (పక్కకు ఆరు 
నారును, నాల్గు నాల్గును, మూడు మూడును, ఒకటొకటి యనగా జతలు ఎనిమి 
దింటికి బొట్లు ఇరువది యొనిమిదియై యుండును. ఆ పాచికలు రెంటిని 
తూనింది వేయునప్పుడు వాని పొర్లి క భేదముచేత ౧౨, ౧౦, ౯, ౮,౭ ౬, 
౫, ౪, ౨ గా పందెములు తొమ్మిది పడును, కాన ఆ పందెములు తొమ్మి దియు 
“అ త్రీవంచి తిగ' అను పద్యములో చెప్పబడియున్నవి. 


“అ త్రీవంచ” పద్యములోని పదాల కర్గమిట్లు చెప్పవలెను. అ త్రీవంచ. 
ఆతీవంచ, తీవంచ-నాలుగు, తిగ-మూడు, దుగ-రెండు, సత్తా-ఏడు, తచ్చాక- 
ఎనిమిది వంచి-ఒకటి (తచ్చాకవంచి-ఎనిమిది న్నాకటి-తొమ్మిది అని 
యర్గమేమో) చౌవంచ-ఆయిదు, ఈరైదు-పది, ఇత్తిగ-ఆరు, ఇద్దుగ-నాలుగు, 
బ|దలు=పన్నెండు. 

ఇక ఈ యాట నిప్ప డెట్లాడుచున్నారో తెలుసుకౌందము. 


ఆట యాడువా రిద్దరుకాని నలుగురుకాని యుండవచ్చును. పందెము 
వేయు పాచికలను సారెలు ఆందురు. అవి దంతమువి కాని, కలివి కాని, 
లోహములవి కాని యెయుండు. నాలుగు మూలలు కల రెండు సమానమగు 
పొాచికలుండును. ఒక్కాక్క-సారెకు నాలుగు ముఖాల పై ఈ (కంది విధముగా 
చుక్కాలుండును 


© 
© © © 
© 
© © 
© © © 
| © © © 


పె పేజీలో కనబరచిన పరిణామములో పాచికలుండను. ఒకొక) 
పాచికయొక్క- నాలుగు భాగాలలో ౧, ౩, ౬, ౪ ఈ వరుసగా చుక్క. 
లుండును. ఇట్టి రెండు పాచికలను అరచెతిమీదుగా లొడిపి నేలపై వేయుదురు. 
పైకి పడిన భాగాల చుక్కల లెక్కి౦చి వాటి సంఖ్యను బట్టి కాయలను ఇండ్లలో 
నడుష్పదురు. పచ్చీసు అయిదు గవ్వలు వెలకిలబడిన పద్బీసనియు, ౬ పడిన 


60 ఆం[ధుల సాంఘిక చరిత 


తీస్‌ అనియు, అందురు, అనగా ౨౫, ౩౦ ఇండ్లు కాయలను జరుపుదురు. కాని 
పాచికల అటలో ఎన్ని చుక్కలుపడిన అన్ని యిండ్ల జరుపుదురు. కాయలను 
జంటగా నడుపవచ్చును. అప్పుడు (పతిపక్షి జంటకాయలే వచ్చి వాటిని 
చంపును, తక్కిన దంతయు ఇంచుమించు పచ్చీసువరె యుండును, పాచికల 
ఆట యిండ్లు ఇట్టుండును. 


ఖు మ! 

(పతి వారును (౮) కాయలు పెట్టుకొని యాడుదురు. తన యింటిని 
ముందునుండి చావకుండా చుట్టు తిరిగి తన యదుట మధ్యయింటినుండి 
మధ్యకు కాయలను నడపుట పండు అగుట యందురు, ఒక్కొకరి కాయల 
కొకరంగు గుర్తు పట్టుటకై' వేసియుందురు. 

అయితే యొక , విశేషమును గమనింపవలెను. నాచన సోమన వర్ణించిన 
ఆట తెనుగువారి యాటయె యుండును. కర్ణాటకు లది కూడా అదే యాటయె 
యుండును. ఇప్పటికిని మనవా రాడు ఈ యాట ఇంచు మించు సోమన 


వర్తించినట్టిదె యున్నది. తమిపలలో దీనిని పోలినయాట యొకటి గలదు. 
దానిని *కరలు” అందురు. అందు మూడు ఇిత్తడిసారె లుండును, ఒకదాని పై 


కాకరీయుల యుగము 81 


ఒకచుక్కు, ఒకదానిపై రెండు, మూశవదానిపె మూడుచుక్కు లుండును. ఇద్ద 
రాడుదురు, తలా ౬ కాయ లుండును, 


9 © ల టి ఇ © 
తాయ న్‌ 


ఖం సల 
4 


10.... O0....02 

ఒకరు కుడినుండి ఇంకొకరు ఎడమనుండి కాయలు నడుపుదురు. 

మహాభారత యుద్ధకాలమునను, వెదకాలమునను ఆడిన పాచికలయాట 
దీనికి వ్రిన్నించినట్టిది, వేదమందును, పురాణములందును. ఈ యాటను 
అక్షఖేలన మనిరి, పొచికలపై చుక్కలు కన్నులవలె నుండుటచే అక్షలని వాటికి 
పేరువచ్చెను. ఏఖీతకము (తాం[డ) చెట్టుయొక్క_ కళ్రితో పాచికలు చేసెడి 
వారు' వేదములో కవష ఐలూష ఆను శూదదర్షి తన కాలమందలి జనులలో 
ఎక్కువగా వ్యాపించిన యీదుర్వ్యుసనముము ఖండించినాడు. (చూడుడు 
బుగ్యదము, మం, ౧౦, సూ 8౪), పూర్యకొలపు సారెలపై నాలుగు దిక్కులలో 
ఒక దిక్కు ఒక్క. చుక్క, రెండవ దిక్కు రెండు, మూడవ దిక్కు మూడు, 
నాల్గవదిక్కు నాల్లు చుక్క లుండెడివి, ఓక చుక్కకలి, రెంటికి ద్వాపర, 
మూటికి |తేత, నాల్గింటికి కృత ఆను యుగనామ సంకేతము లుంచిరి. |పాచీనము 
నుండి నేటి వరకు జనుల వినోదఖేలనములలో సంఖ్యలకు మారు పేరులు పెట్టుట 


G5 ఆంధుల సాంఘిక చర్యతో 


గమనింవదగినది. పాచికలు వేయువాడు పాచికలు లొడివి నేలపై వేసినప్పుడు 
కృత (నాలుగు చుక్కల భాగము) పెకిపడిన వాడు తక్కిన మూడిండ్ల పై 


పెట్టిన పందెములను పూర్తిగా తీసుకొనెడివాడు, భాందోగ్యోపనిషత్తులో 
నిట్లు |వాసినారు. 
0 
యథాకృతాయ విజితాధరే యాః 
సం యంతే;వ మేనం సర్వం తదభిసమెతి 
యత్కించ |పజాః సాధు కుర్వంతి 
య స్తద్వేదయత్‌ సవేద సమయై తదుక్త ఇతి, 
ఆ ఛాటైద, ప జ Cie 


పాచికలాడువానికి కృత అను దిక్కు.పడిన తకి_నభాగముల పందె 
లన్నియు వాడే గెలిచినట్లుగా, _పజలు తాము సేయు సాధుకార్యములవల్ల మంచి 
ఫలము లన్నింటిని ఆనుభవింతురు అని ఎ మం(తభావము, ఇట్లి యుదాహరణ 
మునే ఆదే యుపనిషత్తున మరొకమారు (౪,౩,౮, లో) చేసినారు, 
మహాభారత కథయంతయు ఈ యక్షఖేలనముకపై నడచినది. పాండవ 
కౌరవు లీ కలికృతాదినామములుకల అక్షములతోనే యాడిరని భారతమువలన 
తెలియగలదు. విరాటపర్వమున ఉత్తర గోగహణమున అర్జును స్తుతించిన 
దోణుని దుర్యోధనుడు దూషింపగా అళ్వత్తామ ఇట్లనెను. 
కుటిల బుద్భు లిచట గొనవునెట్టన ఘన 
దోర్చులంబు మెరసితొడర వలయు 
నతడు గాండీవమున నడ్డఫౌళులు వైవ 
డరుల నంపవాన గురియుగాని, 


తెనుగులో స్పష్షముగా లేదుగాని సంస్కృత మూలమున నిట్లు [వాస్‌ 
అ mG ఓ 
నారు, 
“*నాక్షాన్‌ శ్షీపతి గాండీవం నక్ళతం ద్యాపరం నచ 
జ్వలతో నిశితాన్‌ బాణాం సీీవ్లాన్‌ క్షిపతి గాండివం 
అర్జునుడు గాండీవముతో కృతము. ద్యాపరము అని చుక్కల లెక్క 
సెట్టుచూ జూదమాడడు. (ప్రాణాలుకీసే బాణాలు వేసినప్పుడు అత డెట్టివాడో 


99 


కాకతీయుల యుగము 68 


మీకు తెలియరాగలడు. అని వర్ణించునప్పుడు కృత, ద్వాపరపదాలను [పయో 
గించుటచే ఈయాటనే పాండవు లాడిరనుట స్పష్టము. ఇప్పుడీయాటను తెనుగు 
చారు నక్క మష్ట (నక్కముష్టి, లకి ముష్షి) అను పేరుతో ఆడుతున్నారు. ఈ 
' బట యు బల 
క లిద్వాపరాది ఖేఎనవిధాన మొక్క, భారతదేశమందేకాక ఏసియా, యూరోపు 
ఖండములలోని బహుదేళాలలో అతిపాచిశకాలమం దాడినట్లు మనకు నిడర్శన 
ములు దొరికినవి. పూర్వము |గీను, ఈజిప్పు దేశాలలో ఈయాట విరివిగా 
నుండెను. పాచీనపు ఈ జిప్పు జనులు న se పాదికలనుగూడ పూడ్చు 
తుండిరి (పరలోకములో ఆ 'జీవు లాడుకొందురని అట్టు చేసెడివారు). |క్రీ. పూ. 
౧౨౦౦ (పాంతమందు |టాయియుద్రము ౧౦ ఏండ్లు సాగినప్పుడు ముటడి వేసిన 
థి గం ఖ 

గీకు సెనికులు (పొద్దుపోక కై యీ పాచికల నాడిరి. 


తెనుగు వాబ్మ యములో నాచనసోమశ తర్వాత యిద్దరు ముగురు కవులు 
సోమన వర్టించిన విధముగనే వర్సించిన డీసందర్భమంద సూచించుట బాగుం 
డును. విలంగళి సూరన క భాపూర్జోదయమందు (3౩-౧౩౧) “తచ్చాక, చౌవంచ, 
యితత్తిగ, బారా డుగగయని పాదికలాడినట్లు వర్షించెను. . 


సంకుసాల రుదకవి తన నిరంకుళో పాఖ్యానములో (౨.౨౨) “బారా, 
పది, డచ్చి, యిత్తుగ, దుగో యని పాచికలాడినది వర్థించెను. దాని మరి 
కొన్ని వివరా లిట్టు తెలిపెను. (3౩-౨౦) 


“ధృతిపెంపొందగ సారసారెపయి సొదెంజూచుచున్‌ సారవో 
వుతరింబోవుచు జోడుగట్టు తరి రివ్వుల్‌ మీర జోడించుచున్‌ 
జత, బారా, పది, దచ్చి యిత్తుగ, దుగా చౌవంచ, తివంచ, 
బొంకితినాన రకి యంచు నాడెను భయాంగీకార మేపారగన్‌. 


నాచన సోముని కాలమునుండి మనకాలమువర కీపాచికల ఆట ఈ విధ 
ముగా వచ్చియున్నది.! _ విష్ణమాయానాటకము (మదాసు యూనివర్సిటీ 

1 పాచికలయాట ఇప్పటికిని వెదిక _బాహ్మాణులలో కలదని విని కర్నూ 
లులో నొకనాడు నాలుగుగంటలవరకు కొన్నియిండ్లలో విచారించితిని. అందరు 
నాయాట నాడుదుమనిరి. కాని చూపరై రి. తుదకు అలంపూరులో (బహ్మ శ్రీ 
గడియారం రామకృష్ణళర్మచే ఆడించి కనుగొంటిని, నేను [శమచేసి వారియాట 
చూచినందుకు [ప్రతిఫలము వారి పాచికలను తెచ్చుకొనుటయె ! 


ర్రక్సీ ఆం|ధుల సాంఘిక చరిత 


[పచరణములో లకీ విమ్షలు నెత్తమాడినట్లు తత్క వి మూడుపద్యాలలో వర్పించి 
అ టీ య అ 
నాడు. 


ఈనాడు పిచ్చుకుంట్టవారు పగటివేషాలు వేయుచుందురు. హిందూస్థాన 
ములో దినిని “*బహురూవులు” అంనరు. ఈ వేషాల వినోదము కాకతీయుల 
_కాలమందుండెను.! 


పిల్లలాటలుకూడ విశేషముగా నుండెను. వయను కోడెగాండు వికిలి 
పిట్టల పోట్లాటలతో వినోదించిరి. బొటన (వేళ్ళపై పీకిలి పిట్టలను తీసుకొని 
పోవుట వారికి పరిపాటి.2 


పల్నాటివీరుడగు బాలచం|దుడు పెక్కాటల నాడెను, 


“గుమ్మడికాయలు కొంత సేపాడి”” 
““నెరుకులపందెంబు చెలొప్ప గెలిచి” 
"పోకలాటలచేత బుచ్చు ము(పొద్దు” 

“6 అడుడి ముత్యంబు లమరు బంతులును” 
“గుంతమాపల నాడి కొని గెల్చికొనుము” 
''కుటిలజంతుల దెచ్చి గుడిలోన నుంచి 
““విడిపించి పోరాడు విధమును జూడు” 
“రూకలకుప్పలు రూఢిగ నాడుం "ల 


గుంతమాపలన ఒకపలకలో కొన్నిగుంతలుచేసి అందు చింతగింజులు 
పోని ఆడు ఆటయె యుండును, ఈపదము నిఘంటులలో లేదు. బంతులు అన 
కాలిబంతి (పుట్ట చెండు) ఆటయై యుండును. జంతువుల పోట్లాట లన పొ ట్రేండ్ల 
పోరితము, కోళ్ళపండెము, పికిలిపిట్టల కలహము, దున్నల యుద్ధము అయి 
యుండును. తకి,.నయాట లెట్టివో తెలియదు. క చ్చకాయలను తితులలో నుంచు 
కొని వాటితో ఆడుచుండిరి.! 


ర్‌ 


“దై వంబనగ లేదు తా బహురూపు'' బసవపురాణము పు ౨౦. 
“కరములపైని వీకిలిపిట్టలు నుండ” పల్నాటివీరచరిత పు ౨౮. 
పల్నాటి. పు, ౭౮. 

పల్నాటి వీరచరి[త పు, ౪౫ 


త 609 ౧3 


కాకతీయుల యుగము 65 


బొంగరాల ఆట పిలల ఆటలలో చాల ముఖ్యమైనదిగా నుండెను. బాల 
చం|దుని బొంగరాల ఆటను చా విరివిగా వర్గించినారు. పన్నార్లు అనునవి 
బాలిక లాడుకొను గురుగులు అని శబ్బరత్నాకరమందు (వాసినారు. అదెబ్టి 
యాటనో తెలియదు. “వన్నార్హమాటుని” అని పాల్కురికి వాసెను.! 


కోడిపందెము హిందువుల ఆటలలో ముఖ్యమైనది. ఆది చాల పాచీక' 
మైనది. పల్నాటియుద్ధమునకు “కోడిపోరు” ఒక ముఖ్యకారణ మన్నారుకదా ! 
నాయకురాలికోళ్ళు బహ్మనాయునికోళ్ళను గెలుచుట, పందెములో నోడిన |[బహ్మ ' 
నాయుడు రాజ్యమువదలి ఏడేండ్లు పరదేశ మందుండుట, అటు పై పల్నాటి 
యుద్ధము జరుగుట స్నుపసిద్ధమగు చర్మితయే. 


“కృక వాకు సా[మచూడః 
కుక్కు ట శ్చర జణాయుధ 8” 


ఆని అమరుడు |వాసెను కాళ్ళతో తన్ను కొని యుద్ధము చేయునవికాన 
చరణాయుధులని వాటికీ పేరు పెటైను. మనపూర్వికులు వాటి కుడికాళ్ళకు 
జేనెడు కత్తులను గట్టి యుద్ధముచెయినూ యుండిరి. ఆ విధానము అవిచ్చిన్న 
ముగా మన కాలమువరకును పట్ట కొని వచ్చినవి. కోడివందెమునకై యొక్క. 
శాస్త్రమే మనతెనుగువారు (వాసి పెట్టకొన్నారు. చలికాలములోను, సంకాంతి 
పండుగ కాలములోను కోళ్ళపందెములకై కోళ్ళను చంకబెట్టుకొని కుక్కుట 
శాస్త్రమును గుండురుమాళ్ళలో దోపి తమ ళాస్త్రపకారముగా కుక్కు టసజీవ 
ద్యూతనఫుణులు పందిము కట్టుతూ యుండెడివారు. ముప్పై యేండ్లనుండి కోడి 
పందెము ని షేధింపబడినందున ఆ కాస్తాాలు మూలబడి మాయమవుతున్నవి. 


దండికవి ;కీ॥ శ॥ ౭౫౦ [పాంతమువడు, అతడుతన దశకుమార 
చరి,తములో కోడిపందెమును వర్ణించినాడు. అందు నారికేళజాతి ఒక జాతికోడిని 
గెలిచెనని వాసెను. అభినవదండియగు కేతన తెనుగులో దశకుమార చరిత 
మును (వాసినప్పుడు కోడిపందెమును బాలా విస్తరించి వాయుటచేతను తెనుగు 
దేశమం దా పందె మెంత |పాముఖ్యము పొండియుండెనో యూహింప 
వచ్చును. 


1 పండితారాధ్యచరి త, మొదటిభాగము. పుట ౧౩౦. 
(9) 


66 ఆం|ధుల సాంఘిక చరిత 


“ఎడిరికోడి మున్నెనసి యారెడు మెడ 
నెసగాడ నురువడి (వేసి |వేసి........” 
“గెలిచె నామాట దగ నారికేళజాతి''! 


[క్రీడాభిరామములో కోళ్ళయుద్ధమును చాలావిపులముగా, హాస్యజనక 
ముగా, మనోరంజకముగా కవి వర్ణించినాడు. దాని నుదాహరించుట విపుల 
హేతువగునని సూచనమ్మాతముతో తృ వ్రిపడనై నది. 


జనుల వినోదాలలో గంగి రెద్దుల దొకటియై యుండెను.£ ఇవి కాకతీయుల 
కాలమందలి నున పూర్వికుల కతిపయవినోద విశేషములు. 


AY అలంకరణములు 


పూర్ణము తెనుగు స్త్రీల కేమి సౌందర్య మనిపిందెనో యేమో! ముంగర, 
ముక్కర, నెత్తిబిళ్ళలు, దండక డెముల్కు వంకీలు మున్నగునవి యెక్కువగా 
ధరిస్తూ వుండిరి. జోమాలదండను వేసుకొనుచుండిరి.® ఇప్పుడు స్రీలు (యువ 
కులుకూడా) మైపూతలకై చాలా వ్యయము చేస్తున్నారు. స్నో, పౌడర్‌, 
నూనెలు, గోరురంగులు, వాటి యంగాంగములగు అద్దము, దువ్వెన, (బష్టు, 
మొదలయినవి వాడుదురు. ఆ కాలపు స్రీలకు పసుపే ప్రధానము. అది మెరుగు 
నిచ్చి వెం|డుక లను పోగొట్టి క్రిమి సంహారియై పని యిచ్చెడిది. ఆనాటి స్రీలు 
గోళ్ళకు గోరంట ఆకు దంచి కట్టి రంగు వేసుకొనుచుండిరి. 


వారు పెదవులకు యావకరసాన్ని (లక్కరంగును) పూసుకొనుదుండిరి. 


“దరహాసరుచివరాధరకాంతి మాన్సునన్‌ 
వడవున కెమ్మోవి వన్ను పూని" 
(నన్నెచోడ-కుమారసంభవం) 
I దశకుమారచరి త. 
సీ “గంగి రెద్దులవాడు కావర మణచి 
ముకుదాడు పొడిచిన పోతెద్దులట్టు'” పల్నాటి, పు, ౨౦. 
8 పండితారాధ్య, భాగం ౧౩౯. 
“దోర్పంట యెరలయిన వాలారు నఘంకురములు"” అని కీడాభిరామ 
మందును వర్ణితము' 


కాకతీయుల యుగము 67 


కాళ్ళకును లక, రంగు పూసుకొనుచుంకిరి. కన్నులకు కాటుక ను పెట్టు 
కొనుచుండిరి. కాళ్ళకు “పారాణి” పూసుకొనుచుండిరి. 


దండీ సంస్కృతములో స్ర్రేల సొమ్ము లలో “ముణినూప్పుర మేఖలా 

కంకణ కటక తాఓంకహారి” అని మ్యాతమే వర్ణించెను. కేతన వర్ణనలో 
హెచ్చుగా భూషణములను పేర్కొనుటచే నవి తెలుగుసీమలోని సీమంతినుల 
సొమ్ములని భావింపవచ్చును. ఆత డిట్లు వర్ణించెను. 

“మట్టియ లుజ్బుల మణినూపురంబులు 

మొలనూలు వస్ర్రముల్‌ ము తియములు 

కన్నవడంబులు గట్టినూళ్ళును సుద్ద 

సరికీగె మినుకులు సందిదండ 

అం చళలీయనులు హారకంకణములు 

చేకట్టుపాలెలు చెన్ను మెబుగు 

టాకులు సరిపెణలాల క్రకము పూత 

కాటుల తిలకంబు కమ్మ పువ్వు 

లాదిగాగల మేలి (దవ్యముల నొప్ప 

పసదనము చేసి యుచితరూపంబు దాల్చి 

చాలచం[దిక బోటినై పజ కరి? 

దారువర్ముని లోగిలి దరియజొచ్చి” 


ఈ పద్యములో న్రీల మైపూతను జభరణములు కొంతవరకు బోధ 
కాగలవు. “నిలువుటద్దములు"” పల్నాటి యుద్దకాలమందేయుండెను.! ఓరుగంటి 
స్రీలు తాటంక ములు, ముత్యాల కమ్మలు, కాంనీకూప్రర కంకణములు, [తీసర 
ములు, మొరవంక కడియములు మున్నగునవి ధరిందిరి. 

(క్రీడాభిరామము) 


వ. వివిధములు 


'““శాయెతులు” రక్షగా కట్టుకొనుట ఆనాటి కే యాచార మై పోయెను. 


1 “నిలువు టద్దంబులు నిలిపిర” దిళల---పల్నాటి పు. ౧౬. 


68 ఆం[ధుల సాంఘీక చరిత 


“మేనికి రక్షకై మించు తాయెతులు 
దండ చేతుల రెంట ధారణచేసి”! 


అనుటచే చేతులకుమాత్రమే కట్టుకొని రనరాదు. మొల[తాటిలో, మెడలో 
కూడా కట్టకొనుచుండిరి ఆయితే కీ. శం ౧౧౭౨ లో పల్నాటివీరుల యుద్ధ 
కాలములో అవి యుండినో లేక శ్రీనాథుడు ద్విపదగా నా కథను [వాసిన నా 
డుండెనో చెప్పజాలము. ఎటులయినను కాకతీయుల కాలమం దవి యుండె నన 
వచ్చును. తాయెతు అను శబ్ధముపై అప్పకవి పెద్ద చర్చచేసి తాయి (తల్లి) 
శిశువునకు కట్టు “ఎతు' రక్ష యన్నాడు, తల్టులు పిల్లలకు మా(తమే కట్టిరా? 
తమకే అవసరమయిన తమ తల్లులచేతనో కృతకమాతలచేతనో కట్టించు 
కొనిరా* వృద్ధులు, యువకులు, తమంతకు తామే మాం్మత్రికులతో రక లిప్పించు. 
కొని తాయెతులను కట్టుకొనకుండిరా? ఎతు అంటే రక్షణ అనుదానికి పయోగ 
మేదీ! తాయెతు అని వాయక తాయతు అని ముద్దరాజు రామన యెట్లు |వాసె 
అది తప్పు అని యతని పె గంతుకొనినాడు. ఈ పదము తెనుగు పవమే కాదని 
నా భావము. 


ఇది తావీజ్‌ అను అరబ్బీపదమై యుండును. ఖున్‌ మంతాలను 
(వాసి రక్షగా తురకలు కట్వకొందుకు, దానినే మనవారు స్వీకరించినట్లున్న ది. 
అ మో 


వీరకార్యములను చేయుటకు యుద్ధమునకు బోవుటకు వీరులు 'పీల్ర 
తాంబూలములి తీసుకొనుచుండిరి £ దీనినే హిందిలో వీడా యెత్తుట యందురు 
(బీడా=విడెము.) వాపులకు మందు లెట్టివో కనుడు, వాయుతై లాలు, వావిల 
చివుళ్ళు, ఉమ్మెత్త, ఆముదపు చివుళ్ళు, జిల్లెడాకులు, వీటితో కాచుట మున్నగు 
నవి చేయుచుండిరి. 


ఆ కాలమందు వెట్టి యుండెను. ఆది చాలా [పాచీన మయినది. సంస్కృ 
తములోని వేష్టి పదమే వెట్టి, చాణక్యుని అర్జశాస్త్రమునందు వెట్టి చర్చ కలదు. 

1 పల్నాటి. పు. ౧౭. 

2 బసవ పురాణము పు ౨౪౧. 


లి eee 9996 రర 


కాకతీయుల యుగము 89 


“వెట్టి కేగెడుతట్ట బట్టి యెత్తుడు” 


లు లబ 
అని పాలు ,రికి వరించినాడు!. 
(=) 
* దేవతల వెట్లికి బట్టినవాడు” 
అని నాచన సోమన యనెను. 


శూ దజనులు విశేషముగా చల్లడములు (చల్లాడము, చిల్లడము) కట్టు 
చుండిరి.* ఒడిసెలను పిట్టలుకాయుటకు, యుద్ధములో వాడుటకును ఉపయోగిం 
చిరి * [గాసగాండ్రకు జొన్నల జీతమిచ్చిరి. ఇప్పటికిని ఆ యాచారము కలదు. 
“జొన్నలు గొన్న బుణంబు నీగడున్‌ ” అని నన్నెచోడుడు (వాసెను.్‌ జనులు 
అప్పుడప్పుడు పొరాణీకులవలన భాగవత భారతకథలను వినుచుండిరి+ 


“విబుధ విపుల బిల్వగ బంచి 
వినుము భాగవతంబు విజ్ఞాన మొదవ 
భారతరణకథ పాటించి వికుము.ో 


అని బాలచందు?కి తల్లి చెప్పెను. ఆ కాలమున [బాహ్మణులే పొరాణి 
కులై యుండిరేమో! అయితే (క్రీ, శ, ౧౧౭౨ వరకు భారతములో మొదటి 
మూడుపర్వాలే తెనుగై యుండెను. భాగవతము తెనుగు కాలేదు. కావున తేలిన 
దేమన, [పజలు సంస్కృత భారత భాగవత పురాణాలను విని అర్థముచెప్పించు 
కొంటూ వుండి. 


వట్టము, వడ్డి అను అప్పులవ్యాపారము సాగుచుండెను. “వట్టము 
లంచ ముంకువయు, వైద్యము, వేశ్యయు, బూటకూరియున్‌, చేపట్టుననబ్బు"” క 


1. బసవ పురాణము ౮౩. పండితారాధ్య ౧ భాగం, పు ౫-౨౧. 

2, ఉతర హరివంశము. ఆ ౫ ప ౮౯. 

లీ. పండితారాధ్య చరిత, పుట ౯౭. 

4. నాచన సోముని ఉతర హరివంశము, ఆ 8, ప ౧౦౩, ఓడి సెల 
అనుట గమనించునది. 

5. కుమారసంభవము, ఆ ౧౧. 

6. భదపాలుని సీతిశా స్ర్రముకావీ ప ౧౪౦ 
భదభూపాలుడు కీ, శ. ౧౦౫౦ కి పూర్వుడు = మానవల్లి 


(£3; ఆం|ధుల సాంఘిక చరొత 


పూటకూలి ముచ్చటయందే వచ్చినది, పూటకూలి ౧౦౦౦ ఏండ్లేనుండి 
యున్న ఖే, మన పాచీనులు అన్నము నమ్ముట నీచమనిరి. కావున ఇది 
ఆం(ధములో ఈ తరఠంర ఏ:డ్లలోనే పబలియుండును., నగరాలుండుచోట 
పూఓకూళ్లు తప్పక ఏర్పడును. ఆంధనగరమున బరగిన ఓరుగల్లు ఒక మహా 
నగరమై యుండినందున పూటకూళ్ళుకూడా ఆందు నెలకొనెను, దాసిని |క్రీడాభి 
థామకర్త యిట్లు వర్తించెను. 


“ సంధివ్మిగహయానాది సంఘటనల 
బంధకిజారులకు రాయబారి యగుచు 
పట్టణంబున నిత్యంబు పగలు రేలు 


పూటటాటింట వర్తించు పుష్పశరుడు" 
ఓక్కరూక యిచ్చిన యేమేమి లఖిస్తుండెనో యిటు తెలివినాడు. 
జాతే 


“కప్పురభోగి వంటకము 
కమ్మని గోయుమవిండి వంటయున్‌ 
గుప్పెడు పంచదార యును 
(కొత్తగ కాచిన యాలనే, పెసర్‌ 
పప్పును, గొమ్మునల్లనటి 
పండ్లును, నాలుగునైదు నంజులున్‌ 
లప్పలతోడ [కొంబెరుగు 
లత్మణవజ్జ్ఞ లయింట రూకకున్‌.” 


ఇంకేమి కావలెను? ఇది ఉత్తమాహారము (Balanced diet), కప్పుర 
భోగి అనునవి సన్నబియ్యపుజాతి. ఈనాడు మహారాజు భోగాలు ఆన్న ల్లెవి. 


[పతాపరుదుని యుంపుడుకత్తె చరితను “ఆడుదురు నాటకంబుగ 


నవనిలోన” అన్నాడు క్రీండాభిరామక ర్త, పొల్కురికి కూడా “పటు నాట 
కంబుల నటియించువారు" అనెను. 


ఆ నాటకా లెట్టివి ? 


గీర్వాణ నాటక పద్ధతి వేమా కావు, మరీ అవి యక్షగానముల్లై 
, యుండును, 


కాకతీయుల యుగము 7/7 
ఈ సూచనలు వాటి ,పావీనతను తెలుపును, 


సుంకము తీసుకొను అధికారులను నుంకరులు అనుచుండిరి. సుంకమును 
సంస్కృతమున కుల్క మందురు. వాటిని తీసుకొనుటకు ఘట్టములు (నాకాలు) 
ఏర్పాటు చేసియుండిరి. “ఘట్టకుడి _పభాతన్యాయము అని గీర్వాణ మంనందురు. 
శుకడు మునిమా పే బండిసరకుతో బయలుదేరి ఆర్హబాటల బడి నుంకముఘాటును 
తప్పించుకొనదలచి చీకటిలో బాటతప్పి తిరిగితిరిగి భల్చున తెల్సి వారువరకు 
నేరుగా సుంకమునాకా వద్దనే తేలెనట! నుంకరివారు చాలా దుర్మార్గులని భడ్ర 
భూపాలుడైే అన్నాడు. 


“జూదముకంటె వాదమును 
నుంకరికంటెను పాప పకర్మమున్‌” 


లేదు. అని యన్నాడు.! 


జనులు వళ్చువ ములు (రూక లసంచులను) నడుమున కట్టుకొను చుండిరి, 
అవి కండ్రువడ అల్లిన కజాలె సంచులు, అట్టి జాలే సంచులను పల్లెలలో నేటికిని 


ఓరుగంటినగరమున నాగరికుల కవసరమగు మంచిచెడ్డ సాధనము 
అన్నియు నుండెను. మేదరవాం [ఊఈండిరి. కుటపువా రుండిరి, వారు మోహరి 
చాడలో నుండుటచే (ప త్యేకముగా సెనికుల కే యేర్చాతై యుండిరేమో ! 
అయినను బోగమువారు రవికలను కొలతలిచ్చి అప్పుడప్పుడు కుట్టించుకొను 
చుండిరి. జూదములాడుట సామాన్యదృశ్యము. ఒంటిపై దుప్పట్లుకూడ 
అమ్ముకొని జూదమాడుచుండిరి, 


“పచ్చడం బమ్ము కొన్నాడు పణములకును” 
మేషయుద్ధాలను, కోళ్ల పందెములను ఆడుచుండిరి, పొళ్లేండ్ల యుద్దమును 


చెంకటనాథుడు తన పంచతం[తమందు వర్ణించెను (౧-౨౩౨). "పాములాటను 
చూపించువారుండిరి. గానుగ వృత్తిచే జీవించు గాండ్డవారుండిరి, డక్కి, 


1, నీతిళా స్త్ర యుకావళి, పద్యం ౧౫౧ 


12 ఆం! ధుల సాంమిక చరిత 


జవనిక మున్నగు వాద్యములతో సోదెలు, సుద్దులు, కతలు చెప్పెడువారుండిరిం 
చలికాలమందు ధనికులు “కాలాగుద్వాను లేపనషులతో, దట్టు, పున్లు మృగ 
నాభీతో, కనూరితో” చలి బాపుకొనుచుండిరి. దుప్పట్లు రెండు మడతలతో 
కప్పుకొనుచుండిరి, (బాహ్మణాదులు “కొత్త మలక వాళ్ళ" కిరు చెప్పుల దొడిగి 
ఉంరించి నడ: నూ యుండిరి, 


వేశ్యల నుంచకొనుట, ఆ ఘనకార్యము |పకటింగుకొనుట-ఆకాలపు 
రాజులు, సామంతులు, అధికారులు వసందుచేసిరి, నాగన్నమంతి “అంగనా 
హృదయ. సరోజ షట్పదము” అట | రాయవేళ్యాభుజంగ వంటి బిరుదులను 
కొందరు వహించిరి. తుండీర (ఆరవ) దేశము నుండి పిశ్ళె యొకడు ఓరుగంటి 
లో బోగముదానితో వివాదపడగా దానిని జారధర్మాసనములో తీర్పుచేసిరి. 
ఓరుగంటి నగరమున “అగణ్య వస్తువాహన కోభితంబైన వే వెళ్యా గృహంబులు 
౧౨,౭౦౦ ఉండెను” అని ఏక్నామనాథుడు, ఇడి ఆత్యంతమగ్య అతిశథ యో క్రి, 
బోగము కన్నెలకు 'కన్నెరికము పెట్టునపుడు అద్దము చూపించి అలంకరించు 
వేడుక చేయుచుండిరి. 


“*ముకుర వీక్షావిధానంబు మొదల లేక 
వెలపడంతికి గారాదు విటుని గవయో 


ఆంధోర్వీశుమోసాలపై గడియారముండెను. ౬౦ గడియల దినమును 
వగలు ౩౦, రా|తి ౩౦ గడియలుగా విభజించి ౧ మొదలు ౩౧ వరకు గడియ 
లను కొట్లుచుండిరి. 


ఆ కొలమందు గడియకాలములో నీటిలో మునుగునట్లుగా నొక చిల్లిగల 
గిన్నెను నీటిపై నుంచి ఆది మునిగిన వెంటనే లెక్క వకారము గంట కొట్టుతూ 
వుండిరి. 


బొమ్మంచు పదమును (కీడాభిరామములో వాడినారు. “లేత బొమ్మంచుం 
గెంజిగురాకు మోవిణిసి ధాత్వర్థం బనుష్టింతునో .” పూర కము యెజ్జని అంచుగల 
తెల్లని చీరలు వాడుకలో నుండెను, ఎల్జిని ఆంచునే బొమ్మంచు అనిరి, లేత 
మైన బోమ్మంచువంటి ఎల్జిని పెదవులు అని రసిక కవి వాడినాడు, 


కాకతీయుల యుగము 78 


శ్రీకాకుళము తిరునాళ్ళలోని వెలనాటి యువకుల, వితంతువుల దుర్వర్త 
నలు కవి యెక్కువగా వర్ణించినాడు. 


ఇట్టి వింకను చర్చించుకొలది పెరుగుచునే యుండును. కాకతీయుల 
కాలపు సాంమీకి చరి[త కాధారములగు ముఖ్య గంథ ములలో ముఖ్యమైనది 
(క్రీడాభిరామము, దీనిని వల్లభరాయలు రచించెనని యున్నను (శ్రీన్లాథుడే... 
రచించినట్లు అడుగడుగునకు శైలి నిరూవిస్తున్నది. 


కాకతీయకాలపు సాంఘిక చరితకు ముఖ్యాధారములగు 


(గంథములు 
౧. (డ్రీడాభిరామము --” వేటూరి పభాకరశాన్రిగారి పచురణము, 
౨. కాక తీయసందిక ఆం ఢేతిహాసన పరిశోధక మండలి, 
రాజమ హందవరము 
3 wt, . పాల్కురికి సోమనాథుడు 
బసవపురాణము ఆంధపతికా (పచురణములు. 
౪' పల్నాటి ఏరచరి[త అక్కి రాజు ఉమాకాంతంగారి ము[దణము. 


౫. తెలంగాణాళాసనములు లక్ష్మణరాయ పరిశోధకమండలి, హై దాబాదు. 
౬. ఉత్తర హరివంశము నాచన సోమన 


౭, |పతాప చరితము ఎకొమనాథ్రుడు 

౮ దళకుమారచరి[త కేతన 

డ్‌ సితిళాస్త్రము కావ? భద భూపాలుడు. 
రా 


(10) 


౮ద్బరాజుల కాలము 


లి వ (పకరణము 


ఒక సా|మాజ్యము పడిపోయిన వెంటనే చిన్న సామంత రాజ్యాలు తలెత్తుట 

భారతీయ చరిత పరిపాటి కాకతీయ సామాజ్యము పడిపోయెను. దాని 
నాశయించుకొని యుండిన సామంతరాజులు సేనానులు స్వతంత రాజ్యముల 
స్థావించిరి. అందు రెడ్డి, ఎలమ రాజుల రాజ్యాలు ముఖ్యమైనవి. అదే సమయ 
మందే విజయనగర రాజ్యము కూడా ఆంకురించెను. 'ఈ మూడింటిలో (రెడ్డి 
రాజ్యమే దాని పతనకాలము వరకు (పొధాన్యము వహం ఎచ్చినందునను, అయ 
రాజ్య పరిస్థితులను తెలుసుకొను ఆధారము లించుమించు లేనివగుట చేతను 
ఈ కాల. కట రెడ్డిరాజుల కాలమనియే పే ఎరిచ్చుట యవసర మైనది, 


రెడ్డి. రాజులు, ఆదంకి, కొండ ఏడు, eps దవరమ్ము కందుకూరు 
వ ననా న 


న wrt te 


+అ అకార has mie శా ఇ” 


శ 
చెనీది, కాజా రావి స్రీ సమ" Fran బిలానుండి ఏ విశాఖపట్టణము జిల్ణావర 
_కుండెను. దక్షిణమున నెల్లూరి జిల్లాను ఆ|కమించుకొని ఉండను. 


కాకతీయ సా[మాజ్య పతనముతో తురకలు తెకుగుదేశ మంతటను 
వ్యాపించుకొని భయభాంతులై న జనుల పె అత్యాచారాలు చేసిరి. దేనళముల 
పడగొట్టి మసీదులుగా మార్చిరి. బలవంతముగా క త్రిచేతబట్టి జనులను తురకల 
నుగా జేయ మొదలిడిరి. దోపిడీలు, హింసలు మొగలు పెట్టిరి. పజలకు పీతి 
పాతులగు నాయకులను, మంథతులను వారి కండ్డయెదుటనే కొల్చి చంపిరి. 
శాంత చిత్తులై నవారు రెచ్చిపోయిరి. 


ముసల్మానులు ఓరుగల్లును ధ్వంసించిన తర్వాత దేశమందు వీభత్సము 
చేసిరి. దానిచే చిల్లర రాజులు, వారి సైన్యము, జనులు, అందరును దద్దరిల్లి 
పోయిరి. తురకను చూస్తే జనులు భయగణ్యలై పారిపోవునంతటి ఫీతాహమును 


రెడ్డిరాజుల కాలము 75 


జనులలో న్యావింపజేసిరి. తురకలు మహాబలాఢ్యులు, ఎదిరింప శక్యము కాని 
వారు అని యసిపించుకొనిరి ఈ భీతి ఇంగ్లీమవారు భారతీయ రంగముమై 
కెక్కు.వరకు సజలలో కానవచ్చెను, వం లే డీ. కం రతం రరర 

iG 50-1400 
wes వేంక కటాధ్వరి తన విశ్వగుణాదర్శములో ఈ విషయాలను 


స'షముణొ సులి ంచినౌడ్తు. 
ణా 


రెడ్డి రాజ్య కాలమందలి మునల్మానుల ప అప్పటి రాజులే 
అ రాడ్లు (వాయించి నా నారు. ముసల్మానులు bao నుండి టీకిసీద్‌ 
వగగు me రూరకార్యములు తెనుగువారీ ప సాధించిరి. అంతలో 
(పోలయ నాయకుడు, కాపయనాయకుడు వారిని తెనుగు దేశమునుండి పూర్తిగా 
తరిమి వేసిరి. |పోలయనాయకుని విలసత్నామ శాసనమందు అప్పటి పరిస్థితుల 
టు పేర్కొనిరి. 


“పాపులైన యవనులు అలాత్కా రముగా వ్యవసాయము చేసినందువలన 
పంట పర్యాయములు లాగుకొనుటచేత దరి|చులు, ధనికులు ఆను భేదము లేక 
రైతు కుటుంబములెల్ల నాశనములై పోయినవి. ఆ మహా విపత్కాలమున 
ధకము భార్య మొదలగు దేసియందును [ప్రజలకు స్వాయ తతాభావము పోయి 
నది, కల్లు తాగవలెను. స్వచ్చంద విహారము చేయవలెను ద్రాహ్మణులనే 
చంపకలెను. ఇది యవనాధముల వృత్తి. ఇక భూమిమీద [పాణిలోకము 
(బదుకుటెట్లు, ఊఈ విధముగా రాక్షసులవంటి తురుష్కులవలన పిడింపబడిన 
తై లింగ దెశము రక్షించు వారెవరును మనస్సునకు గూడ తట్టక కార్చిచ్చు చుట్టు 
కొన్న అడ వవలె సంతపింది పోయినది.” 

( రెడ్డి సంచిక, పుట. ౧౧ 


“మహమ్మదీయులు వచ్చినారను వార్త వినగానే దుర్గాధిపతులు ఆశ్వ 
భటాకులములై న దురములు వడలి భయాసలులై అడవుల పాలగుచుండిరి” 
అనియు ఆకాలపు శాసనములందు (వాసిరి. (రెడ్డిసంచిక, పుట ౧౩) 


అట్టి కల్లోలములో వారికి పోలయ నాయకుడు అను రెడ్డివీరడు నాయ 
కుడుగా లేచివచ్చెను. అతడు చెదరిన సైన్యాలను కూర్చుకొని సామంతరాజుల 
తోడుచేసుకొని, తురకలసైన్యాలనోడించి వారిని తరిమివేసి మరల ఓరుగంటిలో 


తన కుమారుడును, జ ల గ? విర్షస్యోంకిళ్టుడును. నగు. కావయనాయకు 
ry. శ | 


76 ఆం|ధుల సాంఘీక చరిత 


నితో రాజ్యము చేసెను. కాని, తురకల భయము పోగానే మరల తెకుగురాజులు 
పరస్పర కలహములతో వినోదించికొనిరి. వెలమరాజులు రాచకొండ, దేవర 
కొండ కోటలలో తెలంగాణాను పాలించిరి. రెడ్డు తూర్పుతీరమునను, గుంటూరు, 
కర్నూలు. నెల్లూరు జిల్లాలలోను విశేషముగా రాజ్యముచేసిరి. రెడ్డి, వెలమ రాచ 
వారు అను మూడు తెగలకును నిరంతర వైర ముండెను. పైగా కర్ణాట రాజ్య 
మనబరగిన హంపీరాజ్యము రెడ్డిరాజ్యమునకు (పక్క బల్లి మయ్యెను, గుల్చర్గాలో 
బహమనీ సుల్తానుల రాజ్య మేర్చడెను. ఆ సుల్తానులలో ఒకరిద్దరు తప్ప 
తక్కినవా రందరు పాందూద్వేష్మలె ఆతి |కూరముగా వంర్తించిరి ఉత్తరాన 
ఓ(ఢరాజులు సదా దేశదోహము చేయుచు ఆంధరాజ్యమును ఆకమించి పరి 
పాలింప జూదుదుండిరి 

ఇట్లు నల్టిక్కు ల అలముకొనిన దట్టపు చిక్కు.లలో రెడ్డిరాజ్యము చిక్కి 
యుండెను. అట్టిచో నూరేండ్రవర కయినను మొక్క వోక దినదినాభివృద్దిగా 
చతుర్దిశల నొత్తుచుండిన శ|తువులను, తురకలను ఓడించుచు రెడ్లు రాజ్యము 
చేసిరన్న వారిని కీ ర్లించవలసినదే. వారు ఒడ్డెల, వెలమల, కన్నడుల, రాచల, 
తురకల నెదిరించి యుద్ధాలు చేసినదేకాక్క అటు బెంగాలువరకును, ఇటు మధ్య 
పరగణాలలోని బస్తరు వరకును తమ విజయధాటిని సాగించిరి. వారి మంతి 
లింగన గెలిచిన గెలుపు లెట్టి వనగా !- 


“ర్లూడేశ వన స పమాడె బారహదొంతి 

జం;తనాడు కీతిశ్వురుల గెలిచి. 

యొడ్డాది మత్స్యవంశోదయార్జును చేత 

పల్పవాధిపుచెత పలచ మంది 

దండకారణ్యమధ్య పులిందరాజ రం 

భాహివంశజులకు నభయమొసగి 

భానుమత్కుుల వీరభ దాన్ని దేవేం|ద 

గర్వుసంరంభంబు గట్టి పెట్టి 

యవన కర్ణాట కటక భూధవులతో 

చెలిమివాటించి యేలించె తెలుగుభూమి 

తన నిజస్వామి నల్హాడ ధరణినాథు 

భళిరె ; అరియేటి లింగన పభువరుండు." 
(భీమఖండము, ఆ ౧) 


రెడ్డిరాజుల కొలము 77 


“వంతు నాది” ఆను పాఠనునకు “జం(తనాడు” అను పాఠము 
శ్రీ మల్లంపల్లి సోమశేఖరళర్మగారిది. రూడదేశ మిప్పుడు జయపూరు, 
బొబ్బిలి సంస్థానాల భాగమనియు, స్త్రమాడె గంజాము మన్నెదొరల సంస్థానా 
లనియు, బారహదొంతి ఒరిస్సాలోని భాగ మనియు జంతనాడు ఒడ్డాది 
విశాఖపట్నంలోని వనియ్కు రంభ అందే రంప అనియు శ్రీ మ. సో, శర్మ 
గారే తెలిపినారు 1 


రెడ్డిరాజులు పండువా సుల్తాను నోడిందచిరి.® పండువా బెంగాలులో, 
ఇప్పటి మాల్లాజిల్లాక్‌. ఇట్టి సాహసముల (ప్రకటించిన రాజ్యములో మహావీరులు, 
దండనాయకులు, యుద్ధ కౌళశలమం దారితేరిన సేనాధ్యషలు పలువు రుండి రను 
టయు, వారు ఆభిలాంధుల (పళంనలకు స్థానము లైరనియు చెప్పుటలో ఆతిశ 
యో క్రికాని, పత్యీకాభిమానముకాని లేదు. (పోలయనా నాయకుడు, అనవేముడు, 
పెదకోమటి, కాటయ వేయుడు, అనపో 'త రెడ్డి, రింగనమం|తి, బెండపూడి అన్నయ 
మంతి ముఖ్యవీర.లన జెల్లిరి. ఇట్టి రాజ్యకాల మందలి సాంఘిక పరిస్థితులెట్టివో 
తెలిసికొందము, 


మతము 


రాజు లే మత మవలంవించుచుండిరో జనులలో బహుళ సంభ్యాకులు 
కూడా ఆదే మత మవలంబించుచుండిరి. * 'రాజానుమతం ధర్మం” అని జనులు 
విశ ఏసించిరి. ఆం[ధదేశములో కాంతియుల కాలమందు విజృంభించిన వీరళెవ 
మింకను [ప్రబలముగానే యుండెను, (రైడ్డిరాజులు అత్యంత వీర శె శ వాథినివిష్లులె 
యుండిరి. శివక్నే తముల నుద్దరించిరి4 త్రీ¥ లమునకు మెట్టు కట్టించిరి, పతి 
దినము ఆరుమారులు శివపూజలు చేయుచుండిరి, | అనేక యజ్ఞయాగములు చేసిరి. 
(ప్రభువుల ననుసరించి వారి మంతులు, సేనానులు కె వమతమునకు వ్యాప్తి 
నిచ్చిరి$ 

1. History of the Reddy Kingdoms. ప. 137-143, Part, V. 

2. “పండువా సురతాణి పావడం బిచ్చిన” భీమేశ్వర పురాణం, ఆ ౧. 


3, History of Reddy Kingdoms, ౨. 143, Part 1. 
(ఇకముం దీ [గంథమునకు Hist. R.K అను సం కేతమునిత్తును.) 


78 ఆం'ధుల సాంఘిక చరిత 


[రెడ్లు శై వులయినను పరమతస్థుల నే మ్మాతమైనను బాధించినట్టు కాన 
రాదు)కాకతీ యులు చేసిన పొరపాటును వీరు చేయబేదనవచ్చును. రెడ్డిరాజ్యము 
తుదికాలములో, వైష్ణవ మతము దక్షీణ తమిళమునుండి తెనుగు దేశములోని 
కెగువతి కాజొచ్చెను. అయ్యంగార్లు _వవేశమై తిరుదీక్ష నియ్య మొదలు పెట్టిరి. 
ముమ్మడి నాయకుడను రెడ్డిరాజు ౧౩౪౦ నుండి ౧౩౭౦ వరకు కోరుకొండ లో 
రాజ్యము చేసెను. “అతని కాలమున శ్రీరంగ మునుండి పరాశరభటిను వైష్ణవ 
(బాహ్మణ గురువు కోరుకొండకు విచ్చేసి ముమ్మడ నాయకుని శిష్యునిగా జేసి 
కొని వైష్ణవ మతమును గోదావరి మండలమున వ్యాపింపజేసెను”! (త్రుది రెడ్డి 
రాజు లగు కుమర గిర్యాదులు వైష్టవు లయిరి. ఈ విధముగా మతము మార్చు 
కొన్నను ఈ రాజులు ఇతర మతముల కొ తిడి కలుగ జేసినవారు కారు) 


[2 వళ క్రి పేరుతో పజ లనేక దేవతలను కొలిచిరి/ “కోమలార్ధేందు ధరు 
కొమ్మ గోగులమ్మ”; “మహిత గుణముతల్లి శ్రీమండళల్లి' "; 1'నూకాంబ”; 
“ఘట్టాంబిక”; 'మాణికాదేఎ'£ అను శక్తులు [దాకారామములో వెలసియుండెను) 
కాకతీయుల కాలపు దేవత లింకనూ [వబలమై యుండెను. “కలౌ మైలారు 
భె రవాి'ల ఆని మెలారుదేవుడు గీర్వాణసూ క్రి కెక్కి యెక్కు.వగా వ్యాప్త 
డయ్యెను. ఏకవీరాదేవిని గూడా జనులు మజువలేదు. కూ|దజాతులవారు పం 
దేవతాళ కులను గొలిచిరి. 


““రామాకీకిని, మహాకాళికి, చండికి,......... 
నక్కు.జియ్యకు, కాళి, కందికకును, 
వింధ్యవాసిని, కేక వీరకు, మున్నుగా 

నెల్లి వేల్పులకు దీందించి మొక్కి. 
[(తావుచు నెడనెడ తాల్పుగా వండిన 
నంజుటి పొరకలు నంజుకొనుచు 


- 1. చిలుకూరి ఏరభ[దరావుగారి ఆం|ధుల చరితము, ౭ భా. పు ౧౨౪. 


వి, ఫీమేశ్వర పురాణము, ఆ ౧, ప ౯౯-౧౦౨. 
లి, సింవోసనద్వా।తింశిక్క ౧ భా, పు ౮౫. 


రెడ్డి రాజుల కొలము Ty 


[బహ్మ గొనియాడి యిదె సాంక పట్పమనుచు 
పరిణమిందిరి యొండొ_డ తిరుణులెల్ల ''! 
పై పద్యములో బిందించి ఆనునది నిఘంటువులలో లేదు క ల్లుబిందెను 
అమ్మవారి కెక్కించుట (అనగా నై వేద్య మిచ్చుట) అని దీని యర్భ మని అను 
కొందును. సాంకపట్టుట ఆనునదికూడ నిఘంటువులలో లేదు. “నాకపోయుటో 
అని తెలంగాణ ములో నిప్పటికిని అందురు. దేవత ముందట నిండుకుండ నీరు 
పోసి నైవవ్య మర్చించుటకు సాకపోయుట అని యదువు కవి తెలంగాణమువా 
డనుట కిట్టి పదములు మరికొన్ని యీ కొరఎ గోపరాజ కవి వాడినాడు, కాకతి 
యొక మూలళ క్తి యని యీ కవియే యిట్లు తెలిపినాడు 


“ఆకడ నీతిళాస్త్రవిదు 

డై గురుడొని యేగె వేడ్కతో 
కాకిత మూలళ క్రి గని 

గా నానరించిక పెడిచట్టునా 

నేక శిలాభిధానమున 

నెన్నిక కెక్కి ధరితిలోన నే 
పోకల బోనియట్టి సిరి 

పుట్టిన యింటికి నోరుగంటికిన్‌ £ 


ఇందు కాకిత ఆని కవి వాడినాడు. ఏకశిల ఓరుగంటి పేరే యని తెలిపి 
నాడు. ఒంటిమిట్ట కాదని స్పష్టమైనడి. శ్రైవసాం్యపదాయక కథలు పెరిగేకొలది 
స్కాందపురాణము పెరుగుతూ వచ్చెను. స్థలపురాణాలను నిన్న మొన్నటివరకు 
గీర్వాణములో (వాసి ఆది స్కాందపురాణములోని అముకఖండ ములోని దని 
వాసినవారు కలరు. శ్రీనాథుని కాలములో స్కాం౦దపురాణ విగ్తర్హ మిట్టుండెను. 


క, బంధురసపాదలక్ష 
(గంథంబై, యైదుపదులు ఖండంబులతో 


1. సింహాసనద్యాతింశిక, పు ౧౦౩. 
లి, క్‌ ఇటీ ౨ ఖా, పు ౫౦. 


80 ఆం|ధుల సౌంమ్‌క చరిత 


సంధఢిల్లుచు స్కా ందం బన, 
సింధుపునకు కాల్వ లవరివిన చందమునన్‌ 


ఆ సపాదలక్ష[గంథ మీనా డెన్ని లక్షలవరకు పెరిగినదో పరిశోధకుల 
గురుతుకై తెలుపనై నది. మూలగూరమ్మ అనునొక దేవత కొ_డవీటి రెడ్డ 


) 
'కుల దేవత. “ఈమె దేవాలయము గుంటూరుజిల్లా స తెనపల్లి తాలూకాలోని 


అమీనాబాదు [గామషంద్న్నూది” (రెడి సంచిక -పుట వ. 
ఈనాటి మన పండుగు౨కు ఆనాచివాటికి భేదములేదు. కాని వాటి సూచన 
లలో కొద్దిపాటి విశిష్టతను చూపుబకై యుదిహరించును. 


“చలి |పవేశించు నాగులచవిళినాడు 
మెజయు వేసవి రథనప్తమీ దినమున 
ఆద్చసీతు (పవేశించు పెచ్చు పెరిగి 
మార్గశిర పౌషమాసాల మధ్యవేళ 

ఇండ్ల మొదలను నీరెండ నీడికలను 
అనుగుదమ్ముడు నన్నయు నాటలాడు 

ఆ తయును కోడలుసు గుమ్ములాడు కుమ్ము 
గాదు చోటికి మకరసం|కాంతి వేళ,'”2 


తెలంగాణములో గరుడపంచమిని నాగపంచమి ఆని చేయుదురు. కృష్ణాది 
జిల్లాలలో పైన తెలిపినట్లుగా కార్తీక శుద్ధచవితినాడు సేయుదుకు. వైష్ణవులు 
ఏకాదశిని పుణ్యదినముగా చేసుకొని, శె వులు శివరాశిని నిర్ణయించినట్లు కన 
బడును, తెనుగువారిలో దానిని (పచారము చేయుటకై శ్రీనాథునిచేత శివర్యాతి 
మాహాత్మ్యమును వాయింగిరి, కాని ఆ శివర్మాతినాడు ఇప్పటివలెనే జూద 
మాడుచుండిరని శివరాతి మావోత్మ్యములోనే వర్తించినాడు, 


దీపావళిని “'దివ్వెలవండుగ'” యనిరి.8 నేటికిని తెలంగాణమఃలో దీనిని 
“దివిలిపండుగ'” అని యందురు. ఇప్పుడు మనలో (పతి పున్నమ కొక పేరు, 

l; ఫీమేళ్యర పురాణము, ఆ౧ ప ౨౫, 

2. శివరాతి మాహాత్మ్యము, ఆ. ౪ పం ౨౫, ౨౭ 

8, సింహాసనద్వా తింశిక, భొ,. ౨ ష్య, 3౯. 


రెడ్డిరాజుల కొలము 81 


పతి అమాస కొక పేరు కలదు. ఇవి కొకతీయకాలమున నుండియే యేర్పడుతూ 
వచ్చెను. “దవనపున్నమ'' (ఏరువాక), “*నూలిపున్నమ' ((కశావణపూర్ణిమ- 
నూలు=దారము) అను వాటీని పాల్కురికి సోమన తన పండితారాధ్యచరి_తలో 
పేరా, నెను. [వశమ లను న్రీలు విశేషముగా చేయుచుండిరి. అవి యెక్కువగా 
సంతానమును, ఐశ్వర్యమును కోరి చేసినట్టి కామ్యక్కవతములు. 


ఖై రవాది శివభ క్రులను, కాళ్యాది శ క్రిరూపిణులను పశుబలిచే తృ వి 
పరిచెడివారు. అట్టి సూచనలు వాజ్ముయములో పలుదావుల కలవు. కాగి 
శెవమతముళో ళాశ్తే మము, భైరవతం్యతము మున్నగు వామాచారములను 
పురికొలుపు తం|తవాజ్మయము బహుళ మయ్యెను. జనులు వీరశై వులై ఆవేళ 
పూరితులై అందందు ఆత్మ బలిదానము కావించుకొన్న కథలను పాల్కురికి 
సోమనాథుడు తెలిపియేయున్నా డు. శివపూజలలో ఆత్మబలిదానము చేసుకొన్న 
వారిని, లింగాయత మతమునకై తలపండు నిచ్చినవారిని, వీరులుగా పరిగణిం' 
చిరి, వారిన్మరణార్థము “వీరకల్లు"లను ఆందందు స్టాపించిరి. అనేక [గామ 
బహిః పదేళములలో ఛురికతో కడుపుల ఛేడించుకొన్నట్లు, తలఅ కోసికొన్నట్లు' 
తీర్చిన శిలావిగహముు నేటికిని కానవచ్చును. వీరులపూజక్షై “వీరగుడ్డ 
మలోను అభిమానులు కట్టించిరి. 


ఛ్రరూపములతో నుండు గ్రామదేవతలు శివర ద రూపాలతోనుండు 
దేవర్లును, [దావిడ దేవతలే: చనిపోయినవారిలో కొందరు దయ్యాలై, శి 
రూపిణులై_, శివశక్తులైె తమను, బాధించునని జనల విశ్వాస మాదికొాలము 
నుండి నేటివరకు ఆఅవిచ్చిన్నముగా వృద్ధికి వచ్చినట్టది. మన[పాచీనుల కొలమం౦ 
దిట్ట విశ్వాసాలుండినటుల కవులచాటువులందు రచనలందు పలుమారు వెల్లడి 
యైనది. శ్రీనాధుడు తన చాటువులందును పీఠికలందును [పజల యాబార విళ్వా 
సములను తెలిపిన భాగమలు చాలా విలువగలప్పి! పలనాటిలోని దేవర్లనుగూర్చి 
యతడు కొన్నిచాటువులు చెప్పెనందురు, అందొక టి యిట్టిది, 


“వీరులు దివ్యలింగములు, విష్ణుడు, చెన్నుడు, కల్లుపోతరా 
జారయ కాలభై రవుడు, నంకమళక్రియు నన్న పూర్ణ.' 


అని డాక్టర్‌ నేలటూరి వేంకటరమణయ్యగారు (Origin of the South 


Indian Templeలో) ఉదహరించినారు. తక్కినభాగాన్ని ఉదహరింపలేదు. 
(11) 


82 ఆం|ధుల సాంఘిక చరి;తి 


అక్కిరాజు ఉమాకాంతముగారు, పల్నాటి వీరచరిత పీఠికలో దాని నిట్లు 
దహరించినారు. 


“వీరులు దివ్యలింగములు, విష్ణవునాయుడు, కల్రిపోతరా 
జొరయ భే రవుండు, తుహినా ది జయంకమ, నిర్మలాంబునై 
కేరెడు గంగధార మడుగేమణి కన్యక, యన్నిభంగులన్‌ 
గారెమపూడి పట్టణము కాశిసుమీ కనుగొన్నవారికిన్‌ ” 


చనిపోయిన వీరులు లింగములై పూజలందిరి. చెన్నడు (బ్రహ్మ 
నాయుడే | క్రీడాభిరామములో మాచెర్ల చెన్నడు, కల్లు పోతరాజు అనేవాడు 
చచ్చి, కాలభై రవస్థాన మాకమించెను. అంకమ్మ అనే స్రీ అన్నపూర్ణ 
ఆయ్యను. గంగాధరమడుగు మణికర్ణిక యంతటి పవి|తస్థాన మయ్యెను, 


బెజవాడ కనకదుర్గమ్మను గురించి నేలటూరి వేంకటర మణయ్య గారిట్లు 
(S-I-Templeలో) [వాసెను. “ఒక[గామమం దేడ్గురు విప్రసోదరులుండిరి. 
వారికి కనక మ్మయను చెల్లె లుండెను, అమె శీలమును వారు సందేహింపగా 
నామె బావిలోపడి చనిపోయి జనుల బాధించు శక్తికాగా జనులామెకు గుడికట్టి 
పూజింప దొడగిరి”. నెల్లూరిలోని దర్శితాలూకాలోని లింగమ్మ అను బీదరా 
లొక ధనికునింటి సేవకురాలుగా నుండెననియు, ధనికుల సొతు లవహృత 
మగుడు ఆమెపై నిందవోపగా నామె బావిలో పడి చచ్చి దేవరయ్యెననియు 
నెల్లూరు జిల్లాలోని పొదిలమ్మయు, సందేహింపబడి చంపబడిన యొక త్రీశ_క్తిగా 
మారినట్టిదనియు, నూరేండ్ల కిందటగూడ కోటయ్య ఆను లింగబలిజి ఒక గొల్ల 
మగనాలినిగూడి ఆమె భర్తచే వధింపబడి కోటప్పకొండ దేవరగా |పసిద్దు డయ్యె 
ననియు (శ్రీ నేలటూరివారు (వ్రాసినారు. ఈవిధముగా నేటికిని దేవర్లు పుట్టుచూ 
చచ్చుచూ తెనుగుదేశపు జనసామాన్యుల మూర్గతను లోకానికి చాటినవై నవి. 


అరుదుగా నరబలులుకూడా ఇయ్యబడుచుండెను. అట్టి నరబలులు 
. నిర్జన (ప్రదేశములలో నుండు శక్యాలయములలో జరుగుచుండెను. ఒక 
భైరవాలయములో రెండుతలలను రెండు మొండిముల నొక సెల్లి చూచి 


“ చంపుడుగుడి యిది యని యా 
దంపతుల క శేబరములు తలలుం గని తత్‌ 


రెడ్డిరాజుల కాలము 88 


సంపాదిత భయ రౌదా 
కంపీతుడై సెట్టి బెగడి కన్నులు మూసెన్‌. 1 


చంపుడుగుళ్ళు అని నరబలు లిచ్చు దేవాలయములకు పేరుండె నేమో ? 
ఆఓవికులగు గోండు, కోయ మున్నగువారిలో నీ యాచారమెక్కువగా నుండి 
నట్లు కానవచ్చును. వారునరబలి నెట్లు యిచ్చిరో కవియిట్లు వర్ణించినాడు. 


*" ఆనగరంబు దిననుండి దిమ్ము రేగినయట్లు తూగొమ్ములు, పువ్వనం[గో 
వులుసు౯, తప్పెతలును, డక్కులును పెక్కువిధంబులదిక్కులును చెవుడు 
పరువుచు; మోయ, నవ్వాద్యర సంబునకు బాసటయె తమ యార్చులు౯ పెడ 
బొబ్బలును గిరిగ హ్వురంబుల నుపబృహితంబులుగా గంధపుష్పార్చితుండగు 
నొక్కదినుని నడుమ నిడుకొని కురుచ కాసగొరకలు మెరయించుదు బరికెతలల 
కరకుకొండరులు ననుదెంచిరిం” 2 


పెవచనములో తూగోమ్ములన తూ అను ధ్య్వనినిచ్చు కొమ్ములు, పువ్వస 
(గోవు లన పిల్పనగోవివంటి వాద్యములు అని ఆర్థముండు ననుకొందుమ. 
ఈ రెండును శబరణ్నాకరాదులందు లేవు, అధేవిధముగా “కొండరి” శబ్దములేదు. 
కొండరియన కొండలందుండు ఆటవికుడని యర్థము. (సూనరి, జూదరివంటి దీ 
పదము). కిరాతుడు, బోయ అని సూ, రా, ఆం* నిఘంటువు. 


వీర శై వ మతవ్యా ప్రీతో కొన్ని ఘోరాబారములుకూడ తెనుగుదేశములో. 
వ్యాపించెను. శివార్పణముగా అంగములను ఛెదించుకొనుట, తుదకు తమ తలలను 
తామ నరకుకొనుట, ఆత్మహింసలను చేసుకొనుట మేరలేని భక్రిలక్షణమనియు 
అట్టివా రందరును తప్పకుండా కైలాసాన్ని చేరుకొందురనియు, శివసాయుజ 
మందు సచ్చిదానంద మందుందురినింమ బోధించిరి. భక్రలు నమ్మ ఆచరించిరి, 


రెడ్డిరాజులలోని "”అన్నయరెడ్డి ఎ యుద్ధమందో వీరమరణ మందినట్టు 
తోచుచున్నది. ఈతని పుణ్యమునకుగాను (శ్రీశ లమందు మల్లికార్జునస్వామి దేవో ' 
లయములోని నందిమండ పమునకు సమీపమున ఏీరశిరోమండపమనునది (కీ.శ, 
౧౩౭౭లో అన్న వేమునిచే నిర్మింపబడినది. ఈ వీరమంఓపమందు వీరు లనేకులు 


సింహాసన ద్వాతతింశిక, ౧భా, పు ౭౮. 


జో 


1, 
ల్లి సింహాసన ద్యాతింశిక, భా ౨౨ ఇ ౯2౭. 


88 ఆంధుల సాంఘిక చరిత 


మహాసాహసకృత్యముల నొనరించు చుండెడివారు. తలలు, నాలుకలు, గండ 
క_త్తెరచే ఛేదించుకొనుచు భ కుని సాహసమును చూవినారని కాసనమందు వర్ణింప 
బడినది.” (రెడ్డిసంచిక . పుట ౩౦, ౩౧.) ఇట్టివాటినే చంపుడుగుడులు అని 
యందురు, 


శ్రీ₹ లములో భక్తులు సులభముగా చచ్చుటకు మరొక మార్గముండెను. 
అది "కనుమారి.” 


కనుమారి 


కనుమారి పదము శబ్దరత్నాకరములోను, ఆంధ వాచస్పత్యములోనులేదు. 
ఈపదమును (ప్రయోగించిన కవులిద్దరేయని నాకు తెలిసినంతవరకు చెప్పగలను. 
, పాల్కురికి సోమనాథుడును నాచన సోమనయు నీపదమును వాడిరి. ఇటీవలనే 
'_ఈపదచర్చను శ్రీ వేటూరి [పభాకరళాత్రిగారు “తెలుగు మెరుగులు” అను 
పుస్తకములో చేసినది చూచినాను, దానినిబట్టి తిక్కన సోమయాజియు ఈపద 
మును వాడినట్టు తెలిసికొంటిని. 


“ కల్పు |[దావిన పాతకంబది యగ్ని వ 
ర్రముగాగ గాచి పానంబు సేయ 
గనుమారి యురుకంగ ననలంబు జొర మహా 
స్థాన మాచరింపంగ బాయు” (శాంతి, ౧. ౩౦౭) 


|“కనుమారి యనిన భృగుపతనమని యర్థము. శాంతిపర్వ మూలమున 
“నమురుపపాతం (పపతన్‌” అని కలదు అనగా 'నిగ్గల పదెిశ పర్వతా[గాత్‌ 


నాచన సోమన [పమోగ మిట్లున్నది. 
"” పాయదగు మిమ్ము, కినుమారిబడ బొసంగు 
విషము[దావుట యోగ్యంబు, వెల్టిలోన 
మునుగుటుచితము, మీరెల్ల కనుగొనంగ 
ఆత్మవిడుచుట చన్ను నాకు ననుచునడలి ” (౪౫౬) 


రెడ్డి రాజుల కాలము 85 


దీనిపై శ్రీ వేటూరి |పభాకరశళాన్రిగారిట్లు ఆనుబంధించినారు, 
“ర్రీశై లముషై కర్మారిశ్వరము అని యొక పుణ్యస్థలమున్నది. అది కొండకొమ్ము. 
అక్కడనుండి భకృలు పుణ్యలోక ప్రాప్హ్యర్థమై నేలకురికి పాణత్యాగము చేయు 
దురు. (కిందబడ చున్నవాడుు అంతరాళమున నున్నవాడు, ఉరుక నున్నవాడు, 
అన్న క్రమమున ఎడతెగకుండ శివరాతినా డక్కడ భక్తులు ఉరుకుచునే 
యుండెడి వారు 


కి రమర్ధిజేసి యా కర్మారి నురుకు 
ననఘుల భవపరిత్య క్ర మానసుల 
అరిమురి నవలి కర్మారీశ్వరమున 
నురుకు పుణ్యుల జూచి .... 
పడియెడు దేహంబు పడిన దేహంబు 
నడిమి దేహంబు లెన్నంగ బక్కాడు” 


అని పండితారాధ్య చరిత్రమం దున్నటుల శ్రీ వే. ప్ర. కాస్ర్రీగారు 
_వాసినారు. 


పండితారాధ్యచరి త తుదిభాగమందు కిర్మహరి మహిమ అను భాగము 
కలదు. (పుట ౪౭౨, ఆం[ధప్కతికా (పదురణము) అందిట్టున్న ది. 


“ ఇదె చూడు కర్మహరేశ్వరం బనగ ” 


అచ్చట పూర్వము బల్లహుడను రాజు తన భార్యతోకూడ మల్లికార్జునుని 
ధ్యానించుతూ కొండకొననుండి పడి శివైక్య మొందెనని పండితారాధ్యమందు!: 
(వ్రాసినారు. “కర్మారిపదమే తెనుగున కనుమారి యయినది” అని శ్రీ వే. ప. 
శా స్ర్రిగారువాసిరి. తిక్కన, నాచనసోమన, ఉభయులును కనుమారి యనియే ' 
వాడిరి. తెనుగుపదాలను సంస్కృతము చేయిటకూడా పరిపాటిగా నుండెను. 
కనుమారినే కర్మారి, కర్మహరి, కర్మహరేళశ్వరము, అని మార్చిరో యేమో. 
కనుచుండగానే మారికి (చావునకు) బలియగుటను బట్టి కనుమారి పద మేర్పడి 
యుండును. వీరశై వము ముదిరిననాడు, 


గళముల బిహ్యల కర్ణరం(ధముల 
కడుపుల, మెడల, వక్షముల, పుక్కిళ్ళ, 


8 ఆం!ధుల సాంఘిక చర్చిత 


తొడల, రెప్పల , తొడితొడి దీపవితతు 
లలరంగ బెనుదివియలు నార సములు. 


గలయంగ నిరుమెయిగాడ సంధించి (పం, చ, వుట ౪౦౯) భ కని 
[పకటించినవారును, నాలు లుకోసి, చేతులు నరికి, చన్నులుకోసి, త౭లుకోసి, 
తనువుల నర్వించువారును (వం. చ. పుట ౪౦౭) బహుళముగానుండిరి. కావున 
శ్రీ తె లములో ఒక ఆనువయిన శిఖరమును దాని (కింద లోతైన లోయయు 
చూచుకొని అచ్చట భృగుపాతము చెసి [పాణాలిచ్చెడి వారనిన చిత్రము కాదు. 
అది తిక్కన, సోమనల కాలానికే సుపసిద్ధమైన కనుమారి యయ్యెము. 


జనులలో శకునాలపై విళ్వాసము మెండుగా నుండెను ఒక రాజ 
కుమారుడు వేటకు వెళ్ళగా అతని కెదురయిన ఆపశకున పరంపర యెట్టి 
దనగా ; = 


సీ॥ పిల్లులు పోరాడె, బల్లి యూకర |తెళ్ళి, 
తమ్మళి పొడసూపె, తుమ్మి రదర, 
తొరగుపీయిన లేగ కొరలుచు నౌక కురి 
పరతెంచె, [కంపపైె నరచె కాకి, 
ఉలుమ డొక్కడు నూనె తలతోడ నేతెంచె, 
మెల బీరలదాకి (మోల నెదిరె 
కాకియును, గోరువంక యు, రెక్కలపోతు, 
నేటిరింతయు దాటె నెడమదిశకు 
బె టవెరవు దప్ప పాలగుమ్మయు పారె 
ఒంటిపాట పైడికంటి వీచె 
ఎలుగుచేసె పెద్దపులుగు, పామటు తోచె 
దబ్బి బొబ్బలిడియె నుబ్బు లడర.! 


(కురిజపాడియావు, పాలగుమ్మ=పాలపిట్ట, పెద్దపులుగు= పెద్ద వీట్ట, 
గుడ్డగూబ, జెక్కలపోతు, దబ్బి అనునవి నిఘంటువులలో లేవు. ఉలుమడు 
ఆనగా కుష్ణరోగియని సూ. రా. నిఘంటువులో కలదు. (జెక్కలపోతు అన 
బట్టమేక అను పెద్దప & యనియు, దబ్బియన ఒక పకీయనియు ఊహింతును.) 


1 సింహాసనద్వాతింళక్క భా ౧. పు౨౫. 


రెడ్డిరాజుల కాలము 87 


శకుశాలనుగూర్చి [కీడాభిరామమం దిట్లు తడవినారు. 
“చుక్కుయొకింత నిక్కి బలనూదము దిక్కున రాయుచుండుటన్‌ 
జక్కుగ వే“దిప్పుడు నిళాసమయంబిది పస్సుటంబుగా 
ఘుక్కని మాటిమాటికిని గోటడు వల్కెడు వామదిక్కునన్‌ 
జొక్కటమై ఫలించు మన ళోభనకార్యములెల్త్ల టిట్టిభాం 


మాగిలి మాగిలి వృక్షళు 
పూగొమ్ముననుండి షడ్డము [పకాశింపన్‌ 
లేగొదమ నెమలిపల్కె డు. 

గేంగోయని వై ళ్యమనకు గెలుపగు జుమ్మా 
కొనకొనం గోడియే టింత కొంకనక్క 
నమలి యీనాలుగిటి దర్శనంబు లెస్స 
వీని వలతీరు బలుకు నుర్వీజనులకు 
కొంగుబంగారమం|డు శాకునిక వరులు. 


ఈ గేగూళి లగ్నంబు నంబురంబు |పవేశింపవలయు, విశేషించి 
యుషఃకాలంబు సర్వ పయోజనారంథ ములకు? (బళ _సంటుో 


గార సిద్ధాంతమత ముషశకాలకలన 
శకున మూనుట యది బృహస్పతిమతంబు 
విిపజనవాక్య మరయంగ విష్ణుమతము 
సర్వసిద్ధాంత మఖిబిత్తు సమ్మతమగు.” + 
ఇట్టి పద్యమే [కీడాఫిరామమందును గలదు. 


“ వ్యాసమతము మనః (పసాడాతిశయము” 
అనుటకు మారుగా శ్రీనాథుడు తన భీమఖండమం దిట్లు వేరుగా వాసెను, 


“సర్వసిద్ధాంత మభిజితు సమ్మతమగు'' 
(తక్కిన మూడు పజ్మూ-లు సమానమే) 


1 భీమేశ్వరపురాణము, అ ౩, ప ౪౧ 


ను 


88 ఆం్యధుల సాంఘిక చరిత 


శకునమలు పాటించుట, ఒక |పయాణమునకేకాక శరస్స్హ్నానమునకు 
/' ఆయుష్కర్మ ఆను ముద్దు పేరుగల తారమునకు, నూతన గృహ|ప వేశములకు, 
| విత్తనమునకు, కోతలకు నిత్యజీవనములోని అసంఖ్యాకాల్పవిషయాలకు దినశుర్ధి 
చూచు కొనుటను మనుస్మృత్యాదులందును పురాణాలలోను (వాయుటయు, మనము 
వాటిని పెంచి పట్టగా వాటించుటయు, అనాదిసిద్ధమై మాయని పరిపాటియె 
పోయినది. 


పయాణా దులకు దినళుద్ధి యిప్పటికిని చూద కొనువారే బహుళము 
ఆకాలమందు. 


ఇక, రెర్డీరాజులకాల మందలి కులములను గూర్చి విచారింతము, రెడ్డు 
,“చతుర్ధజాతి “వారై యుండిరి. కాకతీయులు “అత్యర్కే (దుకుల, పసూతులు."” 
వీరిని స్పష్టంగా శుదులని చెప్పజాలకపోయిరి. అయినను క్ష తియోచితకర్మలను 
యజ్ఞయాగాదులను, సోమపానమును వీరు చేసిరి. పైగా క్షత్రియులము అని చెప్పు 
కొనువారితో నెల్లను బాంవవ్యము చేసిరి. చోళులతో, విజయనగర చ|కవర్పులతో, 
పల్లవులతో, హైహయు౭తో, ఇర రాజకులీనులతో బాంధవ్యములు చేసిరి. కాని 
, వలమలతో కాని, కమ్మలతో కాని బాంధవ్యము చేసినట్లు కానరాదు. 


రాచవారు, చోడ.లు తాము త్ల:తియ లమని చెప్పుకొనిరి, క్ష|తియులందరు 
సూర్యునికో చందునికో పుట్టినవారట ! నూర్మాచంద మండలాలకు విల్లలుపుట్ట 
రని మన కీనాడు బాగుగ తెలియును కాన సూర్యచం ద వంళాలనునవి కల్పి, 
బలిష్టులె దేశము న్నాకమించుకొని పాలించిన విజేతలపై పౌరాణికులకు అను 
[గహము కలిగినపుడెల్లను వారిని చందనికో నూర్వ్యునికో అంటగట్టి త్యత్రియు 
. లనుగా జేసిరి. అనార్యులగు హూఇజహవిష్కకనిష్కాదులు, శకరాజులు, ఇట్టివా 
_ రెందరో క్ష[తియులైరి 


“చోడులు క్యతియులుగదా ! వారితో రెడ్డను కలుపుట యెట్లని 
కొందరకుసంశ యము కలుగవచ్చును. కాని, & తియులమని చెప్పుకొన్న 
చోడులు పాచీనకాలమునుండి వా తవృ త్తి వహించిన వారగుటచేత 
నుత్కష్షమెన రాజపదవులను వహించినప్పుడు ఆ కాలమునాటి _బాహ్మ 
ణో_త్తములు వారిని క్ష్మత్రియులనుగా పరిగణించి యుందురు, కాని యిటీ 
వలి రెడ్డిరాజులు పూర్వపు వర్ణాశమసాం[పదాయ ధర్మములు చెడిపో 


రెడ్డిరాజుల కొలము 89 


యిన తర్వాతికాలమున రాజ్యపదవులను వహించినవారు గావున నవీన 
[బాహ్మణోత్తములు వీరిని క్షతియులనుగా పరిగణింపక చతుర్థ వర్ణ 
ములో ను_త్తములనుగా వర్షించియుండిరి.! 
పదునేనవశతాద్ది పారంభమునందు గూడ కొండవీడు, రాజమహేం 
వరము పాలించిన రెడ్డకును, రాచ వారికిని సంఏంధ బాంధవ్యములు కలవని 
(శివలీలావిలాసము, కొరిమిల్లికాసనము)  పైదృష్ణాంతములు వేనోళ్ళ జాటు 
చున్న వి.2 


“దతుర్గకులము '” క్ష తియకుల సమమని శ్రీనాథుడు డొంక తిరుగుడుగా 
ఫీమేళ్యక పురాణాదిలో వర్ణించుతూ “అందు పద్మ నాయకు లన, వెలమల, 
కమ్మలన, సరిసర్హన, వఠటర్లన, బహు _పకారశాథో పళశాఖాభిన్నంబులై న మార్గం 
బులన్‌ ''కీ వెలసిరనెయు, 


అందు పంటదేనటి అను రెడ్డివంళ మొకటి ఆని తెలిపినాడు, పె శ్రీ రాథ 
వచనములో సరిసర్లు ఆన నేజాతియా తెలియదు. వంటర్లు అని ముదితపాఠ 
మందు కలదు. వంటరి అన వంటలవాడు. ఇది సరీయని తోచదు, బహుశా 
అది ఒంటరి (ఎక ఏరుడు) ఆయి యుండును. పద్మనాయకులు వేరు. వెలమలు 
వేరు అని పై వచనాభి పాయముగా కొనవస్తున్నది. మున్నూరుకులమును గూర్చి 
కొరఏ గోపరాజు తన సింహాననద్యాతీంతి (వబంధాదియందు తెలిపినాకు, 
కాని అది తప్పు; చారి (తిక విరుద్ధము. 


రెడ్డి పదోత్స త్రినిగూర్చి పలవురు విమర్శకులు చర్చలుచేసి తేల్చిన 
సారాంశ మేమనగా |కీస్తుశకము ఆరేడునూర్ల సంవత్సరము లనుండి యీ బ్లోత్స త్రి 
కానవస్తున్నది. పూర్వము ఏరు చిన్న భూభాగముల కధికారులై యుండినప్పుడు 
రట్టగుడ్డు అనబడిరి. రట్ట ఆన రాజ్యము; గుడి ఆన గుత్త. ఆనగా వ్యవసాయ 
నిమిత్తము, [గామాలరక్షణ నిమిత్తము భూములను సొందడినవారని యర్థము. 
రట్టగుడియే క మముగా రట్టఉడి, రట్టాడి, రట్ల్టడిగా మారెను, రట్టడిపదములను 
పండితారాధ్యుడు తన శివత_త్త్యసారములో వాడెను. తర్వాతి కవులు [గామాధి 
fi ఆంధుల చరిత, సంపుటము క౩* పుట ౧౩౨. 
Ds ఈ a స పుట ౨౬౪. 
8. ఫీమేశ్వురపురాణము, అ ౧. పస ౩౨. 
(12) 


ర్ట ఆంధుల సాంఘిక చరిత 


కారియను నర్థములో, దర్పదౌర్ణన్యయుతుడను నర్భములోను వాడిరి, రట్టడిపద మే 
[కమముగా రెడ్డియయ్యెను. (కీ.శ. ౧౪౦౦ [పాంతమునుండి రెడ్డిపదము స్థిరపడి 
పోయెను. (రెడ్డిసంచిక, పుటలు ౯౬-౧౧౮; ౩౮౮-౩౯౨) ఇతర జాతులలో 
అంతళ్ళాఖలు (పబలినట్లుగా రెడ్డలోను కొన్ని శాఖ లేర్చడెను. అవి విశేషముగా 
శ్రీ : ప 
సిమలనుబట్టి యేర్పడెను. ) 


గుంటూరు జిల్లాలో నరసారావు పేట తాలూకా కొణిదెస గామమ. లోని 
శాసనమం డిట్లున్నది* “పొత్తపిచోడ మహారాజులు యేలెడి భూమియైన కమ్మ 
నాంటి రాచకొడ్కులు, మందడ్లు, నూకనామకులు, మొట్టవాడ గుటిక రృరాచ 
కొడుకులు, దేనట్లు, నూకనాయకులునై కూడి శకవర్షంబులు ౧౦౬౯ సం క్రాంతి 
నాడు శ్రీకొట్యదొన కేళవదేవరకు నిచ్చినకాన్మి -యూరరూకయు, ఉల్వరిపాది 
కయు నిచ్చితిమి” (ఊరరూక, ఉల్వరిపాది అనునవి [గామములో వసూలుచేయు 
కొన్ని పన్నులు, (గామముఖ్యులు, గామదెవాలయముల నిర్వహణకు పన్నులు 
వేయు అధికారము కలిగియుండిరన్న మాట ) “రెడ్లలో ఆనేక భేదములు కలవు 
పాకనాటి, పంట వెలనాటి, రేనాటి, మొరస, పల్లె-ఇ) నాడీ భేదముల బట్టి 
ఏర్పడినవి. గోటేటి, ఓరుగంటి, పెడకంటి, కుంచేటి. మోటాటి, దేసూరిరెడ్డు 
నినాస (గామముల బట్టీ యేర్పడిన భేదములు (రెడ్డి సంచిక -పుటలు ౧౨౮; 


౧౩౯) 


వె ళ్యకులములో కోమటివారు చేరిరి. వారిలో కొన్ని పిభదాలుండెను, 
దీనిని గురించి మల్లంపల్లి సోమ శేఖరశర్మగారు ఇ: గ్తీషులో (వాసినదాని నిందను 
వదింతురు, 


“,పొథఢ వేవరాయకాలంలో వై శ్యులు వైజాతీ యులు కులవివాద పరిష్కార 
మును కోంగా ఆరాజు కోలాచల మల్లినాథుని మరికొందరి పండితులను ధర్మాసన 
పరిష్కర్తలనుగా నేర్పాటు చేసెను. అంతకు పూర్ణ మొకప్పు డిట్టి వివాదము 
కలిగియుండ కంచిలో (కాంచీపురములో) అది పరిష,తమై కాసనబద్ధమై 
యుండెను. ఆ కాసనమును ధర్మాసనానికి కంచినుండి అదేపనిగా తెప్పించిరి- 
అందిట్లుండెను. నాగరులు, ఊరుజులు, తృతీయజాతీయులును వైశ్యులు, వైశ్యు 
నికి ళూదన్ర్రీకిని పుట్టినవారు వై జాతీయులు, వై శ్యులకు స్వాధ్యాయయజనదానాధి 
కారాలు కలవు. వారు వ్యాపారము, సేద్యము, పళువుల పోషణము చేయగల 


రెడ్డిరాజుల కాలము 91 


వారు. వైజాతీయులలో వణిజు కోమటి, వాణివ్యాపారి, వాణిజ్యవై ళ్యులు, 
ఉత్తరాది వెక్యులు చేరినట్టివారు. వై క్యులకే ఆన్నివస్తువుల వ్యాపారముపై 
ఆధికారము కలదు. “కోమటిఖ్లు ధాన్య విక్రయమాకతే అధికారో స్పియు కం" 
కోమట్లకు ఛడ్డవ్యాపారమే పరిమితిగా చేయబడినది. ఇవి కాంచీపుర శిలాశాసనస్థ 
విషయములు. పదవాక్య [పమాణస్థానులై న మల్లినాథ సూరిగారు సకల 
| కుతిస్మృతిళాస్తేంతిహాస పురాణ కావ్యకోళాదుల నవలోడించి వెళ్ళ, 
ఉఊరుజ, నాగర్క వణిజ, కోమటి, వాణి వ్యాపారి, వాణిజ్య, వైళ్యశద్దా 
లన్నియు వై శ్యశబ్దవాచకమలే! యనియు, కావున వై శ్య వైజాతీయ విభే 
దాలకు స్వ సిచెప్పవలసినదే అనియు జయప|త మిచ్చిరి.”1 మల్లినాథసూరి 
ఆ కాలపు వై శ్యసంఘ సంస్క ర్హగా నండెనేమో! 


కక (బాహ్మణులను గూర్చి కొంత తెలిసికొందము, ఒకదిక్కు స్‌ 
శైవులు (బాహ్మణాధిక్యమును పడగొట్టుటకై చాలా కృషి చేసిరి. అదేసమయ 
ములో |బాహ్మణాది సకల హిందూజాతులను అసహ్యించుకొను తురకలు దేశ 
ములో జొరబడి కల్లోలము చేసిరి, మరొకదక్కు. వీరశె వుల |పతిఘటన పటు 
త్యమునకై రామానుజీయులును పంచసంస్కార విధానముచేతను (పపన్నత్య 
సిద్ధాంతము చేతను కులకట్టుబాట్టను సడలిస్తూయుండిరి. ఇన్ని శక్తు లెదురొడ్డినను 
(బాహ్మణత్వమునకు భంగము కలుగలేదు సరికదా అది మరింక లోతుగా పాతు 
కొనెను, కులనిర్మూలన సంగ రణము లన్ని యు (బాహ్మ ణాధిక్యతకు కట్టుబాటు 
లగుటచే వారు ఆత్మర క్షణము చేసుకొన కూరకుండిరని తలపరాదు అగ్నిమి(త 
పుష్యమి'తులు, కాలంకాయనులు, విష్ణుకుండినులు మున్న గువారి బాహ్మణ 
రాజ్యములు (కీస్తుళకాదినుండి ఆరవ శతాబ్ద్య్యంతము వరకు పలుతావుల విలఏ 
లైను. అప్పుడే వృద్ధస్మతులు, ఉపపురాణాలు సృష్షియె యుండును, 


ఇతర పురాణాలు అపారముగా అప్పుడే పెరిగి యుండెను, స్మృతులలో 

హ_స్పక్షేపము లప్పుడే పడియుండును. ఆదే విధముగా రెడ్డిరాజుల కాలమందును, 

కాకతీయుల కాలమందును స్కాందాదిపురాణాలు పెరిగినట్లు పలువురు చరిత్ర 

పరిశోధకు లభిపాయ మిచ్చినారు. ఆనాటి తెనుగు వాజ్మయ మందును [వాహ్మ 

ణాధిక్యత విశేషముగా కానవస్తున్నది. ఈ రెడ్డియుగముననే వెలువడిన భోజ 
(1) Hist R. K. Page 273. 


92 ఆం|ధుల సాంఘిక చరిత 


రాజీయములో అడుగడుగునకు [బాహ్మ ణ|పభావగర్శిత కథలే బహుళమ.గా అల్లి 
బడినవి, 


ఈ విధమగు [పదార మట్టుండ యథార్థముగా (బాహ్మణుల-దే వేదశాస్త్ర 
|విద్యలు కేం! దీక్భత మై యుండెను "షోడశకర్శ లకు, (వతాలకు, కుభాకుభములకు 

అన్నింటికిని (బాహ్మణుడే యాధారభూతుడు. నిన్నమొన్నటి వరకు కూడా 
[బాహ్మణేతరులకు వేద వేదాంగములు చెప్పుటకు సహంపని [బాహ్మణు లుండి 
నప్పుడు ఆ కాలమున లేకుండిరా ? అట్టి వారుండిన సర్వజ్ఞ సింగడు, సర్వజ్ఞ 
చక్రవర్తి, కోమటి వెమడు ఎట్లు విరుదాంచితులైరి ? రాజులు పైనియమాని కఫ 
'వాదపాతులై యుండిరేమో ? 'ఎటులైన నేమి (శుతిస్మృతి పురాణ శాస్తామల 
కంతకును విశేషముగా [బాహ్మణులే నిధులై యుండిరి. తెనుగులోనికి పురాణములు 
పూర్తిగా రానందున (పజలకు పురాణ్యళవణము చేయువారు |బాహ్మణులే. కావున 
పురాణముల ద్యారా పచార మత్యంత ముఖ్యమని వారెరిగినవారే ! పలనాటి 
బాలచం;దుని తల్లి విపుల బిలివించి భారత రామాయణ పురాణములను విను 
మని కుమారునికి బోధించియుండెను. 


... వీనుల కెల్ల తేనియల్‌ 
చినుక పురాణ వాక్య ములు 
చెప్పెడు వి పుని జూచి, యిమ్మహా 
జనసభ జేరి”! 


ఆనుటచే (బాహ్మణులు పురాణములు చెప్పగా జనులు తండోపతండ 
ములుగా (| మహాజనసభగా) కూడుచుండిరని ద్యోతక మగును, 

అట్టి విశిష్టతలచేత విప్రులు అప్పటి రాజులకు మంతులై , సేనానులై, 
విద్యాధికారులై, దీకాగురువులై , బోధకులై , పురోహితుల్హై తమ య|గస్థానముకు 
స్టిరీకరించుకొనిరి, రెడ్డ చర్మితలో |బాహ్మణ భక్తి ఒక అపూర్వ విచిత్రఘట్టము, 
అది “నభూతో నభవిష్యతి' అని యనిపించు కొన్నడి.. 

రెడ్డు రాజ్యాసికి రాక పూర్వముండిన (బాహ్మణుల స్థితి వారి కాలమందిెట్లు 
మారెనో (శ్రీవాథు డిట్లన్నాడు. 


1.సింహాసనద్వ్యా తింశిక, ౨ భా. పు. ౨ 


రెడ్డిరాజుల కాలము 9§ 


కి ధరియింప నేర్చిరి దర్భ పె ట్రెడు (వేళ్ళ 
వా లు నా 
లీల మాణిక్యాంగ శ్రీయకమలు 
కల్పింప నర్చిరి గంగమటియ మీద 
రు 
క సూరికాపుం,డకముల నొసల 
నువరింప నేర్చిరి జన్నిదంబుల (మోల 
తారవోరములు ముత్యాల సరులు 
చేర్పుంగ నేర్చిరి శిఖల నెన్నడుముల 
కమ్మని [కొత్త చెంగల్వ విరులు 
ఛామముల వెండి యును చెడి తడబడంగ 
(బాహ్మణో త్తము లగహారమలలోన 
వేమ భూపాలు డనుజన్ము ఏరభ్నదు 
ధాతి యేలింప గౌతమీతటమునందు.! 
చారు వి|పుల, 


"అ గహారావళి అఖిల మాన్యంబు లొసగి”2 


గొరవించిరి. ోఅది స్వభావోక్రి” అని వేటూరి |పభాకరశళాన్రిగారు 
శృంగార (శీనాథములో అంగీకరించినారు. 


రెడ్డిరాజుల కుండిన (బాహ్మణభ కక్రి భారత దేళ చర్మితలో వేరుచోట కాన 
వచ్చునో లేదో ఆత్యంత సంశయమే. ఓరుగంటి చ[కవర్తు లిచ్చిన దానాలు 
తురక విజేతల చేతులలోనిక పోయెను, రెడ్డిరాజులు తాము గెలిచిన [వొంతములం 
దంతటను పూర్వరాజుల దానము లన్నింటిని స్థిర పరిచిరి. పెగా తామున్నూ 
ఆఅసంభ్యాకముగా భూములను, ఆ గహారములను (బాహ్మణులకు దానము చెనిరి, 
పీరి దానములచే ఆకర్షితులై తూర్పుతీర మందలి కృష్ణా గోదావరీ మండలము 
లలో (బాహ్మణులు కొల్లలుగా నిండుకొనిఠని పలువురు చరి తకారు లభి పాయ 
పడినారు. [పామాణికుడును, పూజ్యుడును, ముఖస్తుతుల నెరుగనివాడును, 
[పబంధపగ మేశ్వరుడును నగు ఎ,రాప్రగడ తన యు తర హరివంశ ములో 
నిట్లు |వాసెను. 


1,2, భీమేశ్వర పురాణము. ఆ. ౧౧ ప ౪౧, ౪జీ. 


94 ఆం|ధుల సాంఘిక చరిత 


“అ గహారములు విద్యా తపోవృద్ద వి 
[పుల కిచ్చి యజ్ఞక ర్హలుగ నునిచె 
కొమరార చెరువులు గుళ్ళు _పతిష్టించి 
లోక సంభావ్గంబులుగ నొనర్చ్బ్చ 
నిధులు నల్లి డ్లును నిలిషె, తోటల సత 
మలు చలివిందరల్‌ వెలయ బెట్టె 
హేమాది పరికీ రి తావితదాన 
నివహంబు అన్నియు నిర్వహించె 
చేసె, చేయుచునున్నాడు సేయనున్న 
వాడు. పునరు క్ర కృతి శుభ్రావలులనెల్ల 
ననగ శ్రీ వేమవిభున కయ్యలరు పేర్మి 
వళమె వర్ణింప తద్భాగ్య వెభవంబు. ష్ట్ర 

వెన్నెలకంటి సూరక వి యి ట్లనెను, 


“తన [బతుకు భూమిసురు౨కు 

తన బిరుదులు పంటవంశ ధరణీకులకున్‌ 

తన నయము భూమి |పజలకు 

అన వేమన యిచ్చె కీర్తి విభవుం డగుచున్‌.” 


ఒక ఫౌరోహితుని జీవనమను జుగుప్పాకరమగా గౌరన తన వారి 
శ్చందలో వర్ణించెను. “రోగులవలన కొంత లాగి, (బేతవాహకుడై. కొంత 
గడించి గండకాంతులందు, నప్పకము లందును (ఏడు గురను పిలిచి పట్టు 
(కొద్దము లందును) తృష్తాన్తగా భుజించి, (గ్రహణ కాలములో ఒక మాడయైన 
దక్షిణగా పొంది, ఇంటింట పంచాంగ పఠనము చేసి, ఆయవారము లెత్తి, 
దానము పట్టిన ధాన్యాలను తన వస్త్ర మదు మూల మూలలందు మూటలుగా 
కట్టి, ఏమిలేనినాడు కరతి త్రిపట్టి, మష్టియెత్రి, కూడబెట్టిన పైకాన్ని అప్పుల 
కిచ్చి పత్రాలు (వాయించుకొని వృద్ధి, చక్రవృద్ధి, మాసవృద్ధి అని వడ్డీలు 
గడించి, ఒక పొరోహితుడు జీవించెనని వర్డించెను.. (పుట ౧౪౫, ౧౪౬. 
రెండవ భాగం-వేదం పచురణము.) 


అప్పులు తీసుకొనువారిపాట్లను, అప్పుల ముంచే పద్ధతులను గౌరన చాలా 
చక్కగా వర్ణించినాడు, 


రొడ్డెరాజుల కాలము 95 


“ధనికుల యిండ్ల కేగి పయములు పలికి, సేవచేసి, నమ్మి క పుట్టించి, 
మనసులు కరగించి, మాయసామ్ములు, లక్క పొడుపులు, మాయబంగారు, బంగా 
రునీ రెక్కించిన ఇత్తడి, ఇనుప సొమ్ములు, మాయమణులు, గువ్రముగా రాతి 
తీసుకొనిపోయి, ఇవి దాచుడని లక్కము[దలు వేయించి, లండుబోతుల పూటగా 
బెట్టి, అప్పులు గొని, యెగ బెట్టి, పట్టుబడి, రచ్చకీడ్వబడి, వారిచ్చు శిక్ష లను 
భవించి, రాళ్ళుమోసి, దెబ్బలు తినియైనను మందిని ముంచవలెనట | 
(వారిశ్చంద ఉ త్రరభొగము, పుట ౧౫౧-౧౫౨) 


(రెడ్డిరాజులు ఆం|ధదేశమందు అనేక శివాలయములను కట్టించి తమకన్న 
పూర్యమం దుండిన (పసిద్ధాళంయములకు దానము లిచ్చుట యేకాక ధావిడ దేశ 
మందును ఉత్తర హిందూ స్థాన మందును కల (పసిద్ధ శివక్షతములకు దానధర్మ 
ములు చేసిరి.) 


రెడ్డిరాజుల కించుమించు మూడునూర్హ యే డ్డకుముందు హేమాది యన 
నతడు ఆచార న్యవహోారాదుంను గురించి యొక విపుల మగు శాస్త్రమును 
వాసిపెప్టెను. దానికి చిలామణియగుచూ వచ్చెను. కెడ్డిరాజలు హేమా(ది 
(పో క్రవిధానములతో షోడశ దానాలు చేసిరని సమకాలీన పామాణిక కవులు 
వర్తించిరి. ఆదానాలు సామాన్య మైన తిరిపెన లుకావు. అఎకొంపల తిసే త్యాగాలు: 
అ(గహారా లను పేర అనేక (గామాలను. భూదానములను, గోహిరణ్య రత్నా 
దును, నానావిధమలగు ఇతర దానములను చెసి యుండిరి. అనగా తమ ఆదా 
యములను కోరుపంచి యిచ్చిరఠన్న మాట, 'హీమాది [పభావ నుట్టిది. 


(తెనుగువారికి ధర్మశాస్తాంలన్ని టిపెకి. క యాజ్ఞవల్క స్మృతిపై రెడ్డిరాజు. 
లకు ఇన్నూరేండ్డకు పూర్వము వాసిన విజ్ఞానేశ్వరీ వ్యాఖ్యయే _పధానమైన, 
దయ్యెను. ఆకారణముచేత రెడ్డిరాజుల కాలమువాడగు కేతన విజ్ఞానేశ్వరీయమును 
తెనుగు పద్యములలో [వా సెను.) 


వ్యవసాయము --- (పజలస్థితి 


రెడ్డిరాజుల కాలములో దేశమును సీమలనుగా లేక నాడులనుగా విభజించి ' 
నట్టు కానవచ్చును. ఈ విభజన వారు [కొత్తగా చేసినట్టు కానరాదు. వారికంటే | 


98 ఆంధధుల సౌంఘ్‌క చరిత 


పూర్వమనుండియే ఆవి యుండెను. రాజమహేందవరమునకు ౧౧ మెళ్ళ 
దూరమననున్న కోరుకొండలో రాజ్యముచేసిస ముమ్మడినాయకుని రాజ్యములో 
కోనసీమ. అంగర సీమ, కొఠామసీమ, కురవాటసీమ. చాంగలువాటిసీమ మొద 
లగు సీమలు చేరియుండెను, ఇవన్నియు గౌతమీనది కిరుపక్కల వ్యాపించి 
యుండెను, ఈరాజ్యము ఆరటి, కొబ్బరి, పనన, పోక, మామిడి మొదలగు 
తోటలలో రమ్యమై ఆం[ధభూమిని (పసిద్ధిగా నున్నదని యార్యవట శాసనమున 
వర్ణింపబడినది. “అశ ల పూర్వునిక టమునుండి పూర్వ సనముదముదాక 
[ప్రవహించుకుండి తరంగిణి యను గుండ్డకమ్మనది కిర్ముపక్కలనుండు సీమకే 
పూంగినాడను నామము కలదని తెలియుచున్నది. 


ఇట్టి సీమలు దేశ మంతటను అనంతముగా నుండెను. కాని, రెడ్డిరాజులు 
తమ పరిపాలగ పొకర్యమునకై తమ రాజ్యమును కొండవీడు, వినుకొండ, 
బెల్లముకొండ, అద్దంకి, ఉదయగిరి, కోట్క నెల్లూరు, మారెళ్ళ, కందుకూరు, 
పొదిలి, అమ్మన_బోలు, చుండి, దూపాడు, నాగార్జునకొండ అని విభాగములు 
చేసిరి.ళ 


పల్పవులు, కాకతీయులు దేశమంగలి ఆడవులను కొట్టించి, [గామాలను 
ట్రతిష్టించి, వ్యవసాయకులకు భూము లిచ్చియుండిరి. దీనినిబట్టి (క్రీస్తుళకము 
౧౦౦౦కి పూర్వము కర్నూలు, బళ్ళారి మున్నగు మండలాలు అఆరణ్య,పాంతా 
లుగా నుండెనని తెలియును. |పతాపరుదుడు స్వయముగా కర్నూలు సీమకు 
వెళ్ళి అడవుల గొట్టించి ఇప్పటికి కర్నూలు పట్టణమునకు ౧౦, ౧౫ మైళ్ళ 
ఆవరణములోని పల్లెల పెక్కింబిని నిర్మాణము చేసినట్లు ఆకాలపు శాసనాదుల 
వలన తెలియవచ్చెడివి. తెలంగాణములో నూరేండ్ల [కిందటకూడ అడవులను కొట్టి 
రైతుల (పతిష్టించుతూ వచ్చిరినిన ఆకాలపుమాట చెప్పనవసరము లేదు, 


ఇప్పటివలె భూములను పట్టాకిచ్చు పద్ధతి ఆనాడు లేకుండెను. భూమి. 
యంతయు రాజుదే అను సిద్దాంతము అంగీక రింపబడి యుండెను. భూమిని. 


1. ఆంధుల చరితము, ౩ భా. పు, ౧౨౨. 
వీ, 0౭౪ లలల 6666 క వ అకా 


3. Hist. R. K. Page 218 


రెడ్డిం*జుల కాలము 97 


ఏపేటకో లేక నియమిత కాలమునకో (గామ జనుల కిచ్చెడువారు, రైతులు తమ 
. కుండు పశువుల లెక్క [పకారము కాండ్ల లెక్కతో కలిసి కృషిచేసి సమవ్షిలోనే 
సేద్యపు వ్యయముని తీసివేసి అనగా పన్నిద్దరాయగాండ్రకు ధాన్యరూపముగా 
వారి కియ్యవలసిన డిచ్చి వేసి [ప్రభుత్వమునకు ఇంయఘ్య వలసిన షడ్భాగపు పన్నును 
తీసి యుంచి మిగతాది కాొడీల్మపకారము పంచకొనుచుండిరి. ఈవిధమగు సమవ్షి 
సేద్యమలో రాజులు _బాహ్మణుల కిచ్చిన ఇనామలు అ(గ హారములు చేరియుండ 
లదు. , సవవ్షి సేద్యపు భూమినుండి మొదలు (అగ) _బాహ్మణుల ఇనాముల 
తొలగించి (హారము) భూమిని సాగుకు తీసుకొనుచుండిరి. 


ఆ కాలములో భూములను కొలుచుటకు “గడి” యనునొక నిర్ణయమగు 
పొడవు కటైను వినియోగిస్తుండిరి. దానిని కేసరిపాగడ యనిరి. భూములను 
కొలు చుటకుగాను కాస్త్ర గంథాలు వాసిరి. నన్నయభట్టు సమకాలికుడగు మల్లన 
అనునతడు గణితశాస్ర్రమును [వాసెను. అదింతవరకు ము|దితను కాలేదు. 
దానిలో ఆకాలపు వ్యవసాయ స్థితిగతలు కొలతలు మున్నగునవి కలవందురు. 
సంస్కృత గణితిశాస్త్రములను తెనుగలోనికి పలువురు అనువదించిరి. శే |త 
గణితము ఆను పేరుతో పొలముల నక్షాలతో సహా తాటాకుల పె పెద్దపెద్ద 
[గంథాలు వాసియుంచిరి. కాకతీయులకాలవ ందలి క్షేతగిణితమునుండి 
(క్రీ మల్రంపల్లి సోమ శేఖర శర్మగారు విపులముగా నుదాహరించినారు. దాని 
(ప్రకారము, 


అంగుష్టపు వలయార్థం 
బంగుళమగు, మూడుపొడవు యవ లెన్న౦గా 
నంగుళమగు, మరియును, మ 
ధ్యాంగుళ మధ్య|ప దేశ మంగుళ మయ్యున్‌, 
అట్ల ౧౨ అంగు ళములు== ఒక జేన, 
౩౨ జేనలుజాఒకగడ (కొలతక ట్రై). 
ఆకాలమందు తూమెడుపొలము, పుటైడుపొలను ఆంటూ వుండిరి. నిన్న 


మొన్నటివరకును రాయలసీమలో ఇవే మాటలంటూ వుండిరి. అనగా తూమెడు. 


వి తనములు పలైడు భూమియని యర్థము, 
(13) 


98 ఆం ధుల సాంఘిక చరిత 


సీ|| (పకటింతు కేసరిపాటి శే తంబుల 
నలరిన బీజసంథ్యాత మదియు 
నూటవం[ డెండర పాటిగా నొకతూము 
ఎబదారుంబాతి కరస యయ 
ఇరువదెన్మిది పర కేర్పడ గుంచెడు 
పదువాల్గువీనముల్‌ పరగు నడ్డ 
ఏడొక యరవీస మేపార మానిక 
మూటిపై నరకాని మున్ను తవ్వ 
ఒకటి పొతికయు జూడ నొక్కసోల 
ఏడుపరకల దా నానగూడెనేని 
పరగ నరసోల యెరుగుడి వరుసతోడ 
గణితపండిత విను మిది గణితమతము,.! 


భూమికొలతలలో నివ ర్రనములనియు లేశ మరుత్తులనియు వ్యవహ 
రించిరి. పడిచేతులు (మూరలు) =జఒకదండము, పదిదండములు=ఒకనివర్త 
నము; పదినివర్తన ములు =ఒకగోచర్మ ము. (2) రెడ్డిరాజు లకా లములో సిభూమి 
కొంకలు అప్పటి యాధారములనుబట్లి యీ విధముగాకూడా యుండెను. 


౪ మూరలు=ఒక బార 
౪ బారలు=దక గడ 
౪౦౦ గడలు=ఒక కుంట 
౧౦౦ కుంటలు=ఓక కుచ్చెల లేక ఖండిక లేక తూప. 


.సువర్ణాదుల తూకములను మాడలతో కొవిస్తుండిరి. మాడ అనగా అర 


వరహా అని శబ్బ్రరత్నాకరకారుడు వౌసినాడు. అదొక చిన్న బంగారునాణెము. 
కొండవీటి రాజులకాలపు కవియగు కొరవి గోవరా జిట్టు తెలిపినాడు, 


66 


ఎన్న నాల్గుమాడలె తొతకర్షంబు 

నాల్గుకర్షలై న నగు పలంబు 
(1) Hist. మస. K. Page 365. 
(2) Hist, R. K. Page 367. 


రెడ్డిరాజుల కాలము 99 


పలము లొక, నూరుతులయగు, తులలొక్క 
యిరువది మితి భారమిది మతంబు! 


ఆ కాలమందలి నాణిములముచ్చటలు కావ్యాలలో కానవచ్చును. రూక 
పసిడిటంకముల్మీ నిష్క ము, గద్ద, (గద్యాణతద్భృ వము) = వరహాతో 
సమానము. పాతిక పరకర మున్నగునవి ఉదాహృతమలు. ఒకరాజు 
ఒక సేవకునికి బాటవెచ్చమునకుగాను ఏడుదినాల కేడు మాడలిచ్చెను.? అనగా 
బంటువృ తివారికి దినాని కొకమాడ యిచ్చుచుండిరని తెలి మవచ్చెడి, 

తెలంగాణములో తరీ (మాగాణి) సేద్యము నేటికిని (పధానమైనట్టి వ్యవ 
సాయము. అందుచే (పాచీనమ నుండియు రాజులు, మంతులు, సేనానులు, 
ధనికులు, పజలు - కుంటలు, కాలువలు, చెరువులు విశేషముగా నిర్మించుతూ 
వచ్చిరి. తరీసేద్యమునకు మోట, ఏతముద్వారా, చెరువు కుంటలద్వారా నీరిస్తూ 
వుండిరి. 


“ ఈయెడ కర్మభూమి యగు 

డెవ్వరికై నను బుద్ధినేర్పునం 
జేయగల౯్దదు కాల మెడ 

సేసిన నేతమలె త్తి, కాల్యలున్‌. 
పాయలు, కోళ్ళు, నూతులును, 

బావులు రాట్నములున్‌ జలార్భమై 
చేయగ నాయెగాక మరి 

చేయనినా డవి తామె పుట్లునే.! 


(1) సింహాసనద్వా తింళతి. భా. సభ 0 
(2) Pre he. uO 
(8) (4) స్య టు SEE 
(5) అతత భా, ౧. పు, ౨౮. 
(6) సింహాసనద్వా.తింశతి, భా. ౧ పు, ౧౦౨. 
(7) ఎ పు, ౬౪. 


(8) లాం భాం ౨ పు, 2 


100 ఆం|ధుల సాంఘిక చరిత 


ఇది తెలంగాణా తరీసే సద్యమును బాగుగా నిరూపి స్తున్న ది. పలనాటి 
సీమ 'నల్లగొండజిల్లాకు దగ్గరిభాగ ము. మిరియాల గూడా అ పక్కనిది. 
పలనాటిలో నాపరాళ్ళు విశేషముగా నుండెను. అడేమిటో అచట చెన్ననిమహి 
మనో యేమో ఆకాశాన మేఘము ఆవరిస్తే చాలు నాపరాలలో వి తిన యావనా 
ళములు ఫరినూవుండెనని డ్రీడాభిరామక ర్త యీ విధముగా ఆశ్చర్య పడెను. 


ష్‌ చి త్తముగూర్చి మాచెరల 
చెన్నడు, శ్రీగిరిలింగమ న్‌ కృపా 
య త్తతతోడ ముల్కీ_విష 
యంబునకా, మహిమంబు చెల్లి, గా 
కుత్తరలోన మింట జల 
ముట్టినమా[తన, నాపరాలలో 
విత్తిన యావనాళ మధి 
వృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా ! ” 


ముల్కావిషయ మన ములికినాడు. మహబూబుకగరు, కర్నూలు, 
గుంటూరు |పాంతాలండలివే. అయినను పలనాటిలో రేగడిభూమియు విశేషముగా 
నుండెను, అందుచేతనే అక్కడ జనులందరు జొన్నలనే పండించి తినుచుండిరి. 


“ జాన్నకలి జొన్నయంబలి 
జొన్నన్నము జొన్నవిసరు జొన్నలె తప్పన్‌ 
సన్నన్నము సున్ననుమీ 
పన్నుగ పలా టనున్న [పజలందరకున్‌ .” 
చిన్నచిన్న రాళ్ళు చిల్లర దేవళ్ళు 
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు 
సజ్జ జొన్నకూళ్ళు సర్పంబులును తేళ్ళు 
పల్లెనాటిసీమ ప వ్రటూళ్ళు, 
రసికుడు పోవడు పల్నా 
డెసగంగా రంభయైన నేకులె వడుకున్‌ 
వసురేశుడై న దున్నుమ 
కుసుమాస్సు)ండైన జొన్నకూడే కుడుచున్‌, ! 

1, (శ్రీనాథుని చాటుధారలు. 


రెడ్డిరాజుల కాలము 101 


ఈ పరిస్థితులు రాయలసీమకును వర్తించును. ఇక తూర్పుతీర 
మందుండు కృష్ణా గోదావరి జిల్లాలోను, నెల్లూరు జిల్లాలోను, విశాఖ 
పట్టణము జిల్లాలోను వ్యవసాయవరిస్థితు లెట్ట్లుండనో తెలిసికొందము. 
(శ్రీనాథుడు కృష్ణాజిల్హాలో నెక్కువగాఉండి సన్న దబియ్యపుటన్నమును 
బహు వధ రచ్యాహారమలకు ఆరగించిగవాడగుటచే, పలనాటికిపోయి జొన్న 
కూడు తినలేక ఆవస్థపడి లోతులో దొరకు నీటికై భంగపడి పలనా 
టిని తిట్టి వెళ్లెను తూర్చుతీరమందలి డెల్టా (లంక) భూములలో ఏటిమడ 
లలో నానావిధములగు వరిధాన్యములు పండుతూవుండెను. వడ్లలో అనంతమగు 
జాతులు కలవు. శ్రీనాథుడు కొన్నిటిని తెలిపినాడు. 


“నదీమాతృకాయమాన  విశ్వంభరాభరిత కలమశాలిసిరా ముఖ 
షాన్టిక పతంగ హాయన్మపముఖ బహువిధ్యఏహీభేదములు”]1 


గోదావరిలంకలలో బహువిధఫఅములు సమృద్ధిగానుండెను. తూర్పు 
తీరము ధాన్యసస్యసంపత్సమృద్ధముగా నుండెనని ఆకాలమున దేశమును 
చూచిన జోర్డానస్‌ (౧౩౨౭-౩౦) అను పాళ్చాత్యు డిట్టు (వాసి పెట్టను. 


“తెలుగు దేశపురాజు బవం పతాపవంతుడు. అతని రాజ్యములో 
పుష్కలముగా జొన్నధాన్యము, వరి, చెజకు, తేనె, పప్పుధాన్యాలు, ను 


గొర్లు, దున్నలు, పాడి, వివిధములగు నూనెలు, శేష్టములగు ఫలములు 
మరెందును లభ్యముకానట్టివి సమృదిగా లధిసుున్న వి" 
లి లు > అరి మా 


దీన్నిబట్టి ఆ కాలమందలి దేశము చాలా సుఖస్థితిలో నుండెశనుటలో 
సందేహములేదు. కృష్ణాజిల్లాలోనిది కాబోలు కళసాపురము, అరటి తోట 
లకును _దాక్షఫలములకును పసిద్ధికలదై యుండెను. 


రాయలసీమలోని ఎక్కువభాగము కర్హ్ణాటరాజ్యములో చేరియుండెను. 
అందు పల్నాటిలోవలె ధనిక దర్శిద భేదములేక అందరును దున్నుట, నూలు 
వడుకుట్క అందరునూ జొన్నరొట్టెలు, జొన్నసంక టి లేక యంబలి లేక 


1. హరవిలాసము, ఆ ౧. స. ౧౦, 
2. Hist. R.K. Page 373. 
8. “కళసాప్రర [పాంతకద+ వనాంతర [దాషాలతాఫల స్తబకము 


లకు” శ్రీనాథుని చాటుధార,. 


102 ఆం|ధుల సాంమిక చరి(త 


ఆన్నము తినుట యాచారముగా నుండెను. “చల్లా యంబలి దావితిన్‌ 

రుచులు దోసంబంచు SUIS తల్లీ! కన్నడ రాజల కీ దయలేదా! 

నేను శ్రీనాథుడన్‌” అనియు, “ఓపుల్లనరోజనేత ఉడుకు బచ్చలిళాకము 

జొన్నమదయున్‌ మెల్లన నొక్కముడ్న దిగ [1మింగుమనీవస కాననయ్యె 
ఏఐ ne) 0 టు 

డిన్‌” అని నిరించిన దీ పీమనుగూర్చియే 


రెడ్డిరాజుల రాజ్యుకాలములో జనలు [పభుత్వమునెడ చాలా సంపితులై 
యుండినట్వన్న ది. లేకున్న ఓఢ కర్ణాట ముసల్మాన పద్మ నాయకోజ్బం 
భణ దండయాతలలో నెన్నడో తిరుగుబాటు చేసియు: దురు. ఇందలి 
(ప్రబల ళతువులను అవలీలగా నోడిస్తూ వచ్చిరనిన రెడ్డిరాజులకు |పజా 
వలంబన ముండిన దనుట స్పష్టము. (పజలపై అకమమగు పన్నులు 
వేసినవారు కారు. తుది కొండవీటిరాజగు రాచవేమన [(పజాబాధాకరము 
లగు [కొతపన్నులు వేయుటచే [ప్రజలు తిరుగుబాటు చేసినట్లు కొండవీటి 
దండకవిలె తెలుపుతున్నది. అతడు పురిబిపన్ను ఒకటి మోపగా ఎల్లప్ప 
యను బలిజనాయకుడు దాని నిచ్చుకొనలేక వేముని చంపివేసెను. ' 


రెడ్డిరాజుల రాజ్యపతనము కీ. శ, ౧౪౩౪ |పాంతములోనయ్యెను. 
చిరకాలమునుండి (పజల [ప్రయత్నాలు చేయు మూ వచ్చిన ఓఢ (ఒడ్డె] 
రాజులు తూర్పుతీరపు దేశమును గు-టూరు సీమను ఆ[కమించుకొని 
పాలించిరి. . వారికి [ప్రజలపై పీతిలేకుండిను. దేశమునుండి అన్నివిధముల 
[ద్రవ్యమును లాగుకొనిపోవుటయే వారి (పధానాశయమైనట్టుండెను. కవుల 
ఆదరణము, కళాపోషణము వారిలో లవలేశమైన కానరాలేదు. అఖి 
లాం|ధ పరిపూజ్యుడును, కది సార్వభౌముడును, సార్వభౌమ సమ్మాన్యుడును 
నగు (శ్రీనాథునే వారు కష్ట పెట్టిరి. రెడ్డిరాజులలోని పలువురిపాలన లందుండి 
(దవ్య మార్జించి దానిని దొరవలెనే దానముచేసి వారి యనంతరము సహ|సమాస 
బీవియైన శ్రీనాథుడు జీవనార్ధ మై: కొంతభూమిని, ౭౦౦ బంగారు టంకాలకు 
గుత్తకు తీసికొని పంటలు పండక పన్నియ్యలేక ఆవమానము లంది యిట్లు 
విలవించెను, 


సీ. కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా 
పురవీధి నెదురెండ పొగడదండ 


రెడ్డిరాజుల కాలము 103 


ఆం ధనైష ధకదర్త యంఘి ముగ్మంబున 
తగిలియుండెనుకదా సిగళయుగమ్ము 
వీరభ[దా రెడి విద్వాంసు ముంజేత 
వియ్యమందెనుకదా వెదుకగోడిగ 
సాగ్యభౌముని భుజా స్తంభ మెక్కెనుగదా 
నగర వాకిట నుండు నల్ల గుండు 
కృష్ణ వేణమ్మ కొనిపోయ నింత ఫలము 
చిలవిలాక్షులు తినిపోయె తిలలు పెసలు 
బొడ్డుపల్లెను గొడ్డేరి మోనపోతి 
నెట్లు చెల్రింతు టంక ౦బు లేడునూర్లు? 


ఆనాడు పన్ను లియ్యనివారి నన్ని విధముల కష్ట పెట్టుచుండిరో యీ 
పద్యము బాగా విశదపరచినది. చి తమేమనగా (కీ. శ. ౧౯౦౦ వరకు హైదా 
బాదు సీమలోని పల్లెలలో పటేలు, పట్వారీ లివే పద్ధతులను అవలంబిస్తూవు డిరి* 
ఊరిముందర చావడియుండెడిది. ఆందులకు చేతులకు క ధ్రైబేడీలువేయు “కోడాలు" 
ఉండెడివి. రెండుచెతులను మణికట్టువరకు రెండుక బైల రం్యధములందుంచి ఒక 
వెదురు చీలను (గొడిగను) వాటికి బిగించువారు. మరియు ఎండలో నిలబెట్టి, 
బండ లెత్పుట లేక ఊరి ముందర నుండు గుండును భుజముపై మోయించుట లేక 
ఒక పెద్ద మొద్దుకు గొలుసునుకట్టి దానిని కాళ్ళకు తగిలించుట, ఇట్టివన్నియు 
చేయిస్తూ వుండిరి. అనగా ఒడ్జెరాజుల సృష్టి దేశమంతటను వ్యాపించెనన్నమాట. 
ఆయితే తటాలున ఒధైరాజులె యీ శిక్ష లన్నింటిని (ప వేళ పెట్టిరనుట కాదు. 
అంతకుముందు ఇట్టవి యాచారమం దుండెనేమో ! కాని వాజ్మ యములో వాటి 
సూచనలరుదు. ఒడెరాజుల యపయళస్సుమాత మీ శ్రీనాధుని చాటుధార 
యున్నంతకాలము తెలుగునాట నుండక మానదు. 


క॥ ఓరీ కోమటి ముక్కున 
నీరెత్తుడు, మేము కినియనేరక యున్నన్‌ 
నోరికి వచ్చిన యటులు 
€9 
వారణ యొకి,,౦త లేక వదరు లరచెడిన్‌.! 
1. కేయూరబాహు చరితము, అ ౩, ప, ౨౦౧. 


104 ఆంధుల సాంఘీక చరిత 


ఇట్టి నూచనల నుబట్టి పన్ను లియ్యని వారిని కష్ట పెడుతూ పుండిరి, కొని 
కవులను పండితులను శిష్షలను కష పెట్టి యుండరు. 


అనపోత రెడ్డి కంచి. పేరి, పొన్ని ఆను ముగ్గురు భోగపుసానులకు కొన్ని 
గ్రామాలను ధానము చేసెను. ఆ వేశ్యలు తమకిచ్చిన (గామాలలో చెరువులు 
కట్టించిరి. ఈ విషయమును గమనించిన ఆకాలమందు ధనికులును సామాన్య 
జనులును కూడ జలాధార నిర్మాణములందుత్సాహుల యుండి రనవచ్చును. 


తెలంగాణములో వెలమరాజులు అనేక నూతన తటాకములను తమతమ 
పేర కట్టించినవి నేటికిని చెడిపోక తరీ సేద్యమునకు మక్యాధారములై యున్నవి. 
మాధవనాయుడు సీంగమనాయుడు మున్నగు వెలమరాజులు తమతమ చేర 
అనేక [గామాలనుకూడ నిర్మించిరి. అవి నేటికిని వారి పేర్లతోనే వరిలుతూ 
Oo? 
వున్నవి, 


ఈవిధముగా మొ_త్రముపై ఆం[ధదేశమంతటను (కీ, థ్‌, ౧౩౦౦నుండి 
౧౪౦౦ వరకు (పజలు సుఖముగా జీవించిరని చెప్పవచ్చును. 


వ్యాపార పరి శమలు 


పాచీనము నుండియు తెనుగువారు సముదవ్యాపారమును చేసినవారు. 
_ కృష్ణా, గోదావరి, విశాఖపట్టణము బిల్లాలవారికి సముదతీరముండుటచేత వారికి 
సము[దవ్యాపారమునకే యెక్కువ ఆపకాశములుండెను. వారు బర్మా, మలయా, 
ఇండోనీషియా, చీనా, సింహళద్వీపాలతో విశేషముగా వ్యాపారము చేసిరి. 
పె దేళములనుండియు పర్షియా, అరేబియా దేళాలనుండియు నానావిధములగు 
సరుకులు తెనుగు తూర్పు తీరమందలి రేవులలో దిగుతుండెను. నేలబేరానికి 
దొంగలు తగిలినట్ల గా నముదవ్యాపారానికి దొంగలుండిరి. అందుచేత రాజులు 
వారి నణచుటకై (పయత్నాలు చేన్తూవుండిరి. కాకతీయ గణపతి చక్రవర్తి 
కాలానికి ముందును, కాకతీయ రాజ్యపతనానుంతరము దేశము తురకల వళమై 
నప్పుడును సమ్ముద వ్యాపారము _స్పంబించియుండెను. వేమారెడ్డి తమ్ముడు మల్లా 
రెడ్డి పేరుపొందిన శూర సేనాని, 


రెడ్డిరాజుల కాలము 1 05 


“ బాహాదర్పమునన్‌ |పతీపధరణిీ 
పొలావళిం దోలి, యు 
త్సాహోద[గుడు మోటుపల్లి గొని స 
ప్తక్వీప సద్వస్తు సం 
దోహంబున్‌ తనకిచ్చు నెచ్చెలి సము 
[దుం (బీతి కావించుచున్‌ 
మాహాత్మ్యంబు వహించె మల్తరథిని 
నాథుండు గాఢోదతిన్‌,” 
మోటుపల్లి సుప్రసిద్ద మగు ఓడరేవు. దానికి ముకుళపుర మను నామాం 
తర ముండెను, 
ఆంధులు సమ్ముద వ్యాపారము విశేషముగా చేసినప్పుడు తత్సంబంధ 
మగు సాంకేతికపదములు వాజ్మయములో నుండవలసియుండెను. కాని యట్టివి 
విశేషముగా (గంథస్థము కాలేదు. అయినట్టివి కౌన్ని కూడా జనుల కర్థము 
కానివై పోయెను. శ్రీనాథుడు కొన్ని నౌకాజాతులకు పేరులను [వాసెను. 
అందుచే నాపద్యము చాలా ముఖ్యమైనది. అతడిట్లు వాసెను, 
"” తరుణాసీరి తవాయి గోవ రమణా 
స్థానంబులం జందనా 
గరు కర్పూర హిమాంబు కుంకుమ రజః 
క స్తూరికా (దవ్యముల్‌ 
శరధిన్‌ కప్పలి, జోంగు, వల్లి వలికా 
సమ్మన్న్హ , దెప్పించు న 
ర్పరియై వై శ్యకులోత్తముం డవచి తి 
పృం డల్పుడే యిమ్మ హిన్‌.”! 
పై పద్యములోని కప్పలి అరవములోని కప్పల్‌ పదమనియు, జోంగు 
అనునది తూర్పు సముదములోని ఓడ అనియు ఆపదమే ఇంగ్గీషులో (Junk) 
అయ్యెననియు, అవి పెద్ద ఓడలనియు, వల్లి వలికాపదాల కర్ణము తెలియ 
దనియు, సమ్మను పదము మలయా ద్వీపకల్పము లో ఓడకు పదమనియు, రెడ్డి 
రాజ్య చర్మితమందు తెలిపినారు. 
గ హరవిలాసము కృత్యాదులు. బి. Hist. R. K. Page 405-6. 
(14) 


ల. ఆ. వ 
ల 


106 ఆంధుల సాంఘిక చరిత 


“నము[ద వ్యాపారమువల్ల రెడ్డి రాజులకు చాలా గొప్ప లాభముండెను. 
అంతకు ముందటి అరాచక స్థితుల వలన మోటుపల్లి వర్తక మాగియుండెను. 
రెడ్డి రాజులు కాంతిని నెలకొలిపి, సుంకరివారు వ ర్రకులదోవిడి చేయకుండ సర 
కులప్రై సుంకములు నిర్ణయించి, కొన్నింటి ఐ తగ్గించి, కొన్నింటిపై తీసివేసి, 
అందరికినీ తెలియుటకై మోటుపల్లి తీరములో శాసనము (వాయించి యుంచిరి. 
అప్పటి భాష్క అప్పటి వ్యాపారము తెలియజేయి నాళాసనము నిందుదాహ 
రింతురు. 


“స్వస్తిశ్రీ శకవర్గంబులు ౧౨౮౦ అగు నేటి విళంబన సంవత్సర 
శావణ శు ౮ మంగళవారం స్వస్తి శ్రీమతు అనపోతయ రెడ్డిగారు మోటుపల్సి కాపు 
వచ్చిన వ్యవహారాలకున్న వ్యవహారం వచ్చి కరపట్టాల దీపాంతరాల వ్యవహా 
రాలకున్ను యిచ్చిన ధర్కకశాసనం,." 


ఈ మోటుపల్లికి యెవరు కాపతనానికి వచ్చినాను వారిని మన్నించి పెద్ద 
కానికె పెట్టువారము. వారికి భూమితోటి కాణాచియిచ్చువ రము. వారు యెప్పుడు 
మరివొక తావుకు పొయ్యేమన్నాను. కాపని పట్టక ఆనిపిపుచ్చువారము. యేపూరి 
సరకు తెచ్చి నాను తమ విచ్చలవిడి నమ్మ వలసినట్లు సరుకుకొనువారికాని పోగా 
పునకు పల్‌ సనిసర్కు. ఆడపట్టెము, చీరాను, గండము, పపడము, పట్టి వ్యవ 
హారాలకున్ను అపుతికమున్ను సుంకాదాయము మానితమి బంగారు సుంకము 
మానితిమి. గంధముయొక్క బది సుంకము పూర్వుమర్యాద లలోను మూటను 
ఒకటి మానితిమి. ఈ సరకులకున్ను మెట్టసుంకాలు పూర్వమర్యాదలు |క మాననే 
కొనువారము. ఈ |క్రమానకు సర్వమైనవారున్ను విశ్వసించెదరు. దేవర వారికి 
ఆభయహ స్ప మి స్పీమి.” 


“మోటుపల్లికే వర్తకులు వచ్చి నివసింపగోరినను వారిని గౌరవించి వార 
లకు భూములు నివేశ స్థలము లిపింతుమనియు వారిని నిర్బంధ పెట్టి నిలుపక 
స్వేచ్చగా విడుతుమనియ ఏయూరి సరకు తెచ్చినను వారిని స్వేచ్చగా 
నమ్ముకొన నిత్తుమనియు, పన్నులకై వారి సరకులను _గహింపమనియు 


| నాశాసనమున వాయించి (పకటించిరి.” 


1. ఆం[ధుల చరిత, భా ౩ పు ౧౬౯, ౧౭౦, 


రెడ్డిరాజుల కాలము 107 


కుమార గిరిరెడ్డి నుగంధభా.డాగారియు, ఉదారుడును, భక్తుడును, సర 
సుడులు, కొటీశ్వరుడును నగు అవచి తిప్పయ చరిత శ్రీనాథుని హరవిలాసము 
వల్ల తెలియవస్తున్నది. అట్టి మహాధనికు లింకెందరుండిరో తెలియదు. తిప్పయ 
సెట్టియొక్క ఘనతను శ్రీనాథు డనేక విధముల (పకటించినాడు. ఆ సెట్టి యే యే 
దేశాలనుండి యే యే సరకులను తెప్పించెడివాడో యిట్లు తలివీనాడు. 


* పంజార కర్పూర పాదపంబులు తెచ్చె 
జలనో౦గి బంగారు మొలక తెచ్చె 
నింహళంబున గంధసీందురంబులు దెచ్చె 
హురుముంబి బలుతేబి హరులు తెద్నె 
గోవసంశుద్ద సంకుమద [దవము దెచ్చె 
యాంపకట్టాణి ముత్యాలు తెచ్చె 
భోట కస్తూరికాపుట కోసములు దెచ్చె 
చీని చీనాంబర _శేణ్‌ తెచ్చె 
జగద గోపాలరాయ వళ్యాభుజంగ 
పల్ల వాదిత్య భూదాన పరశురామ 
కొమరగిరి రాజదేవం[దు కూర్మిపాతుడు 
జాణ జగజెట్టి దేవయ చామి సెట్టి." 1 


పె పద్యములో గోవా, చీని, సింహళము, హురుముంజి | పర్షియాలోని 
వుర్ముజ్‌ రేవు) అనునవి మృాతము మనకు తెలియును. తక్కిన వాటిన గురించి 
రెడ్డి రాజ్యముల చరితలో ఇట్ట తెలిపినారు, 
a య 


“పంజార --సుమ్మతా దీవిలోని సన్‌సార్‌ అను పట్నము 

జలనోంగి---మలయాలోనిదై యుండును. 

యాంప---సింహళాని కుత్తరమున నున్న జాఫ్నా అనునది. దీనినే: 
యాల్చన, యాప అనిరి, 

భోట._.ఇండియాలోని భూటాన్‌" £ 

], హరవిలాసముం క్ఫత్యాది పద్యాలు, 

2, Hist. R. K. Page 409-412, 


108 ఆంధుల సాంఘిక చరిత 


సటీవచి తిప్పయ “తరుణాసీరితవాయి గోవరమణాన్థానము” ల నుండి 
థ(దవ్యములను తెప్పించెను. ఆ [ప్రదేశము లేవియో ఆ చిక్కును గూడ 
శ్రీ మల్ల ౦పల్లి వారే విడదీసినారు. 


“తరుణాగరి-__మలయాద్వీపకల్పములోనిది. దాని నిప్పుడు టెనస్సరిం 
(Tenassarim) అని యందుకు. 


తవాయి (T120౪) ఇదియు మలయాలోగిది. 
రమణ పెగూలోని రమన్న దేశము.! 


వ్యాపారము చేయువారిలో బలిజలు, కోమట్లు ముఖ్యులు, బలిజళ బ్లము 
వణిజశబమై యుండును. పూర్వము బలిజలకే సెట్టి ఆను బిరుదము౦డెను, 
తర్వాత కోమటులును వారివలెనే పధానమగా వ ర్రకులై నందున వారు సెల్టిదిరు 
దమును స్వీకరించి యుందురు. 


పెద్ద పెద్ద గామాలలో వారమున కొకమారు సంతలు సాగుచుండెను. కొన్ని 
సంతలలో (పత్యేక వస్తువులు మాతమె యమ్ముచుండిరి. 


“_..మూటెడు పాలకు నూనె సంతలో 
గొన జనుదెంచి బియ్యమున 
కున్‌ సరితై లము పోయుమన్న నా 
తనిపలు కెవ్వరున్‌ వినక...“ 


అను మాటలనుబట్ట ఆ కాలమున నూనె నంతలవంటి (పత్యేకపునంత 
లురిడెనని తెలియును. మరియు ధాన్యమిచ్చి కావలసిన సరుకులు కొనిరనియు 
బియ్యమునకు సరి తె లము లభింపకుండెననియు "తో లేడుమా ని కెలకుం దెలము 
మానెడు పురమ్ము ధారణ "5 అనియు తెలియవసున్నది. ఎడు మాని కెల వియ్యా 
నిక ఒక మానికె నూనె, అప్పటి బజారుధర. ఆధారణను (హిందీలో నిప్పటికిని 
ధారణ్‌ అందురు) పురములోని వర్తక్కళేణి నిర్ణయించియుండెము. 

1. Hist. R. K. Page 412-413. 

వ, కేయూర బాహువర్మిత, ఆ ౨వ. 

8. కేయూర బాహుచరి త, ఆ ౨. పంం. 


రెడ్డిరాజుల కాలము 109 


తెనుగుదేశము సన్నని నూలుబట్టలకు (పసిద్ది. రుదమదేవి కాలములోని 
సన్నని నూలుబట్టలు మహారాజులకే తగినట్టివని పాక్చాత్యయాం|తికు లానాడే 
(వాసిరి. తెనుగు దేశమందంతటను నూలుబట్టల వ్యాపారమే అ|గస్థానము వహిం 
చెను. ఇంటింట రాటమాడుచుండెను. కదురాడిన, కవ్యమాడిన యింటికి దరిద 
మెన్నడునూ ఉండదని పెద్దలనెకివారు. హాదులలో పతి శ్రీ యు రాటముపై 
వడకుటను నేర్చియుండె ననవచ్చును. బీదలు తమ యవసరాలకు నరిపోగా 
మిగిలిన దారపుకండెలను ఆమ్ముకొంటూ వుండిరి* అవి వసా౨లుగా సిద్ధమై 
తూర్పు పడమటి దేశ డేశాంతరాల కెగుమతి యపుతుండెను. పల్నాటిలో, 


"రంభయెన యేకులె వడకున్‌" 


అనుటచే ఆ సీమలో శ్రీ లందరును వడికిరన్నమాట. అయితే తూర్పు 
తీరములో ఉ త్రమజాతులవారు వడుకకుండిరేమో + 


నూలుణట్ల్టలేకాక, పట్టుబట్టలును బాగా వ్యా వ్రిలో నుండినట్లు కానవస్తున్నడి. 
వట్టులో ఆనేక భేదములుండిను. “చందనకావులును, పట్రైడుకావులును, చెంగావు 
లను, కదంబకావులును, కరకంచులును, దొమ్ముంచులును, ముడు గుబొమ్మంచు 
లును, ముయ్యంచులును, చిలుక బాష్మను, వేటదాభును, నిండువన్నెలును, ఉబుత 
చారల వన్నాలును, గంటకి వన్నెలును, పుప్పొడివన్నెలున్కు రుదాక్షవన్నెలును, 
నాగాబంధములును, పూజాబంధములుకు, జలపంజరంబులును, కామవరంబులును, 
సూరవరంబులును, తారామండలంబులును, హంసావళులును, హరిణావకులును, 
తురగావళులును, గజావళులును, నసింహావళులుము, దౌపదీ స్టయంవరంబులును, 
లకీ విలా సంబులును, మదన వలాసంబులను, వసంత విలాసంబులును, రత్న 
కీ లితంబులును, రాయళ్ళ ౨గార ౦బులును, కనకదండెలును, గచ్చిలంబులును, 
కర్పూర గంధులును, పారువంపు గంధులును, (శ్రీతో పులుగు, (శ రామ 
తోపులును, (శ్రీకృష్ణ విలాసంబులును, జీబులును, సుగిపట్టంబులు ను, సన్న 
వలిపంబులును, వెలిపట్టలును, హొంబట్టును, పులిగోరుపట్టునుు ఉదయ 
రాగపట్టును, నేతపట్టును. వ|జషట్లును అను పేళ్ళుగల పుట్టంబులు! ఆ కొల 
మందుండిను. “అరుదైన పసిడి హంసావళివన్నె; జిగిజిగి ధగధగయను 
వీనాంబరంబు" అని గౌరన వరి-చెను. (నవనాథచరిత పుట ౪.) 
తకాలితో నననననాననననను 


1. సింహాసన ద్యా|తింశిక, భా ౧ పు ౭౪ 


110 ఆం[ధుల సాంఘీక చర్విత 


పెన పేరా నబడినవాటిలో ప్రత్తి తినూలుబట్టలును పట్ట బట్టలును కలవు. 
నూలుబట్టలలోని ఆంచుల ఖేవము లందు తెలుపబడినవి, (దౌపదీ స్వయం 
వరము Hees (శ్రీకృష్ణ ఆను పేరులు కలవి అంచులు కావేమొ! కొంగులపై 
క బ్రిపలకలము చెక్కిన బొమ్మలను రంగుల పై అచద్చువేయు చుండిరేమో! 
కామవరము, సూరవరము అను పేరులు చెప్పుటచే, ఆ రెండుస్టలాలు 
బట్టలకు (పసిద్ధి చెందననవలెను, 


ఇన్ని పేర్తుకల అంచులన గురించి చెప్పునప్పుడు రంగుల పరి శమ 
విశేషముగా నుండెననుట స్పష్టమే. చెంగావి. అనునది లేతవన్నెయె 
యుండును. కరకంచు అనుటచే కరక్కా యచెక్క తో వన్నె వేయుచుండి 
రేమో! (ఆ తర్వాత నూ. రా. నిఘంటువును జూడగా ఆందుొకరక్కాయ 
నీటితో (వాసిన అంచు” ఆని యుండుట గాంచితిని,) బొమ్ముంచు అనిన 
తెల్లదిరల యెరఆంచు. చిలుకచాళ్ళు ఆనుటచే చిలుక పచ్చనివన్నె వాడి 
రనవచ్చును. ఉజత యన ఉడుత, దానిచారలవంటి వన్నెలుండెను. రుదాకత్ష 
| వన్నె యిప్పటికినీ వాడుకలో కలదు. నీలిమందు చేయుట చాలా [ప్రాచీన 
పరిశ్రమ. ఆ రంగు అన్ని రంగులకన్న మిన్నయైయుండెను. సీలిరంగు 
' హిందువులే క్రనీ.పెట్రిరని దానికి ఇండిగో అని పాళ్చాత్యులు పేరు పెట్టిరి 
మంటజిష్ట, బక్క, పసుపు మున్నగునవి రంగులు చేయుటకు వాడుతూ 
వుండిరి. పట్టులో నీలిపట్టు ఆనుటచే దానికి సీలిరం గిచ్చి రన్నమాట. 
హొంబట్టు అనుటఓచే. జరీఅంచులుకల పట్టు అని యర్ధ్థమగును. రంగులచెయు 
వృ త్రివారు ఒక కులముగాకూడా తర్వాత యేర్చడినట్టు కానవస్తున్నది. 


“బంగారువాోత నిండుమాదావళి దట్రిగట్టి” 1 యని వర్ణించిన దాన్ని 
బట్టి జలతారుఆంచు కల క విలవర్ణ పుకా సెదట్టి అనగా శేనెడు వెడల్పు 
కలది. జెల్లీలు నడుములో బిగించుచుండిరని తెలియవచ్చెడి. ఇపుడు 
దట్టియన స్రీలు కట్టకొను చీరయని యర్షము. కాన ఆకాలమందు 
సడుము పట్టికి దట్టి యనిరి. 


విదేశములనుండి మన తెనుగు దేశములోనికి దిగుమతియగు వస్తు 
వృలకు ఇదివరకే యుదహరించినాము. అవేవో తెలుసుకొందుము, కుమార 


1 చరిగొండ ధర్మన్న చితభారతము, అ౨ ప ౬కు 


రెడిరాజుల కాలము 111 


గిరిరెడ్డికి వసంతరాయడను బిరుద ముండకు. ఆతనికన్న పూర్వుడగు రాజు 
కును అదే బీరుదమున్నను ఇతనికే అది _(పధానమయ్యెను, ఇతడు 
ఏటేట వసంతోత్సవములను చేగాపుండెను.  ఆందు కర్పూరమును విశే 
షముగా ఎగజల్సినవాడగుటచేత కర్పూర వసంతరాయడను వబవిరుదము 
కలిగెను. ఈ యుశ్సవాలకు కావలసిన సుగంధద9వ్య ములను జూవ్హా సుమి 
తా9ది తూర్పు దీపులనుండి తెప్పించదుటకును వాటి) పెద్దభవనముల లో 
నింపి సుగంధభాండాగారాధ్యక్షపదవిని నిరకహించుఓకును ఆవచి సెట్లు 
నియుక్తులె యుండిరి. “అమ్మహారాజునకు పంతిసంవత్సరంబును వసం 
తోత్సవంబుల కస్తూరీ కుంకుమ సంకుమద (జవ్వాజి) కర్పూర హిమాంబు 
(పన్నీరు) కాలాగరు గంధసార (చందనము) (_పధానంబులగు సుగంధ 
దంవ్యంబు లొడగూర్చియు చీని సింహళ తవాయ హురుమంబి జోణంగి 


పిభృతి నానావ్వీపనగరాకరంబుల దిప్పించు చుండెను, సుగంధ 
ద)వ్యములన్నియు ఇండోనీషియా దీప్పంనుండియే నేటికి? వస్తూవుగ్నవి. 
అ కాలములో, చువికాక సింహళ మునుండి ఐఏసుగులు, హుఊఆమంబజి 


(పర్షియా ఆభాతరరము) నుండి గుర9ములు వచ్చెను. పూర్ణము గురాలకు 
పర్షియాదేశమే |పసిద్ధి. తురక సులానుల సేనలో _ గురాలెక్కువగా 
నుండెను. రెడ్డిరాజులు, విజయనగర రాజులు గుర్రాలను కొనుటలో 
చాలావ్యయము చేస్తూవుండిరి. ముత్యాలు సింహళమునుండియే దిగుమతి 
యయ్యును. చీనానుండి పట్టుబట్టలు వచ్చెను. 


రెడ్డిరాజులకు నిరంతరము పక) రాజ్యాల రాజులతో యుద్ధా 
లుండినందున వా రాయుధములను విస్తారముగా  చేస్తూవుండిరి. కమ్మరి 
వారే ఆయుధాలు చేయువారు, కుంపటిలో చిన్న చిన్న లోవాములను 
కాచి ఆయుధాలు చేయుచుండిరి. ఆ యుధాలలో కత్తి, ఛురిక, బల్లెమ్కు ఈదె, 
బాణము ముఖ్య మైనవి. పంచలో హములతో జయ సంభములను, ఆయుధములను 
చేసిరి. రాజుల కొలుపు చవికెలొను కూడ పంచలోహములలో చేసిరి”. ఆంధ 


1 హరవిలాసము. కృత్యాదులు. 
౨ “పంచలోహ కల్పితం బగు నతని కొలువు చవికె” 
భోజరాజీ యము, ఆ, ౨. ప. ౧౧౩, 


$12 ఆం'ధుల సాంఘీక చరిత 


దేశమందనేక స్థలాలలో ముడిలోహమును భూమినుండి (తవ్వి, వాటిని కరగించి 
ఇనుమును సిద్ధము చేసిరిందానినుండి యుకు[మటూడ సిద్ధము చేసిరి. 


గ వయ్యంది గాచి కమ్మరి 
చయ్యన బద నిచ్చు నుక్కు చ[కము మోడి, న్‌. 


(వయ్యంది అనగా కుంపటి.) తెలంగా ణాలో నిర్మల కత్తులు జగద్విఖ్యాతి 
కాంచియుండెను. అచ్చటి కతులు అచ్చటి యుక్కు డెమాస్కస్‌ నగరాని 
కెగుమతి యగుచుండెను. మెరుగు టద్దాలుకూడా సిద్ధమవుతూ వుండెను, వాటిని 
శుభము చేయుటకేమో మెరుగురాతి పొడిని వాడినట్లు కానవస్తున్నది. 


“మెరుగు టద్దంబుల నంటిన మెరుగురాతిపొడియును వోలెన్‌”? ఆనుటచే 
నిది ఊవ్యా మవుతున్నది. 


ఓరుగంటిలోని వెలివాడలోని మేదరి పడచులు కూడ “అలతి యదపు 
బిళశ్ళయన వోక ఏక్షించు"”చుండిరి. (కీడాభి ) దీనినిబట్టి అద్దాలు చిన్నవి పెద్దవి 
వీదవారి యందుదాటులో నుండునంతటి చౌక వస్తృవులు, అద్దముల నెట్లు సిద్ధము 
చెయుచుండిరో ఆ పరిశ్రమ యెచ్చ టెచ్చట నుండెనో యదిమాతము తెలియ 
రాలేదు. 


(వాత విశెషముగా తాటాకులపయిననే జరుగుతూ పుండెను. తాటాకు 
లపై (వాయు లేఖినిని గంటము ఆనిరి. దానిని నానా విధములుగా సిద్ధము 
చెస్తుండిరి. వాయని రెండవ కొనను ఆకుల చెక్కుటకు క త్రిగానో లేక అంద 
మైన రేఖలతోనో సిద్ధము చేసెడివారు. మం[తులు, సంపన్నులు బంగారు గంట 
ములతో |వాసిరి, 


* కలము పనీండీ గంటమున 
కాటయ వేము సమక్షమందు, స 
తృలముగ రాయస|పభుని 
బాచడు [వాసిన [వాలమోతలన్‌ 


= సింహాసనద్వాతింశిక, భా. ౧ పు, ౭౮. 


1 
లి మును en శా! ప డిజి 


రెడ్డిరాజుల కాలము 118 


గలు గలు గల్లు గల్లు రన 
కంటక మం|తుల గుండె లన్ని యున్‌ 
జలు జలు జల్లు జల్లు రనె 


సత్కవివర్యులు మెలు మే లనన్‌."! 


వడిగా (వాయుట, ముత్యములవలె నుద్దుగా [వాయుట తాటాకుల (గంథా. 
లకు చాలా యవసరమై యుండినందున ఆ కాలమువారి వాతలు చాలా సుంద 
రముల్లై యుండెను. అట్టివారిలోకూడా కాటయవేముని (వాయసకాడు (రాయసం) 
అగు బాచమంత్రి అత్షర రమ్యత మరీగొప్పగా పొగ డ్ల కెక్కెను. 


తాటాకులనే [పధానముగా వాడినను జనులకు కాగితము అలవాటు తెలియ 
దని కాదు, 


~ దసా9లుం మసిబు[రలున్‌ కలములుం 
దార్కాన్న చింతంబళుల్‌ 
మున్నగునవి శ్రీనాథుడు చూచియే యుండెనుకదా | 


“ కన్నుల పండువై యమరు 
కాకితమందలి వర్ణ పద్ధతుల్‌ “£ 


అనుటచే రాజులు, మంతులు కాగితముల వాడుచుండిరి. కాగితళబ్బము 
కాగజ్‌ ఆను ఫార్సీ శబ్దమునుఎడి వచ్చినది. అనగా ఈ పర్శ్మిశమను తురకలు 
తెచ్చిరన్నమాట. ఆదిలో కాగితములను కనిపెటినవాగు చీనావారు, కాన వారి 
నుండియే తురకలు ఆ విద్యను నేర్చిరి. నేటికిని చేతికాగిత పరిశమ విశేషముగా 
తురకలలోనే కలదు. 


తాత్కాలికముగా పనియిచ్చునట్టి వ్యవహారములందు పలుపురు తాటాకు 
లపై మసిలో అద్దిన, గలుగు కలములతో [వాసెడివారు. 


వనన సుధాసలంబున కవిం|దులు కొందరు శేముషీ మనీ 
రసము మనః కటాహ కుహరంబుల నించి కలంచి జిప్వాకా 


1. ఒక చాటువు, 
౨. థీమేశ్వర పురాణము, ఆ ౧. ప ౭౪, 
(15) 


114 ఆం[ధుల సాంమీక చరి[త 


కిసలయ తూలికం గొని లిభింతురు కబ్బము లెన్నగా మహో 
వ్యసనముతో నిజానన వియ త్తల తాళపలాళ రేఖలన్‌” 


అని శ్రీనాథుడు వర్ణించెను. 


పూర్వము లెక్కలు వాయువారు కరణాల. యుండిరి. వారు మొదట 
పన్ను వనూళ్ళ లెక్కల కధికారులు కారు. ఆదిలో పన్నువసూలు చేయువారు 
విశ్వబాహ్మణులను కమసాలులు, నేటికిని ఆందందు వారు [గామ కరణాలుగా 
కనబడుతున్నారు. రాయని భాస్క్రరమంతి వారిని తొలగించి [బాహ్మణ నియో 
గులను ఏర్పాటు చేసెనని కొన్ని కథలు చెప్పుదురు. 


లెక్కలు వాయు కరణాలు అసాధ్యులనియు, దుర్మార్గ్లులనియు అనిపిం 
చుకొనిరి. వారు లెక్కలను “వహి” అను పుస్తకాలలో [వాయుచుండిరి. 
(నేటికినీ హిందీలో లెక్కపు_స్తకాలను బహి అందురు) వారు లెక్క లెట్లుంచిరో 
(Book KeePing) కొంత మనకు తిలియవనున్నది. “వాతకానిని నమ్మ 
రారు"! అన్న అపథ్యాతి వారి కుండెను. 


క॥ ఒకదెస దెచ్చిన యాయం 
బొకదిక్కున చెల్లు (వాసి యొకదెస వ్యయ మ 
ట్లొక దిక్కున జన [వాసిన 
[బకటంబుగ వాడు మిగుల పాపాత్ముడగున్‌. 


క॥; వదా వారణాసి యనగా 
మహి బరగిన దిందు కపటమార్గంబుగ నా 
గహమున |వాసిన వానికి 
నిహపరములు లేవు నరక మెదురై రమండున్‌. 


గ్‌! రాని ప్రెడి చెల్లుట వాయుట యాయంబు 
తక్కు-వై వ్యయం బ దెక్కుడౌట 
లెక్క తుడుపువడుట లిపి సందియంబౌట 
చెల్లు మరచుటయును కల్రపనులు. 


Saree 


1. సం, ద్వాతింశిక, భా ౨ పు, ౧౦౪ 


రెడ్డిరాజుల కాలము 1165 


క॥ కరణము తన యేలిక కుప 
కరణము, నిర్ణయ గుణాధికరణము, (పజకున్‌ 
శరణము, పగవారలకును 
మరణము నా బెల్లు నీతిమంతుండై నన్‌. 


కళలు 


ఓరుగంటి రాజుల కాలములోవలెనే ఈ కాలమందుకు కళాపోషణము బాగా 
జరిగెను. అంతేకాదు, ఈ కాలములో కళాపోషణము ఉచ్చస్థాయి నందెను, తుది 
రెడ్డిరాజులు వసంతరాజ బిరుదాంచితులగుట ఈ కళాపోషణమున కొక |పబల 
తర నిదర్శనము. కవిసార్వభౌముడును, ఆసేతువింధ్యా ది పర్యంతము తన 
కీడుజోడు లే డనిపించుకొన్న వాడును, బహుశా స్త్ర పురాణ పారంగతుడును, 
కవితలో నూతన యుగస్తాపకుడునునగు శ్రీనాథుడు విద్యాధికారియట ! అభి 
లాంధ వాజ్మ యమునకు పామాణికాచార్య తయములోనివాడ గు [పబంధ పర 
మేశ్వరుడు ముఖ్యాస్థానకవి యట ! శివలీలా విలాసక ర్హయగు నిళ్శంక కొమ్మన 
రెడ్డి రాజుల కీర్తనల చేసినవాడట ! సహస విధాననవాభినయ కళా శ్రీశో భిత 
లకుమాదేవి రాజసన్నిధిలో నిత్యనూత్నముగా నటంచినదట ! బాలసరస్వత్యాది 
మహాపండితు లాస్త్థాన దివ్యజ్యోతులట ! స్వయముగా రెడ్డి, వెలమపభులు 
కవులై, వ్యాఖ్యాతలై, సాహిత్యాచార్యులై సర్వజ్ఞులె సర్వజ్ఞ చ।కవర్తులైన 
దిగంత విళాంత యశొోవిళాలురట ! కర్ఫూర వసంతో త్సవములకు సుగంధ 
భాండాగారాధ్యక్షు లుండిరట ! ఇక కళాభివృరద్ధికి కొదువయుండునా * 


(పోలయవేముని ఆస్టానమున లొల్ల మహాదెవికవి యనునత డుండెనని 
మ్మాతమే మనకు తెలియును. (రెడ్డిసంచిక, పుటం ౫౧౮.) 


ఆయు ర్వేదమందు భూలోకధన్వంతరియని పేరుపొందిన భాస్కరార్యునికి 
పేదకోమటివేముడు అ[గహారములు దానము చేసెను, 
( రెడ్డిసంచిక ! పుట ౮౯.) 


నాలుగు “వేలు కలముతో నిచ్చినక వికి ఎనిమిది వేల నాణములిచ్చిన 
అనవేములు రాజులుగా నుండ కొంతవిద్య నేర్చిన వారందరును క వులెయైరి. 


1. సింహాసనదాషతింశతి, ౨ భా, పు, ౧౦౪, ౧౦౫, 


116 ఆం| ధుల సాంఘిక చరిత 


కొండవీటీలో నే సందులలో జూచినను విభూతిభస్మాంచితులును, నిరాకృతు 


లును నగు చిల్లరకవులుండుటను గమనించి శ్రీనాథుడు ఆకవులవలె తిరుగు 
గాడిదలను ఇట్లు |పశ్నించెను, 


యడిదబుంగవై యొడలు 
పోడిమి తక్కి. మొగంబు వెల్లన్రై 
వాడల వాడలం దిరిగి 
వాడును ఏడును చొ చ్చొచో యనన్స్‌, 
గోడల గొందులం దొదిగి 
కూయుచునుందువు కొండ వీటిలో 
గాడిద ! నీవునుం గవివి 
కాదుకదా! యనుమాన మయ్యెడిన్‌ !! 


రెడిరాజుల కాలములో నంస్కృతాం ధ పండితు లనేకు లుండిరి. ఆందు 
' కొందరికృతులే మనకు లభ్యమైనవి. మన దురదృష్టమేమో ఈ ౫౦౦ ఏండ్డలోనే 
శ్రీనాథుని బహుకృతులు, శంభుదాసుని రామాయణము, కుమారగిరి వసంత 
రాజీయము, ఇట్ట ముఖ్యమైనవి జాడలేకుండా పోయెను. బాలసరస్వతి అనునతడు 
ఆనపోతరెడ్డి యాస్థానకవియనియు, (తిలొచనాచార్యుడనునత ఈ అన వేముని 
ఆస్థానకవియనియు మాతమే మనకు తెలియవచ్చినది, పలువురి కవితలు శాస 
నాలలో మాతమే మిగిలిపోయినవి, |పకాళ భారతయోగి ఆనునతడు చక్కని 
శ్రాసనళ్లోకాలు (వాసెననిమ్మాతమే మనమెగుగుదుము. వెన్నెలకంటి సూర కవితో 
పాటు మహాదేవకవి యుండెనన్నంతవర కే యెరిగితిమి. అనపర్తి శాసనమందే 
అన్నయకవి పద్యాలు చక్కని కవితాపాకముగలవి మనమెరుంగుదుము. కాటయ 
వేముని శాసనము కవితలో (వాసిన శ్రీవల్హభుడను నతని చరిత మన మెరు 
గము. ఇంకెందరి విజ్ఞానసంపదను మనము కోలుపోయినామో యేమో ? (రెడ్డ 
యాశయములో ఎరా్య_పెగడ, (శ్రీనాథుడు, వెన్నెలకంటి సూరన, నిశ్శంక 
కొమ్మన అమ ,(పసిద్ధకవులుండిరి. వామనుభట్ట బాణుడను సంస్కృృతక వి వేమ 
భూపాల చర్మితమును సంస్కృతములో |వాసెను, రెడ్డిరాజులు స్వయముగా 
గిర్వాణములో వ్యాఖ్యలు, కవితలు[వాసిరి. కుమారగిరిరెడ్డి వసంతరాజీయమను 
నాట్యళాస్త్రమును |వాసెను. పెద కోమటియు నొక నాట్యళాస్త్రమును రచించె 
నందురు కాటయ వేమన కాళిదాస నాటకములకు వ్యాఖ్యలు (వా సెను. పెదకోమటి 


రెడ్డిరాజుల కాలము 117 


సాహిత్య చింతామణిని వాసెను ఈ రాజు వి శ్వేశ్వరకవి యనునతని క|గ 
హారము దానముచెసెను! అతడేమివాసెనో మనకు లభ్యము కాలేదు. [కొండవీటి 
రాజమహేం[దవర రాజుల వలెనే రాచకొండ వెలమరాజులుకు కపులై, పండి 
తులై, రచయితలై. కవి పండిత గాయక పోషకులై [పభ్యాతులై రి) ఆయితే 
రెడ్డి వెలమ పభువులలో కొందరు స్వయముగా రచనలు చేయలేదని ఒకరిద్దరు 
విమర్శకు లన్నారు. ఆది కొంతవరకు నిజమైనను ఆరాజుల విజ్ఞతకు కొట్టు 
కలుగనేరదు. (రాచకొండ రాజుల వద్ద మల్రినాథసూరి ముఖ్య పండితుడై 
యుండెను, 


రెడ్డ యాస్తానాని కాం ధపండితులేకాక, ఇతర భారతీయ (పాంతాలనుండి' 
అనేక పండితులు, కవులు, కళావే_త్తలు కొల్లలుగా వెళ్ళుతూవుండిరి,) అట్టివారిని. 
పరీక్షించి వారి యర్హతలను [వభువులను మనవి చేయుటకు (్రీనాథ కవిసార్య 
భఛెముడు సియుక్తు డై సతతము. కలన శల కొన్నింటిని అతడే (వాసి 
ఫిరంగిపుర కాసనములలో “ విద్యాధికారి శ్రీనాధో అకరోత్‌ ” అని[వానుకొనెను- ఎ 
మరియు తనను గురించి ముట్టు (వాసికొనెను. 


ళ( 


భాషించినాడవు బహుదేశ బుధులతో 
విద్యాపరీక్షణ వేళల: దు” 


(రాజుల యాస్తానాలలో పరీక్షాధికారులనుగా ఉద్దండ పండితకవులను 
నియమి స్తూ వుండిరని, 
6 అధిప్పు కొలువున నే బరీశూధికారి 
నగుట జేసియు సొర విపు దెగడిపుచ్చి' '& 
యనుదానినిబట్ట తెలియును. 
రాజులేకాక మం తులును బహుభాషా వే త్హలె యుండిరి. 
“ అరధీభాష తురుష్కభాష గజ కర్ణా 
టాం(ధ గాంధార ఘూ 
రర భాషల్‌ మళయాళిభాష ళఠభా 
షా సింధు సౌవీర బ 
1. సింహాసనద్వాతింశతి, భా. ౨, పు, ౫. 
ల eae 69 


113 ఆం(ధుల సాంఘిక చరత 


రర భాషల్‌ కరహాటభాష మరియున్‌ 
భాషావిశేషంబు ల 

చ్చెరువ్నై వచ్చు నరేటి యన్ననికి గో 
షీ సంపయోగంబులన్‌. 


అన్నయ మం్మతిశేఖరు డ 
హమ్మదుసేను వదాన్య భూమి భృ 
తృన్నిధికిస్‌ మదిన్‌ సముచి 
తంబుగ వేమ మహీసురేం[ద రా 
జో్యోన్నతి సంతతాభ్యుదయ 
మొందగ పారసిభాష |వాసినన్‌ 
కన్నుల పండువై యమరు 
కాకితమందలి వర్ణ పద్దతుల్‌. 1 


ఆ కాలానికే ఫార్సీ! పభావము తెనముగువారి పె పారంభమయ్యెను, ధక 
సింధు సౌవీర బర్భర కరహాట భాషలు వచ్చెననుట అతిశయో కియెయుండును. 
బర్భర అనునది బార్చరీ ఆను ఆ, ఫీకాఖండో తర భాగము. తురుష్కభాష అన 
ఫార్సీ యని యర్భమేమో ! ఆం ధుల చర్మితలో పైపద్యమందు “అహమ్మళాసన 
దానభూమి భృత్‌” అని |వాసినారు. ముదిత ఖీమేశ్వర పురాణపాఠమే సరిగా 
నున్నది. అహమ్మదుహుసేను లేక అహమ్మదుషా అనునతడు గుల్బర్గా బహమనీ 
సులాను, 

న్‌ కవులకు గొప్ప ఆదరణ సన్మానముండుటచే (శ్రీనాధుడు 
న అక్ష య్యంబగు సాంపరాయని తెలుం 

గాధీక ! కనూరికా 

విచాదానము జేయురో ! నుకవిరా 
డ్ఫృందారక [ళేణికిన్‌' 

దాశారామ చపక్యభీమ వరం 
ధర్వాప్పరో భామినీ 

వవోజద్వయ కుంభ కుంభములపై 
వాసించు నవ్యాసనల్‌.'' 


కేం ఫీమేశ్వర పురాణము. అ (౧, ప 2౩, ౨౨౪, 


రెడ్డిరాజుల కాలము 119 


అని కోరెను, ఈపద్యము శ్రీనాథునిదే! సందేహములేదు. 


“దాశారామవధూటీ 
వవ్లోరుచా మృగమదాది వాంభిత విలగ 
దక్షః కవాట బాంధవ 
రక్షావిధి వ;జపంజర కృపాజలధీ !l 


“* దక్షవాటీ ........ గంధర్వపురో భామినీ” £ 


“భశ 


దాషమారామ చశుక్యభీమ వరగంధ 
ర్వాష్సరో భామినీ, వక్షో జద్యయ గంధసార "లి 


అనుభాగాలను [వాసిన (శ్రీనాథుడు పై చాటువును చెప్పలి దనగలమా 
ఆకాలములో పండితులు చదువుకొనిన విద్యలు పెక్కులు-డెను. భారత రామా 
యణములు చదువని పండితులు లేకుండిరి. శ్రీనాథుసి కచిమానులగు గీర్వాణ 
వాణీకవులలో కాళిదాను, భట్టభాణుడు , పవర సేనుడు, హర్షుడు, భాసళివభ[ద 
సౌమిల్ల భల్జులు, మాఘ భారవి బీల్హ ణ మల్హ ణులు, భద్ది చి తన కవిద౦డి 
పండితులును ముఖ్యులు * మురారిని పేర్కొనలేదు కాని అతని సమాసాలు 
చాలా వాడెను. తెనుగులో నన్నయ తిక్కన కవులును, వేములవాడ భీమకవి, 
వృారాపెగడ అతనికి ముఖ్యులు. అతడ, (“వినిపించినాడవు వేమభూపాలున 
కభిలపురాణ విద్యాగ మములు "ర్‌ అని కీ ర్రసీయుడయ్యెను.) 


మరియు ““అభ్యర్తిత |బహ్మండాది మహాపురాణ తాత్పర్యార్థ నిర్ధారిత 
(బ్రహ్మజ్ఞాన కళానిదానము”6 అనియు పేరొందెను. డిండిమ కవిసార్వభౌము 
నోడించిన వాడెన్ని శాసా9లు చదివి యుండవలెనో యూహిందుడు, ఇతర 
పండితులును ఇన్ని కాస్తా9లు చదివినవార్డె యుందురు. ఆకాలములోని కొన్ని 
శాసా౨ల ముచ్చట యిట్టుండినుః 

1 భీమేశ్వర పురాణము. ఆ ౩+ 

2 లా అ ౧. 

శీ కాశీఖండము. అ ౧. 

4 ఖీమేశ్వర పురాణము. అ-ప. ౭. 

ల్‌ ఫ్‌ పః 


8 శృంగార నై షధము, కృళత్యాది. 


120 ఆంధుల సౌంమక చరిత 


సీ అష్ట భాషల మధురాశు విస్తర చిత 
కవితలు చెప్పు సత్కవులు మెచ్చ 
ఆమా్నాయములు నాల్గు అంగంబు లారును 
ఆభిల ళాస్త్రంబులు నవగతములు 
నూతన రీతుల ధాతు వి భమముల 
రసములు మెరయు నరక మువాడు 
ఏ పురాణంబుల నేకథ యడిగినం 
దడబాటు లేక యేర్పడగ జెప్పు 
ఓలినవధానములు వేనవేలు సూపు 
శబ విజ్ఞానినై నను సరకుగొనదు 
గౌతమునినై న దొడరి తర్క-మున గెలుచు 
అవధరింపు మీకీరంబు నవనినాథ ! 


కళళ 


దై టుగ్య్మ్యజాసామాధర్యణంబులందును, భికోక ల్న జ్యోతి 
ర్నీరుక్త వ్యాకరణ చృందోంబుః ందుకు, మీమాంసాదులగు తత్వావబోధనంబు 
లందును, (బొహ్మంబు, శై వంబు, పాద్యంబుు, వై షవంబు, భాగవతంబు, ఖవి, 
ష్యత్తు నారదియంబు, మార్కండేయంబు, ఆగ్నేయ ౦బు, (బహ్మక్రైవర్తవంటు, 
లై ంగ౦బు, వారాహాంబు, సాాం౦దంబు వామనంబు గౌతమంబు, గారుడంబు 
మాత్స్యంబు, వాయన్యంబు ఆను మహాపురాణములయందును, నారసింహంబు 
నోరదంబు, శివధర్మంబు మహెశ్యరంబు, గాలవంబు మానవంబు, |బహ్మోం 
డంబ్కు వారుణ కాళికంబున్కు సాంబంబు, సొరంబు, మారీచంబు, కూర్మంబు, 
డ్రాహ్మ భార్గవ సౌర వైవ్లవంబులు నను నువపురాణములందును._--- తనకు 
నత్యంత పరిచయలబు” 


పెపురాణాలలో ఎన్ని మూలబడినో ఎన్ని కొత్తవి సృష్టీయయ్యెనో 
తెలుసుకొనుటకుకూడా వీలుకలుగుతున్న ది. పలువురు రాజులు ““లమ్మీయుత్స 
వమలు” చేస్తూవుండిరి. ఆ సమయాలలో వారు కళావేత్తల కుదారముగా 
దానాలు చేసిరి 


నానన నరానికి మానము సానా నావదే వనక నానా నకననుననననని 
1. షోడశకుమార చరితము, ఆ, ౬, ప ౧౩, ౧౬. 


రెడ్డిరాజుల కాలము 121 


* అవని నవంతిభూమి వరు 
డాదగ వార్జి వులెల్ల లక్మీ యు 
త్నవములు మున్నుగా కడు (ప 
శ _సమలౌ సమయం౭బుళందు స 
త్కవులను పాఠకో త్తముల, 
గాయకులన్‌, నటులన్‌, వితీర్ణవై 
భవముల దన్వజొచ్చిరి [ప 


ఆపు లూ ముకు రాఅ Mh 9] 
భావసమృద్దుఖ నింపు పుట్రగన్‌. 


కవు లన భవించిన వైభవముల కొన్ని శ్రీనాథుడు తెలిపినాడు. వారికి 
రత్నాంబరములు, కస్తూరి, హేమప్పాతాన్నము, దినవెచ్చముు మున్నగునవి 
లభించెను! వెన తెలిపినవి విశేషముగా [బాహ్మణుల ఏద్యలై. యుండెను, 


“ బాహ్మణు లట విద్య నభ్యసించుచుండిరో శ్రీనాథుని యీ।|కిండి 
వాక్యము తెలుపును. 


“మథుర యను వట్టణంబున శివశర్మ యను వి|పో త్రముండు గలడు. 
అతడు వెదంబులు నదివి, తదర్ధంబు లెరింగి, ధర్మళాస్త్రంబులు పఠించి, పురా 
అఆ౨బు లథిగ మించి, యంగంబు లభ్యసించి, తర్క-ం0బు లాలోడీంది, మీమాంసా 
దాయం బాలోచించి, ధనుర్వేదం బవగాహించి, నాట్యవేదంబు (గహిందచి, 
యర్గకా స్త్రంబు (పాపించి, మం|తశాస్త్రంబులు తెలిసీ, భాషలు గజచ్చి లిపులు 
నేర్చి, యరం బుపారించె" 

థె జ 
(కాశీఖండము, ౩-౨౯) 


(రాజులు కావ్యనాటకాలను, సాహిత్యళాస్త్రమును, సంగీతనాట్యళాస్ర్రము 
లను ఎక్కువగా నభ్యసించి రనుటకు రెడ్డిరాజులు (వాసిన శాస్త్రాలు, చెసిన 
వ్యాఖ్యలే పథ మసాక్ష్యములు. అవికాక వారికి అశ్వశిక్షణము, అశ్వశాస్త్రము, గజ 
శాస్త్రము, రాజనీతి, యుద్దతం(త ము ముఖ్యమ.లైన విద్యలు, రాజనీతిని గూర్చిన 
శాస్త్రములు సంస్కృతములో నెక్కువగా నుండెను, తెనుగులో మడికి సింగన 
సకలనీతిసమ్మతము వాసెను. ఆందతడు పలువురు తినుగు సీతికపుల నుదహ 
రించెను! ఆకవులలో పెక్కుకవుల [గంథాలు మనకు లభించుటలేదు. 


1. సింహాసనద్వా తింళిక్క భా. ౨, పు, ౨౭. 
(16) 


122 ఆం|ధుల సాంమిక చరిత 


(సంగీత నాట్యశాస్త్రములలో కొన్నిరచనలు రాజులే చేసిరి. కుమారగిరి 
వసంతరాజీయ రచనల కుదావారణముగా అతని యుంపుడు క తెయగు లకు 
మాదేవి నాట్యము చేస్తూవుండెడిది./ 


జయతి మహిమా లోకాతీతః కుమారగిరి (పభోః 
సదసి లకుమాదేవీతాస్య (పియాసదృశీ| పియా 
నవ మభినయం నాట్యార్థానాం తనోతి సహస్రధా 
వితరతి బహూ నర్భానర్థి పజాయ సహ|సశ 


ఎందరు లక మాబదేక్చలు కాలగర్భమున నణగిపోయిరో యేమో! “తురకల 
పారసీకనృత్యము దేశమందు [పచారమై జనుల నాకరించుట చేత పెదకోమటి 
వెముడు తరనాట్యశాస్త్రమ లో ఒక క్రొ తనృత్యముసికు అనగా పారసీక న్నర్తన 
మునకు 'మత్రల్తినర్హనము' అను పేరు పెట్టివర్లించెను.”! జనసామాన్యములో 
అనేక విధములగు నృత్యము లుండెను. వాటిని ముందు తెలుపుదును. 


(_ సంగీతములో జనసామాన్యానికి “జత్మిగామ” విధానముపై ప్రితియుండె, 


నట, 


ష్‌ దుుత తాళంబున వీరగు భీతక ధుం 
ధుం ధుం కిటాత్కార సం 
గతి వాయింపుచు నాంతరాళిక యతి 


[గామాభిరామంబుగా” 


అని |క్రీడాభిరామములో వర్చించిరి. యతి అనునదే జతి. యతితద్భవమే 
జతి. యతి అనునదియు, (గామ అనునదియు వివిధమగు స్వర భేదములు, 


రెడిరాజులును, వెలమ రాజులును గొప్ప కోటలు, దేవాలయాలు నిర్మించి, 
అపూర్వ భవనములుకూడా కట్టించిరి. కొండవీటి దుర్గము మహాదుర్గములలో 
నొకటి యని [పథభ్యాతి కాంచినల్టిది. అందు చాలా మేడలుండెను. వాటిలో ' “గృహ 
రాజూ” మేడ ఒంటి స్థంభము మేడ అను (పసిద్ధికలద్దై యుండెను. నేటికిని 
“గ రాజుమేడ” అను దిబ్బను జనులు చూపుచుందురు, అంతేకాదు, వారు క్రీడా 
—— WH RK K. Page 282 


™ 


\ 


రెడ్డిరాజుల కాలము 1£8 


సరస్సులను, లీలగ్భహాలను క టైంచిరని ఆనప ర్తి శాసనము తెలుపుతూ ఉన్నది. 
సరస్సులనుండి చెరువులలో చిక్నపడవల వేసుకొని లీలావిహారమచేసి నవాబుల 
వలె రెడ్డిరాజులు కొందరయినా (అందు కుమారగిరి తప్పకుండా) ఆనందించిరి. 
కొండ వీటిలో కొల్లలుగా మల్లెలు పూఏ, తమ సౌరభము వెదజల్లుతూ 
వుండెను. ఆ పువ్వుల పన్నీటిని వీధులలో చల్లిన్తూవుండిరని జనులనుకొందురు. 
అనుకొనుటయేల, వారి యనుభవము పై పజలే తమకు తోచినట్టుగా పదముల 
కట్టి పాడ. కొనిరి. 


నాకు లభించిన యొక జానపద గీతికాశకల మిట్లున్న ది. 


స రెడ్డొద్చె రడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా! 
ఏరభ దారెఢి విచ్చే సెనమ్మా | 
(పొద్దున్నే మారెడ్డి పొర కూడిపించు 
నిలువెల్ల నడిఏధి నీరు జల్రించు 
సందుగొందులలోన సాను వో యించి 
చేక ట్ల పసుపు కుంకుమా పూయించు 
రంగవల్లుల నూరు రాణింపజేయు 
తోరణా పంకులా తులకింపజేయు 
దివ్వెలను వెలిగించు దివ్యమార్గాలా 
మా పెల్లి పాలించు మంచి మార్గాలా 
ఎండలకు పందిళ్ళు వేయించుతాడూ 
పొందుగా మా రేళ్ళు కోయించుతాడూ 
ఊరి బావులలోన ఉప్పుసున్నాలా 
వెదజల్లు నేటేట నిండుపున్నానా.... 


జనుల పరిపాలన యెంత పీతిపాతమై, జనోపయుక మై, సకలానురంజక మై 
యుంచెనో టె పాట అనేక విధాలా స్పష్టిక రిస్తుంది, ఇట్టిపాటలెన్ని అనాద్భుత 
ములై మాయమెపోయెనో యేమో! రెడ్డిరాజులకాలపుకళ నవాబు దర్జాతో 
కూడినదని చెప్పవలెను. 


124 ఆం[ధుల సాంఘిక చరిత 


పజాజీవనము 


ఆ కాలపు [పజల వేషాదికము లెట్టివో, ఆచారా లెట్టివో, జీవితవిధానము 
లెటువంటివో, విశ్వాసము లెటువంటివో కనుగొందము. 


సాధారణముగా జనులు ధోవతి కట్టువారు శకూదజాతీలో రాయలసీమ 
తలంగాణములందు చల్లాడ ములు తొడుగుతూ వుండిరి. దుప్పటియు గుండు 
రుమాలయు సాధారణవేషాలు. కొందరు చుంగుల లవేటా రుమాలల కట్టిరి. 
పలువురు నడుములో బెత్తెడు వెడల్పున ఏడెనిమిది మూరల పొడవునుకల కాసె 
(దట్టిని) బిగిస్తూపుండిరి* వారికి అంగీలు లేవనికాదు, వాటివాడుక తక్కువ, 
అంగీలు నిడుపై బొందెలు కలవై యుండెను. కవుల వర్ణనలలో కొందరి వేషా 
లెట్టివో తెలియవచ్చెడిని. గారడిపనిచేయుబంటును నిట్టు వర్షించిరి. 


“ అయ్యెడ నొక [కొత్తయైన మవావీరు 
డిందియ డాకాల లమర బూని 
బాగుగా పులిగోరు పట్టు, దిండుగగట్టి, 
నునుపార మెన చందన మలంది 
తిలకంబు కస్తూరి తిలకించి, చొ ళఇెంబు 
చెంగులపొగతో చెన్నుమీర 
హనుమంతు (వాసిన యరిగబిళ్ళయు, వాలు 
గరమఃల జయలక్ష్మీ గడలు కొనగ 
నొక డువచ్చె వనుక నొక్క బింబాధరి 
అందు దుప్పటి ముసు గమరబెట్టి 
మేనికాంతి కప్పులోన (గిక్కి.రియంగ 
హంసయాన యగుచు నరుగుదేర.” ! 


పె పద్యములో పులిగోరుపట్ప అనగా పులిగోరు వన్నెవంటి పట్టు అవి 
యర్థము. పట్టులలో కొన్నిభేదము లుండెననియు, అం దిదొక్కటియనియు 
తెలుపనయినది. దిండుగట్టుట యన సెల్లగా చంక్యకిందనుండి మెడపై వైచు 
కొనుటకర్ణమై యుండును. పై పద్యము దిగువనే ”(దిండుతోడగూడ మొండెము 


1. సింహాసన ద్వాాతింశిక, భా ౨. పు, ౧౦౮. 


రెడ్డిరాజుల కాలము 125 


దిగదొ రై” లని వర్ణించినాడు, చొళ్ళిము అనగా జడచుట్టవలె చుట్టిన తలపాగ, 
జెట్టలు “నేటికిని మెడలో హనుమంతుని విగహముకల బిళులు కటుకొందురు. 
ఆరి గదిళ్ళ యన విళుదుగా కట్లు కొన్న బిళ్ళ యని యరదరము, 

థి 


శ్రీనాథుడు మొరస దేశమును వర్షించెను. మొరనయన మైనూరు 
(పాంతమనీ (శ్రీ మల్లంపల్లివారు, రెడ్డిరాజుల చర్మితలో ఒకచోట అన్నారు. 
(శ్రీ వేటూరి _పభాఃరళాద్రిగారు మొరసరాశ్ళెక్కు_వగానున్న కర్నూలు మండల 
మనిరి, 


3 


మొలని రాజ్య మెనూరు సీమ. (స్రైనాథు డా|పాంతమునకు వెళ్ళి 


యుండినటు ఈ కింది వర్తన ates 
వ, య ఓ 


“ వంకర పాగలున్‌ నడుము 
వంగిన కత్తులు మెలకోకలున్‌ 
సంకటి ముద్గలున్‌ జరుప 
శాకములున్‌ బలు వచ్చడ౦బులున్‌ 
తెంకగు నోరి చూపులును 
 తేకుప దప్పిన యేసబాసలున్‌ 
'రంకుల [బ్రహ్మ యీ మొరస 


రాజ్యము నెట్లు సృబించె సక టా | 


విజయనగిరరాజుల దర్భారీవేషాలు విచితమ గా నుండెను. పొడవయిన అంగీ 
ధరించి పొడవైన టోవీని (కుల్లాయిని పెట్టుకొని పెద్దసెల్లా మెడలో వేసుకొని 
పోవలసియుండెను, కార్యార్థియైన శ్రీనాథుడును ఆ వెషమును వెనుకొనక తప్ప 
దయ్యను. 


“కుల్లా యుంచితి, కోక చుట్టితి మహా 
కూర్చాసమున్‌ దొడిగితిన్‌ ” 


అని తెలుపుకొనెను. కుల్లాయి మనదేశ వేషమా లేక తురకలనుండి 
అనుకరించిన వేషమాయని సందేహము కలుగును, కుల్లాయి అనున దించుమించు 
మూరెడుపొడవుదై తల క్రిందుగానుంచిన కాగితముపొట్టమువలె నుండునట్టిది. 
ఆ కాలపు అళియ రామరాజాదుల చిత్తరువులనుచూచిన తెలియరాగ లదు, 


1£6 ఆం|ధుల సాంఘీక చరిత 


కుల్లాయిశబ్ద్బము ఫార్సీ కలదా శ బ్రమునుండి వచ్చినట్టున్నది. ఫార్పీలో కులాహ్‌ 
అనగా టోపి. మన వాజ్యయములో టోపి యనునది భట్టుమూర్హి కాలమునుండి 
అనగా విజయనగర పతనానంతరము వచ్చినట్లు కానవచ్చును. టొప్పికాయను 
పదమును మొదట వాడినవాడు చాళుక్య సోమెళ్వరుడు. రాజులకు టోవీని 
ధరించుట ముఖ్యమని ఆతడు అభిలషితార్థ చింతామణిలో (వాసెను. 


వెలమరాజుల యాస్థానమునకు పోవుటకుకూడా దర్భారీ వేషము వేను 
కొనుట యవసరమై యుండెను. ఒకమారు (బహుశా మొదటితడవ) కోలాచల 
మల్లినాథసూరి సర్వజ్ఞ సింగభూపాలుని దర్శనార్థమె వెళ్ళును. రాజుగారి కొలువు 
కూటమునకు (దర్బారు) వషములేక వచ్చెనని కంచుకి లోనికి పోనీయలేదు. 
ఆప్పుడు మల్రినాథు డిట్లనెనట, 


* కం దారుణా వంకరటింక రేణ 
కిం వాసనా చీకిరిబాకిరేణ 
సర్వజ్ఞ భూపాల పిలోకనార్హం 


వ్‌ దుష మెకం విదుషాం సహాయః॥” 


ఆ మాటను అదే కోలాచల (కొలమచెలమ) వంశమువాడగు పెద్రిభల్టు 
అన్నాడని శృంగార శ్రీనాథములో |వాసినారు. గోలకొండ వ్యాపారులను 
నియోగికాఖవారు గోలకొండ రాజ్యములో (తెలంగాణములో) ఏర్పడిరి. వారి 
వేషభాషలను గూర్చి శ్రీనాథు డిట్లనెను. 


ప దస్తాిలున్‌ మసీబు[రలున్‌ కలములున్‌ 
దార్కాన్న చింతంబళుల్‌ 
పుసుల్‌ గారెడి దుస్తులున్‌ చెమట కం 
పుం గొట్టు నీర్కావులున్‌ 
ఆ _స్రవ్య స్పపు క్ర న్నడంబును భయం 
బై తోచు గడ్డంబులున్‌ 
వస్తూ చూ స్తిమి రో స్తిమిన్‌ సడమటన్‌ 
వ్యాపారులన్‌ [కూరులన్‌ .” 


దస్త్రము అనునది ఫార్సీ ద ఫ్రర్‌ అనుపదము, నిన్న మొన్నటి వరకు 
తెలంగాణములో మూరెడు బొంగు లొట్టలో గలుగు దంటుకలాలు పెట్టి ఆ 


రెడ్డిరాజుల కాలము 197 


బొంగు మూతికి మూడు ఆం'ధాలు వేసి దారాలుకట్టి వాటిని కొండ్లుకల ఇత్తడి 
మసిబుడ్డికి కట్టివారు. మనిని పతి (గామమలో జనులే సిద్దము చేనుకొంటూ 
వుండిరి. కలము అను పదము ఫార్సీ, ఖలం అనుదానినుండి వచ్చిన దను 
కొందురు, కొని సంస్కతమ లోనే కలవశళశబ్దము లభి గర్థములో వాడుతూ 
వుండి రి. తెలంగాణాలో గోలకొండ న్యాపారులు కన్నడము మాట్లాడినవారు 
కారు. బళ్ళారి, రాయచూరు (వాంతాలలోనే రరణాలు కన్నడము మాట్లాడేవారు. 
వారిని గూర్చి యే యీపద్యము చెప్పెనేమో ! కాని భయంబై తోచు గడ్డాలు 
వారెందుకు పెంచిరి. అది తురకల పరిపాలన [పాబల్యముండు [ప్రాంతాలలో 
అనుకరించిన వేషమో యమో? 


_“దిచ్చు” అనగా జూడరియని సూ. రా. నిఘంటువులో (వాసినారుః 
దిచు?ల వష మిటు౧డెను, 
జ) ౧ 


కీ చెంగావి వలిపెంబు చెలువుగా ధరియించి 
దళముగా మేన గంధంబు పూసి 
తిలకంబు కస్తూరి తర్చి జాదుల కలి 
గొట్ట ల పొడవుగా కొప్పు వెట్టి 
కంపుదుప్పటి గప్పి యందియ డాకాల 
గీలించి పువ్వులకోల వట్టి 
నిద్దమౌ కుచ్చుల యుద్రాలు కిరని 
మోయగా నుల్లాసమున జెలంగి 
నలుగు రేవురు సంగడీ లెలమితోడ 
పోకలాకులు నొడిలోన బోసికొనుచు 
జాణతనమున నట్టహాసములు వొలయ 
పెచ్చు రేగుచు కొలువగా వచ్చె నొకడు, 
వచ్చి గుడిసొచ్చి యందరు 
దిచ్చులు తన తిండికొరకు తీపులు వెట్టన్‌ 
మెచ్చుచు వేడుక యాటల 
నచ్చోటం (బొద్దుపుచ్చి యల్లిన మగిడెన్‌ +! 


గొలల లక్షణా లిటుండెను, 
య ap) 


1. సింహాసనదాా!తింశిక, భా, ౨ పు. ౮౪. 


128 ఆం|ధుల సాంఘిక చరిత 


“పీలపాగ, మొలలో పెట్సకొన్న పిల్లన గోలు, మూపున గొడ్డలి, 
ముసుగు వేసుకున్న గొంగడి, చేత గుదియ మెడలో గురిజపూసల పేరు, 
బొంగుకోల, కాసెదటి. బెబ్బులుల వొకిట్టు బదనికలు, జింక కొమ్ము, జల్లి 

లు (= న, 
చిక్కము, కాపు కుఠ్కలు” ఇవ ఒక గొల్ల పరికరములు. 
(నవనాథ-పుట ౨౭) 


గొల్లలు గొర్ల మందలనేకాక ఆవులనుకూడ కాచెడివారు “తొలికోడి 
కూయగానే లేచి తన తోడిగొల్లలతో జేరి ఆవుల పేర్లు పెట్టి పిలిచి పాలు పిదికి 
నగరికి వంపి తర్వాత మేపుత కై పొలాలకు వాటిని తీసికొనిపోయి, దొంగల 
నుండి మెకములనుండి రక్షించి మాపటి వరకు మరల ఇల్లు చేరెడివారు. దూడ 
చచ్చిన అపులను సేపునట్లు చేయుట, కడుపురోపలనే దూడ చచ్చిన ఆవులకు 
మందులిచ్చుటయు వారరిగయుండిరి. ఆవులకు వచ్చు రోగా లెట్టవనగా, 


ప hy 


నరుడు కన్నును నీరు నాలిక చేర్లు 
గురుదెపులును గంటి కురుమ కట్టూర్చు 
కప్పనావురు గాలి గట్టి పల్‌ తిక్క 
పుప్పి పంపర యూడు బొడ్డు బొల్లూత 
మొలవిడెసెల తెవులు ముకుబంతికనవటు 
తలయేరు తొడకు వాతము కల్లి వాపు 
నలదొబ్బ దెవులును నాదిగా నెన్న 

గల పసరాల రోగములకు నెల్ల 
మందుల బెట్టరు, మంతింప తవులు 
కందువుగని చూడగా నెర్తు నొప్పు” 


వనాథ* పుటలు ౨౯, ౩౦ 


అ కొలములో పింజారులుండిరి. వారు ఇస్తాం మతములో అప్పటికి చేరి యుండిరో 
లేదో! టిప్పూ సులాను కాలములోనో జొౌరంగొజేబు కాలములోనో వారు బల 
వంతముగా మతము పుచ్చుకొన్నవారని కొందరందురు. వారు రెడ్డిరాజుల 
కాలములో మతము మార్చియుండరనుకొందును. కాని వారివృ త్తి ఆనాటినుండి 
ఏక్షటయే. దూదేకుట చేతనే వారికి దూదేకు వారనియు పేరువచ్చెను, 


రెడ్డిరాజుల కాలము 199 


ఉర్వి మెరయించు కార్చాస పర్వుతంబు 
చేరి మర్టించె నొక్క పింజారి తరుణి.” 


అని (శ్రీనాథుడు వర్ణించెను. బొందిలీలు ఒక వీరభట కులముగా తెనుగు 
దేశములో అప్పటికే వచ్చి నిలిచిపోయిరి. బుందేల్‌ ఖండము(Bundel Khand) 
అను ఉత్తర హిందూస్థాన |పాంతమువారు సైన్యములో యుద్ధభటులుగా చేరి 
జీవించుటకై అంధ కర్ణాట రాజుల సేనలో విరివిగా చేరిరి. వారి గ్రీలలో 
జనానాపద్ధతి యుండెను. అందుచెత శ్రీనాథు డొక బొందిలీ మందయాన నిట్లు 
నర్హించెను. 


“వన్నెలగాగరా, చెలగు వటువ కుచ్చిళులందు పాదమల్‌ 
సన్న పువారి భంగముల సంబున నీగెడు వాలకూర్మముల్‌ 
గన్న తెరంగుదోప కరకంజములన్‌ మునుకుం బిగించి (ప 
చ్చన్న ముణాబ్బయె నడచె చంగున బొందిలిభామ గోయినన్‌. 


గాగరాయన లంగా. బొందిలీలకు “జనానా” ఆనాడే అలవడియుండెను. 
అనాటి న్రీల వేషభూషణాలలో ఎక్కువ భేదము కానరాదు, ముక్కునత్తు, 
వడ్డాణము, దానికి గజ్జెలు గొలుసు లుండుట, అందెలు (నూపురములు), (తీస 
రములు (మూడువరుసల దండలు), కంకణము, తాటంకములు (కమ్మలు), 
ముక్కుర (ముత్యాలవి, రత్నాలు ఫొదిగించినవి), ఇవి సాధారణ భూషణములు, 

'““వీసపు ముక్కున త్తు, నర వీసపు మంగళనూత మమ్మినన్‌ 

కాసునురాని కమ్మ లరకాసును కానివి పచ్చపూసలున్‌ 

మాసినచీర గట్టి యవమాన మెసంగగ నేడ రాగ నా 

కాసలనాటివారి కనకాంగిసి చూచితి నీళ్ళ రేవునన్‌.”' 


“ముక్కున హురుమంజి ముత్యాల ముంగర 
కమ్మ వాతెర మీద గంతు లిడగ' 


అను చాటువులు పెక్కు. కలవు. శ్రీలు కాటుక సర్వ సాధారణముగా 
పెట్టుకొనుచుండిరి. నేటికిని బిడ్డల మొదటిసారి భర్తలిండ్త కంపితే వడి నింపి 
నప్పుడు కాటుక డబ్బి యిత్తురు. 
(17) 


180 ఆం|ధుల సాంఘిక చరిత 


“బంగారు (నెర) చీరలు”, “కుసుమం బద్దిన చీరకొంగులు”, *ీచందుర 
కొవి రవి కలు”, “యమనారైకలు” మున్నగునవి వారి వస్త్రములు, గాగరా 
(లంగా)లను బొందిలీలే కట్టిరి. వారు తెకుగువారు కారు. 


బోగమువారు దాక్షారామములో, భీమవరములో, విశేష వసిద్దితోనుండిరి. 
దాశ్షారామములో పెదమున్నూరుగుంపు, చినమున్నూరుగుంపు అని బోగమువారి 
తెగలు రెండుండెను. 


లో 


రపతి......భూతలమిచ్చె....... 
=. ఆందక్షవాటికావరువకు 
భీమనాధునకు వారవధూ [తిదశద్వయంబుతో ” 1 


జనుల యిండ్లనుగురించి ఆ కాలపు వాజ్మయము కొంత తెలుపుతున్నది. 


* దో సెడుకొంపలో పసుల తొకిడి, దుమ్మును, దూడ రేణమున్‌ 
పొసిన వంటకంబు, పసి బాలుర శౌచము, వి స్పరాకులున్‌, 


మాసిన గుడ్డలున్‌, తలకు మాసిన ముండలు, వఓకుండలున్‌, 
రాసెడు కర్జెలున్‌ దలపరాదు పురోపాతు నింబికృత్యమున్‌ “ 


ఇదీ పల్నా టిసీమలోని ముచ్చట. తూర్చుతీరపు జిల్లా: లో నిట్టిది లేకుండి 
యుండును. పురోపాతుని యిల యింత యింపుగా ఉ: జే శూచులయిం డ్రిం కెంత 
కంపుగా నుండెనో ఏమో? పల్నా టిసీమలోను, దానికి నరిబోలు కర్నూలు, 
కడప, అనంత పురప్ప జిల్లాలలోను, రాయచూరు బళ్ళారివంటి కన్నడ జిల్లాల 
లోను, వాటి కంటిన బపబఖపదేశాలలోను నేటికిని ఓక దురాచార మున్నది. 
ఆదేమనగా, వ్యవసాయకులు పకువులను ఇండ్లలోనే కట్టివేయుదుకు. మరియు 
దొంగలభ యముచే ఇండ్లకు కిటికీలు పెట్టరు, (పొచీన మందును కిటికీలే రాజ 
భవనాల కులడెనో యేమో, కాని జనుల యిండ్లకు “గవాక్షములు” ఆను మిద్దెలేని 
బొ(రలే గాలి వెలుతుర్ల కాధారమమునట్టివి.2 


ఇండ్ల నమూనాలుకూడా పెన్టై బిగించునట్లు ఒకే మోటు నమూనాపై 
కట్టుతూ వుండిరి. సంపన్నులు మా[తము పశువులను వేరే యింటకట్టి కాముండు 


1 భీమేశ్వర పురాణము, అ, ౫, ప, ౮౪, 
2 “భోజనాగార గవాక మార్గంబుల వెడలి” కాశీఖండము. 


రెడ్డిరాజుల కాలము 1] 


యిండ్ల లోపలిభాగములో చతుళ్శాలాభవంతిని కట్టుతూ వుండిరి. పడసాల 
(వరండా), మొగసాల (Entrance Hall) యింటిముందరుగులు, దొడ్డివాకిలి, 
పెరడు ఇపి సాధారణమమునవి. ఇండ్రకును కొన్ని వాస్తుకాస్త్రములు బయలు 
దెరెను. వాటి లెక్క. |పకారము దూలము కూలలేకుండా వాకిండ్డ సంఖ్య బేసిగా 
ఉండకుండా, యెన్నెన్నో నిబంధన లుచేసిరి. సాధారణముగా వంటళాలను తూర్పు 
గానే పెదుతూ ఉండిరి. ఇండ్లు కట్టితే అందలి స్దంభిలకు పెండ్లి చేసే 
బాహ్మణుని పిలిచి స్వ స్పిచెప్పించి పుణ్యాహవాచనము చేయించి శాంతికై 
బంధువులకు, బీదలకు, రుబ్యాన్నముల విందునిస్తూ వుండిది, ఇండ్లకు పశుబలుల 
నిస్తూ వుండిరి. ఇండ్లలో నొక గదిలో చిల్లర వస్తువులుంచుటకు క పైెపలకలలో 
నొక పెద్దఆడ్డగూడు (అల్మారి వంటిది) నిర్మిస్తూవుండిరి. దానిని అట్టుక 


(అట్టుగ, అటిక, ఆటువ) అనిరి. 
ళు లు 6 


““పగలెల్లన్‌ వెలినిచ్చి రాతి రరుదా 
భంగిన్‌ సగ రాంబు, అ 


టుగమిదన్‌ వసియించి" |! 


అను నిదర్శనములు |పబంధాలలో చాల కలవు. బట్టలు ఆరవేయుటకు 
పొడవగు బొంగులను మిద్దెకు | వెలాడ గప్టెడివారు. వాటిని దండెలసిరి, 


“దండియపె నిడ్డ తపనీయమాలిక 
భుజము సోకిన దాని బుచ్చికొనుచు"* 


ఆని యొక కవి వర్ణించెను. ఇచట మాలిక అన దండ, బంగారుదండను 
దండెమ కొనకు తగిలించి యుండిరని ఆర్థము. వాస్తు శాస్త్రములలో సర్వతో 
భద, స్వస్తిక, పుష్పకాది నామములు, గృహనిర్మాణ విభదములను తెలుపునవై 
యుండెను, రాజులు తమ (పాసాదములకు, కొలువు కూటములకు శుభనామము 
లిస్తూవుండిరి. శ్రీకృష్ణదేవరాయల సభా భవనము పేర్కు “భువన విజయమై” 
యుండెను. పీరభదారెడ్డి సౌధంబు పేరు “తై 9లోక్య విజయము.” 
1 కేయూర బాహుచరిత ఆ. 3, ప ౨౩౯ 


2 సిం. ద్వాతింశిక, భా ౨ పు, ౮౮. 


182 ఆం[ధుల సాంఘిక చరిత 


“తె9లోక్య విజయాభిదంబై న సౌధంబు 
చం దళాలా పదేశంబు''! 


అని శ్రీనాథుడు తెలిపియున్నాడు, 


కొలమును గడియలతో లెక్కి స్తూ వుండిరి. పగలు ౩౦, రాతి ౩౦ ఘడి 
యలుగా ఒకటినుండి ౩౦ వరకు ఘడియలను రాజుల భవనాల మోసాలపె 
కొట్టుతూ వుండిరి. వాటిని విని జనులు కాలమును తెలుసుకొంటూ వుండిరి. వివా 
హాదులందు నగరాలలో దొరల నగళ్ళలోని గంటలను విని జనులు శుభకార్యాలు 
జరుపుకొనిరి. ఆవి లేని పల్లెలలో పురోహితులు “గడియకుడుక "లను (గిన్నె 
లను) నీటిపైనుంచి అవి నిండి మునుగుక్షణనులో వివాహాది కార్యాలను జరుపు 
చుండిరి, 


“తదుతృవానందరసనిమగ్నంబగు....శుభలగ్నోదయ సమయ 
సూచకం బగుచు జలంబులందు మునుగు తామ ఘబికాపా(త్ర 
నిరీక్షించి మంగళాశీర్యాద పురస్సరంబుగా సుముహూ ర్హంబ 
నుచు మౌహూ ర్తికుండు జయభంటపై నషితలు చల్లిన" 


"కంగున గంటపై కొడుపుగక్కున వై చుడు తూర్యనాదముల్‌ 
నింగియు ది క్షటంబులును నిండగ విపుల వేదనాద ము 
ప్పొంగి చెలంగుచుండె”8 


“గడియకుడుక భంగి [గిహరాజు జలధిలో 
[వాల చుక్కలు దల బాలు గాగ 
కెంపు హోమవహ్ని క్రియ నొప్పగా ద్విజ 
రాజు పెండ్లియాడె రాతి సతిని” లీ 

అని పలువురు సమకాలికవులు విశదముగా వర్జించి తెలివీనారు. 


సహగమనముమధ్య వచ్చిన ఉ తరహిందూస్థానాచారము. మహమ్మదీయుల 
అత్యాచారాలు ఏమూలనుండిన అచట యా యాగారానికి అకివ్యాపి కలిగెను, 


1 కాశికాఖండ ము-కృత్యాది. 
2 భోజరాజీయము, అ ౪ప౯౨, ౯౩. 
లి సింహాసన ద్వా(తింకిక, ౧భా, పు, ౧౦౨ 


రెడ్డిరాజుల కాలము 199 


ముఖ్యముగా ఇది కాశ్మీర, రాజపుతస్థాన, పంజాబు దేశాలలో [పబలమయ్యెను, 
తర్వాత బెంగాలులో _పబల మయ్యెను. దక్షిణ దేశములో కాకతీయుల కాల 
ములో, రెడ్డిరాజుల కాలము లో [పారంభమై అరుదుగా నందందు జరుగుటకు 
మొదలయెఃనని తలంతును. సింహాసనద్యా తింశిః లో డికబంటు తనభార్యను 
రాజువద్ద రక్షణార్థముంచి యుద్ధాని కేగుదునని చెప్పి గాలిలో మాయమయ్యెను. 
వెంటనే పెనుండి వానిఅంగాంగములు ఛిన్నములై రాజుముందట పడెను. 
అప్పుడు వాని భార్యసహగమనము చేతుననియు సెల విమ్మనియు రాజును 
కోరెను. రాజు వలదని పలువిధముల వారించెను. ఆమె వినక ముష్కురించెను, 
తుదకు విధిలేక రాజు సెలవిచ్చెను, అని విపులముగా వర్తించినారు. సహగమనమే 
సాధారణాచారమె యుండిన ధర్మమును పాలించు [పభువే వలదని వారింప 
బోవునా? ఆ శ్రీ నహగమనాగసర ఒనుగూర్చి ఆంత పెద్దగా నుపన్యసించునా ? 
దాని [పచారమునకై పెంచిన వర్ణన యని తోచక మానదు. ఆమె యిట్లనెను, 


“ ఆకులపాటుతోడ అశు 
భాకృతియె యొక వేళనై న, పో 
కారును లేక, సొమ్ము లకు 
సరులు సాపక, పేరటంబులన్‌ 
పోక తొరంగి, పూతలును 
షవ్వులు దూరముగాగ ముండయై 
యేకడ జేరినన్‌ విధవ 
కెగ్గులె కాక తరింపవచ్చునే | 
ప చచ్చియు చావక తన 
వెచ్చుచు నియమముల నింక విధవాత్వమునన్‌ 
నిచ్చట మాడుటకంటెను 
చిచ్చురుకుట మేలు సతికి &తి మెచ్చంగన్‌ .” i 


సతియను “ఘోరాచారము తెనుగు గడ్డ పె పాదుకొన్నది కాదనీయే తలం 
తును, పై పద్యములో విధవకుండు కష్టాలు చాలా చక్కగా కివి తెలిపినాడు. 
అందు “పేరటాలు” అనగా సహగమనము చేసిన “సతి” కి అర్థమని (్రీమల్ణం 
పల్చి సోమశేఖరశర్మగారు తమ రెడ్డి రాజుల చరి[తలో (వాసినారు. 'పేరటాలు 


1. సింహాసన ద్వాత్రింశిక, భాం ౨, పు. ౧౧౦. 


134 ఆంధుల సాంఘిక చరిత 


అన ముత్తెదువయే. ముభైదువయే సతియగుట చేత దూరాన్వయముగా ఆట్లు 
బెప్పినారెమో కాని వై పద్యములో “పేరటంబులను పోక తొరంగి” అనుటలో 
విత ౦ంతువును శుభకార్యాలలో చేరంటము పిలువరనియు, సహగమనము 
చేయువారు అరుద్దె వై ధవ్య బహువిధవ్యధలకు గురియైన వితంతువులే బవాం 
ళమై యుండిరనియు స్పష్టమవుతున్నది. ఆధునాతన ననాతన వాజ్మయమందుము 
ఆచారమందును పేరంటముగా పిలువబడిన ము త్రెదువకే పేరటాలు అను నిదర్శ 
నాలే కానవస్తున్నవి. “రెండవ దేవరాయలకు ౧౨౦౦౦ భార్యలుండి రనియు 
ఆతడు చచ్చిన అంగు ౩౦౦౦ మంది భార్గల్లె నమ సహగమనము చేయవలసి 
యుండు ననియు నికోలా కౌంటు అను యూరోపు యా|తకుడు [వా నెను. ఆత 
డింకను ఇట్లు వాసెను. “'నతి లేక సహమరణము ఈ విజయనగర సామా 
జమ. లో వ్యాపించినది. సతిని భర్త చితిపై కాల్తురు. కొందరు భర శవముతో 
పాటు భార్యను సజీవముగా పూడ్చివేయుదురు.” సహగమనము విరివిగా లేకుండె 
ననియు, కొన్ని పెద్ద కులాలలో ఆడి వ్యాప్తికి [పౌారంభమయమిు యుండెననియు, 
తలంపవచ్చును, 

మద్యమ లు ఆనేక విధములై నవి |పజలు సిద్దము చేసుకొనుచుండిరి, 
గౌడీ, వైష్టీ మార్వీ మొదలై నవి (ప్రాచీనులు వర్టంచినారు. ఆవికాక మరికొన్ని 
విధములై.నవి రెడ్డిరాజుల కాలమందుండను, 


““ఒక్కైడం గొందరు సుంవరులు పానగోమ్షికిం గడంగి, కాదంబంబును , 
మాధవంబును, ఐతవంబును, జీరంబు, ఆసవంబు, వార్షంబు, రతిఫలంబు 
లనపాక భేదంబుల మూలస్క ౦ధ కుసుమ ఫల సంభవంబుల బహువిధంబుల 
మధురంటులె న మధుపిశేషంబులెల్లం బగమళ (దవ్యమిశితంబుగా గూర్చి 
పాతంబుల నించిరి.'” 1 


పె మద్యభేదములో మాధవము యన ఇప్పసారాయి, ఐక్షవ మన చెజకు 
(బెల్లము) రసముతో చేసినగౌడీరనము, ఆసవముయన సాధారణముగా వైద్యులు 
చేయు మద్య(దవ్యము* కాదంబము, జీరము, వార్షము, రతిఫల మన నేమియో 
తెలియదు. నిఘంటువుఆ(దును ఈ పదాలు లేవు. ఈమద్యములను చెట్ట వేర్లతో 


Cal 


1 సింహాసన దాా!తింశిక, భా ౨ పు ౧౦౩ 


రెడ్డిరాజుల కాలము 185 


కాని, పువ్వులతో కాని, ఫలములతో కాని చేస్తూ వుండిరని కవియే తెలిపినాడు, 
మద్యములలోని కొన్నింటిని (పొఢకమల్లన ఇట్లు తెలిపెను 


శారరంబు, నూనజము, గుగ్గుసుమఘృత జంబు, నారి కేళజంటు, మాది 
కంబు, ఫలమయంబు, గౌడ తాళమయంబు, నాదిగా తనరు నాసవములు. 


రుక్మాంగద. 8-౨౨౭ 


అల్బరి పొడియాపులు వాలియ్యక పొడిని తన్నిన వాటికి తలకోలకటి 
అనగా (తాడుతో కొమ్ములకు బిగించి, దానినొకకోలను కట్టి, దానిశోవడదిప్పి 
పట్టి పాలు పితికెడువారు.! 


జషలలకో పరునవెదిపై__-లోహాల నన్నింటిని బంగారు పట 
రసాయన [కియ పె--విళ్తానము మెండుగా నుండెను. భోజుడు సర్పటి య 
సిద్ధుని మోసగించి ధూమవధి యను స్పర్శవెది [క్రియను నేప్పలళొనెుని . 
రాజీ యములో అనంతామాత్యుడు వర్తించినాడు. ఒక కోమటి) మోసగించి 
వేమారెడ్డి ఆ విద్యను నేర్చి కొండవీటి రాజ్యమును న సాపించెనను కథలను ఆనేక 
విధములుగా జనులు చెస్పుకొని రి. అదెంత సత్యమున్నదో చెప్పుశాఅము, ri లయ 
వేమునికి పరునవేదియో, తత్సమాన నిధియో యేదో దొరికినట్టే నమ్మవలెను. 
[పోలయవేముని వ మంచాళ్ళ శాసనములో (శా Ws ౧౨౬౨౫౯ |కీ, న ౧౩౪౦లో) 
ఇట్లు (వాసిరి. 

యద ఉచ యా స్వర్ణకర [ప పసిద్దిం 


లద్ధ్వాన్న మాంబా పతి రాబభూవి 


ఈ స్వర్దకర పసిద్ధి యెట్టిదో తెఒపలేదు, కొండదిటి దండకవిలెరోను 
దీన్నిగురించిన ఒక కథకూడ |వాసినారు. 


హిందువులలో క్రీస్తు శకాదినుం4యో లేక బౌద్దశకాది నుండియో స్పర్శ 
వేదిని కని పెట్టుట క్రై క న కొన్ని ఓషధుల మ; పసరుచీర్చి అంమ 
ఇనుము, ఈగ వంటి లోహాలు వేస్‌ పుటాలు పెట్టి కరగింది వెండి, బంగారు 
చేయుటకై చాలాపరిశోధనలు చేసిరి. సిద్దనాగార్జునుడు వెండి, బంగారు చేయుట 


అ 


1 సింహాసన ద్వా తింశిక* భా ౧. పు ౧౦౩. 
రః పష న. 
(ఆలరి మొదవులకును తలకోల కరడ చేరి పిదుకకొన తరమగునే) 


186 ఆం|ధుల సాంఘీక చరీ! త 


కనిపెటైకో లేదో కాని తన కాలమందు (పపంచ మందంతటను రసాయనశాస్త్ర 
వేత్త లంద[(గగణ్యుడని పేరు పొందెను. బీనాలో ఆతడు మహామహిమో పేతు 
డని పళ స్తి నిండుకొనిపోయెను. (క్రీ శ. ౧౪౦౦ (పాంతములోని రసవాద 
విద్యను గౌరన యొకచో నిట్లు వర్ణించెను. 


“(పచుర హమ,కియా పారీణులయిన వారల నెందు నెవ్వ్యారిగాన నేను 

బజరగు రస|గంధ పటలంబులందు ధాతువాదము మీద తహ తహ పుట్టి 
చేతి విత్తము మున్ను చెనటియైపోయ మంతవాదులకును ముదుమాకులకు 
యం[తవాదులకు సహాయకారులకు పలుతెరంగుల వెచ్చవడి యొాషధముల 
కలిపి రసంబుల కల్వుంబులందు కసదినగా నూరి కదడుగా బోసి 

వల పుటంబులు వెట్టి వినవిసనూద పెట పెట మని వడి పెటల పెల్టెగస్‌ 
మటుమాయమై పోవ మది తలపోసి యలసి ఈశ్వర బీజ మది కట్టువడనె 


యిల రసవాదంబు లేల సిద్ధించ్క 


నవనాథ. పుటం ౨౪౨ 


వాద భష్టో వైద్య,శేష్షః, రసవాదులమూలాన వై ద్యళశాస్త్రమైనా ఇంతో 
అంతో లాభం పొందినది, 


జనులలో అనేక విశ్వాసాలుండెను. పిల్లలు లేనివారు ఎన్నెన్నో పాట్లు 
పడిరి. బాలచందుని తల్లి విల్లలు లేక పడినపాట్లను చాలా విరివిగా పల్నాటి 
వీరచరి తమలో వర్షించిరి. ఆదే విధముగా ఇతర స్రీలు పలుపాట్లు పడుతూ 
వుండిరి. ఒక స్రీ సంతానార్థమై పడిన పాొట్టివి :- 


క భక్తితో మాతృ కాభవనంబులకు నేగు, కావించు నతిథిసత్కా రములను, 
వాయసంబులకు నిర్వలర్రించు దధిబలి, కొలుచు జ్యేష్టాదేవి నలఘు మహిమ 
చదివించుకొను పుణ్యసంహితా[వాతంబు, మూలికా మా ణిక ములు ధరించు 
తన్వంగి గంధాక్షతలు చిరంటుల కిడు, వి|పశ్నికల గారవించు దరచు. 
కుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు బాలుర కుతియ్యపండులు పంచియుచ్చు 
చెలులు తానునువతములుసలుపుచుండుతామర సనే[ తపు త సంతానకాంక్ష.! 

1 శివరాతి మాహాత్మ్యము, అ ౬* ప ౪౦ 


రెడ్డిరాజుల కాలము 187 


ద్రీలు గర్భవతు లెనప్పుడు : 
“మూడునెలల ముద్ద వెట్టిరి యలరు కుడుము లెదు నెలల బెట్లి 
రేడునెలల మొక్కి. రెగ్రపోలమ్మకు సతికి చూలువెళ్ళ జరుపుకొనుచు. 
“ఇంతిమది దలకుచు నెడమ[ పక, నిడిగి” మెదలెననుచు జెప్ప సుదతులంత 
చంటి జిగురుగోర సంధించి చిరజీవి యైన సుతుడుపుటై ననగ పొంగు 
కుమారుడు పుటినప్పుడు: 
“నినువుబొడఢుమీద పసిడిటంకం బిడి యొయ్య నాభినాళ ముత్తరించి 
ము త్తి యముల జేటముంచి యందిడు కనుదమ్ములందు సమ్మదము నిగుడ."” 


“కలి దోచి నూనె (వే లిడి తలపు రియయందు నేతితెలంబును, జొ 
తిలరించి మెత్తగా బొదు గలరించి కుమారునునిచి రా దాదు లటన్‌, 


“*“ కమమున దాదు లక్క డను ముప్పటిలిన జలకంబుదేర్చి యాచెలువసుతుని 
కొనరగ కాటుకయును చుక్క బొట్టును వొటించి యా గడపకు వెలుపటి 
పొదికిళ్ళ తవుడు నిప్పులు ప తిగింజలు నిడి యడ్డముగ చిట్టు పడిసి వెచి 
వెపరెమ్ములు గిళ్ళపెసలలోపల గించి కాపులు పురిటింట గట్టిచెసి 
వాయనముల కెల్ల వనితల రప్పించి వారుదెచ్నినయవి వరుసనంది 
పచ్చకప్పురంపు. బలుకులు వెట్టి విడియము లిబ్బ రింపు నయముగలుగ.ి"! 


పెండి సమయములో జరిపెడి యాచారములు (శ్రీనాథుడు యిట్లువర్ణించెను. 


“ వేడ్క. నృత్యంబు లాడిరి వీధులందు పాడి రెత్తిలి పిక కుహూ పంచమమున 
పంజళంబున ధవళ [ప్రబంధ గీతకమ ల నవ్వేళ కర్ణాట కమలముఖులు.”" 


ఈ పద్యములో ఎ_త్తిలి అన గట్టిగా అని శబ్రరత్నాకరములో వాసి 
నారు, ఎల్రిలి అనునది ఒక విధమగు దేన్సీగాన మని తోస్తున్నది. వంపిళము 
అనగా పాందాలీ గీతికా విశేషము. ధవళము అనగా పెండ్లిండ్లలో పాడు 
పాటలు. ధవళాలకు సువ్వాలకు అప్పకవి కూడా లక్షణాలు (వాసినాడు. 
నే బికిని కొన్ని యిండలో పెండిండలో ధవళాలు పాడుతారు. ఇంకా as 

ళో దర 
చెసిరనగా ;- 


1 సింహాసనద్వా తింశిక . భా ౧ పు ౫౯ా, ౬౦. 
(18) 


188 ఆంధధుల సాంఘీక చరిత 


'“పూజకుండలు నిల్పె పువ్వుబోడి యొకర్తు శుభ వితర్ణిక చతుష్కో ణములను 
జాజాల పాలెల సర్వౌషధులు నించి [పోక్ష్నించె నొక్క పద్మాక్షీ జలము 
కాంత యొక్కుతె సన్నెకలు పొ త్తరంబునుదోరించె వటశాఖతోడ గూడ 
పీరఠరికంబులు పెట్టి బింబోన్టి యొక్క_తి మడుగు పుట్టము కప్పెనడు గుమునుగ” 


“తగవు లిచ్చిరి పుట్టింట తల్లి పజలు వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు 
కట్న మిచ్చె నృపాలుండు కన్నుదినియ పరమహీపాలు లిచ్చిరి పావడములు'' 1 
పురిటి సమయములో చేయు నుపచారములను శ్రీనాథ డిట్లు వర్ణించెను, 


“*ళశలయంవి ధవళ నిదాకుంభ మిడువారు రక్షాభసిత రేఖ [వాయువారు 
గౌర సర్షపరాజి కలయ జలేడివారు బలివిధానంబుల బర గువారు 

లవణంబు నింబపలవము |దిప్పెడు వారు | పేము మంచంబుతో పెనుచువారు 
గవల ధూపంబు సంఘటియించువారును మంచిము ద్దిడద యోజించువారు 
కదసి దీవించువారును గండతై ల మందుకొనువారు గాయంబు లందువారు 
పాడువారును పరిహాన మాడువారునైరి శుద్దాంత సతు లరిష్టాల యమున” 


“కర్పూర నమ్మి.శ గంధసారంబున చరచె చప్పట భిత్తి చామ యొకతె 
వెల్లకిలబెవ్రై నుతృ్పలగంధి యొక్కరు గర్భ గృహోపకం౦ంఠ భూమి 
జ్యేషాధిదేవత సేవించె నొకయింతి పసుపు పుట్టము గట్టి భ_క్తిగరిమ 
పటము ప లిఖియించె పాటలాధరి యోరు కొ_తలత్తుక శశాంకుని ఖరాంఠు 
జరఠ మెషంబు కంఠదేశమున జుదై పుష్ప డుండుభముల నొక్క పువ్వుబోడి 
అంబుజానన యొకతి నెయ్యభిఘరించె భుజగ నిర్మోక మొకతె నిప్తులగమర్చె' జి 
సింహాసనద్యాతింశతిలోని యాచారాలు తెలంగాణమువై యుండును. 
ఇందలివి కృషా గోదావరీ మండలాలవై యుండును. 
జనులు తమ బిడ్డలకు భ రలయిండ్రకు పోయిన తరువాత ఆవులను 
ఆరణమిస్తూ వుండిరింలీ 
1. శివరా్యతి మాహాత్మ్యము, అ, ౨ ప, ౫౪ ౫౬, ౬, 
2. శివరాతి మాహాత్మ్యము. ఆ, ౨. స, ౭6, ౭౧. తర్వాతవికూడ 
చూడతగి నవే. 
8. “తనదు గాడిలి పుతికి సిదలంచెనో - భోజరాజీయమ్ము ఆ. ౬+ 
ప, ౩౯ 


రెడ్డిరాజుల కొలము 139 


పూడ్చి పెట్టిన ధనమును (బంగారు, వెండి నాణెములు) భూమిను౦డి 
(తవ్వి తీసుకొనుటకు ముందు దాని నావరించి భూతములు (ధనపిళాచాలు) ఉండు 
ననియు, వాటి శాంతికై బలి నీయవలెననియు జనులు నమ్మిరి. అది నేటికిని 
కలదు, 


ల ఎట్టివారి సొమ్మో యిది పెద్ద కాలమయ్యె పృథివి నణగి 
దీని వెడలదవియ బూనిన యప్పుడు భుతత్భ ప్రి వలయు భూతలేం|దా! 


క, ఆనపుడు విభుడది చేయుద మని గొరియల చెరువు వెట్టియనువగు భో 
జనముల ననురులు సురలును దనియంగా భూతత్భ పి తగ నౌనరిందెన్‌”! 


ఇది భూస్త్థావితమగు విక్రమార్కుని సింహాసనమును తీయుటకై భోజు 
డిచ్చిన బలి (చెరువు=బలి.) 


ఆకాలపు ధనికులు సుఖభోజవము చేస్తూపుండిరి. అందు కోజన[వీయత్వము 
దాహ్మణులలో నెక్కువగా నుండెను. రెడ్లు ౫ వులై యున్నందున వారు మాంసా 
హారులు కారేమో ? నేదికిని శె వులగు రెడ్లు మాంసము తినరు. సాధారణముగా 
నెరవాటి కాపులు, నానుగొండ కాపులు అను రెడ్డి శాఖవారు మాంసము తినని 
శైవులు. మరియు మోటాటిరెడ్తలోను కొందరు ౩ పులై మాంసభక్షులు కాని 
వారై యున్నారు. వైష్ణవ మత మవలంగించిన రెడ్లు మాంసభములిరి. వైష 
వాదార్యు లిది ని షధించినట్టు కానరాదు. ఆము క్రమాల్యదలో రెడభు కివిధాన 
మును తెలుసుకొను ఆధారములుకలవు. కవుల వర్ణనలు, విశేషముగా |బావహ్మ్యాణుల 
భోజనముగానే కానవసున్నది. కొండవీటి రాజ్యమంతియగు లింగనమం తి 
పం కిలో (శ్రీనాథుడు పలుమారు కంథదఘ్నముగా, తుష్షిపూర్తిగా భుజించి 
ఆమం తి అన్నదాతృత్వమును (బ్రాహ్మణుల మేరకు) యిట్లు వర్షించి బుణ 
విముకుడ య్యును, 


న్‌ ఖండళర్క రజున్నుకండ చక్కె రబు-దో సెలు, వడల్‌, సేవెపా సెములతోడ, 
కమ్మగా కాచిన కరియాల నేతతో, కమనీయ పంచభక్ష్యములతోడ, 
సంబారములతోడి శాకపాకముతోడ పక్వమైన పెసరపప్పుతోడ, 
తేనియధారతో, పానకంబులతోడ, శిఖర షాడబ రస|శేణితోడ, 


1. సింహాసనదాాతింశిక, భా ౧ పు ౨౧. 


140 ఆం|ధుల సాంఘీక చరిత 


అచ్చలవణాదికములతోడ ఆమృతఖండ 
పాండురంబై న దధితోడ, |బాహ్మణులకు 
భోజనము పెట్టు ద్వాదశీ పుణ్య వేళ 

లింగ మంతి నవీనరుక్మాంగగుండు.! 


(శిఖర షాడబరసము=ాపండుదానిమ్మ తియ్యనిరసము) ద్విజాతివర్గము 
వారు ఏకాదశీ వతనిష్టు లన్నమాట. తన్మాహాత్మ్య (పతిపాదితమగు రుక్మాంగద 
కథ అప్పటికే |పచార మందియుండెను. 


ఇంకా యెట్టి రుచిర పదార్థముల నారగించి రనగా := 


[దాషుపానక ఖండశర్క_రలతో, రంభాఫల (శేణితో, 
గోచీరంబులతోడ, మండెగలతో, (కొన్నేతితో, పపుతో, 
నక్షయ్యంబగు నేరుబాల కలమాహారంబు నిశ్శంకతన్‌ 
కుకుల్‌ నిండగ నారగించితిమి యమ|దమధా శాంతికిన్‌ 2 


అంతేకాదు, భత్యుభోజ్య చోష్య లేహ్య పాసీయముల వ్లైవిధ్యములను 
కాశీఖండమం దిట్లు వర్తించి నారు. 


“కనక రంభాపలాశ పా|తంబులయందు విచి|తంబుగాగల వంట 
కింబులు, అపూపంబులుు లడ్డువంబులు, ఇడైెనలు, కుడుములు, ఆప్పడంబులు, 
ఇప్పట్టు, గొల్లెడలు, జిల్లేడుకాయలు, దోసియలు, సేవియులు, అంగర పోలియలు, 
సారసత్తులు, బొంతర కుడుములు, చక్కిలంబులు, మడుగుబూవులు, మోరుం 
డలు, పుండేమఖండమలు. పిండ ఖర్జూర దాతా నారికేళ కదళీ పనస జంబూ 
చూత లికుచ దాడిమీ కపిత్త కరాంధూ ఫలంబులు, గసగసలు, పెసరుం బులు 
గములు, చెజకు గుడములు, అరిసెలు, బిసకిసలయముల వరుగులు, చిరుగడ 
ములు, బడిదెములు బులుపలు, బులివరకలు, పప్పు గొట్టియలు, చాపట్టు, పాయ 
సంబులు, కర్క_రీ కారవేల్ల కూశ్మాండ నిష్పావపటోలికా కోళాలాబూ స్నిగూ 
దుంబర వార్తాక బింబికా కరవింద శలాటువులును, కందయుం బొందయు, 
చారులు, దియ్యగూరలు, పచ్చడులు, బజ్జులు, గిజ్జణులు, వడియంబులు, కడి 


1 భీమేశ్వర పురాణము, అ౧. ప ౬౧. 
తీ భీమేశ్వర పురాణము, అ ౨, ప ౧౪౨ 


రెడ్డిరాజుల కాలము £41 


యంబులు, గాయంబులు, గంధతోయంబులు, ఉం|డాలు నాను బాలుకు, అను 
ములు, మినుములు, బుడుకులు, నడుకలు, నిలిమిడియును, చలిమిడియును, 
[దబ్బెడయు, వడయును, నుకె, రలు, చకె' రలు, నేతులు, దోనెతొలలు, 
బిట్టును, గట్టున, దాలతిమ్మ నంబులును, దోపలు, పూసలు, మోదకంబులును, 
గుడోదకంబులు.. .......వడ్డించిరి.! 


ఈభోజ్యపదార్గములలో సగము అర్ధము కానివిగా ఉన్నవి. ఇందు కొన్ని 
వంటలు నేడు పలు పలు పాంతాలలో లేవనవచ్చును. ఇవి ఆకాలమందలి |పజా 
జీవిత విశేషములందు ముఖ్య మైనవి. సనూత్ముముగా తరిచి పరిళోధిందు కొలది 
ఇంకనూ పెక్కు విశేషములు తెలియ రాగలవు. 


విరోదముతు 


అటలు పాటలు మున్నగు వినోదములు కాకతీయుల కాలమలోనివే యీ 
కాలమందును కానవస్తున్నవి. ఆవికాక మరికొన్ని యాకాలములోనివిగా తెలియ 
వస్తున్నవి. 


రాజకుటుంబపు రాచవారు పలువురు దు్మార్గులె [ప్రజల బాధించుట 
సర్వసాధారణము, ఆ కాలమందును నిట్టివారు కొందరుండి యుందురు. వారిని 
దృష్టిలో నుంచుకొని మంచన యిట్లు (వాసెను, 


సీ, ఎలుక వేటల పేర నేగి పట్టణములో [పజల యిండులు కూల|దవ్య బంపు 
చెలగి డేగలకును తొండల నేయటోయి దాశ్షామంటపంబులు గాసిసే 
కోడిపోరుల పేర వాడల దిరుగుచు పొడగన్న కడవల బొలియవై చు 
వేటకుక్కల దెచ్చి విడిచి మందుఐలలోని మేకల కుసికొల్సి మెచ్చియార్చు"'£ి 
జనులాడు జూదములు బహు విధములుగా నుండెను, 


క. సరిలేని యంజి సొగటా లరుదగు జూదంబు నెత్త మచ్చనగండ్లున 
దిరమగు నోమనగుంటలు సరసత మెయి నాడుచున్న సతులం గనియెన్‌ .€ 


1 కాశీఖండము ఈ ఘట్టముతో ఇంకనూ చాలా చాలా తెలిపినారు. 
అభిలాషులు మూలము చూడగలరు, 

2 కేయూర బాహు చరితము. అ ౩, ప ౨౯౫, 

లి భోజరాబీయము అ ౫ ప ౭౬. 


142 ఆం(ధుల సాంఘిక చరిత 


ఈ యాటలు ఆడువా రెక్కువగా ఆడుచుండిర. అంజి యను నాటి 
యెట్టిదో శబ్రరత్నాకరకారునికే తెలియదు. సొగటాలు అనునది పాచికల అట. 
దానికీ పగడసాల, పగడసారె ఆట యనియు అన్నారు ఫలువురు కవు, 
లీయాటను ([పంంధాలలో వర్దించినారు, ధనికులైనవా రీయాట పలకల సిద్ధము 
చేయించి యుంచుకొనెడివారు. అచ్చనగ డ్డు యిస్పటికిసి జాలికలు, యువతులు 
ఆడుచుందురు. దానికి అచ్చనగాయలు అనియు పేరుకలదు. [కచ్చకాయలతో 
కొని, చిన్నవి గుం డని గులకరాలతో కాని ఆడ దుకు, ఓమనగుంటలు ఒక కర్తా 
దీమ్మలో ౧౪ గుంతలు చెక్కించి వాటిలో చింత బిచ్చలు పోని యాడు 
ఆటకు పేరు. 


యువకు లాడుకొన్న యాట లెట్టివనగా, కం దుక కేశ ఇది చెండుఅట, 


బహుళా బట్టలతో గట్టిగా గోళాకారముగా చేసి దానిపైన గట్టి లావుదార 
ముల జాల నల్లుచుండిరేమో. అట్టఏ ౫౦ ఎండ్ల [కిందట యుండెను. 


పిల్ల దీవాటలు :- ఇది “విమల చండోదయారంథ వేళః౦దు” ఆడుచుండ్‌న 
యాటయని శ్రీనాథుడు వర్చించెను. ఇదెట్టి యాటయో తెలియదు. “బాల 
[కీడా విశేషము” అని శేబదత్నాక రములో [వాసినారు. నాలుగ దునూర్మ 
యేండ్ల (కిందటి బాలా యాటలు మనకు తెలియకపోవుట విదారకరము 


భాండిక జనుల పరిహాసములు :.. “ఒక కొంత (పొద్దు భా. డిక జనంబు లొనర్భు 
పరిహాస గోస్టి కి పలవించు” అన్నారు. కాని భాండిక శబ్దము శబ్దరత్నా 
కరములో లేదు, సంస్కృత బృహగ్నిఘంటువగు శబ్ద కల్ప దుమమం 
దును ఈపదము లేదు కాని ““భండః=అశ్లీ లభాషీ' అని కలదు. తత్సం 
బంధి భాండికుడు అని వ్యాకరించుకొనిన నీసందర్భమునకు సరిపోవును, 
బూతులలో హాస్య ముత్చత్రిచెయు “వికట క వి" వంటివాడని యర్థము 
కలుగును. 


దీందువ తీవిద్య = ఇది గారడి (ఇం'దజాల,) .విద్య. శబ్దరత్నోకరములో ఈ 
శబ్దము లేదు. సంస్కృత నిఘంటువగు శభకల్పదుమ మందును ఈ 
పదము లేదు. బిందుమతి యనునది "వ్మిపవినోద” ఆను ఇంద్రజాల 
విద్యవంటిది. వ్మిపవినోదనును విద్యను ఒక విధమగు (బ్రాహ్మణ జాతి 


రెడ్డిరాజుల కాలము 148 


వారే, వారును తెనుగు దేళమందే, ఒక గారడి విద్యగా [పదర్శించెడి 
వారు. 


(పహేళిక :- దీనికి పర్యాయపదము [వవ ్లికా అనియు, దాని కర్ణము “గూఢ 
ముగా నుంచబడిన యర్థముల కావ్యవిశేషము' అని శబ్దరత్నాకరములో 
(వాసినారు. ఇది స్పష్టముగా ఆర్థముకాని రీతి తెలిపినారు. తెనుగులో 
తట్టు--తట్ట వేయుట అనుట యిదియే. *కొందుకు, తిందురు", “ముందర 
"పెట్టుకొని యేడ్డురు” అంటే యేమి? అనగా ఉల్లిగడ్డ అని చెప్పుట తట్టు 

ళం ల లా a లు 
అని యందురు. తిరునుులెళ పద్యాలు [ప హేళకలే. తిరుమలేశు డెవ్వడో 
యెవ్వరును ఆతనిని న్మరింపరు. 


శబ్దకల్చ దుమములో ఇట్లు వాసినారు :- 


[పహేలికా=[పపిలతి అభ్నిపాయం సూచయకితి కూటార్థ భాషి తాక థా 
దినికదాహరణములు “తిరుమలేశ పద్యాలు.’ అవి తెనుగులో _పసిద్ధ 
మైనవి. 1 


వేట, రాజులలోనే విశేషము గానుండినట్టు కవులు వర్ణించినారు. వేటలలో 
పక్షివేటకు విశిష్టతకలదు. సంపన్నులు డేగలతో పకులవేటాడుచుండిరి, ఆ డేగలు 
“కాజు కక్కెరలను” మున్నగు పమయలను చంపు దుండెను. 


స్‌, కేరిజంబుల గోరి కేరుట దీరించి పూ రేండ్ల బుడకల బూడ్డిక లిపి 
పాలగుమ్మ ల నేలపాలుగా నొనరించి వెలిచెల మెలకువ వలితిచేసి 
బెగురు కదుపుల బెగ్గిల (మగ్గించి కొంగల పొగ రెల్ల (దుంగ (దొక్కి- 
కక్కెర నెతురు [(గక్కి ంచి కొక్కెర విండు గుండియలెల బెండుపలచి 
nm 9) య 
కారుకోళ్ళ నెండ గారించి గొరువంక బింక మింక వాని పొంక మణచి 
చెమరు టోతుగముల జమరి కౌజుల జించి సాళువంబు జయపాలు జేరెకి 


ఈ పద్యములో పాలగుమ్మలు (పాలపిట్టలు), వెలిచెలు, జెగ్గురు (సార 
సము) కొంగలు, కొక్కెర, కారుకోళ్ళు, గొరవంక, కౌజు (కముజు)అనుపిట్ట 
పేర్లు పల్లెజనులు (పట్టణవాసులు కారు) ఎరుగుదురు కాన్కి తక్కిన పత్షుల పెర్లు 


eh 
శ క 


1 శివరాతి మాహాత్మ్యము, ఆ ౨. ప౮౭(వైనాలాటల చర్చ ఆందు కలదు) 
డి సింహాసన ద్వాతింశిక్క ౧ భా, పు. ౨౬. 


144 ఆంధ్రుల సాంఘక చరిత 


పల్లెజనులుగూడా ఎరుగరు. కేరిజము ఆను పదము శబ్బరత్నాకరకారుడు కేరణజుము 
ని (వాసి “ఒకానొక పక్షీ" అని దానికర్థము |వాసినాడు. పూరేడు అన పక్షి 
విశేషము అసియు తెలిపెను. కొ క్కె_రఅనగా కొంగయేగాని, కొంగలనుకూడ కవి 
వర్టీంచినందున అందలి భేదములని యెరుగవలెను. కక్కెర ఆన వక విశేషము 
అనియే నిఘంటువులో తెలిపినారు. కారకోడి అన ఆడవికోడి. గొరవంకలను 
తెనుగులో బట్టిడిగాడు అనియు, సంస్కృతములో శారిక అనియు నందురు. 
చెమరబోతు అను దాని కర్ణము శ. ర. నిఘంటులో లేదు కాని చెమరు అనుదానికి 
చెమరుకాకి యని |వాసినారు. ఈపక్షీ నీలము వన్నె కలదై కాకికన్న చిన్నదె, 
తోకపొడపుగా కలడై, ధ్వనికూడా కాకితో భిన్నించినద్దై పెద్దరాళ్ళను గోడలు 
కట్టువారు మలిచినప్పుడగు కంగ్‌, కంగ్‌ అను ధ్యనినిబోలి కూయునదై 
యుండును, కౌజు వట్టలను కొందరు సాకి పంజరాలలో పెట్టి పొలాలకు తీసు 
కొనిపోయి ఉరులొడ్డి యుంతురు. వాటి ధ్వనికి సజాతయములగు కౌజువిట్రలు 
కలహిందుట కే వచ్చి ఉరులలో చిక్కి చిరన్‌ | వును; సజాతితో కలదించు 
పిట్ట€లలో కోళ్ళు, కౌజులు, పికిలీ పిట్టలు (బుల్‌ బుల్‌) ముఖ్యమైనట్టవి, 


(౮ 


మన భాషలో పక్షి చరితలు లేనేళేవు. సంస్కృత మందును ఖ్యేనశాస్త్ర 
మొకటి కలదు. అదున్నదని యెరిగిన సంస్కృత పండితులే యరుదు. నిఘంటు 
వులలో ఆయా పక్షుల చ్నితములను ముదించి వానిజీవిత విశిషతిలను కొద్దిగా 
తెలుపవలెను. కాని పక్షి విశేషము, జంతు విశేషము [కీడా విశేషము, అని 
[వాసివే స్తే ఎమెలాభం? ఇంగ్లీషులో ఈనాడు కాదు ౧౫౦ ఏండ్లకిందట, ఇంకే 
మైనా అంటే అంతకు పూర్వమే, పములను గురించిన గంథములు ఒకటి రెండు 
కాదు, నూర్లకొలదిగా నచి్యతముగా, సమ్యగముగా (వ్రాసి ముదించిరి. మన దేళ 
ములో ఒక్కరయినా పక్షి జీవితములను గమనించినారా? ఒక్క.ఆనువాదగంథ 
మైనను (వతులను గూర్చి వీల్లల వాచకాలుతస్న) ముదచించిరా! అందుచేత [పాచీన 
కవు లిట్టి వద్యాలను (వాస్తే వాటి కర్భమువాయు నిఘంటుకారులు పక్షీ విశేష 
మని తప్పించుకొనిపోవుటయు, మన కర్థము కాక పోవుటయు సంభవిస్తున్నది. 


ఇతర (వబంధాలలో నాచన సోముని మొదలుకొని పలువురుకవులు 
వేటను వర్షిన్తూ వచ్చినారు కాని వకులవేటలను వర్ణించిన కవు లరుదు. అందు 
చేత వెన నుదహరించిన పద్యము విలువకలదే ! “బురుకపిట్ట యింతగానిలేదు” 
అని యీ కవియే (సీం. ద్వా, భా ౨ పు ౨౦,) వర్ణించెను. 


రెడ్డిరాజుల కాలము 145 


భటులను.-సీపాయీలను = ఆకాలములో జట్టిలంటూ ఉండిరి. తర్వాతి 
కాలములో ఇంగ్లీషు [| ఫెంచివారు (పవేశ పెట్టిన మిలిటరీ యానిఫారంవలె 
పూర్వము యుద్ధభటులకు వేషాలు సరిగాలేకుండెను. కాని వారికిని కొంత వ తేక 
వషమంమండెను. తలకు గుంగుల రుమాలయు, ముందు చుంగులు వెనుక దిగిం 
చిన ధోవతి లేక చల్హాడము (చల్లడము, చిలడము) అను “నిక్కర్‌” వంటి 
మోకాళ్ళపై లాగును, నడుములో రంగుకాసె దట్ట యు(పట్టి), ఆదడ్రలో కత్తులు 
కఠారులును, చిన్నవి, చిక్కు నిఅంగీయు, వీపున డాలుక్కు ఇవి సాధారణముగా 
వారి 2 వాత 

“జెట్టి అలంకరించుకొనేవరకు కోటలోగుండు (శతువుల ఫిరుగిగుండు) 
పడె" అని మన తెనుగుసామెళకూడా. యుద్ధవేళలందు జెబీలు యద్ధావసరాలం 
కరణములను గావిందుకొంటూ వుండిరని తెలియవస్తున్నది, ఈ జెట్టలను “రావ 
లెఎకలు , “బంటువారు' అంటూ వుండిరి. 'బంటువానికిం గటారి చేత నున్నం 
జాలదె'! యనుటచే బఎటులకు కటారి ముఖ్యాయుధ మని తెలియవచ్చును. 


(“కరకంచు వలి'పెంబు గట్టిగా గాసీంది' అను పద్యములో బంటుల 
వేషము ఇదే [పకరణములో తెలిపినాను.) 

ఒకనా డొకచోట వసంతోత్సవమలు చేసుకొనుచుండ ఒక రాచలెంక 
గుంపునుండి వెడలివసూ “తన మీసములను నంటిన సుగంధంలబు విదిర్చికొను 
చుండ, నెదురై న ఏకాంగవీరుడను లెంక దురభిమానంబున గనలి, 


“ఏరా! ముందరగానక నేరమిపై దెచ్చుకొనుచు నీ మీసలు, నా 
చేరువ వడిపెపైద విది యోరీ ! యేకాంగ వీరు డుంట యెరుగవే?” 


అనగానే అవతలి లెంకకునూ అభిమానము నిండుకొనెను. ఉభయులు 
ద్వంద్వయుద్ధానికి సన్నద్ధుల రి. మధ్యవర్తులు, తుదకు రాజునూ ఎంత చెప్పి 
నను వినలేదు. కడపట్క రాజసమక్షములో [పజలందరు చూస్తూవుండగా వారికి 
కత్తితో ద్వంద్యయుద్ధము చేయుట కనజ్ఞ యయ్యెను.ఆ యుద్ధములో ఓడి 
పోవు లక్షణాలను సిరూపిస్తూ ఒక లెంక కొస్నినిబంధనలు (షర్చులు) నిర్ణయిం 
చెను. ఆ పోటీ యుద్ధఘట్టమును కొరవి గోపరాజు యిట్లు వర్ణించెను, 

1. సింహానన ద్యాతింశిక, భా ౨, పు ౨౨. 

(19) 


146 ఆం|ధుల సాంఘిక చరిత 


ఏమో ఉత్తు త్ర రోషానికి వచ్చి తీరా ఎదుటివాడు తీసుకొగి ఎదురునిలచి 
నప్పుడు తోక ముడిచే వ్యవహారము కాగూడదుసుమా అని ఒకళెంక యిట్లనెను. 


“గుడికొలువుబంటు మల్లని కొలది పంతమయ్యె నిచ్చట నది యొట్టులంటిరేని” 


“ఒకడు దేవర భాండాగారంబు నింటికడన్‌ పాలెమువడం గొలిచి పళ్ళి 
రంబుల (పసాదంబు తినుచు పోతు కియ నుండ నొక్కనాడు, దేవరను దర్శింప 
వచ్చి వారి సందడిలో నొక్క యీడిగ తనకాలు [దొక్కినన్‌ కోపించి ఏమిరా, 
బంటుమల్లు నన్నెరుంగవా తన్నితివి, అనిన, నతండు నే నెరుంగన, ఈ సంద 
డిలో కాలుదాక్కె ననిన, నెరయం దన్ని యెరుంగ నననం పోనిచ్చెదనా? 
యనుచు నందందు దట్టించిన అయ్యోడిగడా కేలి కటారి వలకేల నందుకొని, 
తన్నినాడ, యెమనియెదవురా* అనిన ఆతని బిరుసు చూచి బంటు మల్లండు 
(సుక్క, ఏమియు నేమనియెద, దేవర కూడిగంపు బంటుంగాన దోసమనియెద 
ననియెం గావున, 


“మీకు పిన్నవాడ ఏకాంగవీరుండ రంకెవైచిన, నడబింక మైన, 
నగిన, కేరడించినన్‌, మీన లంటిన, పట్టితివియ నాకు పాడిగాదె” 


అట్టి ద్యంద్వయుద్దాని కేమేమి “పంతముల కొలదులుి (షర్తులు) విదా 
రించగా ఆందొక ఖభటు డిట్టనెను. 


“పుల్పతి వెట్టిన భూమికి కొనరిన, ఎదిరి పోటునకు చే యొదుగుచున్న, 
దండకై దప్పిన, తప్పు |కేళ్ళురికిన, పంతంబుగొన్న, చౌఒళము గొన్న, 
దాణికి జొచ్చిన, దాచిన, మానిన, అరువ నొడ్డి 3 బయలాస పడిన, 

చాగ బొడువకున్న, లాగంబునకుకొన్న, మడమ గెంటిన, (వేళ్ళు మగుడబడిన, 
తారుమారైన, తలవంచి పొడిచిన, పారుగా తలంచు పంత మిదియమె.” 


ఇందలి కొన్ని పదాలు క త్తిసాములోని సాం కెతిక ములు. 
పెవాని (పళలిసృర్ధి పెట్టిన ఎదురుపంతము కొలదులు (ఎదుకువర్తులు) 
ఎట్టి వనగా = 


“మతిగాక దృష్టి నేమరక రక్షించుచు సూకర దృష్టిమై ఢాక గొలిపి 
గర్జన సేయక మార్భాలదృష్టిమై తరలక వరుజించి తాకబూని” 


రెడ్డిం*జుల కొలము 147 


ఇంకను భల్లూక దృవ, గృ ధదృ్భవషి, ఫణిద్భ్చషి, క విదృషి, చోరద్భష్షి, 
ళారూలదృష్టీ కూడ వర్ణించి "నురియకాం[డ పంత మివియో అని తేల్చెను, 


అయితే యీ రెండును సాధారణముగా కత్సియుద్ధాలలో పెట్ట పంతములు 
కావు. 


“అనుడు వింతపంతంబుల కచ్చెరువంది సొందుగా జూచి విడువుండన 
భట్టయు, ఆంగాధీశ్వరుండును నిలువంబడి, విసారంబుగలుగ వె హోళి దీర్చి, 
యల్లజకులం గూర్చుండ నిడి, గలబ పుట్టకుండ, ఎడ నెడన్‌ తలవరుల నిలిపి, 
విడు వారల మాటమాటలలోను పట్టుండని నియమించి, నలువురుబంట్ట నడుమ 
నిడి కఠారంబులు ఓక్క. కొలందిగా కొలిచి, నిమ్ముపండ్ల దొడిసి, ఎడగలుగ 
బంటుచేతికిచ్చినన్‌ పమ్ముకొని యవ్వీరులు, ధీర ధీరంబుగ జొచ్చిరి, ” 1 


పంతంబుల పద్యములో చౌబళము, దాణి, అరువ అకు పదాలకు నిఘం 
టువులలో అర్జాలు లేవు, 


గారడి అను విద్యను ఇంద్రజాల మనిరి. ఇంగ్లండులోని ఇంగ్నీమ ప|తిక 
లలో ఇంచుమించు ౪౦ ఏండ్లనుండి యొక చర్చ కొన్నిమారులు చేసినారు. 
ఇంచుమించు ౧౫౦ ఎండ్ల కిందట ఒక ఇంగ్నీమ వాడొక ఇం[దజాల [ప్రదర్శన 
మును హిందూస్తానములో చూచి దాన్ని చాలా మెచ్చుకొని ఆనాడే పతికలో 
(వాసెను, ఆ ఇం దజాలమలో ఒకడు (తాటి నొకదానిని పైకి నిలువుగా విసరి 
గాలిలో నిల బెట్టి దానిపై కిగ బాకి మాయము కాగా, వాని యంగములు ఖండ 
ఖండములుగా |క్రిందబడె ననియు, మరి కొంత సేపటికి వాడు తాటినుండి గబ 
గబ దిగివచ్చెననియు (వాసెను. అది యబద్ధ మనియు, ఆట్రి విద్యను పద 
ర్శించు వానికి ఇం గ్గండుకు రానుపోను వ్యయమును భరించి వెలకౌలదిగా బహు 
మానము లిత్తుమనియు కొందరు (పకటించిరి. కాని కొరవి గోపరాజు ఒక 
కథలో ఇదేవిధమగు ఇందజాలమును వర్ణించినాడు. 


ఒకడు తనభార్య అనుదానిని వెంటబెట్టుకొని రాజసన్నిధిలో ఆమెను 
రక్షణార్థమె విడిచి, తాను దేవనహాయార్లమై యుద్ధముచేయ వెళ్ళుతున్నానని 
దా DD = @ 
చెప్పి ఒక (తాటిని పైకి నిలువుగా విసరి, దాన్ని నిలజెట్టి, దానిపై కెగ జాకి 
rn rT తర ప తననన నాంభకతంలం కామాలు 


1 సింహాసన ద్వాతింశిక, భా ౨. పు ౨౧. ౨౪. 


148 ఆం|ధుల సాంఘీక చరిత 


మాయమయ్యెను. కొంతవడికి వాని కాలుసేతులు, తల, మొండెు తుంటలై 
[కిందబడెను. వాడుంకువగా నుంచిపోయిన వానిభార్య రాజును వేడి సె.వుపొంది 
సహగమనము చేసెను. 


వెంటనే తాడు పెకి పాకిపోయిన భటుడు పైనుండి దిగివచ్చి తన 
భార్యను పంపుమనెను. రాజు విచార[గస్తుడై ఆమె సహగమనము చెసెససి 
చెప్పెను. 


“ఆవీరుం డప్పుడె నిజ భావము |పకటముగ నాత్మ భామినితోడన్‌ 
దా వై తాళకు డగుచున్‌ గైవారము చేసె జనలు కడు వెరగందన్‌. 
నరనాథ! నిన్ను నపుడవసర మడిగినవాడ, నై ౦|దజాలికురీతిన్‌ 
నరుల నణకించి సీచే సిరి వొందం జోద్య మిట్లు చేసితి ననియెన్‌"! 


ఇది అనాటి 8ం|దజాలవిద్య. అదేసందర్భమలో చతుష్షవ్షికళల పరిగ 
_ణనమునుకూడ తెలివినారు. అందీ కిందివి చేగినవి. వేదాలు, కాస్తా9లు, పురా 
ణాలు, వాసు, ఆయుర్వేదము, ధనుర్వేదము, మాం|తికశ ము, సంగీతము, 
జల స్తంభనాదులు, (మహెం దజాలము), జూదములు, అష్టావధానము, వాద్య 
నృత్య కౌళలను, బహురూపనటసత్వ ము(ఆనగా పగటివషములు), పరిహాసము 
మున్నగునవి. 5 

కాకతీయరాజుల కాలమందు శ్రీకాకుళము తిరునాళ్ళ పసిద్ధిగా నుండినట్ట్లు 


| కీడాభిరామమందు వర్జింపబడినది. అంతకు పూర్వకాలమందే అది (పసిద్ధియై 
యు౦డినట్టు మంచన కేయూరబాహుచరి తలో వాసెను. 


“నలువుగ కాకుళశు తిరునాళులలోపల గుండమం;తి ని 
ర్మలమతి బిట్లు వేగముగ మాడలు రత్నచయంబు చలి "ఖర 


అని వర్ణించుటచే పూర్వకాలమందు రాజులు మంతులు ఉత్సవకాలాలలో 
రూకలుచల్లి బీదలకు దానము చేయుచుండిరని విశదమైనది. 


1 సింహాసన ద్వాతింళిక. భా ౨. పు ౧౧౧ 
2 స్ట అ sae Co 


8 కేయూర బాహుచరిిత, ఆ ౧. ప ౪౫. 


రడ్డి వా జులకాలము 149 


బూడములు అనేక విధములె నవి ఆడుతూవుండిరి. అందు కొన్ని కాకతీయ 
కాలమందలివి తెలిపియుంటిమి. అవన్నియు ఈ కాలములోనూ పుండె ఏ. ఒక 
మెటిజూదరి తన ద్యూతచాతుక్యమును నిట్లు తెయుపుకొ నెను, 


“దృష్షి యేమరక నందయు, జోగరంబును దిగయును, గాళ నా తేటపడిన 

అద్బులలోఒ లనే యచ్చన గె కౌని మాటలాడినయట్ల వేటు గలుగ 

తలపుగతి వచ్చు కోరిన దాయ మనగ,.ఎల్లి పిడికిక్ళు విడిపించుకొని 
యే+కొందు."! 


ఈ యాటను పల్లెజనులు లకి మువ్షి, నక్కముష్టి, అని యందురు. 
బహుళ అది నక్కమువ్షియె యుండునేమో! ఒకడు గవ్యలుకాని, చింత బిచ్చలు 
కొని పట్టుకొన వచ్చును. నాలుగు విచలు ఒక ఉడ్డ యగును. పిడికిలి పట్టిన 
వాని కొకదిక్కు. వదలి తక్కిన మూడువిష్కులలో ఎందరై నను సరే, తమ 
కిషమువచ్చినస్ని రూకొలుూూని, పెసలుకాని యుంతురు, పిడికిలి పట్టినవారు 
ఉడ్డల్మపకార మెంచగా, నాలగుమిెలితే దానిని మష్టయందురు. మూడుమిగిలితే 
దానిని తిగ యందును. రెండు మిగిలితే దుగ యందురు. ఒకటి మిగిలితే దానిని 
నక్క యందురు. నక్కనుండి మష్షవరకు నాలాగ సంకేతము లున్నెందున 
దానిని నక్క మష్ట అసరసియు, అదియే నక్కమువ్షిగా లక లక్కముష్షిగా 
మారెననియు ఊవాం ఏవచ్చును. మున్షిపట్టినవాని యింట సంఖ్యయే మిగిలిన, 
వాడు తక్కిన మూడిండ్ల వారి పెకమంత యు తీసుకొనును. లేక తనకేబయి ట 
సంఖ్యవచ్చునో నా సంఖ్యలో నంత పెకము౨డునో అఎత యిచ్చి, తక్కిన 
సంఖ్యలవారి మొతములను వడిరివేయును, 


పైన వర్ణించిన కవియు నాలుగు సంకేతములను తెలిపినాడు. కాళయన 
నాలు గెయుండును, తిగ యన మూడు, నంది యన ఒకటి. జోగర యన గెండె 
యుండును, వర్ణించిన వరుస కూడ పెయర్థముల సూచించును. ఆచ్చులన 
అ త లు | ఇక స 
పట్టుకొనివచ్చు గవ్వలో, (క్రచ్చకాయలో లేక అంతటి చిన్న గులకరాళ్ళో 
యని యర్థము, 


చదరంగపు పందెములుగూడా వుండెను, 


ఆర 


1 సింహాసన ద్వాతింశిక. భా ౨. పు ౮౫. 


£60 ఆరధుల సౌంఘీక చరీత 


“చతురంగంబున నే నతి చతురుడ కరి తురగ మంతి శకట భట్‌ [వ 
స్థితి పరవాస్తము సేయుడు క్షితిమెచ్చగి రాజు బంటుచే గట్టింతున్‌”] 


చతురంగమును మెదట కని పెట్టినవారు హిందువులు. దానినీ ఆరబ్బులు 
నేర్చుకొని ర. అరబ్బుల సేర్భ్యములలో రథములు లేవు కావుసను వారికి ఒంటెతే 
సమృద్ధికావునను, రథములకు మారుగా ఒంటెలను పెట్టి యాడిరి. ఆయాటను 
యూరోపు గాసులు నేర్చుకోనిరి, వారికి ఏనుగులు లేవుకాపున వాటికి మారుగా 
కోటలు (025116) ఏర్పాటు చేనుకొనిరి, తర్వాత నెత్తము (పాచికలాట)ను 
గురించి తెలిపినారు. ఆటు పై పులి జూదముల గూర్చి యుట్లు తెలిపినారు, 


“తగులు విరివియైన కడుమెనమ్చుగ నాడుదు, పులుల మూట,జూద౦బులటో 
మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్‌ సౌగటాల నే నతి (పౌఢుండన్‌.2 


పులిజూదములు మూడువిధము లెనవని కవి తెలిపినాడు. మన దేశములో 
కండ్రముందటి అరుగుబండల పైన, దేవాలయాల బండలవైన పులి జూదపు 
ఇండ్లను మలిపిస్తూ వుండిరి. ఈ యాటను చతుర లతిజాకచక్యముగా ఆడెడి 
వారు. ఇప్పటికిని ఈ ఇ స్పేటు( పేక Pack) జూదపు కాలములో కూడా 
[గామాలలో పలువురు వృద్దు లీయాటలం దారితేరిన గంటుపోక లై మిగిలి 
యున్నారు. ఈయాటలను విరివిగా వర్గించి సవరించి వటములు (వాస్తి ఒక 
[ప్రత్యేక [గంథముగా మన కాలములో ముదించకపోతే మనకు నాలుగైదు నూర్ల 
యేండ్ల కిందటి మనపూర్వుల ఆటలమి యు మనకు తెలియరానట్టుగా, మనకాల 
మందు పూర్వావశిష్టముగా మిగిలి పాళ్చాత్యులచే దిగుమతియైన పేక జూదపు 
వెల్లువలో కొట్టుకోనిపోయి నష్టమగును. పాచికల ఆట ౨౦ ఏండ్ల క్రిందటి వరకు 
విరివిగా నుండెను. ౨౦ ఎండ్ల కిందట పాలమూరు జిల్లాలలో, రాయల సీమలో, 
నక_ముష్షి చాలా ఆడుతుండిరి. పులిజూదాలు కూడా విశేషముగా నాడుతుండిరి. 
కొని యిప్పు డినన్నియు అరుదై పోయినవి సిఘంటుకారులు బాల, కీడా విశేషమ్ము 
ఒకవిధమగు జూదము అని వాయటయో లేక ఆంతమా తముకూడా [వాయక 
ఆపదాలనే యెత్తుకొనక పోవుటయో చేయుచున్నారు. ఇది సరియగు పద్ధతికాదు. 
ఈ విషమమున పరిశోధనలు చెయదలచినవారి కీసూచనలు చేయన్నె నది, 
1 సింహాసన ద్యా(తింశిక ఛా ౨ పు ౮౫ 
పు౮ 


బీ సింవోసన ద్యాతింశిక భా ౨ బ్‌ 


రెడ్డిరాజుల కాలము 151 


ఇక మూడువిధములగు ప్పలిజూదము లని కవి తెలిపినాడు, రెండు పులి 
జూదాలు కలవు. కాని, మూడవది తెలియరాలదు. తెలియ వచ్చినంత తెలుపు 
కొందము. 


ఒక పులిని మూడుమేకలతో కట్టివేయ 
వలెను. పులికి పెద్ద గులకరాతి ముక్కయు, 
మేకలకు చిన్నగులకరాతి ముక్కయు నుంచి 
ఆడుదురు. 


పులిని మొదట పె శిఖర కోణమం దుంతురు. మేకను దానిసమీపమందలి 
యింట పెట్టి దానిపై దాని మేకలేకుండిన అవతలి యింటిపె పులి |వాలును. 
కాన మేకలను పెట్టువాడు పులికి మూడవ యింట బెట్టి తర్వాత పులియంచున 
నుండు నింట పెద్రైదరు, పులి జరుగకుండా కట్టివేసిన అట ముగియును. లేదా 
మూడు మేకలను పులి చంపిననూ ఆట ముగియును, ఇది యొక పృలిజూదము. 


రెండవ దెట్టిదనగా "an 


152 ఆం|[ధుల సాంఘీక చరిత 


నాలుగు పులులతో ౧౬ మేకలతో ఈ యాట నాడుదురు, నాల్లు పులు 
లను నిలువు [ఓికోణమందలి మధ్యరేఖపై వరుసగా నుంతురు. మేకల (పతికకీ 
పులులకు [పక్క యింటిలో పెట్టక ఒకి యిల్లు ఎడమగా ఒక మేక నుంచును. 
పులుల కక్షి ఒక పులిని ఒక యిల్లు జరుపున. మేకిలగాడు రెండవ మేక 
నుంచమ. పులి !: పక్కన అదే పం కలో మేక (పక్కని యిల్లు వారీగా నుండిన 
పుభివాడు మేక పె పులిని దాటించి చంపును. ఈవిధముగా ౧౬ మేకలను పెట్టిన 
తర్వాత మధ్య పులులు చంపగా మిగిలిన మెకఃతో పులులను కట్టి వయు ఎతు 
లతో మేకలను జరుపుదురు. మేకలు విరివిగా చచ్చి, ఇక పులుల క ట్టలేనని 
అనుకొని ఓటమి యొప్పకొన్న ఆట ముగియును. అటులే పులులు కదలకుండ 
వాటి (పక్కని యిండ్ల నాక్రమించుకొనిన ఆట ముగియును ఇది రెండవ విధ 
మగు పులి జూదము. ఈ రెంటిలో ఆటాడువా రిద్దరే యుందురు, 


ఇక మూడవదేదో తెలియదు. కొని ఉత్త మేకల చదరంగము అని 
మూడాట లాడుదురు అందేదయిన నాండునే మో అసి యీ (కింద తెలుపనైనది. 


ఈ యాటను ఒక్కడే ఆడుకొనును. 
తొమ్మిది కాయలను పెట్టుకొని వాటిని జరు 
పుతూ చంపుతూ పోవును. పొద్దుపోని మనిషి 
ఈ యాటకు పూన కొనును, 


ఇదియు మేకల ఆటయే. (పక్కపుటలోని నమూనాలో లీవ పంకీతప్ప 
తక్కిన వంకులలోను తోకగానుండు |తికోణపు టిండ్లలోను ఇద్దరాటకాండు 
పదారేసి మేకల నుంతురు. ౧, ౨ రేఖలు దాని |తికోణ మొకనిక్కి ౪, ౫ రేఖలు 
దాని (తికోణము (పతిపక్షుని కుండును. ఒకరి తర్వాత ఒకరు ఒక్కాక్కమా 
రొక మేకను మొదట భాలీగానున్న” ౩-వ రేఖలోనికి జరుపుదురు ఒకని 
మేక (ప్రక్క కింకొకని మేక వచ్చి కూర్చున్నను, ఆ మేక (పక్కయిల్లు 
కూలీగా యున్నను అవతలివానీ మేక వచ్చిన మేకను చంపుము, మొదలు 
చూపిన పులిజూదముల రెండింటిలో పులి ఒక్కొక్క మారొక్క మేకనే 


రెడ్డిరాజుల కాలము 153 


ల 
వ 


కొట్టును కొని యీ యాటలో ఎన్ని సందులు దొరికితే అన్ని మేకలను ఆటకాడు 
కొట్టవచ్చును. ఎదుటివాని మేకలను చంపి దుర్చలునిగా బేసి పూ రిగా మేకలను 
చంపవచ్చున్ను లేదా కట్టివేయ వచ్చును, 


మరొక విధమగు ఆట కలదు. దీనిని ఇద్దరు ఎదుటమదుట కూర్చొని 
యాడుదురు. (పతివాడు ౯ మేకలను (కాయలను) తీసుకొనియాడుగు. ఒకడొక 


154 ఆం|ధుల సాంఘిక చరిత 


కాయ నొక యింటిలో నుంచిన రెండవవాడును తన దిక్కేకాక తశ యిష్టము 
వచ్చినచోట తన కాయ నంచును. ఈ విధముగా కాయలు పెట్టుటలో ఒకడు 
తన కాయల మూడింటిని ఒకే వరుసలో పెట్టనియ్యక తన కాయను ఆవరుసలో 
పెట్టవలెను! ఆ యాటంకములను తప్పించుకొని ఒక డొకే వరుసలో తనమూడు 
కాయలు పెటణిన యెదుటివాని కాయనేదై న నొక దానిని తీసివేయును. ఈ 
యాటను చర్‌ పర్‌ ఆని యందురు. తన కాయలను మూటి నొక వరున సెట్టి 
చర్‌ అని యెదుటివాని కాయను తీసివేయును. మరల తన కాయను వెనుకకు 
జరిపి స్వస్థానానికి తెచ్చి మూటి నొక వరునచేసి పర్‌ అని ఎదుటివాని కాయను 
మరొక దానిని తీసివేయును, అందుచె నీ యాటను చర్‌ పర్‌ ఆట యనియు 
నందురు, 


కావున ఈ యాటలో నేడై నా మూడవ పులి జూదములో చేరిన దేమో 
తెలియదు. ఈ యాటలన్నియు తెనుగు మండలా లన్నింటిలో నున్నవో లేవో 
గటిగా చెప్పజాలము కొరవి గోపరాజు పుణ్యమా అన్నట్లు అతని వర్తననుబట్టి 
ల ౧? యా Co 
మన పూర్వుల యీ వినోదాలు కొన్నియైనా తెలియ వచ్చినవి. 


మా రెడుపల్రి సికిం దాబాదు నుండి శ్రీయుత తాడేపల్లి కృష్టమూర్తిగా 
రనువారు నాకిట్లు వాసియుండిరి. “మూడు విధములగు జూవములలో రెండు 
తెలివి మూడవది తెలియదన్నారు. మూడవ విధమగు పులిజూద మిట్లాడుదురు. 


న్‌ rN 
oC.) # 3 Kk 
లా af షో ల 1 


aii paren (0112న. 1 212 1121 గ కా 
క న. 


ఈ యాటకు ౩ పులులు ౧౫ మేకలుండును. కొందరు ౩ పులులు ౧౪ 
మేకలతో ఆడుదురు. ఆట యారంభమందు మొదట ౧వ స్థానమం దొక పులిని 
పెట్టుదురు. తర్వాత క్రమముగా ౨, ౩, ౪ ఇండ్లలో తక్కిన మూడింటి నుంచు 
దురు, ఆట తక్కిన ఆటలవలెను పులుల కట్టుటయో లేక మేకలను పులులు 
బచంపుటయో ఆటకు ముగింపు, ఈ యాట ఉత్తర సర్కారులలో ఆడుదురు, 


రెడ్డిరాజుల కొలము [59 


చర్‌ పర్‌ అని వర్షించిన ఆటనే ఉత్తర సర్కా రులలో “దాడి” అట 
యందురు, చర్‌ పద్‌ అనటకుమారుగా “డాడి” అని యదుటివానికాయ నెత్తి 
వేయుదురు, (ఈ సూచనకు పెవారికి కృతజ్ఞత). 
Cn ణో 


చర్‌ వర్‌ ఆట అత్యంత (ప్రాచీనమై ఏషియా, యూరోపు ఖండాలలో 
అన్ని దేశాలలో నుండెనట. మోర్‌ హెడ్‌ అను ఆటల నిపుణుడు ‘Pocket 
Book of Games’ అను (గంథములో మిల్‌ (14111 )అను నొక ఆటను వర్జించి 
నాడు. ఆది పూర్తిగా చర్‌ పర్‌ ఆటయె. దాన్ని గురించి అతడిట్టు వాసినాడు. 


“The Mill is known to every European school boy. 119 
unknown in America. It is one of the most. ancient of 
games. It is seen on the steps of Acropolis in Athens, 
on a Roman tile’ on the deck of a Viking vessl.” “మిల్‌ ఆట 


(పతి యూరోపియన్‌ బడివిల్లకా నుకు తెలిసిన ఆటయే. ఇది అమెరికాలో 
లేదు. ఇది అత్యంత (ప్రాచీన ఖేఎనము. ఏతెన్సులోని దెవాలయమందు దాని 
రేఖలు తీర్చియుండిరి. రోము ఇటికెలపె కూడ ఇది యుండెను. నార్వే (ప్రభువుల 
ఓడల పకూడ దీని రేఖల చెక్కి యుండిరి.” 


ఇదే సందర్భములో జూదమువలన కలుగు నష్టముల నుపన్యసించి, 
ద్యూతకారుల దృష్టిలో ఆది మంచి వినోదమే యని బాదింపజేసిన హేతువాద 
ములు విపులముగా విషయభరితముగా నున్నవి. అం దీపద్య మొకటి కలదు. 


“ధనలాభమును పురాణము వినికియు వాద్యంబు యోగవిద్యయు శాస్త్రం 


బున సంగీతముంకావ్యంబులు నాటకములు జూదమున కెనయగునొ 1 


ఆ కాలమందు జనులకు పురాణ శవణములో చాలా ఆస ముండెనని 
తెలివియుంటిమి. ఇది మరొక నిదర్శనము, యోగవిద్యలో, లోహములను బంగా 
రుచేయు విద్య చేరియుండును, నేటికిని అట్టివిద్యను కొందరు యోగం అని 
యందురు. ఈ పద్యము వద్దనే, 


“జబూద్రమున ధాతువాదము వాదంబున దొడర చే టవశ్యము కలుగున్‌” 


అని యున్నందున యోగవిద్య నిచ్చట ధాతువాదానికి వాడి యుందురు. 


జో 


1 సింహాసన ద్యా(తింశిక, భా ౨. పు ౮౬. 


156 ఆం; ధుల సాంఘీక చరిత 


వసంతోత్సవములు రాజులకు పీతిపా[తము లగుటచే ఆవి జనులలోను 
వ్యాపించిపోయెను, దక్షవాటికలో బోగమువారి గుంపులు రెండు౦డెను. వారు 
వసంతోత్సవ కాలములందు భీమేశ్వరుని: ద్ద నాట్య మాడి గాము చేస్తూ వుండిరి, 


వస౩తోత్సవాలలో 'కుసుమరజము', *గంధంబు పనుపుి, “గంధపుటుం 
డలు ఒకరి పెనొకరు వెసుకొనుచుండి5. పన్నీరు, రంగులు విచికారీలతో 
' చిమ్ము 'కొనుచుండిరి మరియు, 


“నేతులనూనెలం బసుపు నీరును కుంకుమ చెందిరంబులన్‌ 
నూతన గంధసారములను న్నానరించిరి కేలితం|తముల్‌” | 


“చిరుబంతి పసుపును గాజు కుప్పె అ గ స్తూరికాజలము'ను సంపక్న్షు 
లు చల్లుకొంటూ వుండిరి. ““కర్పూరాది సుగంధదవ్యంబులు వసంత చాలనం౦ 
బొనర్చెడివారిలో నుండి కలహకంటకుండను రాచలెంక వెడలివచ్చుచు తన 
మీసములను నంటిన సుగంధంబు విదిర్చికొనుచు" టై ఇను, అను వాక్యమును 
బట్టి జనుల్సలో వసంతోత్సవము వ్యాప్తిలో నుండెననుట స్పష్టము. 


జనులకు నాటకములందు చాలా (పితి. నాటకముల ముచ్చటలు పలు వూరు 
సారస్వతములో కానవచ్చినవి. కాని ఆవి సంస్కృత నాటకములు కానీ, వాటి 
రీతుల అనుకరణములు కానీ కావు అదేమి కారణమో ఈ౨౦-వ శత్రాబ్దాదివరకు 
సంస్కృత మర్యాదలతో కూడిన నాటకాలు తెను( గున [వాయలేదు, పెద్దపెద్ద 
క వులుకూడా”" యక్షగానాలు” (వాసిరి. యక్షగానము అని యేల పేరువచ్చెరో' 
తెలియదు. ఈ యక్షగానాలు సంస్కృత నాటకాలకు భిన్న మైనవై దక్షిణదేశము “ 
నం దంతటను జనుల కాదరపా|తము లె పీతికరములె వ్యాప్తిలో నుండినట్టివి 
కాన ఇవి నన్నయ కంటి పూర్వమునుండి వచ్చిన' “దేశిక వితాయు క్తమగు పాటల 
నాటకాలె యుండెను, “అక్కలేజోగు” అని కా మేశ్వర్యాది శకి దేవతల గొలుచు 
జక్కులవారను జాతివారు తెనుగుదేశమలో కలరు. పాదీనమునుండియు కవులు 
“జక్కు లపురం[ధీ" వర్గ మును వర్ణించుతూ వచ్చినారు. ఈ జక్కు.ల వారే 


1 ఫీ మేశ్యర పురాణము, ఆ ౫, ప ౧౧౬. 
2 సింవోసన ద్వాతింశక, భా ౨ పు ౨౦. 


రెడ్డిరాజుల కాలము 1567 


యక్షులు జక్క అను దేశి ( దావిడ)శబ్రమును సంస్కృతములోనికి తీసికొని 
య క్షళబ్దముగా సంస్కతీకరించిరో యేమో? అనార్య జాతులలో యక్షులు 
చేరినారు. యక్ష కిన్నర గంధర్వ పన్నగ పిశాచ రాక్ష సాదివర్గాలన్నియు అనార్య 
జాతులే. 


కిన్నెర లను జాతిని (న్రాచీన గీకులు కినా 3, Kinaries) అనిరి. గంధ 
రు అనగా కాశ్మీరు పాంతమందలి గాంధార దేశ మువారు, పన్నగ. జాతి మధ్య 
ఏషియా లోనివారు, పిళాచులు టిబెటు, మంగోలియా (పాంతాలవారు. రాక్షసులు 
అరక్షసీ (412౫65 ) అను నద్మీపాంతమువారె యుందురు. అటులే యక్షులు 
అక్షస్‌ ౮౫౦౩ )లేక జమా రస్‌ (Jaxartes) వాంతమువారైనను కావచ్చును, లేదా. 
(కీ సుళకారంభమున మన దేశములో పశ్చిమోత్రర భాగాలను గెలిచి పాలించిన 
యఖ (Yuh) అను జాతియైవను కావచ్చును. అయితే వారు మన తెకుగుదేళ 
లోని జక్కులతో నే నంబంధఎు కొలవారో తెలియదు. యక్షుల వేషాలువేసి గాన 
ములో (పసిద్ధియెన యక్షుల పేరుతో వెలసిన యక్షగానములను |పయోగించి 
నాటకాలాడినందున జక్కు లవారను మన నటకులకు పేరు వచ్చెనేమో ఆలోచనీ 
యముగా నున్నది, 


మగడకు విజయనగరరాజుల కాలమునుండి కొన్ని యక్షగాన నాటక ముల 
పేరులు తెలియవచ్చినని. కొన్ని లభించినవి. ఆంతకుపూర్వము యక్షగానాల 
నాటకాలను విరిఏగా ఆడినట్లు నిదర్శకములు కలవు, 


"కి ర్రింతు రెవ్వానికీ ర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగొనసర ణీ 
ఆని భీమేశ్వర పురాణమున వర్తితము, 


_జక్కులవారే మొదట నాఓకా లాడియుండినవారు శివసంబంధమగు 
కథలను [ప్రదర్శించి యుందురు. శైవకథలను ఆడి (పదర్శిస్తూ వుండిరని 
పాల్కురికి సోమ నాథుడు పండితారాధ్య చరిత్రలో తెలిపినాడు. 


“ఆచట గంధర్వ యక్ష విద్యాధరాదుల్రై పాతల నాడించువారు"” 


అని పర్వత _పకరణమం దన్నాడు. తర్వాత భాగపత కథలను, వైష్ణవ 
గురువుల చేతను, రాజులచేతను (పోత్సహింపబడి ఆటలాడి జనులలో వైషవము 
వ్యాపింపచేసి శైవమును నణగద్రొక్కు టకు దీనిని గూడా సాధనముగా గై కొని 
యుందురు. భాగవత కథలను ఆటలుగా నాడు= రిని భాగవతులు అనిరి. వారే 


]రీటీ - ఆంధుల సాంఘీక చరిత 


“భాగోతులై రి, శ్రీశాథునిదో లేక సమకాలకవిదో యైన ఓక చాటువు. *“'భాగో 

తుల బుచ్చిగాడు” పసిద్ధముగా ఆచ్చపు స్రీవలెనే స్రీ వేషమువెసి ఆకర ణీయ 

ముగా ఆడుచుండిననియు, పాడుచుండెశనియు, *'పెండెల నాగి” అను స్రీయు 

అటిదే యనియు, కీలు (తక్కు_వజాతి వనన! ‘Non’ వంటివారు) రూడా 
టి (౮ y 

స్రీపాతల నభినయిస్తూ వుండిరని తెబ్చుటకు సహాయపడినడి. (కీడాభికామము 

నకు వీధి నాటకము ఆని పేరు, దానిని పడర్శించిరని అందిట్లు తెలిపినారు. 


““నటులది దోరసము[దము, విటులది యోర్గల్లు, కవిది వినకొండ మహా 
పుటభేవన మీ _తితయము, నిటు గూర్చెను |బహ్మ రనికులెల్లరు మెచ్చన్‌'”, 


అయితే (కీడాభిరామము (పదర్శన యోగ్యముగా లేదు. (పదర్శించిన 
(పజల కర్థమై యుండదు. అగ్గము కానిదాన్ని జనలు చూడరు. వీధి నాటకము 
ఆనుటలోనే దాని చరిత యిమిడీయున్నది. అవి ఇప్పటివలె టికెటు నాటకాలు 
కావు. వీధులలో కొద్దిహెటి పరికరాలతోనే ఉవితముగా జనుల యెమట నాటకా 
లాడుతూ వు;డిరి. గామ ముఖ్యులు, ధనికులు నాటక మువారిని పోషిసూ 
వుండిరి, 


జనలు అనేక విధములగు పాటలు పొడుకొనుచుండిరని కాకతీయ కాల 
మందు తెలిప్‌నాము. పల్నాటి ఏరుల చరిత్రమును పిచ్చుకుంట్టవారును, కాటమ 
రాజు కథను గొల్లవారుకు, ఎల్లమ్మ కథను బవనివారును చెప్ఫువారై రి. ఈవిధ్‌ 
ముగా ద్విపద భేదాలతో కథలుపాడి వినిపింవ జీవించు కులాలు కొన్ని యేర్ప 
డను, ఎల్లమ్మ కథయే రేణుకాకథ. దినిని చాలా విపులముగా పురాణకధకు భిన్న 
ముగా రెండుదినాలవరకు బవనీ=డ్డు జవనిక వాయిా చెప్పుదురు. ఏరే పెద్ద. 
దేవరకథను రాయలసీమలో చెప్పుదురు. ఇది పురాణాలలో నెందును లేనట్టిది. 
[బాహ్మణయి. డ్తలో కా మేళ్వరికథ (బసిద్ధమైనది. దానిని పొద్దున మొదలుపెట్టి 
సాయం|తమువరకు చెప్పుదును, ““అక్కలు లేచేవరకు నక్కలు కూ సె” అన్న 
సామెత దీనినిబట్టియే వచ్చినది. ఈ కథ గుంటూరు కృష్ణాగోదావరి జిల్లాలలో 
విశేష పచారమంమన్నట్లు కానవచ్చును. ఈకథను జక్కులవారు చెప్పెడివారని 
క్రీడాథిరామమందు వర్షించినారు. 

[కీడాభిరామములోని “కామవల్రీ' కథాసూచన యిదియే. బీదలు, పని 
పాటలు చేయువారు, మోటకొట్టువారు, కలుపుదీయువారు, దంచువారు, విసురు 
వారు, పొటలుపాడుచు పనిచేయుచు ఆయాసమాను మరుస్తూ వుందురు. 


రెడ్డి రాజుల కాలము 159 


“పనిచేసి గంజియైనను అంబలైనను నెద చల్లగా దాగి యెచటనై న 
పడియుండి వెన్నెల గుడిపాటపాడగా పేదల కాత్మసంపీతి కలుగు.” 1 


వెన్నెలగుడిపాట యన నెట్టిదో తెలియదు. వెన్నెలలో పాడునట్టి పాట 
యని మ్మాత మూహింప వచ్చును. పొల్కురికి తలిపిన వెన్నెల పాట యిదియె 
యుండును. 


గు;రములకు నడక నేర్పుట యొక అనుభవవిధానమె యుండెను. మంచి 
గు|రపురెౌతులు (వత్యెకముగా గురములను సాధించువారై యుండిరి. గురపు 
నడకలు పలువిధములవై యుండెను. మన సమీక్షాకాలములో *జోడనయు, 
జంగనడకయు, తురికినడకయు,  రవగాలునడక యుంగల వారువంబులు” 
ఉండెను ౫. జోడన అనధెరితకము ఆనియు, జంగన అనగా కాలు చాచి పెట్టి 
నడచునడక అనియు, రవగాలుశ:డకయన ఆస్కందితము అనియు శబరత్నా 
కరములో (వాసినారు. కాసె తురికియన గు రమని యగ్గము (వాసినది ఈ సంద, 
ర్భమునుబట్టి కుదురదు. నాలుగుకాళ్ళను ఎత్తి సవారిపోయిన ఈనాడు దానిని 
చాతురికినడక అందురు. బహుళా ఆద చౌతురికియె యుండునో యేమో? 


దొంగతనము అందులో కన్నపుదొంగతనము, బందిపోటు దొంగతనము 
జస.లకు బాధాకర మైనదై నను కవులవర్దనలలో అదొక కళగా పరిణమించినది. 
సంస్కృృతవాజ్మ్యయమందు దండి దశకుమారచరి తములోను, చూ దకుడు 
మృచ్చక టికా నాటకములోను దొంగతనమును వర్ణించుటను చదివినవారి కదొక 
(పీతిదాయకమగు కళగా కానవచ్చును. ఆమర్యాద ననుసరించి కొరవి గోపరాజు 
చౌర్య విద్యను వర్ణించువిధాన మిట్టున్నద, 


దొంగలు కాళికాది శ క్రిదేవాలయముల కేగి తమదొంగతనము విజయవం 
తముగా కొనసాగిన ఆమ్మ వారికి ముడుపు లిచ్చుకొందుమని _మొక్కుకొందురు. 
ఊళ్ళలో చీకటిపడగానే ఆరెకలు (తలారులు) కావలిగా తిరుగజొచ్చిరి. 
దొంగలు సిద్దమైన విధ మెట్టిదనగా, 


“'గాలిదీరయు నొల్కిబూడిద (గద్దగోరును గొంకియున్‌ 
కోలయున్‌ వెలుగార్చు పుర్వుల కోవి ముండులబంతియున్‌ 


1 సిం. ద్వా(తింళిక భా, ౨ పు, ౫౯ 
వ్‌ si Re ౪౧ 


166 ఆం[ధుల సొంమ్‌క్‌ చరిత 


మైలమందుల కొయ్య కతిర, మారుగన్న వు క రియున్‌ 
జే అవుట | 
నీలిదిండులు, నల్లపూతయు నేర్చుతోడుగ _ముచ్చులున్‌” 
“పాలెమున్న వారిపై నొల్కి బూడిద మందుచల్లీ పెద్ద మగులు కొంత 
కూల దవ్వి రాచకూతురుండు మేడ క తిరిందినటు గంటు వెటి" 
టి థో ఉం 


“తొడితొడి కోవుల పువ్వుల విడిచి దివియ లార్చి...రొ 1 


వపేవర్టనలోని చౌర్యపరికరము లలో ఒల్కి.చూడిద యొక్క యు, వెలుగును 
ఆర్చి వేయునట్టి పుర్వుల్నకోవియొక్కయు ఉపయోగమును తెలిపినారు శ్మళొ 
నములో పీనుగుల గాల్చిన బూడదను ని(డ్రించువారిపై చల్లిన ఆది మచ్చుమం 
దుగా పచిచేయునని దొంగల విశ్వాసము, అందును “వాలెమున్న వారిపై” 
చబ్లుచుండిరి. (పాలెము అన మొదటి యర్థము కావలి. సీమాంతమందు దుర్గాధి 
పతులుగా నుండి తగినంత సెన్యములు కొని (పతిఫలముగా జాగీర్లను పొందిన 
వారి కర్థమయ్యెను. వారిదండును కూడా పాలెమనిరి.) గాలిదీర అన గాలి జొర 
కుండుటకై అడ్డముగా పెట్టెడు వస్త్రము. (గద్దగోరు అన 'చోరసాధన విశేషము” 
అని శద్దరత్నాకిరకారుడు వాసెను. ఆంతమాతము మనకను తెలియును. 
దొంగలు (గద్దగోరుతో కన్నము పెట్టుచోట గీయుదురు. ఆ గీత మె_త్తదనమును 
బట్ట అట కన్నము పెట్టదురు. అటు కానిచో మరొక తావున గీయుదురు. 
దొంగల కట్టి విక్వాసముండెను, ఆది (గద్దగోరుయొక్క_ [పయోజనము! తెఃం 
గాణాలోని కొన్ని పాంతాలలో ఈ విశ్వాసము నేటికిని కలదు. కొంకియన 
కొండివంటి వంపు చీల. దానికి _తాడుగట్టి గదులలోనికి దిగి సామానులను ఆ 
చీలకు తగిలించి [తాడులాగి సెగ చేసిన పై నున్నవారు గవాశ్‌ము 
ద్యారా చేదుకొని తీసుకొనుచుండిరి. కట్టకడపట దిగినవాన్ని కూడా 
ఆతాటితో చేదుకొనచుండిరి. వుర్వుల్యకోవి యనియు, (కోవుల పువ్వులు 
అనయు కవి రెండురూపాలు వాడినాడు. రెంటిలో పుర్వులు అనునడే సరియగు 
రూపము. (కోవి అన గొట్టము. అందు పుర్వులను ఆనగా పురుగుల నుంచి 
వాటిని దీపములపై విడిదిన అవి వాటిని ఆర్పుచుండెను. దీపము లార్పు పుర్వు 
లేవియో ముందు కనుగొందము, ముడ్ల్‌ బంతి యెట్టిదో? ముండ్లబంతిని (తాడు 
నకు గట్టి గదోక్షము ద్వారా వదిలితే కొండ్లకు సామానులు తగిలిన వాటిని చేదు 
కొనుచుండిరేమో! ఆదే ముండ్ల (కొండ) బంతి (61౦19 అయి యుండును. 


1 సింహాసన ద్యా(తింశిక, భా ౨. పు ౮౮. 


రెడ్డిరాజుల కొలము 161 


మైలమందులు అనునది నిఘంటువులో లేదు. అవి మైకపు మత్తుమందులే 
అయి యు=డను నల్పపూత ఆంటే చీకటిలో కనణడకుండుటకైె ఒంటికి పూసు 
కొనుపూత. ఈకళ యీవిధముగా నశించిన దన్నమాట! అనేక విషయాలు 
మనకు తెలియనివై నవి, 


తిమ్మభూవరుడు ఆనుకవి పరమమోగి విలాసము అను పద్య కావ్య 
మును (వాసెను. దానినుండి ళబ్ధ్దరత్నాకరమందు |గద్దగోరు ఆను పదమువద్ద 


యిట్లుదాహరించినారు. 


క. బలపము, కన్నపుగ తియ తలముళ్ళును, చొక్కు, నీలిదట్టి యిసుము, చీ 
మల (కోలు, (గద్దగోరును, మలుబంతి యు, కొ తెరయును మొదలగువానిన్‌. 


ఈపద్యమందు “చోరసాధన విశేషములను” వర్ణించినారు. తలముళ్ళన 
తలముడి బహువచనము. తల వెంటుక లను మడిచి క ద్రైడు ముడిబట్టయె యు౦ 
డును. సిలిదిండు, సీలిదట్లి ఆనగా నీలిరంగు వేసిన బట్టలను వారు తొడిగిన చీక 
టిలో కానరాకుందురు. ఇసుము (ఇసుక) ఎదుటి వారికంట చల్లుట కేమో? 
“చీమల (కోలు నకును, “పుర్వుల |కోవులి కును సంబంధము కానవచ్చెడి. 
(కోవు బహువచనమే కోలు. ఆ | కోవులలో | గొట్టములలో) చీమలునింవి తీసి 
కొనిపోతూ వుండిరన్నమాట. చీమలు వెలుతురును ఆర్పునా ? రెక్కల చలిచీమ 
లీ పనిని చయునా ? ఆదియు తెలియదు. దీపము చూచిన పుట్టలుగా వచ్చి 
దానిపై బడు పురువులు కొన్ని కలవు. అవి యీ చీమల వంటి వేమో! దీపము 
లార్పునవి చీమలు అని పైన [వాసినను తర్వాతి కాలపు ఇద్దరు కవులు ఆ పురు 
గులు భమరములు అని తెలిపినారు. “(భమరాల బట్టిన |కోవి" అని గౌరన 
తెలిపినాడు. (హరిశ్చుంద, ఉత్తర భాగము, పుట ౨౨౬.) 


“భవనదీపాహిత [భమర పేటిక” అని వేంకటనాథ కవి (క్రీశ, ౧౫౫౦ 
[పాంతము వాడు.) పంచతం౦ం్యతములో [వాసెను. (౩-౧౯౯) (భమరములన 
తుమ్మెదలు కదా! తుమ్మెదలు దీపముల నార్పునేమో! ఎవరై నా పరీక్షించిన 
కాని తెలియదు. దొంగల పరికరాలను, వారి చౌర్యకళను చాలాచక్కగా వేంకట 


నాధథు డిటు వరించినాడు. 
ర్వా స 
(21) 


162 ఆం|[ధుల సాంఘిక చరిత 


భవన దీపాపాత (భమర పేటిక, వాలుకాభ స్తీ, తలముళ్ళు, (గద్రగోళ్ళు 
ములుదోరణముబట్ట, మొల తాటికురువాడి కై కెదువు దెసకట్టు కావుబొట్టు 
జిలుగు కన్నపుక తి, బలపంబు, మొగమాయ మందు, అరక మెలగోది 
మడువ్పుటాకులు, సోక పొడికాయ, మోరచ్చు చెప్పులు, భుజగ వృశ్చిక చికిత్స 
సువ్రివృద్ధిక రౌషధత్షోద, మసిత వనన భంగంబు పెడతలవంక సిక యు, 
కొరు నును మేను, నెరని కన్నులమర దూరిత తాసు డపుడొక్క దొంగబంటు 
“వచ్చి (తిమ్మరు తలనరులు కన్లొనకుండ బవరి చుట్టును బలపమున (వ్రాసి 
ముంచి కన్నపు గ త్రిమొన కత్రి పెట్టించి యొయ్యనాయ్యన శిలలూడదివిచి 


ర రి థి ల అల? రి అ టీ ని అ౪€ + లల 6 96 ల బని అ? త శినా 9 ౨ 6 అ 9 9 6 అ 9 6 అ అ 4 9€9 ¢ 


గాలికుండ వెలుతురు కాకయుండ కరకు గరబట్ట కన్నపు గండిగప్పి” 
(3౩-౧౯౯, ౨౦౦) 


బలపము యొక్క యుపయోగ మిచ్చట ఈ కవి తెలిపినాడు, 


ఇంతకు పూర్ణమే కీ. శ, ౧౨౫౦ [పాంతమందుండిన పాల్కురికి 
చౌర్భకళ నిట్లు వ ర్లించి యుండెను. 


“క త్తియు, బలపంబు, కాఎబీర యును, కత్తిర, యిసుమ్ము నక్షతలును, ముండ్ర 
బంతియు, సీలిక ప్పడమును, [దిండు, మంతర కాటుక, మరి చండవేది, 
సెలగోల, యొంటట్ట చెప్పులు ఎకె మొలుకుల బూడిద యును వాటుజాలు, 
కుక్కలవాకట్టు కొంకినారసము, (గక్కున కంకటిరజ్ఞువు, నమర” 
గడియ కన్నంబును, కడప కన్నంబును, గోడకన్నంబును, గురినేల కన్నము 
ఓడక [ తవ్వించి, యిల్లొ య్యన జొచ్చి మరిక రల టు! 


పై పద్యమందు దిండు అనగా నడుమున కట్టు పట్టీ లేక దట్టి లేక 
వీపుపె చు ధ్రిడు వస్త్రపు దుట్ట, మంతరకాటుక అన మంతించిన కాటుక అంజ 
నముగా పనియిచ్చునట్టిది. చండవేది పదము నిఘంటువులలో లేదు. ఈ చౌర్య 
కళను గురించి ముందు |పకరణమున నెక్కువగా చర్చింపబడును. 


తెనుగు భారతము ఆనుశాసనిక పర్వములో నీ (క్రింది పద్యము కలదు. 


1. బసవ పురాణము. పుటలు ౧౫౪, ౧౫౫ 


రెడ్డిరాజుల కాలము 1€8 


“గువ్వ, (గద్ద, దివ్యారుపు( _బువ్వు, గూబ, 


యిల్లు సొచ్చిన కాంతి సేయింపవలయు” ౪ఇ=ఎ౧౧౯ా 
ఇందుకు సంస్కృత మరో మిట్లున్నది. 


“శృ హే ష్వేతేన పాపాయ తథావై తై లపాయికాః 
ఉద్దపకాళ్చ గృ (ధాళ్ళ క పోతా |భమరా స్తథా 
సివిశేయు ర్యదా తత కాంతి మేవ తదాచరేత్‌ 
అమంగళ్యాని చై తాని శథోతోగొశా మహాత్మనాం” 
ఆను. ౧౧౪ అధ్యాయము, 


తె లపాయిగ మలు అనగా గదబ్బిలములు, కపోతములన గువ్వలు, ఉద్ది 
పకము లన నేమో? (పకాశమిచ్చునవి అని శబ్బ్దకల్ప(దుమము, కొండచీమ అని 
(ఆంధ శబ్దరత్నాకరము, అవెట్టివో యేమో? రాతులందు గూబల కన్నులు 
(పకాశించునుకాన అవే ఉద్దిపకము లగునా? తిక్కన గూబ అని వాడినాడు. 
దానికి సంస్కృత మూల మెది మరి? రాతులందు (పకాశించునవి మిణుగురు 
పుర్వులు కదా! అవే ఉద్దీపకములగునా ? ఆచర్చ మనకు |పధానముకాదు. 
“తిక్కన దివ్యారుపు( (_బువ్వు” ఆని వాడెను. దిశ్య అనగా దివ్వె. దివ్య 
(ప్రయోగ మిదొక్కటి తెనుగులో కానవచ్చినట్లున్నది. దివ్వటీ వలె దివ్వ అని 
పద ముండెనేమో. ఏది యెట్లున్నను దివ్యారుపు (బువ్వు అనగా దీపము నార్చు 
పురుగు అని యర్థము, ఆ పురుగేది? సంస్కృత మూలములో భమరాపి అని 
కలదు ఈ చర్చలో ,భనగరమలు దీపము లార్పునని ఒక కవి |పయోగించినది 
చూవినాను కదా! (భమరమునకు తిక్కన దీపమార్చు పురుగు అను నర్గము చేసి 
వాసెను. కావున దొంగలు కోవులలో గొట్టములలో దీపముల నార్పుటకై. 
తీసుకొని పోయినవి (భమరములేయని స్పష్టమై పోయినవి. 


మెలారు దేవుని అనగా మెలారు అను ఊరిలో (పసిద్ధముగా నెలకొన్న 
వీరభదుని కొలిచే భక్తులను మైలారు భటులనిరి. వారు పాణాంతకమగు 
ఆత్మహింసా కార్యములను భ_క్తిపారవశ్యము చేతను, [మొక్కుబడి చెల్లించుట 
కొరకును చేయుచూ ఉండిరి. 


“రవరవ మండ న్మెరనిచం్యడ మల్లెల చోద్యంపు గుండాలు చొచ్చువారు 
కరవాడి యలుగుల గనపపాతర్లలో నుట్టిచేరులు గోసి యురుకువారు 


కేరిశ్తీ ఆంధుల సాంఘిక చరిత 


గాలంపుగొంకి గంకాళశచర్మము (గుచ్చి యుడువీధి నుయ్యెల లూగువారు 
కటికి హొన్నాళంబు గండక లత్తెర వట్టి మిసిమింతుబునుగాక _మి౨గువారు 
సందులను నారసంబులు సలుపువారు యెడమ కుడిచేత, నారతులిచ్చువారు 
సాహసమ మూర్తిగై కొన్న సరణివారుధీరహృద యులమైలారుఏరభటులు ! 
పెద్దపెద్ద పొడవైన గుంతలలో ఎర్రని బొగ్గునిప్పులు పోసి వారందు 
'నడిచిపోతూ వుండిరి. నేలపై హూలాలు పాతి పెద్ద గిడపె నుండి ఉట్టి ఊగి 
వాటిని |తెంపుకొని ఆ హలాలపై పడుతూ వుండిరి. బహుశా ఆత్మ బలివాన 
 మవుతూ వుండిరి. . 


ఒక గడపై తిరుగు ఇమప కడెమునకు కట్టితాడు కొననున్న ఇనుప 
కొండిని వీపు చర్మానికి |కుచ్చుకొని దానిపై |వేలాడబడి గడె చుట్టును రంకు 
రాట్నమువలె తిరుగుతూ వుండిరి. బంగారు నాళపు (హొక్నుళనాళము) పిడి 
గల గండక త్రైర (తల నరకు సాధనముతో తల పండు విచ్చుకొను చుండిరి. 
బాణాలను /(దబ్బనము లను=ళ స్త్రములను) ఒంటి సంధులందు |గుచ్చుకొంటూ 
వుండిరి. నేటికిని కా ర్రీకనంది సేవలలో శైవులు ఆవేశమతో దబ్బనముల 
(శస్తా9ల-స తాలతో ) దవడలకు [కుచ్చుకొందురు. అరచెతులలో కర్పూరమును 
వెలిగించి దేవరకు హారతు లిచ్చిరి. ఇవి అబద్ధమయిన ముచ్చట్లు కావు. 


విజయనగర చ్యకవరుల కాలములో వీపున కొంకిని (గుచ్చుకొని జలు 
ఉయ్యెల లూగిరనియు, ఇళర సాహస హింసాయుత కార్యాలను (ప్రదర్శించి 
రనియు కాంటి యను యూరోపుఖండవాసి వర్షించి యుండెను. పైగా నేటికిని 
నిష్పులలో నకుచుట్క దబ్బనాలు [కుచ్చుకొనట, ఆరచేతులలో కర్పూర హారతు 
లిచ్చుట శెవు*లో కాననగును. 

భరతముని పతిపొదితమగు నాట్యభంగి మములు శా సోకముగా కూచి 
పూడివారు ఐబహుళొ అభినయిన్తూ వుండిరేమో! కూచిపూడివారి నృత్య మీ కాల 
మందే వ్యా ప్రిలోనికి వచ్చియుండును. సామాన్య జనులు మాతము తమకువచ్చి 
నట్టి నచ్చినట్టి దేశీనృత్యములందాస క్రి కలిగియుండిరి. 

కవితలో సంగీతములో నృత్యములో దేశివిధానము, మార్గ విధానము 
అని పాబీనమునుండి రెండువిభిక్నరీతు లేర్పడియుండెను. నన్నెచోడుడు 

1 క్రీడాభిరామము. 


రెడ్డిరాజుల కాలము 165 
మార్గకవిత (సంస్కృత పద్ధతి) నుండి భిన్నించిన డేశికవితను గూర్చి తెలిఎను. 
సంగీత శాస్త్రములలో మార్గవిధానము, దేశివిధాశ మున్నవని వివరించినారు. 
రామాయణమును కుళ౯వులు “"ఆగాయితాం మార్గ విధాన సంపదా” ఆని రామా 
యణములో [వాసి నారు. “ దేశిమార్గ లాస్య తాండవంబులు” అ కాశీఖండ ములో 
చెప్పినారు. 

దేశినృత్యవిభానాలే జనులకు పీతి నిచ్చినవె యుండెను. ఆ నృత్యాలలో 
పురుషు లాడునవి కొన్ని, గ్రీలాడునవి కొన్ని యుండెను. కోలాటముపై అందెలు 
వేయుచు కోలంట్లువేయుచు పాడుచు మగవా రాడెడివారు. స్రీలు వలయాకారముగా 


చప్పట్లు చరుచుచూ ఆడేవారు ఇప్పటికి తెలంగాణాలో బతకమ్మపాట అనునది? 
రాయలసీమలో బొడ్డెమ్మ అనునది యీ విధానపు గీతికాయుక్త నృత్యమే! 


ధ్రీలు గొండ్రియాటను ఆడీ రి 3... 


“వీరు మైలారదేవర వీరభటులు గొండ్రియాడించుచున్నారు గొరగపడుచు 
నాడుచున్న చూడు మూర్దాభినయము తాను నెట్టిక సీలంతగాని లేదు.” 


గొండి (గొండిలి) అనునది కుండల అనుదాని తద్భవమేమో! కుండలా 
కార నృత్యము గొండి. గొండ్లి విధానమే బతకమ్మ, బొడ్డెమ్మ ఆటలు. గొరగ 
పడుచు అనిన మైలారుదేవుని గొలుచు న్ర్రీ. ఆగ్రి నీటి ప్యాతలోని వస్తువును 
మొగ్గవాలి నాలుకతో నందుకొనె నని యు అందే వర్టించినాడు. 


నాట్యములలో దేశి మార్గ నృత్యములను గురించి శ్రీనాథుడు కాశీఖండము 
లో రెండు మూడు తావులలో నుదాహరించినాడు. 


జక్కి.ణి యనియు, చిందు అనియు రెండుదేశీన్సృత్య ము లుండెసు. జక్కి- 
ణిని గురించి దశావతార చరితలో నిట్లు వర్టించినారు 


“దురుపదంబులు సొక్కుమై సిరులువొనగ 
సరిగ నిరుగెల కంచియల్‌ సవదరించి 
పెక్కువగ జక్కి-ణీకోపు దొక్క నొక్క 
చక్క నిమిటారి నరవతుల్‌ సౌక్కి చూడ”1. 
1 Hist. R.K. Page 432 - 


£36 ఆంధుల సౌంఘ్‌క చరొత 


ఇట్టివి ఆనాటి తెనుగు సారస్యతములో విరివిగా గానవస్తున్నవః 


ఈ విధముగా రెడ్డదాజ్యకాలమందు జనులు 'జీవించిరని తెలును కొన 
గలిగినాము, కొండవీడు మహావై భవోపేతమయిన్నదై యుండుటచే (శ్రీ రాథుడూ 
తదభిమానముచేత పరరాజుల దర్శించినప్పుడు తన కొండవీటి నిట్లు వర్ణించెను. 


సీ, పరరాజ్య పరదుర్గ పరవైభవ [శీల గొనకొని విడనాడు కొండవీడు 
పరిపంధి రాజన్యబలముల బంధించు గురుతె న యురి! తాడు కొండ వీడు 
ముగురురాజులకును మోహంబు పుట్టించు కొమరుమించిన వీడు కొండ వీడు 
చటులవి;కమ కళా సాహసం బొనరించు కుటిలారులకు జోడు కొండవీడు 
జవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక [పకట గండ 
సింధురార్భటీ మోహన శ్రీల దనరు కూర్మి నమరావతికి జోడు కొండవీడు. 


ఈ పకరణానికి ముఖ్యాధారములు 


౧. కొరవి గోపరాజు: సింహాసన ద్వా తింశిక ౨ భాగములు. కాకతీయ 
కాలానికి క్రీడాభిరామ మెటులో, ఈ కాలాన కిది అట్టిది. ఇది సాంఘీక 
చరిత్రకు చాలా యుపయు కవైనది. 


౨. HISTORY OF THE REDDY KINGDOMS. రెడ్డి రాజ్యాల 
చరిత, (ఇంగ్గీమ) -- కర్త :--- శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్శ 
గారు. 


ఈ [గంథము ఏ[పెల్‌ ౧౯౪౯ లో వెలువడినది. ఇది సాంమక చడ 
[తకు చాలా విలువనిచ్చునట్టి సమ్మగ [గంథము. నేను స్వయముగా నోటు చేసు 
కొని చదివిన విషయాలు కాక నాకు తెలియనివి దీనినుండి యుదాహరించి దీన్ని 
వెర్కొన్నాను. దీనిని ఆం|ధా యూనివర్సిటి వారు పక టించినారు. తెనుగులోను 
ముదించుట భాగని నూచింతును. 


౩. కృంగార్‌ శ్రీనాథము :— థ్రీ వేటూరు ప్రభాకర శాన్తిగారు. 
ఇదియు చాలా విలువకలడి, 


రెడ్డిం*జుల కాలము 167 


శ్రీనాథుని కృతులన్ని యు._చాటువులును. 


. ఆం ధుల చరి|తమ్ము (శవ భాగము, ఎ శ) చిలుకూరి వీరభద 


రావు గారు. 


. భోజరాజీయము :-= అనంకామాత్యుడు. 
= కేయూర బాహూ చరిత :- మంచెన, 


* బ్మిర్యాపెగడ్‌ :- నృసింహ పురాణ ఉత్తర హరివంశ, కృత్యాది 


పద్యాలు. 


శ రెడ్డి సంచిక (రాజమహేం దవరము ఆంరేతిహాస పరిళో ధక 


మండలి) 


* గౌరన :- హరిశ్చం|ద, నవనాథ చరిత 


౪వ (పకిరణము 


విజయనగిర నావూజ్య కాలవుం 


శ్రీ! శ॥1 ౧౩౩౯ నుండి ౧౫౩౦ వరకు. 


మతము 


ఓక్‌ దిక్కు. రెడ్డి రాజ్యము. వెలమ రాజ్యము స్థావితములు కాగా మరోక దిక్కు, 

విజయనగర న్నామాజ్య మారం౦ంఖథ మయ్యెను, అందుచేత రెడ్డిరాజుల 
కాలముతో బొటుగ విజయనగర రాజ్యకాలచర్చయు చేయుట యవసర మైనది. 
సాామాజ్య స్టాపనకాలమునుండి (శ్రీకృష్ణదేవరాయల నిర్యాణము వర కీ పకర 
ణమున చర్చింవబడును. 


పలువురు చరితకారులు విజయనగర్‌ సాామాజ్య స్థాపనము be గ 
౧౩౩౬ లో నయ్యెనన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు కీ. శ. ౧౫౭౦ లో చనిపో 
యెను. డీ. శ. ౧౫౬౫ లో తళ్ళికోట యుద్ధమందు రామరాజు వధ్యుడై 
విజయనగర విధంసము దక్కన్‌ సుల్తానులచె ఆతి ఘోరముగా జరిగెను. పెను 
గోండలో మరల తిరుమలరాయలు నిలదొక్కుకొని తురకల యా[కమణను నిరో 
ధించి రాజ్యము చేయగలిగెను. కాని, శ్రీరంగ రాయ లు చాలా దుర్చలు డగుటచే 
రాజధాని చం[దగిరికి మారను, ఆచ్చట కొంతకాలము నామమాత్రావశిష్టముగా 
సౌగి తుదకు డీ: శ. ౧౬౨౦ పాంతములో విజయనగర సామాజ్యము రూపు 
మాసెను, (కీ. శ, ౧౫౩౦ నుండి ౧౬-౨౯ వరకు ముందు పక రణములో 
చర్చింతుము, 


ఓరుగంటిన మంట గలివీన ముసళ్మాన లు తెను(గుదేశ మంతటను 
వ్యావీంచుకొని తమ ఘోరకృత్య ములను సీకాఘాటముగా సాగించిరి. అట్టిసమయ 
ములో [పోలయ కాపయనాయకులు వారిని తరుముటయు, రెడ్డి వెలమరాజులును 
అదేపని చేయుటయు సంభవించినందుశన తెనుగు దేశము తురకల పెళాచికము 


విజయనగర సాామాజ్య కాలము 169 


లను నాలుగై దేండ్లకన్న నెక్కువగా సహించి యుంకినది కాదు. కాని ఢిల్రీనుండి 
పొరకచుక_ కు (ధూమకేతువు) వలె విజయధాజీ నమారంభముతో చూచినదెల్ల 
వళ్యముగాను. పట్టినదెల్ల బంగారముగాను, సాగినమార్గ మంతయు జైతయాత 
గాను, కావించిన మలిక్‌ కావిర్‌ తమిళ పాండ్యదెశమందలి మధురలో మ.ఫ్లీం 
రాజ్యమను స్థాపించి పోయెను. అచ్చట సులాను లేడుమంది ఇంచుమించు ౫౦ 
ఎండ్లు రాజ్యము చేసిరి. ఆ రాజ్యకాలములో వారు తలచిన ట్లెల్ల [పజలను దుర్భర 
హింసలపాలుచేగిరి. ఆం[ధదేశమున క్రి సంబంధించకున్నను వారిచర్యలంత టను 
నొ కేవిధముగా సాగినవగుటచేతను తెనగుదేళమునను జనులకు కలిగిన కష్టాలను 
తెలుసుకొనుట కుపకరించునని యిచ్చట వాటి మాసర తెలుపబడును, 


' వీరకంపరాయచరిత్ర మను నామాంతరముకల మధురా విజయ మనుకావ్య 
మును కంపరాయల భార్య యగు గంగాదేవి (వా సెను.! అది సత్యమయిన చారి 
[తిక [గంథము, కీ. శ. ౧౩౭౧ లో కంపరాయలు మధుర నుండి తురకల 
నోడించి వెళ్ళగొదైైను. 


\మధురా విజయములో ఒక శ్రీ కంపరాయని కాంవీనగరమందు దర్శిం 
చుకొన్మి మధుర రాజ్యమందలి తురకల పాలనము నిట్లు వివరించెను. 


అధిరంగ మవాపయోగ ని[దాం హరి ముద్వేజయతీతి జాత ఫీతిః 
పతితం ముహు రిషికానికాయం ఫణదచ, కేశ నివారయ త్యహిందః 


హరియొక్క. యోగనిదకు భంగము కాకుండా శ్రీరంగగోపురపు ఇటి 
కలు పడిపోగా శేషుడే తన తలలతో ఆనబట్టుతున్నాడు, (పాములు పారాడిన 
వన్నమాట) 

ఘుణజ గ్ర కవాట సంపుటాని స్ఫుట దూర్వాంకుర సంధి మండ పాని 

శథ గర్భ గృహాణి ఏక్ష్య దూయే భృళమన్యాన్యపి దేవతాకులాని. 


దేవతాయతన ద్వారాలను చెదలు తివివేసెను మంటపాలు విచ్చు కొని 
పోయి వాటి సందులలో గడ్డి వెరిగినది, గర్భగ్భహాలు పడిపోయినవి. ఈ 
యవస్థ ఇతర దేవాలయములకును కలిగినది. 


ముఖరాణీ పురా మృదంగ ఘోషై రభితో దేనకులాని యాన్యభూవన్‌ 


తుములాని భవంతి ఫరవాణాం నినద్ద_ సాని భయంకర రిదానీం. 
(22) 


170 ఆం|ధుల సాంమీక చరిత 
మృదంగ ధ్వను లుండినచోట ఇప్పుడు నక గ్రాలకహాతలు వినవసున్నవి, 


సతతాధ్వర ధూమ సౌరభి 8 (పాజ్నిగమో గ్లోషణవద్భి ర్యగవారైః 
అధునాజనివిస మాంసగంధై రధికెక్షీబ తురుష్క సింహనాొడ్డె 8. 


అగహారాలలోని యజ్ఞధూమాలు పోయి మాంసము కాల్చు సెగలపొగ 
లెగయుచున్నవి. సర్వయు క్ష వేదఘోషలకు మారుగా కేవలము అనుదాత్త 
ఆస కాయితం A 
కర్కాళ తురుష్క. నిర్భి షలె మిగిలినవి, 


మధురోపవనం నిరీత్యదూయే బహుళ ఖండిత నారికేళ షండం 
పరితో నృకరోటి కోటిహార (పచలచ్చూల పరంపరాపరీతం 


మధుర తోటలలోని చెంకాయల చెట్టను కొట్టివెసినారు. వాటికి మారుగా 
శూలములపై మానవుల తలకాయలు _వెలాడుతున్నవి, 


రమణీయతరో బభూవ యస్మిన్‌ రమణీనాం మణినూపుర _పణాదః 
ది?జ ళృం-ఖలికా ఖలాల్‌ (కియాభిః కురుతే రాజపధః స్వకర్త శూలం 


ఏ మధురా వీధులలో రమణుల నూపురరవములు వినబడుతుండె రో 
ఆందిప్పుడు |బాహ్మణులకు తగిలించిన సంకెళ్ళ గలగల ధ్వనులు విన 
వస్తున్నవి. 

స్తన చందన పాండు త్నామపర్ణ్యా స్తరుణీనా మభవత్‌ పురాయదంభః 

తదసృగ్భిరుపైతి కోణిమానం నిహతానా మభితో గవాం నృళంసైః 


ఏ త్హ్మామపర్టి నదిలో యువతుల మెపూతల చాయ లుండనో ఆందిప్పుడు 
వధింపబడిన గోవుల రక్తము కలిసియున్న ది. 

శ కసితానిల కోషితాధరాణి శ్లథ శీరాయత చూర్ణకుంతలాని 

బహుబాషృ పరిప్పుతేక్షణాని [దవిడానాం వదనాని వీక్యదూయే. 

ఎండిన నోళ్ళు, మాసిన తలలు, ఎడతెగని కన్నీరు కల (ద్రవిడ పడుచు 
లను చూచుటకు బాధ కలుగును. 


(కుతి ర స్తమితా, నయఃపలీనో, విరతా, ధర్మకథా, చ్యుతం చరితం 
సుకృతం, గత, మాఖిజాత్య మస్తం, కిమివాన్యత్‌, కలిరేక ఏవ ధన్యః. 


విజయనగర స్నామాజ్య కాలము 171 


ఈ పరిస్థితి నంతయు ఒకే వాక్యములో చెప్పవలెనంటే :---వేదాలకు 
అస్తమయం, సీతకి పలీనం, ధర్మానికి స్వస్పి, చరి్మతకు ద్యుతి సత్కార్యా 
లకు విరతి, కలీనతకు నాశనం, కలిగి కలియొక్క టే ధన్యత నొందినది. 

గంగాదేవి (వాసిన © విషయాలలో చెంకాయ చెట్లను మధురా సులా 
నులు కొట్టించి వాటి స్థానములో శూలాలు వాతించి, వాటిపై హిందువుల తలలు 
గట్రించిరన్న విషయమునకు ఆ కా.మందలి ఇబన్‌ బతూతా అను అరబ్బు 
యా త్‌కుడు స్వయముగా చూచి ఇటు | వాదినదే తార్కాణము, 

ఉన, టా 


“గ యాజుద్దిన్‌ మధురను రాజ్యము చేస్తుండగా హిందువులను చాలా 
బాధ పెదిను. గయాజుద్దీన్‌ ఆడవినుండి మధురకు వెళ్ళుచుండగా నేను (ఇబన్‌ 
బగూతా) వెంట నుంటిని. అప్పు డాతనికి విగహారాధకులు (హిందువులు) 
పలువురు తమ స్రీలతో, పిల్లలతో వళ్ళుచు ఎదుగుపడిరి. వారు అడవిలోని 
చెట్లు కొట్టి బాటచెయుటకై నియుక్యలై యుండిరి సుల్తాను వారిచే రెండు కొన 
లందు వాడి మొనలుగల కూలములను మోయించెను. తెల్లవారగానే వారిని 
నాలుగు గుంపులనుగా విభజించి నగరముయుక్క నాలుగుద్వారాలవద్ద కం పెను. 
శూలాలను భూమిలో పాలించి యా శనిమాలిన దర్శిదుల వాటిపై (గుచ్చి 
చంవించెను. 


ముసల్మానుల విజృంభణమున కనేక కారణములు కలవు. అందొకటి 
హిందువు=లో మతభేదము లేర్పడి పరస్పర వై షమ్యములు ముదిరిపోవుట. 
కాకతీయుల కాలములో కై వమత విజృంభణమును గమనించినాము. విజయనగ 
రారంభ దశలో వెష్షవ మతవ్యా ప్రి కానవచ్చెను ఈ కాలమువరకు ఆచార్య 
తయమువారి అదై ఏత విశిషాదైె త సిద్దాంతమలు వ్యా ప్రిలోనకి వచ్చెను. 
జైన బౌద్ధుల సంఖ్య లెక్కలేనిదయ్యెను. ఇక మిగిలినవి శైవ వైష్షవములు, 
శె వులు మొదట పరసాం,పదాయములను నోటికి వచ్చినట్లు తిటుటకు మొదలు 
పెట్టిరి. శివుని దప్ప అన్య దైవతమును మెచ్చినశారి నెత్రిన కాలు పెట్టుదు 
మనిరి, శివుని వలననే విష్ట్వాదులు వరములంది మాన్యాలుపొంది సామంత 
స్థితిలో నుండినట్లు కథలు కల్పలు కొల్పలుగా వాసుకొనిరి. 


1. మధురా విజయము, ఆక్టమ స్సర్గము, ఆది భాగళ్టోకాలు, 


172 ఆంధుల సాంఘీక చరిత 


(శ్రీకృష్ణ దేవరాయలే తన ఆముక్త మాల్యదలో శైవ పభువులు పర 
మతస్థుల కపచారము చేయుటను, పర దేవతాయతనములను పడగొట్టి శైవ 
మఠముల కట్టించుటను ఈవిధముగా వర్ణించెను. ఒక పాండ్యరాజును గూర్చి 
విష్ణుగుపునితో [శీరుగనాథు డిట్ల నెకట, 


“వెర్రి వంబు నుదిరి మద్వినుతి వినడు నతి యొ 
నర్పడు మామక |పతిమలకును 

హరుడె పరత త్తమను, మదీయాలయముల 
నుత్సవంబుల కులుకు నెయ్యురును న ట్రై. 


సీ, ఆ్మళాంత జంగమార్వనస కి వ రీలు 
న్న అణాల అందే 


వేదవద్దిజపూజు ఏటి గలివి 
భౌమవారపు వీరభద పళ్ళిర మిడు 
గృహదైవతంబు లి రింకు లింక 
షజ్జవతి శాద్దచయ మారబెట్లు సం 
కర దాసమయ్య భక్ష్మపతతికి 
అద్యంబులైన దేవాలయంబులు [వాల 
నవవీ నిరాశమరాళి నిలుపు 
జందెళు త్తర ర వంబు జెంది |తెంచదు ప 
తితు లారాధ్యదేవశ్ళి (పాప్యులనుచు 
ఉపనిషత్తులు వారిచే నబ్బి వినుచు 
వెండి యేజంగమె తిన వెరగుపడును, 


క. శివలింగము దాల్చిన జన నివహంబేవైన జేయు నిది పాపము దా 
నవుగా దన డాసమయమున నవునను వి|పులకె య,గహారము లిచ్చున్‌. 1 


ఆ పాండ్యరాజు శైవులు గంజాయి తాగినను చూనీ చూడనట్లుండి 
విపుతలతప్ప కొంచెమెనను పంచాయతిసభ కెక్కించి వారికి శాస్తి చేయించె 
ననియు, ఆ రాజును నమ్మించుటకై యిష్టము లేకున్నను ఇతరులు రు(దాత్ష 
చేరులు మెడనిండ ధరించి చంకలో వీరశైవ పు స్తకమగు సూతసంహితల 
నిరికించుకొని తిరిగిరనియు నిదే సందర్భములో తెలిపెను. రాజులును, మతా 


1 ఆముక్తమాల్యద ౪-౪౨ నుండి ౪౪ 
వయా 


విజయనగర సా్యమాజ్య కాలము 173 


చార్కులును నీవిధముగా (పజల బాధించుటవల్ప హిందువులలో పరస్పర ద్వేషాలు, 
రాజ[దోవా, దేశ దోహ బుద్ది _పబలుఓలో నాళ్చర్యము లేదు. 


కాళహస్తీశ్వర శతకమును ధూర్జటి వాసెనందురు. శైలిని బట్టి అది 
తనిది కాదని చెప్పవచ్చును. దాని నెఎరు రచించినను ఆది యీ సమీజా కాలపు 
దిగా కానవచ్చుని, 


అందు విష్తుదూ షణములు మెండుగా గలవు. “సీవాదపద్మ౦బుచేర్చె 
న్వారాయణు డెట్లు మానసము దా శ్రీ కాళహ స్తీళ్యరా!”, “శ్రీ లమ్మీపతి 
సేవితాం[ఘి యు*ళా శ్రీ కాళహస్తీశ్వరా!" “శ్రీరామార్చిత పాదపద్మ 
యుగళా శ్రీకాళహ _స్టిక్యరాో ఆని దూషించెను. ఇద్ద తిట్టులను విని 
శ్రీవైష్టవు లూరకొందురా? వారును కొన్ని కథలను కల్పించి శివునిచెతను 
విషపాదముల బట్టించిరి. పరమయోగి విలాసమున తాళ్ళపాక తిరువెంగళ 
నాథుడు కొన్ని తావుల శివదూషణము చేసెను. ఈ ద్వేషము లెంతవరకు పోయె 
ననగా, ఇైవవైష్టవులు పరస్పరము చండాలు రనియు, పాషండు లనియు, 
పాపు లనియు తిట్టుకొని సచేల స్నానాలు చేసిరి, 


తమ సెం పదాయములో చేరినవారు కులము చెడి, వ్యభిచారులై , 
దొంగలై, మద్యపాయులై , హంతకులై నను సరే, తమ వేల్పుపె భి కలవా 
రేని లేక భక్తి యున్నట్లు నటించినను సరే, వారికి ముక్తినిచ్చిరి. ముకి ధామ 
ములు కూడా వేరెవేరె యుండెను. శెవులు కై లాసానికి, వైష్టవులు వైకుంఠా 
నికి పోయిరి. ఇప్పటికిని పోతూనే వున్నారు. తమ సాంప్రదాయక దేవతలతో 
ఎన్నెన్నో నీచపుబనులను చేయించిరిం 


మః నిను నావాకిలి గొవుమంటినా, మరు స్నీలాలక భాంతి గుం 
చన సొమ్మంటినొ, యెంగిలిచ్చి తిను తింటెగాని కాదంటినో, 
నిను నెమ్మి6 దగ విశ్వసించు సుజనానీకంబు రక&ీంప జే 
సిన నావిన్నప మేల కైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా; 


అనియు, 


“నిన్నే రూపముగా భబింతు మదిలో నీరూపు మోకాలో; శ్రీ 
చన్నో, కుంచమొ, మేక పెంటికయొ...... ?“ 


174 ఆం[ధుల సాంఘిక చరిత 


ఆని కాళహస్తీశ్వర శతకకారుడు (వాసెను. ఆదే విధముగా శ్రీవెష్షవులా 
oa 

విపనారాయణుికి వేళ్యాసాంగత్యమును కలిగించి (శ్రీరంగనాథ్ర సాకమిచే 
వేళ్యకు దొంగ సొత్తు నిప్పించిరి. ఈ కథ బల్లినవారు సంఘములో మతవ్యా పి కే 
అవినీతులను కూడా వ్యాప్తి చేసిన వారై రనుట వారికి తోచక పోయెనేమో! 
శో వులను వైష్షవులగా, వ షవుంను శె వులుగా మార్చుట పరిపాటి యయ్యను. 
విజయనగర సాామాజ్య కాలములో శ వుం [పాబిల్యము తగ్గను, బసవ ప-డితా 
రాధ్య సోమనాథులవంటి (పచారకలు లేకపోయిరి. వైష్టవ |పాబల్య మెక్కు 
వయ్యను. ళ్లే వలు బిజ్జల రాజ్యమును పళపరచు కొన్న ట్లుగా, వైష్ణవులు రెడ్డి 
వెలమలను విజయనగర చక వరులను వెషప్షవులనుగా మార్చి వేసిరి. ఆనాటి మన 
మత పరిస్థితి యిట్టి హీనదళకు వచ్చియుండెను. 


వివిధ సాం,పదాయక వర్గాలవారు తమతమ (పాబల్యముగల తావులం 
దితర వర్ణ్గములవారిని హింసించుటకు గూడ జంకలెదు అనేక జై నా-యములకు 
ళ్‌వు లా|క్రమించకొని వాటినీ శివాలయమ. లనుగా మార్చిరి. వేములవాడలో 
నేటికిని శివా ల మము ముందట (పాచీనమందుండన ద్లైనవ్శిగహాలు తమ యవ 
సను తెలుపుకొంటున్నవి. గద్వాల సంస్థానములోని పూడూరు అను (గామ 
మందు పశ్చిమ చాళుక్య శాసనాలున్న వి, అచ్చట ఊరిముందటనే ఒక పెద్ద బైన 
శాసన మున్నది. ఆ యూరికి కొంతదూరములో నొక శివాలయ మున్నది. దాని 
యావరణములో (పాచీన జై నవ్మిగహాలు లోపలినుండి తొలగించి బయట నుంచి 
నారు. శె వులను జూచి వ్వష్షవులును జనుల హింసలగు పార? భించిరి. జెను 
లిప్పటి మెసూరురాజ్యుమలో ఆనాడింకిను మిగిలి యుండిరి, వారిని శ్రీవై వ్షవులు 
హింసించి (శ్రావణ బెల్లోలలోని వారి దేవాలయములను కూల్చిరి. ఆప్పుడు 
మొదటి బుక్కరాయలు వారికి నఖ్యత కూర్చి శ్రీవెష్షవులచేత కూలిన జైన 
దేవాలయములను బాగు చేయించెను. (1) 


విజయనగర రాజులుమా[తము మతసాంపదామిక ద్వేషాలకు తావిచ్చిన 
వారు కొరు, ఒకదిక్క తురకలు తాము గెలిచిన [పాంతాలలో హిందువులను 
బాధించి, మతముమార్శ్చి, |గంథాల నంటు బెట్టి, దేవాలయాలను గూల్చి ఫీభ 
త్సము చేయుచుండ, హిందువులలో ఐక్యత క లిగించుటయే రాజనీతిగా నుండెను. 


PI nena i 
(1) Vijayanagara Sexcentenary Gommemoration Volume P. 42. 
(ఇక ముందు దీనిని V. 5. €. అని యుదాహరింతును.) 


విజయనగర సా[మాజ్య కాలము {76 


ఆనాటి విదేశీ యాత్రికలు విజయనగర రాజ్యమందు సర్వమత సహన ముండు 
టను చూచి యాశళ్చర్యముతో (పశంసించిరి రాజులలో మతసామరస్య ముండి 
నను జనులలోను, మతాచార్యులలోను అది మృగ్యమె యుండుట ళోచనీయము, 


మధుర రాజ్యములో ముసల్మానుల (కూరచర్శలను గురించి తెలుప నైనది. 
అట్టి చర్యలే ఆర్మధ కర్ణాట [ప్రాంతాలలో ముసళ్మానులు కాలు బెట్ట తావృలలో 
వ్య_క్షమయ్యెనని యప్పటి వాజ్మయములో విశేషముగా చర్చింపబడెను. శ్రీకృష్ణ 
బేవరాయలే యిట్లు వర్తించేను. 


సనకాది దివిజ మన్మరి ఫాలగోవిచందన 
పుండవల్రిక ల్నాకి నాకి 

సెలని హాహాహూహూపు5 దండియలతం( కి 
దైవ్షసింగిణులుగా దిఐచి తివిచి 

స_ప్పరి కృత వియ జరవాలూకాలింగ 
సమితి ముచ్చెe కాళ్ళ చమిరి చమిరి 

రంభా!పధానాప్పరః పృథూరోజకుంభంబు 
లెచ్చట గన్న బట్టి పట్టి 

తిరుగు హరిపురి సురతరుసురల మరగి 

బహుళ హళి హళి భృతక లబరిగనగర 

సగర పురవరాపరిబ్బఢ జవన యవన 

పృతనభవదసి నని దెగి కృష్ణరాయ. 1 


శరా 


“గోవధంబుసేయు తురకల దెవంబవు నీవు" అని చందుని పెద్దన 
తిచ్లిను., 2 


చనిక వ్యవస్థ 


ముసల్మాను విజృంభణమున కొక కారణము ;- హిందుపులలో మత కుల 
ద్వేషాలుండుటచే ఐకమత్యము లేకపోవుటయని తెలిపినాము. మరొక కారణము, 
హిందువుల యుద్ధ నిర్వహణ లోపమైయు ౦డెను. మసల్మానులలో ఐక్యత, 
1 ఆముక్త మాల్యద. ౧-౪౧. 
2 మనుచరి త ౩-౪-౨ 


176 ఆం ధుల సాంఘీక చరిత 


మతావేశముండెను. మరియు మతవ్యా ప్రి చేయుట వారియాదర్శమై యుండెను. 
పైగా వారి పెన్యములో అశ్విక దళము ఆపారముగా నుండెను, గ్యురములు 
దికీణ హిందూ స్థానమందు తగినట్టివి లేకుండెను. ఆరేబియా, పర్షియా దేశాల 
నుండియే అవి దిగుమతి యపుతూ వుండెను. ఆరబ్బులు, పారసీకు లీ వ్యాపార 
మందు కోట్ల [దవ్యమును గడించిరి. వారు సహజముగా తమ మతస్థులగు 
హిందూస్థానీ ముసల్మానులకు మొదలు గుృురములను సప్పయిచేసెకివారు. విజయ 
నగర చృకవర్తులు గురమలు లేని లోపమును గమనించి వాటిని కొనుటకై 
సదా కృషిచేసిరి. గుర్రము లోడలలో వచ్చునప్పు డవి చచ్చిన వాటి తోకల 
దెచ్చి చూవీన గురము ధర యిస్తూవుండి రి. ఒక్‌) క్క.మారు ఒకక, 
గుురమునకు 6 లెన్స్‌ లిచ్చిరి. పోర్చుగీసువారు ఏటేట ౧౦౦౮౦ గురములు 
సప్పయి చేసిన, తాను ౨౦,౦౦౦ పొను లిత్తునని కృష్ణదేవరాయ అనెను, 


హిందూ సెన్యమలో మరొక లోప మేమనగ్గా వారికి తుపాకిమందు, 
ఫిరంగీలు తక్కు వై యుండెను 1 వాటి యుపయోగమును వారు తురకలనుండియే 
నేర్చుకొనవలసి వచ్చెను. తురకల యుద్ధశంతము మేలై నదిగా నుండెను. వారు 
యుద్దధర్మ ములను పాటించినవారు కారు. హిందువు లింకను పురాణయుగము 
నుండి బయటపడినవారు కారు. మూడవ భల్లాలరాజు మధుర సులానులపె 
దండెత్తి ముట్టడించగా తురక లోడిపోవుట నిజమని గుర్తించి సంధి చేసికొందు 
మనియు దాని కవకాశ మియ్యవలెననియు కోరిరి. భల్లాలు డొప్పకొనెను. అత 
డను అనని సైన్యమున్ను ఇక యుద్ధము లేదని నిళశ్చింకగా న్నిదించగా రాతి 
ముసల్మానులు వారిపై బడి సౌప్తిక (వళయము గావించి, భల్లాలును బట్ట కొని 
అపార ధనమిచ్చిన విడుతుమని, లాగవలసిన దంతయులాగి ఆతని తిత్తి యొలి 
పించి తోలులో గడ్డినింసి కోటకు (వేలాడ గట్టిరి. 


ఇట్టే మోసాలు జౌరంగజేబు మరణమువరకు ముసళ్మానులు చేసినను, 
పూర్వము కూడ గోరీ, అల్లావుద్దీన్‌ మున్నగు సుల్తానులు బహు మోసములు 
చేసినను హిందువులు గుణపాఠము నేర్చుకొనలేదు! నేర్చుకొన దలచలేదు !! 


“దక్షిణదేశ హిందూ రాజుల వద్ద అపార ధనమున్నదనియు, వారిలో 
ఐక్యత లేదనియు, అన్ని టికన్న మకుటాయమానమగు లోపము హిందూ పైన్య 
1. V.S.C.P. 222. 


విజయనగర సా్యమాజ్య కాలము 177 


దుర్చలశలో నున్నదనియు, అల్లావుద్దీన్‌ భిల్టీ గుర్తించి దక్షిణాపథముపై 
బడెను. (1) 


హిందువుల మరొక లోప మేమన, వారు శ తుపు" పె గెలుపొంది నపుడు 
మరల శ;తువు తల యెత్తకుండా గట్టి చేనుకొన్నవారు కారు. రాయచూరు 
యుద్దములో ముసల్మాను లోడిపోగా వారిని ప్పూర్తిగా తుడిచివేయ వలెనని 
సేనాను లొతి చెప్పినను (శ్రీకృష్ణ దేవరాయలు వినక పారెడి వారిని సంహరిం 
చుట ధర్మము కాదని వాదించెనని విదేశీయుడగు నూనిజ్‌ చకితుడై వాసి 
యుంచెను. (2) ఆతడు ఉష్ముత్తూరును గెలిచి నప్పుడు ఓడిన రాజులనే మరల 
అదు నెఒకొల్సెను. ముసల్మానుల యుద్ధతం త మట్టిది కాదు. శతువు విరిగి 
నప్పుడు వానిని పూర్తిగా భన్మముచేసి, వానియొక్కయు, వాని (పజల 
యొక్కయు, ధనమును పూర్తిగా లాగుకొని వారి నగరములను నాశనము చేసి 
తలచినన్ని ఘోరాలు చేయుట వారు నేర్చిన రాజనీతి. 


దేవగిరి, ఓరుగల్లు, కంపిలి, విజయనగరము శిథిలాలే వారి చర్యలకు 
సాత్య మిస్తున్నవి. మలిక్‌ కాఫిర్‌ దక్షిణాపథమును దోచి ౩౧౨ ఏనుగుల 
పయిన ధనమును, ౯౬౦౦౦ మణుగుల బంగారును అసంఖ్యాక మగు ముత్యాల 
రత్నాల పెద్టెలను, ౧౨౦౦౦ గుురాలను తీసుకొని ఢిల్లి చేరెను. 


హిందూ సైనికులు ముసల్మానులవంటి సెనికభటులు కారు. ముసల్మాను 
సెన్యములో అరబ్బులు, ఖురాసానీ తురకలు, పారసీలు, అదీషీలు (అవిసీని 
యనులు), పఠానులు, భిల్లులు, మున్నగు ఆటవికులు ఉండిరి, తమ సైనికులు 
తురక భటులకు సరిరారని విజయనగర చ కవ రులు గురించి, తురక లను 
తమ సైన్యములో భర్తీచేసి, వారికొక “తురక పేటను (ప్రత్యేకించి వారికి 
మసీదులు కట్టించి సకల నదుపాయములు చేసిరి. అట్లు చేసినను వారికి హిందూ 
రాజుల పె విశ్వాస ముండినటుల కానరాదు. వారు అమ ఏలికలకు సలాములు 
కూడ చేయుటకు ఇన్టపడనందున ఏదోవిధముగా తమ గౌరవము నిలుపుకొనుటకు 
1, “se cceethe utter want of unity among the Hindu States 

of the South, and to crown all, the inherent weakness of the 
Hindu armies convinced Alauddin....cc.ce...Of the advantage of 


invading the South’”-Heras; న్‌, C. P. 29. 


2. VSG Pl. 
(23) 


178 ఆం'ధుల సౌంఘీక చరిత 


తన గద్దెపై ఖురాను నుంచుకొని దానికిచేసిన తురక సలాములను తానును పంచు 
కొనెను, ఇట్టిలోపాలతో కూడిన “సైన్యాలను విజయనగర చక్రవర్తులు వీలయినం 
తవరకు సవరించుకొంటూ వచ్చిరని నిరూవించినాము, 


కాకమాగిమూ ర్తి కవిచే రదితమయిన! రాజవాహన విజయము అను 
పద్యకావ్యమును చూడగలిగితిని. శ్రీ యన్‌, వేంక టరమణయ్య గారు వాసిన 
యొక ఇంగ్లీషు వ్యానమును జదివి తెనుగు మూలమును చూచితిని. రాజవాహన 
విజయములో తురకల తుపాకీ యుద్ధాలు వర్ణింపబడుట చేతను సదాశివరాయల 
టంకాలను పేర్కొ నుటచేతను తత్క్యర్ర కీ. థం, ౧౬౦౦-౧౬౫౦ [పాంతమ౦ 
దుండినవాడుగా కనబడుచన్నాడు. రాజవాహన విజయమందు యుద్ధయా్యతను 
గురించి విఫలముగా వర్ణించినారు. విజయనగర రాజుల యుద్ధయా తలను సమ 
కాలికలు కొందరు వర్చించి దానికిని ఈ కవితలోని విషయములకును ఏమియు 
భేదము కానరానందున కటువైన యీ కవితనుండి మనకు పనికివచ్చువిషయముల 
నుదాహరింతును. 


“రాజవాహన = యువరాజు యుద్దయాతను నగరమందు 
[పక టించెను. సెన్యమంతయు నగర బహిః పదేశమందు రూడెను, 
యువరాజు జలతారు పనిగలిగి చక్కని కుట్టుపని కలిగిన అంగీ 
తొడిగి, సండిదండెపై రత్నాల కడెమును ధరించి ఎ రని బురుసాని టోపీని 
ధరించియుండెను. పల్టకీమోయు బోయీలు మొసలి మొగముల రూపముతో 
నున్న కొనకొమ్మలు కలిగి పరదాలును, పట్టుకుచ్చులును కల పల్లకిని యువ 
రాజు కె తెచ్చిరి. ఆ బె_స్సభోయలు | వేలాడు రుమాల చెంగులు కట్టిరి, జేనెడు 
బాకుల నీలిదట్టలో నుంచిరి. బిళ్ళచెప్పులు తొడిగియుండిరి, మావటీడుపట్టపుదం 
తిని తెచ్చి నిలిపెను. ఒకడు అలంకరింపబడిన గుర్రాన్ని తెచ్చెను. దానికి హురు 
మంజిలో సిద్ధమైన జీను, కళ్ళిముండెను. ఫరంగి కేడెమును రాజుకు పట్టిరి. 
యువరాజు తుక్టార మును (తుభారాదేశ పు సమరాశ్యమును) ఎక్కను. అతని 
యెదుట ఏనుగుల బలము, తర్వాత గు!రపు బలము, దాని వెనుక రథముల 
బలము, అటుపై కాల్బలము నడిచెను. యుద్ధవీరణములు అనగా శంఖ, కొహళ, 
ఢక్కా, హుడుక్కాది రవములు దిక్కులు పిక్కటిల్ల _మోసెను. ఏనుగుల 
“| రాజవాహన విజయ మను [పబంధము నాకు లభ్యము కాకుండెను. 
నాకు (వియమితుడగు (శ్రీ మల్చంపల్లి సోమ శేఖరళర్మగారు సంపాదించి నాకం 
వీరి, వారికి నౌ కృళజ్ఞతాపూర్వక నమోవాక్‌ ములు. 


వీజయనగర సామాజ్య కాలము 119 


దంతపు కొమ్ములకు పెద్ద ఖడ్గములను కట్టి యుండిరి. గురపు సేనలో పఠాను 
లక్కువగా నుండిరి. వారు జంపాలకు నూనె పూసి దువ్వి మెరుగిచ్చి వాటివై 
జరీపాగలు చుట్టరి, ఆంగీలు దొడిగిరి. అంగీపై నడుములో దట్టలు బిగించిరి, 
రూందే (తుర్కీ ) దేళములో సిద్ధమైన రూమీ కత్తులు పట్టియుండిరి. వారికి రాగి 
వన్నె మీసాలుండెను. కండ్లు ఎరుపై యుండెను. తాంబూలములు నమలినందున 
వారి నోశ్ళిరబారి యుండెను. వారు గురాలపె బారులు తీరి యువరాజునకు 
సలామందించిరి. తర్వాత చెంగులు విడిచిన పాగాలతో నడుమలో కటారులతో 
కురుచ బల్రెమలతో, చేతిపై నిలిపిన డేగలతో “కయిజీతపు రాజులు” వెళ్ళిరి, 
ఆ రాజులవెంట వారి సామానులను మోయు తట్టువలు వె ళ్ళిను. తర్వాత డాలు, 
కత్యలు వట్టిన బంట్లు పసుపువన్నె చల్లాడ ములతో , ఆ చల్లాడములకు కట్టిన 
చిరుగంటల (మోతతో, ద్యవ్షి దోష పరిహారమునకై పెట్టించుకొనిన మసి 
బొట్లతో, నడుము దట్టంతో, ఒరనుండి సగము బయటకి లాగిన కత్తులతో, 
ఆ బంట్లు వెళ్ళిరి. కర్ణాట దేశమందు బేండర్‌ (నిర్భయులు) అని వేరుగాంచిన 
బోయలు, నల్లని దట్టం నడుములందు చుట్టి రంగు చెల్లాడముల దొడిగి 
వెండితో పొదిగించిన ఆంబులతోను, కటారులతోను, వీపున నుండు బాణాల 
పాదులు తలపాగల ముందుకు నూగుచుండ నల్లని వులులవలె నడిచిరి, 


బంట్లు ఆంబులు, బాణాలు, తీసుకొని, మణికట్లపై ఇనుప కడెములు గలు 
గల్లు మనగా గోనె సంచులతో అవనరమగు యుద్ధ పరికరాలను మోసికొనుచు 
నడిదిరి. తర్వాత ఒంటరులు అను వీరభటులు దట్టిలలో వంక కత్తులను జొనిపి 
జుట్లను ఒంటిపొర గుడ్డలచే నె త్రికట్టి కొ వెలకుంట్ల తిరుమణులతో, బాగా 
తోమిన తెల్లని దంతముల పె అందానకిగాను చెక్కించిన బంగారు పువ్వులతో, 
రక్షగా తమ పెద్దలు కట్టిన తాయెతులతో నడిచిరి. భటులు తమ్ము సాగనంప 
వచ్చిన భార్యలను ఇంటికి పొమ్మని తొందర పెట్టిరి. కొందరు స్త్రీలు వెంట 
నత్తుమనిరి. తురక యోధుల భార్యలు తట్టువల పై నెక్కి, కాళ్ళ మెద్దెలతో, 
ముసుగులతో, సైన్యము వెంట వెళ్ళిరి. కన్నడ స్రీలు పలువురు వెండి సందెకడె 
ములతో» నొసట విభూతితో, మంకెనలలో, పాలు, పెరుగు, నెయ్యి పెట్టి గిత్త 
లపై కట్టి తామును వాటిపై కూర్చుని సైన్యము వెంట పాలు, పెరుగు, నేయి 
అమ్ము టకు వెళ్ళిరి. యువరాజుంచుకొనిన భోగిని ఒక పల్లకీలో పర్దాలు వేసుకొని 
బయలు దేరెను. ఆమెకు చెలికత్తెలు తాంబూలములు కట్టి యందింపగా పరదాలో 
నుండి బయటకి చేయిచాచి అందుకొను నప్పుడు ఆచేతి సొకుమార్యమును, అంద 


180 ఆం|ధుల సాంఘీక చరిత 


మును చూదినవారు ఆమె రూపు రేఖలను పూర్తిగా చూచిన మరెంత అందముగా 
నుండునో అని అంచనాలు వేసుకొని ఆశ్చర్యపడసాగిరి. రాజు భార్యకూడ ఒక 
అందలములో బయలు దేరెను. ఆమె పల్లకి వెంట పట్టె నామములతో శ్రీవెష్షవా 
చార్యు లిద్దరు రాఘవాష్టకమును చదువుచు వెళ్ళిరి. ఆ రాణిని సేవించు స్రీలు 
పలువురు కాళంజి, యడ సము, తాళవృంతము, కండి, రుంచె, వింజామరలతో 
సేవలు చేయుచు వెళ్ళిరి. ఆరాణియొక్క_ భ_దతకై అమెపల్పకీలో ఆమె సోద 
రుడు కూర్చునెను. ద్విపదలను పాడి, కతల చెప్పు పబైవామాల శ్రీవై ష్టవులు 
వెంట వెళ్ళిరి. మరియు రాజాంతఃపుర న్రీల రక్షణకై రాచవారు కొందరు వారి 
వెంట వెళ్ళిరి. పెసరకాయ, దోస, చెజకు, సజ్జ మున్నగు పంటలను లాగి 
తినుచు సైన్యము వ్య“ సాయకుల భూములను లీళ్ళుగా చేసి పోయిరి. గు;రాలు 
వరిచేలను నుసిగా (తొక్కి పోయెను. రథముల వలన, ఏనుగుల వలన పంట 
చేలు నాశనమయ్యెను* కాపులు అందుకై దుఃఖించిరి. ఈవిధముగా సైన్యము 
"కూచి" (March) సెను ళరత్కా లమందు 'సెన్యము బయలుదేరెను. వారు 
రాతులందు మంచుకు తాళలేక అడుగున బందారాకు పరచుకొన దుప్పట్లు 
నిండుగా కప్పుకొన్నను చలికి వడవడ వడికిరి. 'సెక్యపువ్యయములను వాయనట్టి 
కరణాలు సైన్యమవెంట వెళ్ళిరి. పలువురు బోగము స్రీలు సైన్యమ.వెంట వెళ్ళి 
సెనిక విటులవద్ద “రూకలు పది యైిదు నిద్దురకు" లాగిరి. ఈ విధముగా యువ 
రాజు యుద్ధ యాత చెడలెను, (చూడుడు ౨వ ఆశ్వాసము 


ఇదే రాజవాహన విజయమందలి పంచమాళ్వాసములో యుద్ధవర్జన చేసి 
నారు. దాన్నిబట్టి కొన్ని వివరాలిట్లు తెలియవచ్చెడి. “దుర్గముల నక గలదై 


కమ్మవారును, వెలమ వారును ౫౦౦౦ వరహాల జీతము పొందు పఠాను సైన్యపు 
సేనానులు, క్రై జీతపు రాచవారు, “పగటి గానంబు తప్పక యుండ దినరోజు 
మాదిరి నొంటరి బోదుమూక"” మొదలైన వారు యుద్ధము చేసిరి, ఆ యుద్ద 
మందు శ|తువులు “గడలపొజు” క కావికలయ్యెను, తుపాకీలను కాల్చు మూక 
ఒక దిక్కు. వాటిని శ్యతులపై కాల్చిరి. గజ సేనను కోట తలుపులు పగుల గొట్ట 
పురి కొల్పిరి. బాణములను కొందరు రువ్వుచుండిరి. కోట గోడలవద్ద గనులు 
[తవ్వి మందునింపి కాల్చుచుండిరి. దానిని కోటలోనివారు భగ్నపర చుచుండిరి. 


కొందరు నిచ్చెనలతో కోటగోడ లెక్కుచుండిరి. కోటలోనివారు వారిని కూల 


విజయనగర సా్యమాజ్య కాలము 181 


(దోసిరి. శ తువుం దిచనుతనమును జూచి రాజవాహనుడు “రేపు సర్వలగ్గ' 
యని (ప్రకటించెను. శతువు లది విని సంధి చేసుకొనిరి, 


కంపరాయలు దక్షిణదిగ్యిజయ యాతా పస్థానము చేసినప్పుడును పెన 
వివరించిన విధానమే కానవచ్చినది. “వీరకంపరాయలు పొద్దుననే లేచి పృత 
నాధ్యక్షులను (సేనానులను) సేనాసన్నాహమునకై ఆదేశించెను. వారును రణ 
దుందుభులను కోణాభిఘట్టనలచే నగరమందు (మోయించి (పక టించిరి* 
ఏనుగులు గురాలు వచ్చి చెరెను కవచ ధారులగు భటులు కృపాణ కర్పణ 
(పాస కుంత కోదండపాణులై వచ్చికూడిరి. _పస్థానోచిత వేషములతో సామం 
తులు సేనానులు వచ్చిరి. ఉతుంగ ధ్వజముల నెతిరి. పురోహితులు యాతా 
ముహూ_ర్రమును నిర్ణయించిరి. అధర్వ వేదమంత్రాలు తెలిసిన [_బాహ్మణులు 
మంత పూతమగు హోమము చెసిరి. తర్వాత తనకై తెచ్చిన యు త్రమాశ్యము 
నెక్కాను. సేనానులు జయవాదములు చేసిరి. సామంతులు రాజుముందు నడిచిరి, 
నగర(స్త్రీలు లాజలు చల్లిరి. తర్వాత [పయాణము సాగించి అయిదారు దినాలలో 
చంఒరాజు రాజధాసియగు ముల్వాయిని చెరిరి. యుద్ధషుందు చంపరా జోడి 
పారి, రాజగంభీర అను కోటలో దాగను. కంపరాయ లాకోటను ముట్టడించి 
బాణములతో కోటలోని “సైన్యాన్ని నష్టపరచెను. కోటనుండి యంతములచే 
రువ్వబడిన పెద్ద పెద్ద గుండు కంపరాయల సైన్యమును నష్టపరచెను. తుదకు 
నిచ్చెనలతో కోటనెక్కి పట్టుకొనిరి. 1 


విజయనగర రాజులు లక్షలకొలది. సైన్యమును కలిగి యుండిరి. తళ్ళికోట 
యుద్ధములో రామరాజు ఆరులక్షల సెన్యములతో పోరాడెనని ఆంచనా వేసి 
యుండిరి. విజయనగర చకవర్తుఇ సైన్యముపై గృురములపై యెక్కువగా 
వ్యయము చేసిరి. బహమనీ రాజ్యము అయిదు చీలికలై అహమద్‌ నగరు, 
గోలకొండ, బిదర్‌, బిజాపూర్‌, వీరారులలో నెలకొని సర్వకాలము లందును 
(పక్కబల్రిమై _పమాద హేతువైై యుండెను, ఏమా[త మవకాశము దొరకినను 
వారు సా[మాజ్యమును ధ్వంసము చేయువారు. అందుచేత విజయనగర చక 
వర్తులు సైన్యముపై అత్యంత (కద్ధ వహించిన వారై రి, మొదట ఈరాసీ 
వారును తర్వాత పోర్చుగీసు వారును ఈ రాజులకు గురాల నమ్మిరి. మంచి 

1. మధురా విజయం ౪వ సర్గము, 


182 ఆం ధుల సాంఘీక చరిత 


పెద్ద గురమును ౩౦౦ నుండి ౬౦౦ డ కెట్ట వర కమ్మిరి. (౧ డ్‌ కెట్‌ =౫ 
రూపాయలు). చక్రవర్తి యెక్క గ్నురను వెల ౧౦౦౦ డకెట్లు.! 


విజయనగర సైన్యములో ౪౧,౦౧౧౨ గు రాలుండెను. కాల్బలము 
కత్తులు, బర్జెమలు పట్టుచుండెను. మొత్తము ౧౦ లక్షల సేన యుండెను. 


విన్సెంటు స్మిత్‌ తన ఆక్కుఫర్డ్‌ హిందూదేశ చరితలో ఇట్లు (వాసెకు. 
“౧౫౨౦లో కృష్ణ దేవరాయలు రాయచూరు యుద్ధమునకు ఎడులక్షం మూడు 
వేల కాల్చలమును, ౩.౨౬౦౦ గు రపు సేనను, ౫౫౧ ఏనుగులను తీసుకొని 
పోయెననియు, ఆ సైన్యము వెంట సైనులు, నౌకరులు, వ్యాపారులు మున్నగు 
వారు కొల్లలు కొల్లలుగా పోయిరనియు పీస్‌ |వాసెకు. రాయలకన్న చాలా 
కొలమునకు ముందే రథాలు పె న్యమునుండి తొలగిపోయి యుండెను. రాయల 
బలమునక్తు సంభ్యాబల మే పధానము కాని, 'సెనికులు ముసల్మానుయోధులకు 
భయ పడెడివారు. సైనికులు పలువురు వ్య కిగతముగా శూరులే, బలాఢ్యులే కాని 
'సెనిక వ్యూహములో వారు పనికిరాని వారైరి. 


““ద్వంద్య యుద్ధము కేవలము విజయనగర రాజ్యమందే నెగడెను, 
ద్యంద్వయ.ద్దము చేయువారు మంత్రి లేక రాజు సెలవు పొందవలసియుండెను. 
గెలిచినవానికి ఓడినవాని ఆస్తి యిప్పింబెడివారు.'” (సింహాసన ద్వా|తింశికోదా 


CT 4 


హృత వర్ణన యంతయు సత్యమేయని పైవాక్యాలు నిరూపించినవి). 


పీస్‌ అను విదేశీ ఇట్లు వాసెను: “సైనికులు నానావిధముత% రంగురంగుల 
బట్టలను తొడుగుతూ వుండిరి, అవి బాలా విలుపగలవై యుండెను. వారు పట్టు 
డాళ్ళ పె బంగారుపూలను, పులులను, సింహాలను చి|తింప జేస్తుండిరి. ఆ డాలులు 
ఆద్దాలనలె మెరుస్తూ వుండెను, వారు పట్టు కత్తులమీదకూడ బంగారు నీరుపని 
యుండెను. ధనుర్యుద్ధముచేయు దళముకూడా సైన్యమందుండెను. అమ్ముల 
మీదకూడా బంగారు పనితన ముండెను. బాణాలకు ఈకలుకట్టవారు, నడుములో 
కాసెదట్టీ; ఆ దట్టిలో బాకులు, గండగొడ్డండ్లు చెరివియుండిరి, జానకి (తాటి 


1. SALATORES-Social and Political Life in Vijianagar 
Empire, Vol. Il. 


ఇక్‌ ముందీ (గ్రంథాన్ని Salatore అని యుదాహరింతును. 


విజయనగర సా మాజ్య కాలము 138 


తుపాకీదళ మొకటి యుండెను ! అటవికులగు చెంచులు, కోయలు మున్నగు 
వారినికూడా సేనలో చేర్చుకొనరి,*క 


కాల్చలమువారు పాళణాలను లెక్క పెట్టేవారు కారు. వారు చెడ్డీతప్ప 
మరేమియుకట్టుకొనక శరీరమంతయు నూనె పూసుకొని యుద్ధములో దిగెడివారు. 
శతువులతో పెనగినపుడు వారికి చిక్కక జారి పోవుటకై వారీతం తమును 
పన్నినవారు, గరుడ, గరుడా అని పైనికులు యుద్ధ కేఃలు వేసెడివారు. 


గుురాలను బాగా ఆలంకరిసుండిరి. వాటితలపై వెండి బంగారు పట్టీలను 
కట్టిరి. గు[రపురౌతులు పట్టుబల్లలను దొడుగుతూపుండిరి. ౧౦౦౦౦ ఏనుగుల 
చిన్యముండెను. ఏనుగులకు రంగులువేసి ఆలంకరించిరి. పతి ఏనుగుపై 
నలుగురు కూర్చొనుటకై అంబారి కట్టిరి. సైన్యావసరములగు వస్తువులను 
ఎద్దులు, కంచరగాడిదలు, గాడిదలు మోయుచుండెను.శి 


యుద్ధములో నుప మోగించు ఆయుధముల ముచ్చట ఆ కాలపు వాజ్మయ 
ములో అందందు వర్ణింపబడినది. కుమార ధూర్జటి తన కృష్ణరాయ విజయ 
ములో కృషరాయల జై తయా/త నిట్లు వర్లించెను. 
ణి కా న న్‌ ళు 


సీ. రటిత దిక్తట నట త్పెటపెటార్భటులతో 

"ఘోరమైన తుపాకిగుండ్ల చేత 

దవ్వుదవ్వున హెచ్చి రివ్వురివ్వున వచ్చి 
పసరించు రాదూరి బాణములను 

పెల్లుగా వేసి చి త్త జల్లుగా వెద జల్లు 
"పెంపరుల్‌ 'పెంపారు నంపగముల 

ధాటీగతి నటింప మాటికి సూటిగా 
నాటుకొన్‌ బల్రెంపు జీచెగముల 


1. Salatore, Il. 

2, “పార్యతీయ బలంబులోనం గూడకయ రాజునకు (పజాబాధ తరు 
గదు” ఆము క్రమాల్యద. ౪-౨౨౨, అ క్లే ౨౨౩. ౨౨౯౪, ౨౨౫ 
కూడా చదువుకోవలెను 

3, Salatore, Il, 


£34 ఆం(ధుల సాంఘీక చర తో 


ఆరిమి తరిమిన భయమున విరిగి జరిగి 
నిజబలంబుబఢాకకు నిలువలేక 

శరణు జొచ్చినవారల కరుణ జూచి 
యచటి దుర్గస్థలంబుల నాక్రమించె! 


తుపాకీలు యుద్ధములో ముఖ్యమైనవయ్యెను. రాయ చూరులో బాణము లు 
సీద్దము చేసినట్లు కానవచ్చును. “రాచూరి బిరుదు తలాటము" అని నవనాథ 
చర్మితలో (పుట. ౩౬) [వాసిరి. దీన్నిబట్టి రాయచూరులో పూర్వము ఆయుధ 
పర్మిశమ (పనిద్ధముగా నుండెననుట స్పష్టము. “కలనైన విరుగెరుంగని పోటు 
పరిక, రాచూరు కత్తులమాటు జొచ్చి కొన్ని" అని వేంకటనాథుడును పంచ 
తం[తములో వరించెను, (౪-౨౪౯) కృషరాయల సైన్యమును చూచి తురక 

ఆ ఓ ఇ... మ 

లిటనుకొనిరట. 


ఏనుగులు వేయి, బొందిలీ లెంచిచూడ 
లక, పెండారు లొకలక్ష, లక తురక 
లిచటి బల మానృపాలున కంచ భటులు 
నారులత్షలు, హరు లర్వదారువెలు, 
పరలు కరు లొక రెండువే లరసిచూడ 
రాజులును వెల్మలును కమ్మ (పజలు ఘనులు 
కలుగు రాయలతో పోరి గెలువ మనకు 
వళమెయైన ఖుదా యున్న వాడటంచు.! 


యుద్ధములో నుపయోగించు ఆయుధాలను కొన్ని తెలివీనాము. ఆవికాక 
పెట్టగోవులును, జబురుజంగులును, ధీరంగులును, ఢమామీలును, బాజపుజివక 
లును, రాళ్ళును (పయోగించిరి.®ి దంచనమలు ఆను అయుధములనుకూడా 
యుపయోగించిరి. ఆది ఫరంగియని కొందరు, గొలునుతోడి పాషాణయంత 
మని కొందరు వ్యాఖ్యానించిరి. ధ్యంననము అనుదాని తద్భవము దంచనమై 
యుండును. సిన్యములకు ముందొక నాయకుడును, వెనుక నొక నాయకు 

1. కృ, రా, విజయము, ౩-౫. 

2, క. రా, విజయము, ౩.౨౬ 


8. ఆళ93 6699 ey 
4. ఆముక్‌ మాల్యద సలా 
యాతి 


విజయనగర సామాజ్య కొలము 185 


డును ఉండెడివారు వెనుక భాగమందలి నాయకుని “దుముదారు దొర” 
అనిరి! ఇది ఉకరూపదమ్ము దుమ్‌ అన తోక; దార్‌ అన రక్షించువాడు. 


అనగా వెనుకభాగిమను రక్షించు సేనాని, విజయనగరమందు, 


“...తూర్చొచ్చముల్‌ వాజులం దలరున్‌, బాహ్లిక, పారసీక శకధ 
టారట్లఘోటాణముల్‌ "2 


బాహ్హాక మన బలఖథ్‌ దేశము. పొరసీకము ఈరాన్‌. శక అన సితియన్‌. 
గ్రీకుల సాగ్గియా ఈరానుకు పక్చిమముననుండు (పాంతము. ధట్ట ఎచ్చటనో 
తెలియదు, ధట్టనుండియే తట్టు, తట్టువ పదము లేర్పడెనని (శ్రీ వేదము వెంకట 
రాయ శాన్ర్రి వ్యాఖ్య. ఆరట్ట పంజాబు పాంతభూమి, యుద్ధమ నకు వనికివచ్చు 
గురాలు దత&ీణ హిందూస్థానమందుక్చ త్తి కాకుండెను, ఉ త్ర మాశ్వములకు 
(పసిద్ధిగన్న దేశ ను మధ్య ఆసియాలోని తార్తరీ, ఖోటాన్‌, ఖురాసాన్‌, 
ఈరాన్‌ అరివియా దేళాలును కొంత వరకు ఆఫ సిస్థానమును, సింధు, వంజాబు 
దేశములునునై యుండెను. నామలింగానుశాసనములో అమరుడు గుర్రములకిచ్చిన 
పర్యాయపదము అన్నింటికి లింగా భద్దియములో ఏదో యొక వ్యుత్పత్తిని సాగ 
దీసి అర్థము చెప్పినారు. కాని ఆవి సరియని చెప్పుటకు ఏలలేదు. అమరములోని 
అశ్వపర్యాయ శబ్దములలో ఎక్కు శబ్దములు గుృురములు బహుళముగా 
దొరకు దేశముల పేర్లని నేనూహించినాను. ఆఫ్హనులకు (పాచీననామము అశ్వ 
కానులు. (అదే అహ్వకాన్‌, ఆఫగాన్‌ అయ్యెను.) అశ్వములు కలవారని ఆశ్వ 
కాన్‌ శబ్దము తెలుపుతున్నది. మధ్య ఎషియాలో ఖభోటాన్‌ గురాలే ఘోటకములై 
యుండును. కృష్ణరాయలు ఘోట్టాణముల్‌ అని వాడినదియు గమనింపదగినది. 
తురికీ దేశపుదికాన తురికీ యన గురమను నర్ధమయ్యెను. తెకుగులో సామాణి 
గురాలు అని కొందరు కవులు వాడిరి. అనగా ఈరాన్‌లోొని సమరాన్‌ అను స్థల 
మునుండి వచ్చినవని యర్థము. ఖురాసాని అని మరికొందరు గృురమునకు పేరు 
పెట్టిరి. మధ్య యేషియాలోని ఖురాసాన్‌నుండి వచ్చినవన్నమాట. గురమును 
గురించిన చర్చ చాలా కలదు. దానిని గురించి ప్రత్యేకముగా (వాయవలసి 
యుండును. 

1. మనుచరిత ౩-౫౪. 


ద, ఆము క్ర మాల్యద. ౨-౨౦౪ 
(24) 


186 ఆం|ధుల సాంఘిక చరిత 


తెనుగువారికి సమరాశ్వముల లోపము చాలా గొప్పలోపము, గురముల 
[ప్రాముఖ్యమును విజయనగర రాజులు, రెడ్డి వెలమరాజులు బాగా గుర్తించి వాటి 
కెంత వ్యయమైనను భరించి తమ నై సైన్యమందు చేర్చిరి. కాని కొందరు తప్ప 
తక్కినవారు గురపు సవారీలోను, దానివై యుద్ధము చేయ నిపుణతలోను 
తురకలకన్న తక్కువ యైనవారే. అందరు ఆశ్విక దళములో నెక్కు 
వగా ముసల్మానులనే చేర్చవలసిన వార్త రి. 


'సెన్యములో భటులకు కు సీలు, ఆయుధ (పయోగమును, సవారి మున్న 
గునవి బాగా నేర్పెడివారు. శ్రీకృష్ణదేవరాయలు మంచి సాములో సవారీలో ఆరి 
తేరిన జెట్టీలలో మేటిజట్టి. |పతిదినము కుసుమ నూనెను చిన్న గిన్నెడు (తాగ 
అదే నూనెతో ఆంగ మర్చనము చేయించుకొని సాముచేసి, సవారిచెసి, కుస్తీలు 
వ బైైడివాడని వీ వెస్‌ అను విదేశీ |వాసెను!, 


ఆ కొలమందు శ్రీలుకూడా మంచి జెట్టీలుగా సిద్ధమై కుస్తీలు బేసిరి. 
En శ॥ ౧౪౪౬ నాటి యొక శాసనములో హరియక్క అను నామె తన తం|డిని 
కు స్సీలో చంపిన జెట్టిలతో డు స్తీచేసి వారిని చంపి పగ దీర్నుకొ నెను, 2 జను 
ల. సామ చేయటలో ఆస రి యుండెను. జానకి తాటి తుపాకి [ప్రయోగము 
లోనికి వచ్చినను క్తి యుద్ధమున కింకను [పాధాన్మముండెను. అందుచేత 
జనులు కుస్తీలు, కత్తిసాము, "క ప్రైెసాము, సవారి మున్నగునవి నేర్చుకొనిరి. 
వాడవాడలలో సాము గరిడీలు (తాలీంభానాలు, అభౌడాలు) ఉండెను. సాము 
సాలెలతో భూమిని లోతుగా[తవ్వి మన్ను రీసివేసి అందిసుక సగమువరకు నింపి 
చె భాగమును ఎర్రమట్టితో నీంపెడివారు. అట్టిరంగ మందు సాము నేర్చుటకు 
కావలసిన గదలు (ముద్గర ములు - వీటినే వర్ణ ర వ్యత్యయముతో ఉర్దూలో ముగ్దర్‌' 
అందురు.) సంగడములు (ఏటి నుర్దూలో సింగ్‌ తోలా అనిరి. అవి మధ్య 
ఇరుసు, ఇరుపక్కల చిన్న రాతి చ;కములు కలవి. ) ఉండెడివి, సాములోను, 
కుసీలోను బాగా గడితేరిన వారిని జెట్టిలనియు పొంతకారులనియు పిలిచిరి,క 

1. Salators, ll. 

2. Salatore, Il. 

8. మనుచరిత్ర ౫-౫౯, ఇందు సూర్యాస్తమయ వర్ణన కలదు. దాని 
నుండి పె పై విషయాలు లేల్చనై నది, రాధామాధవము ౩-౮౯ నుండియు ఇది 
వెల్పిడి యవుతున్నది. 


విజయనగర సా|మాజ్య కాలము 187 


నేటికిని సాము గరిడీలలో పై యాచారవిధానములే వరి 


కార్గమై విరగ ల్లులను స్థాపించిరి. అట్టివి నేటికిని చాలాపలె 


లలో కానవస్తున్నవి. 1 


న్‌ 


ఏదైనా యుద్యమము సాగించినపుడు జనులు శకునము జూచెడి వారు. 
అదేవిధముగా రాజులు యుద్ధమునకు బయలు దేర సంకల్పించి నప్పుడు తెల్పి 
వారుకాలమున వీధులలోనో, నగరోపాంతమందో శకునముల గమనించెడివారు. 
దాసిని ఉప్యకుతి అనిరి. శ్రీ కృష్ణదేవరాయలు కటకము (ఓ, ఢదేళము)పై దండ 
యాతకు వెళ్ళుటకు ముందు ఉప(శుతిని విచారించుకొనిరి. ఆనాడు తెల్లవారు 
టకు ముందే ఒక చాకలి మైలబట్టలను బండపై ఉతుకు లుతుకుచూ అదే తాళ 
ముగా ఈవిధముగా పాడ. కొంటూవుండెను. 


కొండవీడు మనదేరా! కొండపల్లి మనదేరా ! 
కాదని వాదుకు వస్తే కటకందాకా మనదేరా! 


వెంటనే ఆతడు 'సెన్యాలతో బయలుదేరెనట ! చాకలివానికి కూడా పర 
దేశాలన్నీ *మనవేరా” అనునంత రాజ్యాభిమానము [ప్రశంసకు పాతము. 


వీదరు పట్టణములో బరీదు సులానుల కాలమునాటి కోటలు, రంగీన్‌ 
మహల్‌, చీసీమహల్‌ మున్నగునవి కలవు. రంగీన్‌ మహలును అలీబరీద్‌ ఆను 
సులాను (౧౫౪౦-౭౯) కట్టించెను, అచ్చట కోటలో లభించిన ఇనుపముండ్రను 


లగన్‌ ముళ్ళు 


కొన్నింటిని ఆర్షకాఖ వారు కూర్చి యితర యుద్ధపరికరాలతో పాటు నుంచినారు. 
ఇ నుపముండ్లను ఉర్లూలో గో ఖూ అందురు. కన్నడములో లగన్‌ముట్ట అందురు. 


(1) Salatore, 11. 


188 ఆం[ధుల సాంఘిక చర్చిత 


అవి రెండంగుళముల పొడువుండును, నాలుగు కొనలుండును భూమిపై వాటిని 
యెటు వేసినను సరే మూడు పాదాలపై రి నాల్గ్లవపాదము పెకి లేచి 
యుండును. 


అవి దబ్బనమంత మందముగ నుండును, వాటిని లక్షలకొలదిగా సిద్ధము 
చేసి శ! తువులు దాడిచేయు వేళ కోటచుట్టును చల్లి నడిచెడివారు. శ్య్తువుల గజ 
తురగములుకాని, కొల్బలముకొని వేగముగా రాకుండుటకె రాతి కాని లేక్ర 
పగలు చూదుకొనక కాని నడిచిన ఆ సూదులవంటి ముళ్ళు శతు సెన్యమునకు 
నష్టము కలిగించెడివి ఇది అపూర్వపద్ధతి. ఇట్టివి మరెక్కుడను చూడలేదు. 
మన వాజ్మ యమందుకు వాటి జాడలు లేవు, బహమనీ సులానుల యుద్ధ 
తంతములో నీ లగన్‌ ముళ్ళు కూడా చెరియుండెను, 


విజయనగర దరాజులకొాలమందుండిన చింతలపూడి యెల్టనార్యుడు తారక 
(బహ్మ రాజీయములో అచ్యుత దేవరాయలను క్లీర్తించినాడు. అచ్యుతునివద్ద 
నంజ తిమ్మయ యనునతడు “ గంధాసార లేఖకుడై ” మం'కియె యుండె 
నన్నాడు. 


శ 


“ఆ రాయల కృప [గంథా 

సారము [వాయుచును కీర్తి సంపాదించున్‌ 
ధీర గుణాఢ్యుడు, కందా 

సారము నంజరుసు తిమ్మ సచివుడు సిరలున్‌” 


కొందాసారము లేక [గంథాసారము అన మిలిటరీ లెక్కలు అని వీఠికా 
కారులగు (శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు (వాసినారు. ఇది స్కంధావారము 
నుండి ఏర్పడి యుండునన్నారు. సైన్య సంబంభమగు లెక్కలు వాయుట గొప్ప 
పదవిగా భావింపబడు చుండెను, 


నాణములు 


విజయనగరరాజ్యములో చాళుక్య కాకతీయ నాణకపర్ధతి కొన్ని మార్పు 
లతో [1పచారమందుండెను. వెండి, బంగారు, రాగి నాణెములు వ్యాప్తిలో 
నుండెను, రాజులేకాక సామంతులును నాణములను ముదించు సెలవును పొంది 


విజయనగర సా(మాజ్య కాలము 189 


యుండిరి. క్రీ వెండి బంగారు నా నాణెము లకు గు _ర్లించుటకు కమసాలులు నియ 


Te aa sem చలా! 


కుల. లె యుండిరి. కవుల రచనలలో ఈ, (కిందివి కే పేర్కొనబడినవి, 


మినుకు 1 కాన్కు క మాడలు, i వీసము, కీ అప్పటి నా నాణెములలో 
వరహా అన్నింటికన్న పెద్దది. కాక్‌ తీ ములకు వరాహము, దాని ముందు ఖడ్గము 
రాజచిహ్న ముగా నుంచెను. దానినే విజయనగర చ కవర్తులు స్వీకరించిరి. 
వరాహ చివ్నాములతో ము| దించిన బంగారు నాణములను వరహాలు అసిరి. 


వాటిని టంకసాలవాటు లనియు వ్యవహరించిరి. (: :) 
చిన్నమ్ము తారము అనునవి వెండినాణిమలు, 
“శిబికొని పోడొక్క చిన్నమైన న్యాయార్గితము తారమైన లెస్స” (-[) 


దొంగనాణెములను పరీ&ంచుటకై కమసాలులేకాక బచ్చులుకూడ 
ఏర్పాటై యుండిరి. ! !వజలు కోమట్టవద్ద తమ ధనమును పడ్డి కిచ్చి దాచుకొనిరి. 
అనగా కోమ ట్రై ఆకాలపు బెంకొలు. పలుమారు వడ్డీ లె కగాలవద్ద తగవు లేర్చడి 


అల్రరులుచేసి తుదకు రచ్చచావిడికి వెళ్ళి ఇచ్చి పుచ్చుకొన్న వారు తమ తగవుల 
పరిష్కరించు కొంటూ పుఠకీరిః 


“''ఇల్లానగూర్చి వై శ్యునకు నిచ్చి, చనన్‌ మరి పుచ్చి చౌకముల్‌ 
వెట్టుదు, వడ్డిలెక్కొలటు వెట్టుచు ధారణవాసికై కొదల్‌ 

వెట్టుచు, వాడు రేగి మరి పెట్టుదు పెట్టుననంగ, మిట్ట గూ 

పెట్టుచు' నిట్టు పోర గనిపెట్టుచు నొక్కరు డుండి వెండియున్‌,” కీ 


1 పరమయోగివిలాసము-తిరువేంగళనాథుడు, పుట ౯౮. 

2 ““ఒక కాసు చెల్లింపకున్నాడు" చిన్న రాగినాణెము. 
పరమయోగి విలాసము. పు ౪౫౭. 

Sis wu DNS, 

4 ఆము కృమాల్యద. 8-౪, 

(iy coe 0 ౨-౮౫ 

(+) నీతి సీ సపద్యములు తాళ్ళపాక తిరుమల య్య. 

1 ఆము కమాల్యద. అజో 

బి ఆముక్తమాల్యద, ౬ ౬ 


190 ఆం ధుల సాంఘీక చరిత 


(ధారణ అను పదమును హిందీలో ధారణ్‌ అందురు. అనగా ధర. ధారణ వాసి 
యన, ధరలో ఎచ్చుతచ్చులు లేక ధాన్యమునకు పెకముధర. మరియు పెకానికి 
ధాన్యం ధర్‌ కట్టుట. మిట్ట అన రచ్చ కట్ట. ర చ్చకట్ట పంచాయతిని గురించి 
ముందు వాయ దుము,) 


పరాశరమాధవీయములో హరహరరాయలు పన్నులను నాణెములలో 
చెల్రింపవలెనని యాజ్ఞ యిచ్చినట్లు తెలియవస్తున్నది, అనగా ఆంతకు ముందు 
జనులు పన్నును ధాన్యరూపముగా కూడా చెల్రించి రన్నమాట. నాణము లన్నిం 
టిపె వరాహ లాంఛనమే యుండెనని తలపరాదు, రాజులు తమ చిత్తము వచ్చి 
నట్లుగా లాంఛనముల మార్చిరి. విజయనగర నాణెముల పె హనుమంతుడు, గరు 
డుడు, ఎద్దు, ఏనుగు, ఉమామహెళ్వరుడు, వే,క టేశుడు, బాలకృష్ణుడు, దుర్గ, 
లమ్మీ నారాయణులు, రాముడు, శంఖ చ (కాలు లాంఛభనా లుగా ము దింపబడెను. 


నాణములను గుంజల లెక్క పకారము ము|దించిరి, 


ఈకింది నాణములు ముఖ్యమె నటివి. 
= టట 
బంగారువి,- గద్యాణము (వరహాలు), |పతాపలు (ఏటినే మాడలు 
అనిరి, !, పణము, కాట, హాగ, 
మెంది వం నా తారము, చిన్నము. 
రాగివి : --- పణమ్ము జీశల్‌, కాసు మున్నగునవి. 


రెండవ దేవరాయల నాణెములను గురించి అబ్బుర్రజాఖ్‌ అను ఈరానీ 
రాయబారి (కీ. శ, ౧౪౪౩ లో ఈ విధముగా _వాసెను, 


నాలుగు కాటీలు ఒక వరహా, 

వరహాలో సగము (పతాపము. 
[పతాపలో పదవభాగము పణము, 
పణములో ఆరవభాగము తారము. 
తారములో మూడవభాగము నాణెములు, 


“సాధారణముగా వరహా ౫౨ గుంజల ఎత్తుండెను. 


విజయనగర సామాజ్య కొలము 191 


“కన్న డమలో (పతాపము అన్న నాణెమును తెనుగు మాడ అన్నట్లు 
న్నది. అది రెండు రూపాయల లోపలి విలువకలది. చిన్నమను నాణిము వర 
హాలో ఎనిమిదవ భాగము అనగా ఏడణాల విలువది.” 


“'హాగ అను కన్నడ నాణెమునే కాకిణీ అనిరి. అది పణములోని నాల్గవ 


“'తిరుమలరాయలు రామటంకలు అను నాణెములకు జారీచేసెను. ! 
(శ్రీనాథుడు దేవరాయల ఆస్థానమందేకదా దీనారటంకాల అభిషేకమును పొంది 
నది! నాణముల నిపుణు లెవ్వరును దీనారములనుగాని, టంక ములనుగాని 
పేర్కానలేదు.” 


పై నాణెము లన్నింటిలోమాడలే తెనుగుదేశమం దెక్టువగా వ్యాప్తిలో నుండెనని 
సారస్యతమందలి వర్ణనలనుబబ్లి ఊహింపవచ్చును. జనులు మాడలను విందెలలో 
నింపి ఇండ్లలో, దొడ్లలో, చేలలో గుర్తుగా దాచుకొంటూవుండిరి. తరాలుగా దాచిన 
జాడలు వృద్దులు తమవారికి తెలుపకముందే చచ్చుటయు, దానికై వాని సంతతి 
వారు వెదుకుటయు సంభవించెడిది. ధనాంజనము వేసి ధన మెక్కడున్నదో కని 
"పెళ్లై మంత తంతవెత్తలు బయలుదేరిరి. పలుమారు దాచిన దవ్యము పరులకు 
హఠాత్తుగా దొరుకుతూ వుండెను. (ద్రవ్యమును భూమిలో పూడ్చి దాచుకొను నాచా 
రము నేటికికూడ మన పళ్లెలలోని కొందరిలో కానవస్తున్నది. వరశుల్క కన్యా 
శుల్కుములు మాళ్ళలోను, వరహాలలోను ఇస్తూ వుండిరి. వివాహాలలో బంధు 
మితులు వరహాలను “చదివిన” వుండిరి. ఈనాడు జనులు రూపాయలు చది 
వించినను “అముకవ్య కి చదివించిన ఇన్నివరవహోలూ” అని పురోహితుడు 
అందరు వినగా చదువుతూనే ఉంటాడు. విజయనగర టంకమ్ముద అంతటి బలిష్ట 
మయినది. 


నాణములు మన [పాచీనుల చరిత నిర్మాణమునకు చాలా సహాయపడును, 
పైగా ఆకాలపు లోహముల విలువను, టంకసాల పద్దతులను, నాణముల విలు 
వలను ఆర్థిక వ్యవస్థను తెలుపునట్టి వి, పాళ్చాత్యులు (పాచీన నాణెములకు విలువ 
నిత్తురు వాటి; పయత్న పూర్వకముగా సంపాదించి సేకరించి యుంతురు. 


1 పంచముఖ ఆనువారు వాసిన వ్యాసము. 


192 ఆంధుల సాంఘీక చరిత 


కాని మనము పూర్యనాణెములు దొరకినఅవి చెల్లవని వాటిని కరగించి యుపమో 
గించుకొందుము, మన చారి తక పరిశోధకులందరు (పత్యేకముగా నాణముల 
పరీక్షను బాగా చేసినవారరుదై యున్నారు. తెనగుదేశములో చాళుక్య, కాక 
తీయ, రెడ్డిరాజ్య విజయనగర సా|మాజ్య కాలములలోను, గోలకౌండ రాజ్య 
ములోను నుండిన నాణెములను నచి|తముగా, సమగముగా, (పల్యేకముగా 
బయలుదేరిది, యవనరము, 


వ్యాపారము 


కాకతీయుల కాలములోకన్న రెడ్డిరాజుల కాలములో దేశీ విదేశీ వ్యాపొ 
ర్‌ము వృద్ధివొందియుండెను. విజయనగర రాజుల కాలములో వ్యాపారము 
మరింత వృద్ధి నొందెను. హిందూస్థానమందు పాడి కొమ ధేనువులు, ధన కల్ప 
వృక్షమ లు (PagodaTrees ) కలవని యూరోపు ఖండములో మూలమూల 
లందు మార్మోగి న హిందూ స్థానమునకు బోయి “వగోడా చెట్లను" 
ఉ|రూతలూవీ రాలిన ధసరానులను ఓడలలో నింపుకొని పోదమని అచ్చటి 
సాహసికలు సాహుకారులు, మేలయిన తుపాకుల మడలపె వేనుకొని ఓడలలో 
బయలుదేరిరి. ఉయితే వారికి హిందూస్తానసమున కెల్బపోవలెినో సముదముపై 
దారి తెలియకు ౦ డెను, స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాలవారు ఒకరికంటే ఒకరు 
ముందుగా [ప్రయాణము కట్టిరి, స్పెయిన్‌ వారు సము[దముపై కొలంబస్‌ 
నాయకత్వములో పోయిపోయి తుదకు అమెరికా ఖండ తీరమందలి దీవులను 
చేరి. అదే హిందూస్తాన మనుకొనిర. కాని తరువాత పొరపాటును గురెర్తిగి 
ఆదీవుల జనులకు మొదటిపే రెముండెరోకాని వారుమా(తము ఎర ఇండియ 
నులు అను నూతన నామ మిచ్చిరి. పోర్చుగల్‌ వారు వాస్కో డగామా అనువాని 
నాయకత్వములో అఫికా ఖండమును చుట్టకొని తుదకు హిందూస్తాన పశ్చిమ 
తీరమందు చేరిరి. వారు (శ్రీకృష్ణ దేవరాయల కాలములోపలనే మన దేశమందు 
[పత్యతమై విజయనగర సా_మాజ్యములో వ్యాపారము చెసిరి, 


అరబ్బు దేశము ఎడారి భాగము. అందుచెత అరబ్బులు జీవించదలచిన 
వ్యాపారముచేతనే జీవించవలసి యుండెను. వారు బహు పాచీనమునుండి 
హిందూ స్థానముతో వ్యాపారము చేసిరి. అత్యంత సస హితమం దుండిన ఈరాన్‌ 
(లేక పారసీక) దేశము హిందూస్థానముతోనే యెక్కువ వ్యాపారము చేసెను. 


విజయనగర సా[మాజ్య కొలము 1£8 


హురుముజ్‌ జలసంధిలోని రేవుల నుండి ఓడలు వచ్చి పోయెను (Gulf of 
Hurmuz). అక్కడి ముత్యాలు చాలా |శేష్టమైనవై యుండెను. అందుచేత 
వాటిని హురు ముంజి ముత్యాలసిరి, 


తూర్పున నుండి బర్మా, మలయా, ఇండోనీషియా, చీనా దేళాలతో 
వ్యాపారము జరిగెను. విజయనగర సా_మాజ్యము తూర్పున కటకము నుండి. 
రామేశ్వరము వరకును, పడమట గోవానుండి కన్యాకుమారి వరకును వ్యాపించి 
యుండెను. పడమట గోవాలో కాలిక ట్టు రేవులో ఎక్కువ వ్యాపారము జరిగెను. 


“కాలికట్టువంటి మంచి రేవులు సా(మాజ్యమందు ౩౦౦ వర కుండెను” 
అని అబు;రజాథ్‌ |వాసెను “రత్నాలు, ముత్యాలు, అభరణాలు, గుురాలు, 
a య 
ఏనుగులు, పట్టు నూలుబట్టలు, సుగంధ |దవ్యములు, ఓషధులు, ఇనుము, 
వెండి, విశేషముగా వ్యాపార వస్తువులై యుండెను. వ్యాపారములో సంపూర్ణ 
న్యాయము |పసాదింపబడుచుండెను. అందుచేత పోర్చుగిసువారును, అరబ్బు 
లును ఎక్కువగా వచ్చిరి”1 ఆని బార్బ్చోసా [వాసెను. 


వ్యాపార మును గూర్చి శ్రీకృష్షదేవరాయలే తన ఆము క్తమాల్యదలో నిట్లు 
వాసెను, 


“రవుల్యా వు మతంగ జంబును మణి శ్రీఖండ ము కాదియున్‌ 
రా, వాణిజ్యము పెంచి యెలగ నగున్‌ వర్షంపుటెవ్వన్‌ రుజన్‌ 
హాళ్ళన్‌ దిగు సస్య భూ పజల రా జాయాయిు జాత్యాచితిన్‌ 
(బోవంగాదగు, తోటదొడ్డిగను లాపుల్‌ నూడ బంపందగున్‌” 2 


పరదేళశములమండి గు రములు, ఏనుగులు, రత్నాలు, చందనము, 
ము_త్తెములు, రేవులద్యారా వచ్చెననియు, వాటిని తెచ్చు విదేశీ వ్యాపారులకు 
సౌకర్యములు కూర్చిరనియు, కఇ్షామాద్యుపషదవముల వలన పరదేశి జనులు 
వచ్చిన వారి నాదరించిరనియు పె పద్యము సూచఓంబనది. 
వ ౧ వా 6౨36. 


ది ఆము క్ర మాల్యద ౪-౨౪౫ 
(25) 


194 ఆం[ధుల సాంఘీక చరిత 


సింధురమవాశ్వముఖ్యము ల్చేర్చు దౌల 
దీని వణిజులకూళ్ళు సద్భృహములు పురి 
గొలువుదేజంబు వెల మేలుగలు“ (పాత 
వారిగా జేయు నరి నవి చేరకుండ. 1 


దూరదూరపు దీవులనుండి, దేశాలనుండి వర్తకులు ఏనుగులు, పెద్ద 
గుర్రాలు తెతుురు. వారికి మంచి యాదరణ గావించ్కి వారి విడిదికి మేలైన 
యిండ్రిచ్చి, [గామాలిచ్చి, రాజదర్శనమిచ్చి, మంచి మర్యాదలిచ్చి యాదరించ 
వలెను. లేకున్న వారు ఏనుగులను గు|రాలను శ తురాజులకు ముట్టజెప్పుదురని 
వై పద్య భావము, 

(శ్రీకృష్ణదేవరాయ లక్షరాలా యీ నీతిని పాటించెను. ఈరానీ రాయబారి 
తనకు దర్బారులో [పత్యేక గౌరవమిచ్చి వీధులలో ఎదురైన తన యేనుగు 


నాపి కుశలాదులను ఎబారించి చాలా [పేమతో ఆదరించెనని [వాసుకొనెను. 


పాండ్య దేశమందలి తాృామపర్డీ నదిలో పెద్దజాతి ముత్యములు పూర్వము 
లభించెను, ఆమ క్రమాల్యదలో, 


“శ్రామపర్సి గలుగు అల ముట్లరాని ము కామణీకులంబు" అని (వాసి 
అ ఠం జార 
నారు. 2 


“మౌ కికవాతముకై వెలుంగు తా మపర్తీ తటమటు” అని అలసాని 
కూడా [వాసెను,కి 


తూర్పున పెగూనుండి, మలకానుండి ఎర్రసము దానికి వెళ్ళు ఓడలు 
కాలికట్టురేవులో ఆగి, సరకులను కొనిపోయెడివి. ఆనాడు వర్తకమంతయు ముస 
ల్మానులదే. అందెక్కువగా అరబ్బులే చేసిరి వారు ఆ ఫికాకు తూర్పుననుండు 
మడగాన్మరు దివినుండి ఇండియాకు తూర్చున నుండు మలాకావరకు రేవులలో 
నిలిచి వ్యాపారాలు చేసిరి. 


1 ఆము క్ర మాల్యద Vr ౨౫౮ 
వ్రీ ఆము క్ర మాల్యద ౪౫ 
8 మనుచరిత ౭.౮౦ 


విజయనగర సా్యమాజ్య కాలము 195 


సీజర్‌ (ఫెడరిక్‌ అనువాడిట్లు (వాసెను, “గోవా రేవుద్వారా విజయ 
నగరానికి అరేబియా గుర్రాలు వెల్వెట్‌ ఒట్టలు, డెమాస్క స్‌ వస్త్రాలు, పోర్చు 
గల్‌ నుండి అర్మోనిన్‌ (Armosine) ఆనునది దిగుమతి యవుతుండెను. 
ఒక గురానికి కావలసిన వస్తువు లేయేదేశముల.దు సిద్ధ మయ్యెడివో యీ 
(కింది పద్యము తెలుపుతున్నది. 
““పచ్చని హురుమంజి పనివాగె పక్కెర 
పారసి పల్లంబు పట్టమయము 
రాణ నొప్పారు పైఠాణంబు నీంగిణి 
తళుకుల కోరుల తరకసంబు 
మిహ పనీండి పరంజు మొహదా కెలం 
కులు ఠావు గుబ్బరి సేత కేవడంబు 
డా కెలంకున సిరాజీ కడి చురక శ్రి 
కురగట [కొవ్వాడి గొరకు పొరిది*ో 
(మను. ౪-౨౮.) 


పైఠాణమ. = పైఠన్‌ (|పతిష్టానము-జారంగ బాదు జిల్లాలోనిది). సిరాజీ=ా 
ఈరానలోని షీరాజ్‌ పట్నము, పట్లుబట్టలు సూరతు రేవుద్యారా కూడా దిగు 
మతి యయ్యెను. కంచినుండి తెనుగు దేశానికి మంచి నేత నూలుబట్టలు 
వచ్చెను. శ్రీవైషప్షవులు ““పదియారు మూర డంబరపుటంచు కమ్మడాల్‌ కంచి 
రోవతి చెల్వు మించు లెనగ” కట్లకొనుచుండిరి. (కృష్ణరాయ విజయము, 
౨-౨) ధనికులు “బసిండి (వాతల దంతపుం బెట్టెలలో” ఆభరణములుంచు 
కొనిరి. (రాదామాధవము, ౪-౧౭౨) 


“విజయనగర సా(మాజ్యము నుండి బట్టలు, బియ్యము, ఇనుము, 
చక్కెర, సుగంధ |[దవ్యాలు ఎగుమతి యయ్యెను, తమిళ దేశపు రేవగు పులి 
కాటునుండి మలాకా, పెగ్యూ సుమ్మతా దేశాలకు రంగు అంచులు ము|దలు 
కల (కలంకారి) వస్త్రముల _నెగుమతి చేసిరి. బియ్యము బసూరు, బారకూరు, 
మంగళూరు నుండి మలబారుకు, మాల్రివులకు, హుర్మజుకు, ఏడెన్‌కు ఎగుమతి 
యయ్యెను. భట్క-ల్‌ నుండి చక్కెర, ఇనుము ఎగుమతి యయ్యెను.” 


““గు[రాలు, ఏనుగులు, ముత్యాలు, రాగ, ముల్తెపు చిప్పలు, పాదరసము 
కుంకుమ, చీనాపట్టు, ముఖ్మల్‌ సా_మాజ్యములోనికి దిగుమతి యయ్యెను, వను 


196 ఆం|ధుల సాంఘిక చరిత 


గులు సింహళమునుండి, ముఖ్యల్‌ మక్కానుండి దిగుమతి యయ్యెను.” (1) 
(మక్కా నుండి వచ్చిన మల్లు అగుటచే కాబోలు మఖమల్లు ఆని పేరు వచ్చెనో 
యేమో?), మన వాజ్మయములో పల్నాటి వీర చరితలోను, ఇతర పద్య 
కావ్యాలలోను మఖమరల్‌ ముచ్చట కలదు. 


ముస్టిముల తర్వాత వ్యాపారము విరివిగా చేసినవారు కోమటి సెట్లు, 
మలబారీలు. అయితే ఏరు విదేశా: తో వ్యాపారము చేసినది తక్కువే. సా(మా 
జ్యమం దొక |పాంతమునుండి మరొక (పాంతానికి సరుకులు మార్చినవారే. 
కోమటి సెట్టలో ఆరవ నాటుకోటుచెళర్లే యెక్కువ వ్యాపారము చేసినారు. 


దేశమందు బాటల నిర్మాణము చాలా తకు్క[_వ, అందుచేత బండ్ల పై 
వ్యాపారము చేయుట కనుకూలముగా లేకుండెను. వ్యాపారస్థులు ఎద్దులపై 
కూలీల కావళ్ళపై, గురపు తట్టువులపె, గాడిదలపై కంచర గాడిదలపై సరు 
కులను తీసికొనిపోతుండిరి. ఈవిషయమును మన సారస్యతమందు పలుతావు 
లలో తెలిపినదేకాక ఆగంతుక వై దేశికులగు వీన్‌, బార్బోసా | వభృతులు తాము 
చూచినట్లు తెలిపినారు బాటలు లెక అడవులెక్కువగా నుండినప్పుడు దొంగలు 
కూడా ఎక్కు వగానే యుండిరి, పరకాలుడను వైష్టవభక్తుడు వైష్టవకై ౦కర్యకు 
నకై బాటలు కాచి వ్యాపారులదోదఏ, రేవులను కొల్లగొట్టి ధనములాగుటను 
ద్విపద పరమ యోగివిలాసమ౦ దతివిపులముగా వర్షించినారు (చూడుడు. 
౬-వ, ౭-వ ఆశ్వాసాలు) దొంగలభయానికి వ్యాపారులు గసంపులుగాపోయిరి. 
“విజయ నగరము నుండి భట్క-ల్‌కు అయిదారు వేణ యెద్దుల మోతల సరుకులు 
తీసికొని పోవుచుండిరి ౨౦ లేక ౩౦ పశువుల కొకమనిషి వంతున ను-డెము” 
అని పీస్‌ [వా సెను. (2) 

ఆ కాలపుధరల సమకాలికులు కొందరు (వాసియుంచినారు దానిని 
చూచిన ఆనాడన్నియు చాలా చౌకగా లభించెడివని తెలియరాగలదు. పిస్‌ ఇట్లు 
_వాసీయుంగెను. 


“విజయన్‌” రమందు సక లవసువులు లభించినట్లు [పపంచమ.లో మరిం 
దును లభించవు. బియ్యము, గోధువలు, పప్పుధాన్యాలు, జొన్నలు, చిక్కుళ్ళు, 


(1) V-S. CP. 221-2. 
(2) V.S.C.P. 224. 


విజయనగర సామాజ్య కాలము 197 


ఇతరధాన్యాలు సమృద్ధిగా నున్నవి. ఇవి చాలా చౌ౩గా లభీందును, ఒకటిన్నర 
అణాకు మూడుకో ళ్లు నగరములోను, నాలుగు పల్లెలలోను లభించును. జకటి 
న్నర అణాకు ౧౨ లేక ౧౪ పావురాలు దొరుకును. ఒక పణము (౮ అణాలు) 
ఇచ్చిన పచ్చి దాక మూడుగుత్తు లిత్తురు. ఒక పణమునకు పది దానిమ్మ పండ్లు 
దొరకును. ఒక వరహాకు నగరములో ౧౨ మేకలు, (గామాలలో ౧౫ మేకలు 
దొరుకును. ఒక భటుడు తన గురమును ఒక దాసిని నెలకు నాలుగ్తెదు వర 
హాలలో భరించగలడు.” (అనగా ౨౦ లేక ౨౫ రూపాయీలు.) 


మిరియాలకు సుంకము తీసుకొనెడివారు. ఆ కాలములో మిరియాలకు 
చాలా (రవానా) గిరాకి ((గాహకము) ఉండెను. మిఠరవకాయ లింకను దక్షిణ 
అమెరికానుండి మన దేశమలో (పవేశ పెట్టి యుండలెదు. మిరపకాయ లను 
పదము మిరియము అను ళబ్దముఘండి మిరియపు కాయ ఆని యేర్చడినది. అది 
[క ళ॥ ౧౬౦౦ తర్వాతనే మనదేశమందు నెగడెనము. ఆంతకు పూర్వము కారా 
నికి మిరియాలే వాడిరి. మిరియాలు మళయాళ దేశమందు సమృద్ధిగా పండును. 
తూర్పు దీవులందును అవి సమృద్ధి. వ్యాపారులు వాటి నక్కడినుండి తెప్పించి 
తెనుగు దేళమందమ్మిరి. వాటవలన వచ్చు సుంకము వలన (వభుత్వానికి గొప్ప 
ఆదాయ ముండును. 


“ఒకవైశ్యు డు త్రముడు మిర్యముల పెరికలు |తోవగా పెక్కు 
గొంపోవ గని యవి యేటి వెక్కడి కేగుచున్న వనుచు చౌరంగి తన్నడిగిన 
వాడు నుంకరి యను ఫీతి |నుక్కి నేర్పునను బొంకి తప్పించుక పోద 
మటంచు నవి జొన్నలనుటయు నట్టుగా నాత్మ దవిలి తలంప చ్మితముగా నా 
పెరిక లందలి మిరియంబు లవి జొన్నలయ్యు.” 


---నవనాథ, పుట ౯౯. 


ఆ కాలములో జొన్నలకు సుంకము లేకుండెనని పె పంక్తులను బట్టి 
యూహీంప వచ్చును, 


కోమట్లు వ్యాపారవు మరుగుమాటల నాడుదురు. మదాసూో బేరగాం 
డ్రిరువురు చెతులుకలిపి పైన కప్పి ఒకరి ఆరచెతిలో ఒకరు ధగ (వాసి 
“కో మటిదబాస” యుండెను 


198 ఆం|ధుల సాంఘీక చరెత 


“తక్క-టి సెట్లు నాతలి బిలిపింప 

జేరి కోమటి బాస జెప్పె” పట్టింపు 
భూరాము సల్పడు భూరాము లొండె 
మరికెంబు బోడ దమ్మని నాండెనతని 
దరిమి గాలము [తాటదమ్ముల నొండ 
మలుచంపు బుడుగుల మాసల్లె డొండె 
మలయక కాలము మాసల్లిడైన 
వెలుకుల నొండేను వెన చెర్యులోన 
దిలకింత మనుచు చింతింపుచున్నాడు.” 


ఈ బాస కర్ణము చేసుకొన (పయత్నించుట పనిలేనిపని. 


డీ. శ. ౧౩౩౬లో హరిహరరాయలు పన్ను చెల్లించువారు ౧ రూపా 
యకు ౩౪ సేర్ల ధాన్యమిచ్చునట్టు నిర్ణయించెను. దీన్ని బట్టి ధాన్య మెంత 
చౌకగా నుండెనో తెలియగలదు, 


ధాన్యం తూకమలు, సోల!, తూము ఇరుస, మానికె మొదలగు మాన 
ములలో జరుగుతూ వుండెను, 


ఓడ రేవులలోని బేరమును గూర్చి యిట్లు |వాసీరి. 


“అటకు మిక్కిలి చేరు దగు పయోరాశి 
తట సమీపమున నిత్యంబు నోడలును 
పచ్చ కష్ప్రురమును పట్టుబట్టలును పచ్చి 
కసురి మేల్మి పనీడి యిట్టి కెలు 
మణులు చం|దాననామణులు పటీర 
కణములు మొదలుగాగల వస్తువులుగు 
నిరవొంద నెన్నిక కెక్కు. బేహరులు 
హరుల రంతుల తోరహత్తుగా దెచ్చి 


1 ద్విపద పరమయోగి విలాసము, పు ౬౯ 


వం. సతు wee, Se పు ౪౮౦ 


విజయనగర సామాజ్య కాలము 199 


ఆంచి బేహారమాడగ నటకు వానిక్తె_ 
చను దెంచు వారల వాని 


బూని బేహార మాడి పోవువారలును”! 


ఆ కాలమందు దిగుమతులగు వసువులను సమకాలికులు తెలినిన వన్నియు 
ఇందు కలవు. పైగా చందాననా మణుల (ఆందగ_్రైల) వ్యాపారము కూడ 
జరిగెను. ఈబేరము రెడ్డిరాజ్యకాలములోను జరిగినటుల ఆ కాలపువారు తెలివి 
నారు. పరదేశముల సెట్టవేష మెట్టిదనగా ఫలా 


ప శ్ర దేశముల సెట్టపగిది దిండుగను పెల్లుచుట్టిన పెద పెద ముడాను 
లును డొల్లుబొంగులును సీటుగ పొందుపరచి పొదిగల్లు అసిమల భుజ 
ములం బూని వదలుగారింటెముల్‌ వలెవాటువై చి.” £ 


ఇదు డొల్లుబొంగులు తప్పు. డొల్లుపోగులు ఆని యుండవలెను. అనగా 
ఊగునట్టి పోగులని యర్థము. (ముడాసు పదము నిఘంటువులలో లేదు ) “ముడా 
సుపై లపేటాడబ్బు” అని కకస ప్పతిలో వర్ణించుటచే ముడాసు అన టోవి అని 
యర్థము. ముడాను కన్నడ పదము. కోణాకారముగల చక్కని బట్ట. టోవిపె 
ల పేటా-షమ్లా-రుమాల కట్టుట నేటికిని ముసల్మానులలో ఆచార మైనది, అసిమి్మి 
అసివి, అశ్విసంచులు మూరెడు వెడల్పు గజముపొడవు కలిగి నిలువు మధ్య 
దుందు జనెడు సంమగలిగి కుట్టిన గోనెసంచి. ఆ సంచిలో రెండుమూలలలో వస్తు 
వులనుంచి వీపున ఒక మూల ఎద పై ఒక మూల పడునట్లుగా భుజముపై వేసుకొం 
దురు, ఎద్దుపై లేక అశ?ముపై ఎక్కి నపుడు దానిని గంతవలె వేనుకొని పోదురు. 
గుర్రాల పె నెత్తుధాన్యాదుల సంచులగుటచే ఆసిమి లేక అనివి నంచులని వాటి 
కా పేరు వచ్చియుండును. ఇవి నేటికిని పల్లెలలో కోమట్టవద్ద ఆందందు కాన 
నగును అసిమిని మాతసంచి యనియు అనిరి. పయాణములో అది తలగ 
డగా పని యిచ్చెడిది. 8 రించెములు అనునది సరికాదు. రెంటములు అనునది 


సరి, (రెండుపోరువల దుప్పటియని యర్థము.) 
1 ద్వపద పరమయోగి విలాసము పు ౪౮౬. 


On న 0 6 6 0/7 పు ౮౮ లిం 


8 ఆము క్ర మాల్యద. ౨-౪ 


200 ఆం(ధుల సాంఘిక చరిత 
వైదేశిక బేహారులు చేసిన దేశ దేశ వ్యాపార మెట్టిదనగా : 


“కాంక్రక్ర జీస పెగో వరకంగు లంక యయోధ్య మలాక యీడాము 
మొదలై న దీవుల మునుకొని వచి” ! 


ఇందు మొదటిపం౦ క్తి అంతయు తప్పుగా కనబడును. చీని, పెగూ, 
అరకాన్‌ ఆను దేశాల ఆ పేరులని తెలితుక లేఖకులు ఆడ్డాదిడ్డ ముగా (వాసినద్దు 
న్నది. లంక ఆనునది సింహళము. మలాక మలయాలోనిది. ఈడాము అనగా 


అరేబియా రవుపట్టణమగు ఏడెన్‌ అయి యుండును" 


విజయనగరమలో కొందరు ౫ లక్షల జనులుండిరనియు, ఆంతకంటే 
చాలా యెక్కువగా నుండిరని మరికొందరును తెలిపినారు. అట్టి నగరములో 
వ్యాపారమ. చాలా వి5విగా నుండెను, వ్యాపారులు కందులవలె రత్నాలరాసులు 
పోసి అమ్ము చుండిరి ఆకాలపువారు |వౌసిరి, నగరవాసుల వె భవములు అనంత 
ముగా నుండెను. ఆట్టీవాటికై విలాస వస్తువులు సమృద్ధిగా అమ్ముతూ పు డిరి, 

పరి(కశ మలు 

ఇదే సందర్భములో జనుల యవసరాలకె యే యే వస్తువులు సిద్ద 
నుయ్యెనొ తెలుసుకొందుము. సాధారణముగా భూదులలో బఎఐ జనులు రాట 
ములపై నూలు వడుకుచుండిరి. దానిని నేయువారు సాలెవారు, వారిలో బహు ' 
శాఖలు ౦డెను. సాలె, పద్మ సాలె, వటుసాల్మె ఆగసాలె మున్నగు వారుండిరి, 
*'అవ్వీటి మేటిసాల్హె ఆగసాలె, సటుసాల్క్‌ వానె, వైజాత్మి సాతులు, ఏతుల 
కొవమరులు" 8 అనువారుండరి. పటుసాలె లన పట్టుప స్త్రములను నేయువారు, వానె 
అన ఒకిజాతి కోమటు లని యర్థము (వాసినారు. వణిక్‌ అను దానినుండి 
యేర్చడినదేమో? వై జుతియన వైళ్యజాతి యని రెడ్డి్యాజ్యకాల చర్చలో తెలిపి 
నాము, సాతులన గోనెబు నేయు పె5కెవారు. ఏతుల అన చాప లల్రెడు వారు. 
ఈపదము ఏతులు అనియో. ఎతుల యనియో సరిగా తెలియదు. 


విజయనగరములో కొలలుగా గు బీపూల నమ్ముచుండిరి, జనులకు 
"సుగంధాలపై చాలా వేడక. కస్తూరి, కుంకుమపూవు గలుగులో నూరి వాడిరి. 


1 పరమయోగి పిలాసము పు ౪౮౮ 


ణి ఆముక్త మాల్యద, వ 


విజయనగర సా(మాజ్య కాలము 201 


“దెవుల సంకులు, కొంకిసిగలు, కావిదుప్పటులు నొప్ప, గంధకలనా 
కుసుమ (సక్‌ (గథనాదుల నాంధ్యంబు లేకలరు ఆం|ధదేశీయులగు గంధ 


కారులు] 


ఆనుటచే అం ధదేశమందే పూలదండలు కట్టి, సువాసన వస్తువుల సిద్ద 
ముచేని, బుక్కా విండినీ (పిష్టాతక ము) చేసి అమ్మి జీఎంచువారుండి రనుట 
స్పష్టము. కొల్లలుగా బోగముసానుల యిండ్లు గల విజయనగరములో గంధ 
కారుల కొదువయుండునా ? ఆ బుకా_వారు “పన్నీరునించిన తన్నీరు తిత్తు 
లొడ్తి9.” వారు తన్నీరు (తుపు +-సీరుడాచల్లని) పన్నీరును కూడా సిద్ధముచేసి 
తోలుకత్తులలో పోసి యమ్మెడివారు. 


తెనుగుసీమ పాచీనమునుండి వజాల గనులకు (పసిద్ధి నొందినట్టిది. 
గుత్తికి ౨౦ మైళ్ళ దూరముననుశ్న వ్యజకరూరు ఇంగ్లీషువారు. దేశాన్ని 
గెలిచిన కాలమందు కూడ వ జాలకు (పసిద్ధి గన్నట్టిది. గుత్తి దుర్గాధీశు డచ్చటి 
వ జాలను చక్రవర్తుల కంపుతూ వుండెను.* ఇట్టి గనులు మరిమూడు నాలు 
గుండెనని ఆ కాలపు యాతికులు (వాసినారు, 


కంసలి, కమ్మరి, కంచరి కాసె, వడ్రవారి వృత్తులు నిండుగా ఉండెను, 
వీరిని పంచాణమువారు (శిల్పులు) అని పేర్కొచనిరి, నేటికిని పల్లెలలో పందాణ 
పదమును “పాంచాలి యని యుచ్చరించి వడ్డ, కమ్మరి, కంసలివారలను 
పాంచాలివారని యందురు, వడ్డవారిన్‌, కంసాలివారిని వంచాణము వారనుటకు 


“సారెకు నచ టి పంచాణంబువారి బేరి 46 86 6 తత 4 అభ ఉట 
గుడిసొచ్చి చోరులు కొంపోయిరకట యనుచు కంసాలివా రనిళంబు 
వినగ అనుచుండు''క అనుట |[పమాణము. 


సాధారణ కాలమందు ౧౦ లక్షల సైన్యము కలిగి అవసరమైనప్పుడు 
౨౦ లక్షల సెనికుల వరకు కూర్చుగలిగిన సా మాజ్యములో కమ్మ రివారికి పని 


1; ఆము క్రమాల్యద ౪౩౫. 

2.V.S. C.P. 218. 

లీ, పరమ యోగి విలాసము-పు ౫-౨౩. 
(26) 


202 ఆం|ధుల సాంఘిక చరిత 


తక్కువగా నుండనా? వారు వివిధాయుధములను చేయుటలో నారితేరినవారు. 
మహారాజులు, సామంతులు దేవాలయములను, స/తములను, భవనములను, 
కోటలను నిర్మించినందున కాసె వారికి పని తక్కువకాకుండా యుండెను. 


వస్త్రములకు దేశిరంగులు వేయువారుండిరి. వారు [పధానముగా సీలిరం 
గును వొడిరి. మంజిష్ట, ఇంగిలీకము, కరక్కాయ, మున్నగునవి వొడిరి. “ఇంగి 
లీకంబునన్‌ తడిపి యెత్తు కసీసపు రెంటములు'” జనులు వాడిరి, (చూ ఆము. 


౪=౧౦.) 


(పజాజీవన విధానము 


విజయనగర సామాజ్యమం దాం ధులది పై చేయిగా నుండినది. ఆంధ 
దేశము మహావై భవముతోను, ఐశ్వర్యముతోను నిండియుండెను. ఆంధధు లుత్సా 
హవంతులై కిళాపోషకుల్దె దేశాంతరములందును పథ్యాతి గాంచిరి, అది మంచి 
చెడ్డలతో నిండిన !పబంధ యుగము. సుందర నిర్మాణములు, చితలేఖనములు, 
ఇతర శిల్పమలు దేశమంతటను సువ్య క్తము లయ్యను, ధనికుల భోగలాల సత 
ఇదే కొలమందు విజృంభించెను. విద్యానగరము హృద్యనగర మయ్యెను, అందు 
లోనే భావిపతన సూచన లిమిడి యుండెను, జనుల యిండ్లు, వారి యుడుపులు, 
వారి వేషములు, ఆలంకరణమలు ఆచారవ్యవహార ములు మనకు బాగుగా 
తలియ వచ్చినవి. మొదట రాజులయొక్క.యు, రాచవారి యొక్కయు 
జీవన విధానములను గురించి తెలుసుకొందము వారికి ఆలంకరణములందు అభి 


మానము మెండుగా నుండెను, 


“పన్నీటితో గదంబము సేసి పూసిన 
మృగనాభిపస రాచనగరు దెలుప 
పాటలానిలము లార్పగ దపారపుజుంగు 
లలరు దానికి మూగు నళులజోప 
కర్ణడోలామౌ క్రికద్భామ లెగ బాకు 

నురుహారరుచుల [ద స్తరికి దన్న 
శకికాంతి చెంగావి దళ. మలచిన కేల 
స్వర్ణత్సరువు వొడివాలు మెరయ 


విజయనగర సామాజ్య కాలము 213 


మెంతయడపముదే, జరన్మేరు వనగ 
తలవరులు గొంద రొలసి మంగల జనంగ 
అర్ధి ర ధ్యాంతః పురాంతరమున 
భోగినీసంగతికి రాజు పోవుచుండిలి' 


రాజులు పన్నీటితో కలిపిన కనూరిని పూసుకొనుచుండిరి. పొడవైన 
కచ్చుటోపీలు పెట్టుకొనుచుండిరి. చెవులలో ముత్యాల పెద్ద పోగులును, కంఠ 
మందు ముత్యాల హారమును ధరించు ఎర్రని అంచుగల తెల్లవస్తాంలు ధరించిరి. 
బంగారు విడిగల కత్తిని చెతబట్టిరి. పరిచారిక (ఆడపాప!) తాంబూలకరం౦డ 
మును (పాన్‌ దాన్‌) పట్టుకొని వెంట నుండెడిది ముందర తలారులు నడిచిది, 
ఇవన్నియు టోగముదాని యింటికి వెళ్ళునప్పటి సంరంభము 


రాచనగళ్ళలో నెమళ్ళను పెంచుతుండిరి. సుఖముగా ని|డించిన రాచవారు 
పౌద్దెక్కిన తర్వాతనే మేల్కొ.నెడివారు. తర్వాత గమగమ పరిమళించే పువ్వు 
లతో చేయబడిన “గంధరాజము” అనెడి పరిమళ [దవ్యముతో అంగమర్దనము 
చేయించుకొని చాలాసేవు వెన్నీళ్ళ స్నానము చేసి తెల్లని ధౌతవస్త్ర ములను నానా 
విధ హారములను ధరినూ వుండిరి, అటుపిమ్మట సన్నని వరియన్న మును, 
వేటాడి తెచ్చిన అడవిమృగ పక్షుల మాంసమువంటను, అపుడు కాచిన వెన్నతో 
కలిపి ఆరగించెడివారు. కస్తూరీ సమ్మి|శిత తాంబూలమును వేసుకొని రాత్రులందు 
మేడలపైకి వెళ్ళి అందు చిన్న చృకములతో కూడిన లోహపు కుంట్టలో అగరు 
చెక్కల దూపమును ఆఘాణించుతూ అంతఃపురనసుందరులతో ఆనందించుతూ 
వుండిరి. £ రాచదారి వేషాలు కూడ, సామాన్యుల వేషాలతో భిన్నించిన్నవై 
యుండెను, 

“జడలు మడంచి, చొళ్లినుగ సన్నపుబాగడలంగ జుట్టి చ 

ల్లడ ములు పూని మీద బడిలంబుగ గల్టిన మట్టికాసెలం 

బిడియము లందదోపి పృథు భీషణ బాహుల సౌాళువంబులన్‌ 

దడలి కెలర్చుచున్‌ జనిరి నాథుని [మోల నృపాల నందనుల్‌€” 


1 ఆము క్ర మాల్యద ౨-౭౫ 
ఏ ఆము, ౧౩౫, 
8 మనుచరి త ౪.౩0౦ 


204 ఆం|ధుల సౌంఘీక చరిత 


రాజులు, ధనికులు, సంపన్నులు వేసుకొనుచుండిన తాంబూలాలు విలు 
వయిన సుగంధ [ద్రవ్యములతో కూటినల్లివి. అవి, 


“ఖండిత పూగి నాగర ఖండంబుల ఘనళళాంక ఖండంబులచే 
హిండితమగు తాంబూలములు” 1 


వక్కలు, సొంటి, వచ్చకర్వూరము తాంబూలములతో చేరియుండెను. 
అంతేకాదు, అవి, 


“మృగబద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాందవీటి గంధ 
స్టగితేతర పరిమళమై” యొప్పెను 2 


అన్ని వర్గములవారు తాంబూలము వేసి రనియు, అది యు లేజకరమయి 
నదనియు, అందచేతనే రాజు ౨౦౦ మంది భార్యలపయిగా ఉంపుడు గ త్తెలతో 
భోగింపగలిగెనేమో ! ఆనియు అబ్బు రజాఖ్‌ ఆశ్చర్యముతో (వ్రాసెను, 


తాంబూల సంబారమలుందు కరండికల సుందరముగాను, వెండి బంగా 
రుతో చేయబడినవిగాను, సన్నని తీగె పనులు కలవిగాను ఉండెడివి. అందువే 
వొటిని “జాలవల్లికలు” అని వ్యవహరించిరి, * సంపన్నులు స్నానము చేయు 
నప్పుడు వాడుకొనిన నలుగుపిండికూడ విలువై నట్టిది, “'హర్మిదామలకా 
దిక స్నానీయ వసు |వజంబు * పనపు, ఉసిరికపొడి మొదలయిన స్నాన 
వస్తువులు ఆనుటచే పిండిలో వాటిని కలిపిరని అర్ధము. పెసలు, సెనగలు 
విసరిన పిండిలో అవి కలిపెడివారు. ఇది శ్రీల స్నానపు విండి, 
పురుషులు “*ీగంధామలకంబు”" గంధపు పొడి, ఉసిరిక కలసిన పిండిని 
రుద్దుకొనిరి, రి స్నానానంతరము శ్రీలు అగరు ధూపమును వెంటుకలకు వేసి 
జవ్వాజి పూయుచుండిరి. మరికొందరు “హరిచందన గోరోచనాగరు [పకల్పిత 


1 ఆము క్రమాల్యద ౫-౯౩, 

2 మనుచరిత ౨-౨౪. 

లీ పారిజాతాపహరణము ౨-౨౦. 
4 ఆము క్రమాల్యద ౫-౮౯. 

5 పారిజాతాపహరణము, ౫-౫౬. 


విజయనగర సా మాజ్య కాలము లి0 ర 


సురభి ధూశంబును* వెషటుకలకు వేసిరి, ! స్త్రీలు కాలి దేళ్ల్ళకు లతుక 
రంగును పూసుకొంటూ వుండిరి, 2 


రసికుల యాహార మెట్టిదో తెలుసుకొంద ము, 


“తారుణ్యాతిగ చూత నూత్న ఫలయు క్రై లాధిఘార సన 
ధ్రారాధూపిత శువ్యదంబు హృతమా తృ్యచ్చేద పాకోగ్గతో 
ద్లారంపుం గనరార్చు భోగులకు సంధ్యావేళస్‌ గేళికాం 

త రభ్యంతర చాలుకాస్థిత హిమాంత ర్నారి కేళాంబువుల్‌. 8 


భోగులను, మాంసభుక్తులును నగుదారు ఎండకాలములో చేప తునకలలో 
మామిడికాయ ముక్కలు వేసి తాళింపుచేసి, మధ్యాహ్నమందు భుజించి, 
సాయంకాలమందు తడిపిన ఇసుకలో పూన్చిన చెంకాయలను తీసి ఎడనీరు 
(కాగి, చేతల కనరును పోగొట్టుదుండిరి. ఇది శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా 
ననుభవించినదై యుండును [బాహ్మణుల వైభవముల కేమియు కొదువ లేకుం 
డెను. వేసవిలో అరటిపండ్లు, పనసతొనలు, నేతిముద్దలవంటి దోసబద్దలు, మంచి 
జాతుల మామిడిపండ్లు. దాక్షపండ్లు, వడపప్పు, తియ్యదానిమ్మలు, రసదాడీ 
అను అరటిపండ్లు, పానకము మున్నగునవి సాపడుతూ పుండిరి. * ఆలర్క- 
మును ముండ్ల యుచ్చింత కూర యని వేదము వే, రా. క్రాస్ర్రిగారు (వాసిరి, 
దానిపై యామునాచార్యులకు (పీతి మెండుగా నుండెను 5. ఆది మేదోవృద్ధిని 
కలిగించెడి కూరయట ! కాని యిదే యామునాచార్య కథను [వాసిన పరమ 
యోగి విలాసములో ఈ కూరను “ము౨డ్డ ములివింతకూర' ఆని |వాసినారుర్‌, 


రాజులకు, రాజబంధుపులకు వేటపై ఆస ర యుండెను... చిరుత పులులను 
పొంచి వాటిని వదలి జింకలను 'వైటాచ్రడివారు?.. నర్రము బాగా కురిసిననాడు 


1 రాధామాధవము, ౪-౧౬ ౩. 
అజదెకులో, 
ఆము కటు ద మేత 
స ౨౭ ౩. 
అము కమాల్యద 9౧౯౫. 
pa +) 
పరమయోగి విలాసము ద్విపద. పు ౫౮౧. 
ఆము క్రమాల్యద పబ తః 


కై రు ఈ; షా అఆ రిచి 


£06 ఆం, ధుల సాంఘిక చరిత 


వేటకుక్క లలో బయలుదేరి జింకల జోపుతూ వాటికాళ్లు బురదలో దిగబడి 
యురకలేక అలసిపోయినప్పుడు వాటిని కుక్కల సహాయముతో పట్టుకొంటూ 
వుండిరి1. పెద్దన యీ వేట పామాలయములలో చేసినట్లు వర్ణించెను. హిమా 
లయ పర్వతొలపయిన రేగడిపన్ను కలదా? రేగడి సీమయగు కర్నూలు, కడప, 
బళా జిల్లాలలో నేటికిని జనులు వర్షాకాలములో జింకలవేట నాడుదుకు. 
కర్నూలు, కడప మండలాలలో నుండు ఎరమల నల్లమలలలోని చెంచుల జీవ 
సమును, వారి వేటను ధూర్జటికవి యిట్లు వర్ణించినాడు. 


పౌ త్తపినాడు అనున దిప్పటి కడపజిల్లాలలోని రాజంపేట తాలూకా 
నిది, ఉడుమూరు అనున దిప్పటి ఉడుములపాడు. ఆచ్చట చెంచులుండిరి. 
వారు పొరుటాకుల కటిసీమల కట్టిరి. అవే వారి యుడుపులు, నేటికిని కోయలు 
మున్నగువారు న్రీ పురుషులును |పతిదినము ఆడ్డాకులను పెద్ద ఆకులను ముం 
దొకటి వెను కొకటి వెసి మొలకు కట్టుకొందురు. చెంచు స్రీలకు కురువిందదండ 
లిష్టము. పెరులకు దృషిదోషము పోవుటక్రై పసరముల తలలను, ఏనుగుల 
తలలను కొమ్ములతో చేలలో నె తెడి వారు. వారు అడవిలోని పండ్లను, గడ్డలను, 
తేనెను, చారపప్పు మున్న గువానిని తినేడివారు, వారి స్రీలు ఎరుపుగల వెం,టు 
కలతో నెమలి పింఛాలు పెట్టి, అలంక రించుకొనెడివారు. చెంచులకు విల్లంబులు 
[పధానమగు ఆయుధాలు, వారు బాణాలతో అడవి జంతువులను వేటాడి వాటి 
మాంసమును తినెడి వారు. నేరేడు, నె._యూటి, కొండమామిడి, దొండ, పాల, 
నెమ్మి, బరివంక్క చిటిముటి, కలివె, తొడివెంద, తుమికి, జాన, గంగ రేను, 
ఐలగ, మోవ్కి బలుసు, బీర్క కొమ్మ, గొంబి, మేడి మొదలగు పండ్లను తినెడి 
వారు. 


అడవిరోని చెంచు, కోయ, భిల్లులు నామకార్థముగా తమచుట్టు రాజ్యా 
లకు లోబడినవారయినను వొ రించుమించు స్వతం తులే “efy భిల్లాది కంప 
కోలనూల నాజ్ఞ చెల్లు”క్కి “వారెక్యరికై న అభయ మిచ్చినచో వ వానిచేతికి ఒక 
యంసక ప్రెను (బాణము) గాని, నూలిపోగునుగాని గుర్తుగానిత్తురు, దానిం గని 


1 మను,*, ౪=ఎ౨ిం, 

బి శ్రీ కాళహ స్తిశ్వర మాహాత్మ్యము ౩వ ఆశ్వాసము. ౧నుండి ౧౩౦ 
వర కుండు పద్యా లన్నియు చూడవలెను. 

8 ఆముక్త మాల్యద ౪-౨౦౬, 


విజయనగర సామాజ్య కాలము 207 


వారి (పజలె న దొంగలు వానిని చెనఃరు” (వెదంవారి వ్యాఖ్య). ఆటవికులను 
స్నేహితులనుగా చేసుకొనికుండిన వారు పజలను బాధించెడివారు. “పార్యతీయ 
బలంబులోనం గూడక యు రాజునకు (ప్రజాబాధ తరుగదు. ఎల్లేని బెదరు వావి, 
వొరలం జేకూర్చుకొనవలయును. అవిళ్వాసంబును, విళ్వాసంబును, ఆలుకయు 
నెలమియు, ఆతి వై రంబును ఆత్యనుకూలంబునుు, అల్పు లగుట నల్పంబును 
యగు. ఎట్లం టిని” (ఆము. ౪-౨౨౨) “చెంచులులోనగు వారు పాలన్నము 
పెట్టిన మాత్రాననే ఆ పెట్టి:వారియెడ సత్యము తప్పక |పవంర్డింతురు. 
అయినను ఏ యించుక ఆతిికమము కనబడినను పగబట్టుదురు.” (వేదం 


వ్యాఖ్య. ఆము, ౪-౨౨౩) 


మన సారన్వతములో వేట ముచ్చట వచ్చినప్పు డాటవికలు రాజువద్దకు 
వచ్చి పునుగు పిల్లుల, దుప్పికొమ్ముల, ఏనుగు దంతముల. పులిగోర్ల, జింక 
చర్మాల, చారపప్పు, ముంతమామిడి, తెనె మున్నగు వాటిని తెచ్చి కానుక 
యిచ్చినట్లు వర్తించిరి. అంతకంటె మించి దౌరేమియు తెలుపలేదు. మన (పక్క 
ననే అనాదిగా జీవించి మన భాషనే నానాప భంశ రూపాలతో మాట్లాడు గోండు, 
కోయ చెంగు, నవర మున్నగు నాటవికులను సంన్కరించుట, వారి జీవన 
విధానములను బాగా గమనించి, వారి చరితలను |వాయుట అనునది మనలో 
నేటికిని లేదు. పాళ్చాత్యులు వారిని గురించి ఆనేక [గంథాలు సిరి. ఇటీ 
వలెనే హ్యుమన్‌ (డాఫ్‌ అను జర్మనువాడు హైదరాబాదులో ఆటవికోద్యోగియె 
చెంచులను గూర్చి, విసన్‌ కొండలోని (గోదావరీ తీరారణ్యము లందలి) రెడ్డి 
అను ఆటవికులను గూర్చి(క£666416 of the Bison Hill) సమ గోద్గింథము 
లను |వాసెను. వాటిని చూచువారు కూడా మనలో లేరు. అయితే ఆ జర్మనుకు 
తెనుగు రానందున చెంచుల తెనుగును అర్థము చెసికొనలేక చాలా తావుల పొర 
పాట్లు చేసినాడు. చెంచులను గురించి తెనుగువారే (వాయుటకు ఊఉ త్తమాధి 
కారులు. మన చెంచుల ఆటలు, పాటలు, భాషలోని విశేషాలు, ఆచారాలు, పకా 
సాలు, దేవరలు, వారిబట్టలు, రూపములు, పరి శమలు వారి ఓషధీ విజ్ఞానము, 
వారి మంతతం(త్రాలు, వారి ధనుర్విద్యా పొటవము, వారి గుడిసెలు, ఆహారము 
మున్నగు ననంత విషయాలను గూర్చి కొందరు యువకులు పత్యేక కృషి 
చేయట యుక్తము. 


208 ఆంధుల సాంఘిక చరిత 


దొరల యిండ్ల మంచాలు చిలుకలతోను, హంసలతోను, సన్నని పని 
తోను కూడిగట్టి “సకినెల పట్రైమంచములు,” వాటికి దోమ తెర లుండెను, 
వారి ముంద్హ వద్ద “న కీబులు” వేత హసులు [(పహరి (పహారా) యిచ్చెడివారు. 
(నకీబు ఫార్సీ నీట్‌ పదమే. దానికి సర్దార్‌ అని యర్థము, అనగా భటుల 
సర్దారులు, ) రాచవారు తమ [గామములకు వచ్చినప్పుడు వారిని పెండి కొడుకుల 
వలె పగటి దివిటీలతో, వాద్యములతో ఎదుర్కొని తీసుకొని పోయడివారు. 


విజయనగర చ కవ రులు సామా జ్యవ్యయము లన్నియు, సొంత 
వ్యయము లన్నియు పోగా ఏటేట ఒక కోటి మాడలు మిగిలించకొంటూ 
వుండిరి. వారి మంతులు, సామంత మండలాధీశులు జీతమునకు మారుగా 
పొందిన జాగీర్ల నుండి ఒక్కాక్కురు ఏటేట ౧౫౦౦౦ నుండి ౧౧ లతల 
మాడల (ఆర్ధవర వా) ఆదాయం పొందుతుండిరి. అందు వారు మూడవ భాగము 
చక్రవర్తీ కిచ్చి తక్కిన భాగమతో నియమిత సెక్యము నుంచుకొని, అజ్ఞాపించి 
నపుడు దానితో యుద్ద సహాయార్థము వెళ్లవలసి యుండెను. కొని వారు నియ 
మిత సైన్యమును నిలువ యుంచక [గామాలలోని జనులను కొందరిని అవసర 
మగునప్పుడు వచ్చుటకు కట్టడి చేసుకొని ఆదాయమును పెంచుకొని, ఇచ్చవచ్చి 
నట్లు వ్యయము చేసి ఆనందించెడివారు, (1) 


విజయనగర రాజధాని యావరణము ఇంచుమించు ౬౦ మైప్లండెను. 
చ్మకవ ర్తి [పపాసాదము మహాభవనముతో నిండినది. అందు పెద్ద పడసాంలు, 
మోసాల లుండెడివి, లోవల విశాలతగల బయతళ్లుండెంవి, ఎక్కడ బట్టనా సీట్రి 
కొలను లుండెడివి. నగరములోనీ మండాలాధీశళ్వరులు, మంతులు కూడా అదే 
విధానముపై తమ భవనాలు కట్టుకొని యుండిరి. చక్రవర్తి (పొసాద సమీవము 
ననే సామంత |(పభుల భవనాలుండెడివి. ఆవి బారులు తీర్చిన ఏధులుగా 
నర్పా వె యుండెను. అవి చాలా యందమై అలంకృత మై శిల్పములతోను, 
చి త్తరువులతోను నిండిన వె కన్నుల వండునై యుండెను. విరూపాక్ష స్వామ్యా 
లయము ముందు అతివిశాలమగు వీధియు చక్కని వరుసలో నుండిన మహి 
భవనములను చూచి యానందింప దగినవై యుండెను. నాగులాపురము(హోన 
పేట) లోని యిండ్లు ఒంటిమిడ్దిలై , విశాలమైనవై, అందమైనవై యుండెను(2) 
(1) V. 5. C. P:; 226. 
(2) V.S. 0. P, 226; 


విజయనగర సాామాజ్య కొలము 209 


సామంతుల యొక్కయు, రాదవారి యొక్కయు ఉడుపులను బార్కోసా 
యిట్లు వర్ణించెను. “వారు నడలము దు కాసె క రైడు వారు చాలా నిడుపుకాని 
చిన్నని సన్నని నూలు అంగీలు దొడిగిరి. లేదా పట్టు ఆంగీలు తోడిగిరి. ఆ 
యంగీలు ముందు భాగమున విడుచుటకు కట్టుటకు ననుకూలముగా నుండెను. 
దానిని తొడల సందున దూర్చి కూర్చొనుచుండిరి, నెతులపై చిన్న రుమాలలుం 
డెను. కొందరు పట్టు జరీ టోపీల ధరించిరి. వారు చెప్పులుకాని ముచ్చెలుకాని 
తొడిగిరి. భుజాలపై పెద్ద పెద్ద దుప్పటంతటి 'సెల్పాలము వెసుకొనిరి. వారి 
స్రిలు చాలాసన్నని తెల్లని నూలు చీరలనుగాని, రంగురంగుల పట్టుచీరలను 
గాని అయిదుగజాల పొడవుకలవి కట్టుతూ వుండిరి. (ఇప్పటి వలెరే కట్టు 
చుంగులు కొంగు వేసుకొనిరి.) పట్టుతో జలతారుతో కప్పిన ముచ్చెలను 
తొడిగిరి (1) 


“విజయనగర చ కవరులు ఊరవిచ్చుకలు ఎలుకలు, పిల్లులు, బల్లులు 
కూడా తినిరి” అని నూనిజ్‌ అనే విదేశ యా,తికుడు |వాసెను. నేటికిని పరమ 
నీచులును. మన దేశ మందెందును పిల్లుల, బల్లుల తినుటలేదుకదా! ఇక ఆ 
చ్మకవర్తులకు ఉత్తమమైన కోరినట్టి రుచ్యమైన మాంసము దొరకక యీ 
యసహ్య మాంసమలను తిని రనవలెనా ? ఇది పచ్చి అబద్ధము. పాశ్చాత్యులు 
తెలిసీ తెలియనిపిచ్చి! వాతలను కూడా వాసి పెట్టిపోయినారు. అవి విస్సృన్న 
వేదమువలె [గాహ్యములు కానేరవు. 


సామాన్య జను లెట్లు జీవించిరో కనుగొందము, సాధారణ జనులలో 
ముఖ్యులు రెడ్లు, కొండ వీటి రెడ్డిరాజుకు విజయనగర చకవరర్తి కన్యకనిచ్చి 
పెండ్లి చేసియుండియు నిరంతరము రెడ్డిరాజులకు విజయనగర చ(కవ రులకు 
యుద్ధాలు జరిగెను. తుదకు రెడ్జికాజ్యము పడిపోయెను. సా(మాజ్యములోని 
రెడ్లు (గామాధికారులుగను వ్యవసాయకులుగను, సైనికులుగను జీవనము 
గడిపిరి. (శ్రీకృష్ణరాయలు వారిని తన ఆము క్రమాల్యదలో రెండు మూడు 
మారులు తడవెను. “విడువ ముడువ వేపరని వీసంబుగల రెడ్డొని పేర్కొ 
నెను. దుప్పటి కొంగులో బీవవారు కాసువీసము ముడి వేసుకౌని ఆత్యవసర 
మెనప్పుడు కూడా విడువలేక విడిచి వాడుకొందురు, పేదవారికి వీసమే మహో 
కోశము, రెడ్లు తమచేలవద్ద గుడిసెలు వేసికొని మంచెలు వేసికొని పిట్టలనుండి 


(1) V. S. C. P; 227. 
(27) 


210 ఆం|ధుల సాంఘిక చరిత 


దొంగలనుండి చేలకు కావలి గా సెడివారు. వారి స్త్రీలు మసురుపట్టిన వర్షాకాల 

ములో అంబలి పాతను బుట్టలో పెట్టి నెత్తిమీద పెట్టుకొని దానిపై జమ్ముగూడ 

వేసుకొని కావలిగానున్న తమపురుమల కీచ్చెడివారు. జొన్న సజ్జ గోధుమ 

పిసికిళ్ళు' కావలి కాయు వారికి సమృద్దిగా నుండెను. వరాకాలములో రెడ ; బదుకు" 
థి జ! యే 

నిటు రాయలవారు వర్ణించినారు, 


“గురుగుం, జెంచల్కి తుమ్మి, లేకగిరిసాకుం, తిం తిణీవల్లవో 

త్క రమున్‌, గూడ పొరంటినూనియలతో కిట్టావికుట్టారుగో 

గిరముల్‌ మెక్కి. తమింబసుల్‌ పొలము వో (గేవుల్‌ మెయిన్నాక్క మే 

కెరుపుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుతై కా ప్తి రెడ్డజ్జడిన్‌. ! 

[శావణమాసములో ఆకుగూరలు సమృద్ధి, ఆప్పుడు గురగు (గునుగు 
ఆని వ్యవహారం). చెంచలి, తుమ్మి, లేతతగిరిసాకు (తగిరెంత ఆని వ్యవ 
హారం). ఈ నాలుగు కూరలను తరిగి చింతచిగురు కలిపి బాగా నూనెపోసి 
పొడికూరగా చేసి కావలసిన ఉప్పు కారము మున్నగునవి చేర్చి కలగూర చేసి 
రన్నమాట. వారికి పకువుల సమృద్ధియు, గొర్హమంద లి సమృద్ధియు, వరి 
మళ్లనుు మంచాలపై పడకలును కలవని ఈ పద్యమందు సూచితములు. 

సామాన్య రెడ్డ భో జనమును కృష్ణరాయలు వరింపగా ఆతనికి ౧౦౦ 


1 ఫ్‌ 
ఏండ్ల తర్వాత నుండిన తంజావూరి రఘునాథ రాయలు రెడ్డి దొరల భోజనము 
నిట్లు వర్ణించెను. 


“కప్పుర భోగివంటకము, కమ్మగనే, వడియున్‌, భుజించి, మేల్‌ 
దుప్పటు లట్లు మూరల తోరపు బణచ్చటముల్‌ చెలంగగా 
గొప్పక దాని పెడి జిగి గుత్తపు టుంగరముల్‌ కరంబులన్‌ 
దిప్పుచు రచ్చచేయుదురు రెడిదొరల్‌ తమి హెచ్చ నచ్చటన్‌.” 


_--రఘమునాథ రామాయణము. 


రెడ్లు |గామాధికారులై యుండిరి. దొంగలను పట్టుట్క శిక్షించుట, తగ 
వులు తీర్పులు చెప్పుట, [గామరక్షణము సేయుట వారి విధులై యుండెను. 2 


Cr ననన న టం. 


1 ఆము క్ర మాల్యద. ౪-౧౩౪. 
వి అనుక మాల్యద క జతలో 
లీ 


విజయనగర సా|మాజ్య కాలము 911 


ఈ సందర్భమ లో రడ్డి అని రాయలు |పయోగించినారు. రాష్ట కూట, రట్ట 
కడ్డి, రట్టకి, రడ్డిఅని రూపాలు మారుతూ తుదకు [క్రీ॥ శ॥ ౧౬౫౦ నండీ రెడ్డి 


“ఎడ్జెతనపు కై సేతల రడ్డులు పురస్పరద్భార్యమ గా” 


అని యతిస్తానములో తెనాలి రామకృష్ణుడును, “రాజానా, రడ్రియానా” 
అని చేమకూర వేంకటపతియు వాడిరి* రడ్డీ పద్మపయోగము చేమకూరదే 
తుదిది. అటుతర్వాత రెడ్డిరూపమే సిలిచినది. 


రెడ్లు వ్యవసాయమును (పధాన కులవిద్యగా చేసుకొనిరి. “వారికి తెనుగు 
దేశములో మంచి పలుకుబడి యుండెను. పంట మైలారు రెడ్డి చాలా (పసిద్దుడు, 
వారు దూర దూర ప్రాంతాలకు వలస పోయిరి. అందుచేతనే యిప్పటికిని వారు 
తిరుచునాపల్ల్తి, కోయంబత్తూరు, సేలం జిల్లాలలో నున్నారు. య 


“రామయభాస్కరుడు అను _బాహ్మణుడు (శ్రీ కృష్ణదేవ రాయల పక్ష 
మున కొండ వీటికి వెళ్ళి గోపీనాథస్వామి దేవాలయమును పునర్నిర్మాణము చేసి 
కొండవీటి రెడ్డిరాజ వంళమువారిని అచ్చటికి దేవుని దర్శింప నాహ్వానించి ఒక 
రొకరిని అంతరాళికము లోకి తీసుకొనిపోయి తలలు గొట్లించెను. అటుతర్వాత 
రాయలు సులభముగా కొండవీటిని ఆ్యకమించుకొనెను.” (2) ఇదే విషయమును 
గూర్చిన ఇట్టి యైతిహ్యము కలదని కొంద రాం|ధులుకూడ (వాసిరిం 


అయితే యిందెంత సత్యమున్నదో నమ్ము టకు వీలులేదు, 


ఆనాటి వ్యవసాయమును గూర్చి బార్చోసా యిట్లు వాసెను, “జనులు 
కనరా దేశములో వరి యలుకదురు. జడిగెములుకట్టి గొజ్టుతో విత్తుదురు. 
బయలు మెట్టుపొలాలలో విత్తనాలు చల్లి పాయుదుకు.'” నూరేండ్ల [కిందట 
నుండిన నర్‌ తామస్‌ రో అను ఇంగ్నీషువాడు రాయల సీమలో చెరుపులనుగూర్చి 
యిట్లు [వా సెను. కక [పాంతాలలో కొత చెరువులు కట్టుటకు [పయత్నించుట 
వ్యర్థ్యపయత్నము. అనువైన [పతిస్థలమలో కూడ పూర్వము చెరువులు కట్టి 


(1) 52126016, Il. 37, 
(2) 52124016, I1, 133-4 


212 ఆంధుల సాంఘిక చరిత 


నారు, కడపలోన ఒక తాలూకాలో 3౫౭౪ చదురపుమెళ్ళ వై శాల్యములో ౪౧౯౪ 
చెరువులున్న ఏ” (1). విజయ నగరచ కవర్తులు సవ ఎద్దిగా చెరువులు కట్టించి 
రైతుల నాక ర్షించి దేశమను సుభిక్షముగా చేసిరి. రాయల రాజనీతియు నట్టి దే. 


“దేశ సౌభాగ్య మర్టసిద్ధికిని మూల 

మిల యొకింతె న కుంట కాల్వలు రచించి 
నయము పేదకు, అగి, కోరునను నొ 

సంగి 'పబలజేసిన అర్థఢర్మ ములు పెరుగు” 2 


చిన్న భూ పదేశములందు సహితము చెరువులు, కుంటలు, కాలువలు 
తవ్వించి రైతులకు తక్కువ పన్నులపె భూములిచ్చి తక్కువ కోరువారినుండి 
రీసుకొనిన వారు వృద్ధికి వత్తురు. పభుత్యకోశము నిండును. రాజు ధర్మ పరు 
డను కీర్తియు వచ్చును అని రాయలు |వాసెకు, నూనిజ్‌ అను సమకాలికు 
డిట్లు [వా సెను. “నాగులాపురము (హోసపేట)లో రాయలు చాలా గొప్ప చెరు 
వును కట్టించెను. అ చెరువు నీటితో వరిమళ్ళు చేసి తోటలు సమృద్ధిగా 
పెంచిరి, రైతుల నొకర్షించుటకై రాయలు ఆ చెరువు [కించి భూమలకై మొదటి 
తొమ్మి దేండ్లు పన్నును తీసుకొనలేదు. ఆటుపై వచ్చిన ౨౦ వేల మాడల 
పన్నుతో ఆతని మండలేశ్వరుడగు కొండమరాజు ఉదయగిరిలో అనంత సాగ 
రమును కాలువాయి చెరువును కట్టించెను (క) 


రాయలవారు స్యయముగా వ్యవసాయకుల కనుకూలములు కల్పించి నను 
పలువురు మండలాధికారులు పన్నులెక్కువగా లాగి, బాధించిరి, అందుచేత 
పలుమారులు పన్నులు తక్కువగానుండు [పాంతాలకు ర తులు వెళ్ళిపోయిరి, 
ఉత్తరఆర్కాాటు జిల్లాలో ౩౩ పన్నులలో ౩౨ పన్నులను దేవస్థానముదారు 
తీసుకొనిరి, ఒక పన్నునే కేంద పభుగ్వము తీసుకొనెను. దేవాదాయ (బవ్మో 
దాయ భూములనుండి వసూలుచేయు పన్నలను రాయలు తీసివేసిరి చిదంబర 
ములో పన్నలెక్కుువని [పజలు మొర పెట్టుకొనగా అక్కడి మండలాధికారి 
వాటిని తగ్గించెను మరొక తావున (పజలు గుంపులుగా వెళ్ళి రాయలతో మొర 
వెట్టుకొన వారు పన్నులను తగ్గించిరి. (4) 

(1) V.S-C.P. 216. 

(2) ఆముక్త మాల్యద. ౪-౨౩౬. 

(3) (4) V.S: C. ౨. 217, 228. 


విజయనగర సా(మాజ్య కాలము 9 13 


“గట్టిగా పెంప దశ్షత లేమి నూరూర 


'బందెల బడిపోయె పశుగణంబుి ] 


అనుటచే బందెందొడ్డ పద్దతి దేశమంతటనూ నుండెను 
శెడ్జివెష మెటిదో యటొక కవి వరి౦చెను. 
స్తు ళా అ 


“బసప్ఫు చుంగుల తలపాగ నెట్టంబు 
కసిబీసి మెసగు బాగాల వీడియము 
మిన్న దేరెడు దొడ్డ మెడ నూలు మిగుల 
పన్నియగల మాధవశళి పచ్చడం౦బు 
దోశ సరియగు దేవదారు గంధంబు 
వలకేల గనుపట్టు వంకుటుంగరము 
డొల్లు బోగులును కాటుక పప్పు దేరు 
పిల్లిగడ్డ ము, పడిబెట్టు మీసలుకు 
నలవడ నాందోశికారూఢు డగుచు 
అలనాటి పూర్వికుడగు పెద్దిరెడ్డి” 2 


(నెట్టమ.కాదు నెద్దిము=అనగా గుంపుపమాల, మాదళము, మాదావళము 
అన్న రూపాలు కలవు, అనగా కపిలవర్దము కలది. వంకుటుంగరమన వంకి 
వంటి వంకర యుంగరమని యర్థ మేమో! పెద్ది రెడి కాక పెద్ద రెడ్డి యేమో |) 


ఈకవి కాపువానిని వేరుగా వర్ణించినాడు. రెడుకూడ కాపులే. కాని ఇతర్‌ 
జాతులవారు పలువురు కాపులని చెప్పుకొనిరి. ఇక్కడ వ్యవసాయకుడగు నొక 
శూదజాతి వాడని యభ్మిపాయ ముండును, 


“అప్పు డామడిసేయు నాయూరికాప్పు 
ముప్పిరిగొను పగ్గముల చుటతోడ 
Ny అ 
గుచ్చిన మునికోల గోంగడిముసుగు 
మచ్చల మచ్చల మల్టి కాశియుఈ 


వననమెయానానా వనన నుమననల లంబం నాలా బానానా నునన వామన నరుడా కనిననునులయాల నలరు నకానునన ననన లసంత నాలోన వనాడసకో దనన 


1 మనుచరి.త ౧౨౯ 
2 ద్విపద పరమయోగి విలాసము, పు ౪౭౮ 


214 ఆం[ధుల సాంఘిక చరిత 


బలువై న కేలి యంబటికుండ తనకు 
నలవడ నలగొండ లన నొప్పుచున్న 

మీదైన యెద్దుల మెడ కాడిమీద కోటేరువైచి 
నెక్కాన్‌ రొప్పికొనుచు చనుదెంచె” ! 


(కా? కాక కాసె ఆయియు౦డును.) వరిమళ్ళలోని వరిపంటలు సమృ 
దిగా నుండెను, కొన్ని వడ్రపేర్లను రాయలిట్లు తెలిపినారు. “తీగమలైెలు, ఖర్లూ 
° 9 0౧ oe) లు ణ్‌ 
రాలు, పుష్పమంజరులు మామిడిగుత్తులు, కుసుమములు, సంపె/లు, పచ్చ 
గన్నెరలు, పాళలు, రాజనములు' 2 ఇంతవరకు రెడ్డ, కాపుల, వ్యవసాయ 
మును గురించి (వొసినాము, ఇక ఇతర తాతులవారిని గురించి తెలుసుకొందమ, 


కరణము వేష 'మెట్టిదనగా:_ 


'“వనముంచు తెలివలిపంపు వింజియలు పొసగ చుట్టినయట్టి బోడ కుల్లాలు 
చింవికుప్ప సములు చెవిదోరములను సంవుటంబులతోడ జంపాడు నొడలు 
దిగువగా చెంపదోవీన ఐలపములు తక నలవడ వ_త్తరి 

కరణికులు చమదెంచిరి.” కి 


(బోడకుల్లాలుడాచిన్నటోపీలు, కుప్పసములు=కుబుసములు (అంగీలు.) 
సంపుటము ఆన ఒకవిధమైన బట్టపలక. పూర్వము బట్టపై లేక కాగిదాలపై నల్లని 
గార్‌ (Coating ) పూసి యెండించెడివారు. ఆ యట్టలను రెండుమూడు కలిపి 
యుంచుళకొని వాటిపె మెత్తని కోపు బలపముతో వాసి తుడిచికొని మరల 
మరల |వాసెడివారు. బట్టకు రెండుపక్క_ల కాగిత మంటించి దానిపై ఆకు 
పసరు, బంక, బొగ్గు నుసి పట్టించి పలక వలె చేసికొని దానిపై కోపు బలపాలతో 
[వాయుచుండిరి. కరణాలు అట్టి సంపుటాలను పట్టుకొని కోపు బల 
పాలను చేవుల పె నుంచుకొనిపోయిరి. "ఆ కాలమందు నల్లని బట్టపె బలపముతో 
(వాస్తుండిరి,” అని బి. సూర్యనారాయణగారు (వాసీనారు. కరణాలు వ్యవసా 
యపు పన్నుల లెక్కలు [(వాయువారు,. ఆ కాలములో భూములు కాళ్వత 
పట్టాపె యియ్యకుండిరి! కొందరు కలసి కోరుకో పన్నుకో చేతనై నంత భూమిని 
తీసుకున్నట్లున్నది. మండలాధికారులు భూములను పొంది అందు తమ సేవకైన 
1 పరమయోగి విలాసము. పు ౫౩౧. 


లీ ఆము ౧-౬౬... 
శి పరమయోగి విలాసము ద్విపద, పు ౪౫౮+ 


విజయనగర సామాజ్య కాలము శి! 


SK 


గాయము తీసివేసి మిగిలినదానిలో కొంత కోరును పభుత్వానికి చెల్లించు 
తారు, 


“ఉమ్మడియును! శాణ్క, యు తరు వమర మిమ్మెడియింప మాకియ్యేటి 
వరఈ చెల్లిన ధనమెంత"” + 


ఉమ్మడియన సః రాజ సేవకై యిచ్చిన ఇనాము. ఠాణయన భటుల 
సిబ్బందియుంచుట= డి త్తరువు అనునదియు ఒక విధమగు పాశెపు సేవ. అమ 
రము అనునదియు అట్లిదె. 


ఆమరమ.ను గూర్చి కృష్ణరాయ విజయందెట్లు నిక్యచింపబడినది, 


“భటులు వేయిటి కెన్న ,ఇగ్వదియు నాలు 
వేలుగా; లక్షయిర్వదివేల .పజకు 

చెల్లు నల్వదిలక్షలు జీత మనఘ 
ళా 
అమర మేలెడు దొరల కీకమమె సుమ్మి” 


దీ త్రరువు ఉమ్మ ళియు [తోయంగ మరియు నందులకు నిందులకుపోయె 
పొమ్మని వార బులివిపుచ్చుటయు గనలి భూపతి బోడుకలు కొంగుబట్టిపె చి 
రాదిగిచి యీడ్చుటయు” £ గుంవించి ఆనుటచే రాజులకు రావలసిన భూభాగము 
రాకున్న రాజసేవకులు వారి నవమానించెడివారు. (బోడుకలు సదమునకు 
చూపగా టోడికలు అని శ. ర. లో కలడు.) పన్నులు చెల్లించనివారిని, 


“పడతాళ్ళ చేద దీర్పరుల మన్నీల తడయక విలివించి తద్వార చెప్పి” 


థిశ్షానిర్లయము చె సెడివారు. (పడ తాలు శబ్దములు శ. ర. నిఘంటువులో 
లేదు. సందర్భమునుబట్టి భటుడనియర్ధము.) (శ్రీ రాళ్ళపల్లి ఆనంతిశర్మగారు పడ 
వాలు అను పదమును తెలిపినారు. అపుడు భటుడనుట సరిపోయినది, మరియు 
'గుదియగట్టి” వారిని ఈడ్చుకొని పోయెడివారు. బండలె త్తి, ఎండలో నిలబెట్టి 
చేతులక కాళ్ళు సం కెళ్ళు వ్‌ బాధ పెట్టెడవారు. 

1 పరమయోగివిలాసము ద్విపద పు ౪౫౮ 

లి పరమయోగి విలాసము-పు ౪౬౧. 


వ్రు ౪5౪ అ య ea 2౭౪ పు ళలోం. 


216 ఆం[ధుల సొంఘ్‌కో చరొ త 


వైద్యుల క. మెటిదనగా :__- 

“వంక మందుంసంచి జగజంపు వలువ 
పొంకమె సిజక ర్భముల నొప్పు దూది 

కునివడ్‌ జుట్టిన కురుమాపు పాగ 
అనువంద పంచలోహంపుటుంగరము 

ఉరుతరంబై నట్టియూర్హ పుం డంబు 
కరమొప్పు వలకేలి కరకకాయలుగు 

బెరయ పచ్చడముతో వెనుపడ సంది 
నర గనుపట్టు బాహాట పుస్తకము 

బనుపడలో గుణపొఠంబుచదివికొనుచు 
మూలికలుదిక్కులు చూచిశొనుచు 

ఆన్నగరవ నుండు నత డేగుడెంచె' !. 

(జగజము--ళ. రః లో లేదు.) బాహాటము అన బయలు పడినది, 
వెంటనే ఆరగనుపట్టు అనుటచే బాహాటమున కీ యర్గము సరిపడదు, "బాహా 
టము ఆను వై ద్య్యగంథము కలదు దాని కైక్కువ పామాణ్య మానాబి వెద్యు 
లలో కలదేమో ? బావోటమని కవి యేల వాడెశో? 

(విజయనగర మున ఆయుర్వేద కళాశాల లుండెను. అందు అరబ్బులు 
ఈరాసీ విద్యార్థుల కూడా వైవిద్య నభ్యసిం చరి. అరబ్బు యువకులు ఈ దేళ 
మన ఆయుర్వేదము కొంతకాల మభ్యసించనిది తమ ఎద్య ప్పూర్తి కాదని తల 
చిరని హ్లూజెల్‌ అను యూరోపువాడు |వాసెను. విజయనగరమలో వై ద్యకళా 
శాల లుండెననియ అందు అరబ్బు విద్యార్థులు చదువు తుండిరని సులేమాన్‌ 
అను అరబ్బు వ్యాపారి _వాసెను. 
వెషవ భాగవతుడు :_ 


2౯3 
“వదలువింజల నిడు వాలుధోవతియు పోలగా జుట్టిల పొ_తిపొగయును 
దూలగట్టిన వెడతోపు పచ్చడము అంకే డాకేలి పంచాంగంబు ముష్టి 
చంక వేలెడు తాళ చలిదిమూటయును” 2 
కలిగి పయాణము సాగించెను. 


1 ప, యో, విలాసము. వుం 9X0. 
2 ప, యో, విలాసము, పు, ౫౦౮. 


విజయనగర సా్యమాజ్య కొలము 217 


మేదరివాని వేషమును కవి యిట్లు వర్ణించెను వా 


“మలయంగ నెడదుంటి మైనోరగాగ 
మొల(తాటి జెక్కిన మోటక త్రియును 

కొనసిగతోగూడి కురులొక యింత 
గనుపట్ట జెరివిన గన్నెరాకమ్ము 

గొనల వెల్వడు పుట్టగోచియు నెరులు 
బె*గొన్న నునుదబ్బపీను డా కేల 

వెడ వెడజివాాడు ఎదురుసలాకి 
యెడమచెేబొట। వేలి యినుపయుంగరము 

పట పటు Sa అవ్వశభూమి కేతెంచె ! 

(గన్నెరాళకమ్ము =గన్నే రాకువంటి ఆలుగులుకల ఆమ్ము) జివాాడు 
తప్పు, జవ్వాడు అనవలెను. మేదరవారు తెనుగువారు కారు, వారు ఆరవలుగా 
గనుపింతురు. రాయలకాలమునాడే వారిభాష వేరుగా నుండెను. అడవిలో ఓక 
బాలుని ఆక ందనమును మేదవారు విని, 


“* ఆలించి మార్దాలమని సంశయించి పాక్క పాక్కని తమభాష జెప్పుచును "౨ 
అనుటచే వారిభాష వేరనుట స్పష్టము. తెలుగుదేశమందలి మేదరవారు 
తెనుగు భాషనే మాట్లాడుదురు. కాని బొంగు, ఈతబరిగెలతో బుట్టలల్లు ఎరు 
కలవారు మ్మాతము చెడిన అరవమును మాట్లాడుదురు. పాక్కఅన విల్లి అను 
నర్గమిచ్చు . కన్నడ పదముకాని, తమిళ పదముకాని లేదని తెలిసినది. మరే 
భాషలో నున్నదో యేమో ? మేదర వారిని సంస్కృతములో వేణులావకులు, 
కటకారులు అనిరి, వారు వెదురుదావలు, బుట్టలు, తడకలు మంచములు, 
గుమ్ములు మున్నగునవిచేసి జీవింతురు. మనలో వీరు కాకతీయుల కాలానికి 
పూర్వమనుండియే జీవించినను వీరినిగురించి తెలుసుకొన్న వారు లేరు. 


కాసెవారు (ఇండ్లు కట్టువార్సు ఎట్టివారనగా : 


“కలయ నాచార్యుల కాసీల గపుడు విలిపింప వారలు పెనుజన్నిదములు 
చంకల శిల్పశాస్త్రపు సకములు వంకవో జుటిన వలుదపాగలును 


ns చద 
1 ప, య్మో విలాసము, పు ౫౦౮. 
౨ ప. యో. విలాసము, పు ౬౫. 
9 ప. యో. విలాసము, పు ౬౬, 


218 ఆం(ధుల సాంఘిక చరి[త 


కొలది రేఖలు వడి కోసినయట్టి యెలమించి వలకేలి యినుపకమ్ములను 
చేరువ నిలిచిరి”! 


దారీపను లెట్రివనగా పా! 


చప్పటి కుమదంబు చదరపానంబు కప్పుచూరులు, కంబకాళ్లు, పద్మకము 
ఒగి వహాజగతియు, ఉపజగతియును మొదలయిన తమ పని....” 2 


ఈ పదములలో చదరపానము అన చదురమైన సానవట్టమనియు' 
కప్పుచూరు లన ఇంటిక ప్ప ముంగలి భాగము లనియు, పద్మక మన దేవాలయ 
గోపురముల అడుగు భాగములలో తీర్చెడి పద్మదళము లసయు ఆర్థము చేసి 
కొందురు. కప్పుచూరులు తప్ప తక్కిన పై పద్యమలోని పదములన్నియు 
శ, ర. నిఘంటువులో లేవు. మహాజగతిి ఉపజగతి, పద్మక పదములు శబ్ద 
కల్ప|దుమమందుగు లెవు, వాసు థాస్త్రములం దీవి లభించు సమో? 


మాలదాసరి వేష మెట్రిదనగా : 


చమురు తగిలిన తోలు కుప్పసముు చెక్కి అనగ టోపియును, ఇత్త 
డితో చేయబడిన ఒక శంఖపు ఒక చ|కపు ఆకారముగల కుండలములు, జింక 
కొమ్ముల అలుగులు, తోలుతి త్తి, మొగలియాకు గొడుగు, గురప్ప వెంటుకతో 
నమర్చిన దండె | కిన్నెర | యు, చిటితాళములు, చంకబుట్ట, తులసి పేరులు 
నామాలు మున్నగు పరికరములు కలవాడై యుండెను 8, ఆతడు వాయించు 
కిన్నెరను “చాండాలిక ” అనిరి, 


ఆ కాలమున వెట్టివా రుండిరి. ““వెట్టివాని కేల విమలవిదారంబు ?” 
“వెట్టివానికి కూలి వేడ దగదు” ఆని యొక కవి అనెక. “ఇల దొమ్మరిది 
జాతిహీనత యెంచదు'” పూటకూళ్ళది పుణ్యమునకు జొరదు్‌ ఆని యున్నం 
దున దొమ్మరివారిని హీనులనుగా చూచిరి. 


1 ప యో,విలాసము. పు ౫౩౮, 

2 ప, యో, విలాసము. పు, ౫౪౦+ 

లీ ఆము క్రమాల్యద ౬౬, 

4 వెంకటేశ శతకము, తాళ్ళపాక. పెదతిరుమలయ్య. 


ర్‌ CRE) తాతల 9౪ OUR 0౪+ 9 9 ఇ €అ€ 


విజయనగర సా|మాజ్య కాలము 219 


టోగమువారి వేషా లిట్లుండెను :___ 


వలిపె చెంగావి పావట, వెలి పట్టుచీర కట్టి, జవ్వాది పూసుకొని, చంద 
కాంతపు దువ్వెనతో నెత్తి దువ్వుకొని, జారుకొప్పు వెట్టి, అణిముత్యాలచేర్లు 
కంఠమున ధరించి, వచ్చున బ్‌ న రించి, గుమ్మడిగింజ (వంటి) నామము 
దీర్చి, తాటంక ములుదాల్చి, మొదపుతీగెకు (హార ముఖభాగము) చెంత ముత 
పుబలుకు పెట్టి, పుంజాలద౦డను, నేవళము. (మణులహారము) వేనుకొని, బన్న 
సరములు దాల్చి, చేతులలో మురువులు కంక ణములుదాల్సి, ముత్యాల చేకట్లు 
కట్టుకొని, సండిదండలు, నెలవంక తాయెతులు, ఉంగరాలు, మణులు యొడ్డా 
ణము, బిల్లల మొలనూలు బంగారు సరపణి (గొలుసు),మణనూపురములు 
బోగము స్రీలు ధరించెడివారు !. 


చోగముసానుల వద్దనుండు దాసి వేష మిట్రిది ఫా 


నల్లపూసల పేరు, బండి గురిగుంజ, తావడములు (హారములు), పవ 
డందు చేకట్టు, పిత్తడి కడెములు, వికిలిపూదండలు, నల్పముదుక గాజులు, 


లక్క తాయెతులు, తెల్లని తగరంపు ముక్కర్క సీసప్పు ముద్దటుంగరము, కాకి 
బేగడ బొట్టు, కంచుమట్టియలు, శంఖు ఉంగరము, ఇవి దాని యాభరణములు. 


ఆ నాటి స్రీలు సాధారణముగా ఈ (50ది భూషణముల ధరిస్తూ 
పురిడిరి క 


“తలుకు విల్లాండ్లు బబ్బిలి కాయలను మ 
ట్టియలు విరమద్దెలు సందియలును 
మొలనూళ్ళు, నొడ్డాణములు, నేవళంబు 
బుంజాలదండయు బన్నసరము మొగపు 
దీగయు నాణి ము తెపు బేడ్లు సండిదండలు 
సూడిగములు గౌడ సర ములును 
కడియాలు పెక్కు జోకల యంగరములు 
ముంగరయు గోలాటంపు గమ్మజోడు 


1 పరమయోగి విలాసము, ద్విపద పు. ౨౭౩-౪. 
2 wis = పు, ౩.౨౩. 


220 ఆం[ధుల సౌంఘీక చరిత 


చెవుల పూవులు బవిరలు చేరుచుక్కు 
కొప్పువలయును సవరించి రొప్పుమీర 
భూషణములకు తానొక భూషణమయి 
పడతి యపుడొప్పె కన్నులపండువగుచు” ! 


అప్పుడు ముక్కర సర్యసాధారణముగా నాభరణము 2. నేటికిని రాయ 
లసీమ, దాని పరిసర తెలంగాణా (పాంతములో శూద స్రీలు ముక్కర ' పెట్టు 
కొంటున్నారు. వనితలు కొప్పులలో తిరుగుడు బిళ్ళలు, కంఠములలో ముత్యాల 
హారాలు, నడుములందు డావులు, కాళ్ళలో పాంజీలు ధరించిరి 8. బోగపు 
సానులు ఎర్రని పావడలను కట్టుకొనిరి &. 


తంబలజాతివారు దేవాలయ స|తభో జనములకుగాను విస్తర్తను కుట్టుకొని 
తెచ్చియిచ్చువారై యండిరి 5. తంబలలు (తంబలి) వారు రాయల సీమలో శుభ 
కొర్యాలలో పూలు, తములపాకులు తెచ్చి యిచ్చువారు' మరియు పూర్వము 
శివాలయములందు పూజారులై యుండిరి. నేటికిని అట్టి యర్చకులు కొందరు 
మిగిలియున్నారు. మరికొన్ని తావులలో వారు దేవాలయములందును, శుఖ 
కొర్మ్యములందును డోలు వాయింతురు. వీటిని బట్టి వారికొక నియమిత వృత్రి 
కలదని చెప్పజాలము. తాంబూలి శబ్బభవమే తం౦బలి (తంబల) ఆయియుండునో 
యేమో? 


అన్ని వర్ణముల పురుషులు నడుములలో ఎ|రని పల్లీని ౬, ౭ మూరల 
దానిని చుట్పకొంటూ వుందిరి6, దానిని కాసె, కాసె కట్టు, కా సెదట్టి, దట్టి 
అనిరి. అయితే ఎరుపే [పధానము కాదు. కొందరు నల్ల కాసెలు కట్టిరి, 7 

1 కళాపూర్గోదయము కజకుక 

2 ఆము క్రమాల్యద, ౮౪-౧౬౧. 

ot 
8 మనుచరి[త =e 
4 eo అ ళలిఠతి మ ఉలి 


(5) 52121401౯6, 11. 
6. జము క్ర మాల్యద, ౪=౧౮ా౭, ౧-౧౫౭. 


7. ఆము క్రమాల్యద, 8౭-౧౬. 


విజయనగర స్నామాజ్య కాలము లివి | 


ధనికులు, అధికారులు, కవులు, పండితులు, రెడ్లు మున్నగువారు 
పల్లకీలలో వెళ్ళుతూ వుండిరి, పల్లకీలను బోయీలు (బె_స్తలు) మోసెడివారు. 
పల్నాటి యుద్ధములో పల్లకీ బోయీల ముచ్చట కలదు. అనగా |క్రీ.ళ. ౧౧౫౦ 
నుండి ఈనాటి మన కాలమువరకుగూడా బోయీలు తమ వృ ర్రిని వదులుకొన్న 
వారు కారు. కవి పండితసభలను రాజు కావించికప్పుడు వారు బయట వదలి 
వెళ్ళు వావరక్షలను కాపాడటకై సేవకులు నియుకులై యుండిరి.! 


సా తని, సా త్రిన అని వైష్టవార్చకులలో రెడు కాఖ లుండెను, 
సాత్తినవారు నెత్తి గు-డుగా గొరగక జందెము వేసుకొన్న వారు. సాత్తనివారు 
నెత్రి బోడిగా గొరిగించి జందెములేక యుండువారు. (ఆముక్తమాల్యద; 
౨-౯౭) సాత్తనివారి వేష మెట్టిదనగా :__ 


““పొంకపు పటైనామములు పొల్పగు మేల్‌ తిరుచూర్జ రేఖలున్‌ 
చంకల తాళికాదళ విసారిత పేటికలన్‌ భుజంబులన్‌ 
సంకును చకముల్‌ గలుగు సాత్తనివారు., .”'£ీ 


వెలివాడలో మాదిగవారు చెప్పులు కుట్టి వాటిని తంగడాకుతో మె తచేసి 
యిచ్చెడివారు, 


విజయనగరములో టోగప్పసానుల సంఖ్య అపారముగా నుండెను, 
వారిపై గణాచారి గుత్తాపన్ను వసూలబెసిరి, నగరముననుండు ౧౨౦౦౦ 
రక్షకభటుల జీతాలు బోగమువారి పన్నులతో సరిపోయెడిది. రాచవారు, 
ధనికులు, ఉంపుడుగ తెల నుంచుకొనుటయు, ఆ ముచ్చటను |పకటించుకొను 
టయు మగతనపు అక్షణముగా భావించిరి. మంచిమంచి మంతులు, పా? 
గాం|డు, రాజులు కప్పలచేత అట్టి రసికతను వర్ణింప జేసుకొనిరి. సింగమ 
నాయడు తన బోగముదాని ముచ్చటను భోగినిదండకముగా రచింపచేసెను. 
సంపన్నులు తమ యుంపుడు క ల్తెలను బోగం వారిని ఉత్సవాలలో వెంట ఆసు 
కొనిపోయి జనులు చూచునట్లుగా వారితో సరసాలాడెడివారు శీ, 


కేం ఆము కిమాల్యద, ౪౨2. 

జి కృష్ణరాయ చరిత్ర. ౨-౫౪ 
య 

శీ ఆము కృమాల్యద, ౪- ౩౫, 


229 ఆం|(ధుల సాంఘిక చరిత 


దాసరులు “సందె గోపాలభిత” చే జీవించిరి. సంది వేళలో గోపాల 
కీర్తనలతో యిండ్లనగ్ల బిచ్చ మెత్తుకొనుటను సందె గోపాఎమనిరి, 1, 


(బాహ్మశణులు విద్వత్తుచెతను, వైదిక వృత్రిచేతను జీవించెడివారు. 
దెవాలయములందు ఆర్బకులుగాను, పొరోహితులుగాను, జ్యోతిర్వే త్రలుగాను 
జీవించిరి. వారికి దేవాలయ సతములం దుచితముగా భోజనము లథంచెడీది. 
ఈయాచారము నేటికిని తిరువాన్కూరు, కొచ్చిన్‌ సంస్థానాలలో కానవసున్నది. 
వారి కానాడు [పతి శనివారము శిరస్స్నానానికై నూనె పిండి కూడ యిచ్చెడివారు. 
[వతాలకు కొదువ లేకుండెను. నానావిధ దానాలను, ఆందు ముఖ్యముగా షోడ శ 
దానాలను, వారికిచ్చు విషయములో హాదూ ది యొక గొప్ప గంథమునే వాసి 
యుంచెను. అది పమాణ [గంథ మయ్యెననియు, రెడ్డిరాజులు 'హేమాది. 
(పో క్రదానాల నన్నింటిని చేసిరనియు తెలిపినాము. (గ్రహణ సం[కమణ కాలా 
లలోను, రాజులకు (గ హశాంతి యవసర మైనప్పుడు (బాహ్మణులకు దానాలు 
చేసిరి. “ఆబద్ధంబులాడి బిల్లర పభువులన [భమియించుచుండి, దీక్షితులం 
జూచి యయక్ష వొడమి (ద బ్యాభిక్షార్థినై .మధురకుం బోయి యప్పురంబున” 


“బహివడ్డ ద్విజున కల్పపు పాచితం బిడి 
పసిడి రైతా వానిబంతి గుడిచి 
కలిబ వణిక్పురోధులతోడ బుణ్యాహముల 
బియ్యములకునై మొత్తులాడి 
శశి రవి[గహ జపస్నానాదికము లెల్ల 
౧ 
దొరల వాకిండ్ల కే దొద్దయిచ్చి 
౧ ణి 
పచ్చిరితో ల్బ_రచుచ్చాల మెట్టంది 
కొనదాన యూరెల్బ గు_త్తవల్టి 
దర్భపోటుల దిని లేనితరుల మై తివంటి 
పీత్స శేషము భుజించి యదియు నెడల 
అక్కవాడల నర కూళ్ళు మెక్కి మీద 
వీర శేఖర మొకత లాలర్హ్విజ్యము కొని 2 
అణాల ప 


అనాటి పురోహితులు జీవించిరి. 


1 ఆము. ౪-35౫ 
2 ఆము క్ర మాల్యద 9, ౪ ణి, 
Pret +) 


విజయనగర్‌ సా మాజ్య కాలము 998 


అయితే యిట్లందరును చేసిరని కాదు. కొందరై నను చేసిరని యర్థము. 
విద్వాంసులు వివిధ విద్యలను నేర్చిరి, అందు ముఖ్యమైనవి షడంగమలు, నాల్లు 
వేదాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము ఆను ౧౪ శాస్ర్తాలు. 
తర, శాస్త్రము ఖండకారికా పుస్తశమలు అఆసెగా స్మార్తకర్మ (_పయోగాలు 
కల శాస్తా9లు, యజ్ఞ యాగాదుల మం[తాలు, విశేషముగా (బాహ్మణ విద్యలై 
యుండెను ఎ, దాహ్మణుబు సేన్యము చేయగుండిరి. చేసినను చాలా అరుదు. 
త్య జ అప్పులపాలై నపుడు తమ మాన్యాలను కుదువ యుంచుతూ వుండిరి 2 


రాజుల కొలుపులో కవి పండిత సభలు జరిగేవి. లేదా విద్యా పీఠముల 
వద్ద జరిగెడివి. మధుక దక్షీణడెళమందు (పనిద్దమగు విద్యాపీఠమై యుండెను, 
కంచి కాళి, కాళ్ళీరయు, తక్షశిల నలందా నవద్విపము, అమరావతి వంటి 
స్థలాలలో విద్యాపీఠములు మరీ పూర్వకాలమందుండెను. విద్యార్థులు చదువు 
పూర్తిచేసుకొని స్నాతకులై గుటవువద్ద సెలవుపొంది ఒక విద్యాపీఠమునకు 
వెళ్ళి అచట పండిత పరీక్షలో నెగ్గి జయపతమును (డిగ్రి పొంది పోయెడి 
వారు, రాజసభలలో విద్యాధికారు లుండెడివారు, అచ్చట కవులుకాని, పండి 
తులుకాని, వాదములు చేసెడివారు. అందు గెలిచినవారికి బవుమతు 
లిచ్చెడవారు. ఓడిపోయిన పక్షమువారు తబ్బిబట్బై బయటకు వచ్చి తమ 
పాదరక్షలు మరచిపోయి తిరిగివచ్చి తీసుకొని తమ యెదుటనే ఉండు ఆంద 
లాలు కానక ముందుకు పోయి వెదుకులాడి భవనొంది రాజు పె నింద పెట్టి 
నానావస్థలు పడెకివాలు శీ. కవి పండితుల సభీ రాజుయొక్క భవన “చతు 
శృాలిక ”లో జరిగెడిది. (*) వాదములందు గెలిచిన వారిని, మహాకవులను 
రాజులు పూజించిరి. వారికి టంకాలీచ్చిరి. 


“వాద మొనరించి గెలివి, తత్వంబు దెలుప 
వాని కని వీర పువ్వులబోని టంక 
సాల వాటులు నించి యాస్టాని గట్ట 


కాలసరృముగతి (వెలు జాలె జూచి" ఈ 


1 అయి క్‌ మాల్యద దత 
Cee.) 

2 మనుచరి|త 8-౧౨౫ 

8 ఆము క మాల్శద్క, ౪-౭. 
Sos wee Ws 

ర్‌ ఆము! క్త మాల్యద. ౨-౫౮ 


224 ఆంధ్రుల సాంఘిక చరిత 


నాణెములలో [పత్యేక కృషి చేసినవారు విజయనగర కాలములో టంకా 
లండినట్లు [వాయలేదు. అవి బంగారువి. కొ త్తటంకాలై తే వీరపూలవలె మెర 
సెడివి. శ్రీనాథుని కిదే విజయనగ రాస్తానమ౦దే టంకా స్నానము చేయించిరి. 
అట్టిచో నాణ్య నిపుణులు దానిని పేర్కొ నకుండుట యేలనో తెలియరాదు. 


కవులు కూర్చొను స్థలమును శంఖవీఠి యనిరి. ఇది తమిళ దేశాచారము. 


“* ఈ కవితాభిమానము వహించితి నేటికి శంఖవీరిపె 
నీ కవు లున్న యట్లు వసియింపక దేవునితోడ నేల చా 
ర్వాక మొనర్చితిన్‌ . 1 


ఇచ్చట శంఖపీఠి యన నేమో? శ, ర. లోను, శబ్బకల్పదుమములోను 
లేదు. మధురాది తమిళ (పాంతాలలో పూర్వము సంగము (సంఘము) అను 
కవుల పీఠము లుండెను. దానినే మన కవి శంఖము చేసెను.”__రాళ్ళపల్లి. 


అ[గకవియగు అల్లసాని పెద్దనకు రాయలు స్వయముగా గండపెండే 
రము తొడిగించుటయు, అతని పల్లకిని స్వయముగా మోయుటయు, ఆతడెదు 
రెనచో మత్తకరీందము నాపి ఏనుగుపె నెక్కంచుకొనుటయు, ఐతిహ్య (పసి 
జాల ON 9 | 
ద్ధములు. రామరాజ భూషణుడు, భ రవిక వితాత, రాజుల గద్దెలు రాజుల 
పక్కన కూర్చునిరనియు వాసినారు, (బాహ్మణులలో పలువురు మంతులు, 
దండనాయకులు, మండలాధికారులై యుండిరి. ఈ విధముగా (బాహ్మణులకు 
సరకత అపూర్వ మర్యాదలు జరి గెను. 


శ్రీకృష్ణ దెవరాయలు స్వయముగా ఎట్టి వస్త్రభూషణములు ధరించెనో 
సమకాలికు లిట్లు వర్ణించిరి, 


* రాజు రెండుజేనల పొడవుగల జరీటోపీని ధ్రరించిడివాడు. యుద్దానికి 
వెళ్ళినపుడు నూలు రుమాలను కట్టి దానిపై నానారత్న భూషణములను పెట్టు 
కొంటూ వుండెను. జరీపనిగల తెల్లని వస్త్రములు కి ధను. చాలా విలువగల 
రత్నాలహారములను కంఠసీమ ధరించెను. తలపై జరీపట్టుటోపీ ధరించెను. 
రాజభ వనముల కావలిగాయు పరిచారికలు కూడ టోపీలు ధరించిరి” 


న్యూనిజ్‌ ఇట్లు (వా సెను. 
1లీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము. 8.౧౭౪ 


విజయనగర సాామాజ్య కాలము 225 


“రాజు ఒక తడవ ధరించిన యుడుపుల మరల ధరింపడు. బాలాసన్నని 
జరీ పట్టబట్టలనే ఆతడు ధరించును. వారి టోపీని కులాయి యందురు” 
రాయల విగహమున్ను, ఆతని యిరువురు భార్యల వి(గహాలుక్ను తిరుపతిలో 
కలవు. రాయల వి గహమునకు తలపె తుర్కీ కుచ్చుటోపీ కలదు. అశియరామ 
రాజును, ఆతని సెనికులును యుద్ధమున కు వెళ్ళినప్పుడు [వాసిన చి త్తరువులలో 
మూరెడు పొడవుగల టోపీలు వాల ధరించినట్లు చి తించినారు. ఈ టోవీల 
యాచారము కర్ణాటకులలో నుండెనేమో? తురకలలో ఆనాడీవేషము లేకుండెను. 
వారి చిత్తరువులలో నిట్టివి కానరావు, తెన గుసీమలోను నిట్టివి లేకుండెను. (శ్రీనా 
థుడు (పౌఢ దేవరాయల అస్మానానికి పోయినప్పుడు కర్ణాట దర్చారు వేషము 
వేసికోవలసి వచ్చెను. కుళ్ళాయి పెట్టుకొని మోకాళ్ళ [కిందికి జారిన మహా 
కూర్చానమును ఆంగీని తొడిగి పెద్ద సెల్లా వేసుకొనెను. ఆయితే కులాహ్‌ అను 
శబ్దము ఫార్సీలో టోపీ యను నర్భమగుటచే ముసల్మానుల నుండియే విజయ 
భఖ రాజులు వారి అనుయాయు b యాచార మును స్వీక రించిరేమో ? అనాటి 
కిర్ణాటాచారమును నేటికిని కొందరు వైష్టవ భికుక-భకులు అక్షయ పా[తతో 
బయలుదేరి పొడవు టోపీలను ధరించి రామదాను కీర్తనలను పాడుచుందురు. 


జనుల వేష భూషణములను గురించి అబ్బు రజా కిట్లు (వా సెను, * ఈ 
దేశమందు ధనికులును___చెవులపోగులను కంఠహారాలను, దండక డెములను, 
ఉంగరాలను ధరింతురు ' (1) నికోలోడీ కాంటి ఆను యూరోపు వాసి 
యిట్లు |వాసెను. “జనులు గడ్డాలు పెంచరు, కాని జుట్లు పెంచ కొప్పు ముడి 
వేయుదురు. యూరోపువాసులవలె జనులు ఎత్తై ఆయురారోగ్యాలు కలిగి 
యున్నారు. ప్రి జముహొణాల అ జరీ అంచు ఛొదర్హను పరుచుకొని పండు 
కొందురు. కొందరు స్త్రీలు సన్నని అట్టలుక ల మోజాలను జరీపనులతో అలంక 
రించి తొడిగి కొందురు.” 


బార్బోసా అను మరొక పాళ్చాత్యు డిట్లు (వాసెను. “పురుషులు చిన్ని 
రుమాళ్ళను కట్టుదురు. లేదా పట్టుటోపీలను పెట్టుకొందురు. కిరు చెప్పులను 
తొడుగుకొందురు. శరీరమునకు రుద్దుకొనుటక్రై వాడుకొను నలుగు పిండిలో 
గంధముపొడిి, కుంకుమపువ్వు, కర్పూరము కన్తూరి, కలబంద కలిపి నూరి 
పన్నీటితో మర్దనచేని రుద్దుకొందురు. (2) విజయనగర వానులు తురకలవలె 


1, 2. Salators, Il. 
(29) 


వీ20 ఆం|ధుల సాంఘీక చరిత 


చల్లడములను తొడుగు కొందురు. చల్చడమును 'చండాతకము' అనిరి (1)జనుల 
టోపీలు రెండు విధములై నవి. ఒకటి రెండు జానల పొడవై నదని తెలిపినాము. 
రెండవద బొందెలు కల బట్ట కుల్లాయి. అది నెత్తికి నిండుగాను, చెవులు 
చెంపలు మూయునదిగానుండీ గొంతు కింద టొందెలళో కట్టబడుతూ వుండెను 
ఆది *గౌదకట్టుకసి చేరుల పెకి”? అనగా చెంపలు మూతబడునట్టుగా కొరడా 
కొనవలె నుండు బొందెలతో గడ్డమ్ముక్రింద ముడివేయు కుళ్ళాయి యనియర్థము. 


దొరలు తమ అధికారుల పనుల మెచ్చుకొన్న ప్పుడు వారికి కొత్త వస్త్ర 
ములు అంగీలు, టోపీ పసదనముగా నిచ్చెడివారు; “మేలు కుళ్ళాయి గబ్బాయి 
కొమ్మంచు నొసగి అని వర్టించిరి. గబ్బాయి అనవలెనో, కబ్బాయి అనవలెనో 
తెలియదు. కొందరు కవులు అంగీ అను నర్థములో 'కబాయీి అని వొడినందున 
ఇచ్చట కబ్బాయి యనవలిను. కుల్హాయివలె ఇదియు విదేశివదమో యేమో? 
ఈ పదమును ఆ కాలపు పింగళి సూరన వాడెను. అంతకు పూర్వకవితలలో 
ఇది కాన ౮దు 


జనుల వాహనములు చక పుబండ్లు, ఎద్దులు గురాలు, అందలములు, 
పల్లకీలు ఆయియుండెను, “పల్లకీలు, నందలములు, వారువంబులును, దంతులు 
నాదిగ గల్లు వాహనంబులు”* అనుటలో పల్లకీలు, ఆందలములు అని రెండును 
కలిపి చెప్పినందున వాటిలో భేద మున్నదనుట స్పష్టము. అందలము లనగా 
ఇప్పుడు పీఠాధిపతులను ఉత్సవ వి|గహాలను తీసికొనిపోవునట్టి దాపులేని వాహ 
నములు. పల్లకి యనగా (పక్క లందును పెభాగమందును మూతల కప్పును గల 
“మ్యానా* ధనికులు ఉయ్యెలమంచాలు, దోమ తెరలమంచాలు, చక్కని శిల్పము 


లతో కూడినవాటిని వాడిరి. 


“బంగారు గొలుసులు పవడంపు దరిమెన 
కోళ్ళును వింతబాగుల బొగడలు 
రత్నంపు చిలుకలు రాయంచ (పతిమలు 
పసిడి పువ్వుల వాత పనుల సొబగు 
1. ఆము కమాల్యద, ౪-౩౫. 


2. 99 ౨ ళ శి అ 6466 ౭2.౧౭౭ 


$, పం యో, విలాసము, పు పు ౪౮౨. 
4 కళాపూర్లోదయము ఎంత 


విజయనగర సా మాజ్య కాలము 227 


వివిధంబులగు చిత విరచనలును దసి 
లీ మాలుపట్టె యల్లిక బెడంగు 
పలు తెరంగుల పట్టుతలగడ బిల్లలు 
మవ్యంపు కుంకుమపువ్వు పరపు 
గలిగి మెరుగులు దిక్కుల గడలుకొగగ 
మించు టద్దపు టుయ్యెల మంచ మునను 
బొలుపు మీరుచు దన యంతివురము 
సతులయూడిగ౭బులు గ్‌ కొందు నున్న శౌరి' [1 


కొందరు పావలు (సమ్మా+ిగలు) తొడిగిరి. జనులకు నిలువుటద్దాలు, చేతి 
అద్దాలుండెను, ఆచారపరులవి మట్టివని కంచుటద్దాలను వాడిరి. కంచును బాగా 
తోమి దాసలో చూదుకొనిరి.? జనులు ధనము జూలెలను (వల్లువము, వల్లము) 
నడుమున కట్టుకొనిరి శీ 


నీద జనుల యిండ్లు పూరికప్పులవై యుండెను, మట్టిమిద్దెల యిండ్లును 
వారికండినట్లు ఆముక్రమాల్యదలో సూచితము. ““మట్టిమిద్దెల వారికి నిదురు 
చెడియి” (ఆము. ౪-౧౨౩). భోగమువారి యింది జనుల యిండ్ల పెకీ వెభ 
వోపేతముగా నుండెనని విదేశి యా|తికులు |వాసిరి, వారు చాలా ధనవంతు 
లనియు, వారి యిండ్లు ఉ తమముగా నుండెననియు పీస్‌ (వ్రాసెను, 


జనుల ఆచార వ్యవహారములు 


మల్చయుద్ధాలు, కుస్తీలు జనులకు పీతి. ''మల్లయంద్దారికం దృష్ట్వా* ఆని 
యొకడు వాసెను,. జనులు సాధారణముగా కంచు పాత్రలలో (కంచాలలో) 
తినిరి.5 


మరులు తీగను తొక్కి తే బాట తప్పుదురని [పజలు విశ్వసించిరి. 


yarepan 


ఎ లు we was D-౧౫ 

2 ఆము క్ర మాల్యద. ౪-౧౮౦. 

8 ప. యా. విలాసము. పు ౫౦౩, ధర జాలెతో దూడ ధన మిచ్చినర్లై 
ఓ ఆకాశ భి రవకల్పం 

5 ఆము క్ర మాల్యద. ౪=౧౨౮. 


£8 ఆం|ధుల సాంఘీక చర్మీత 


“మరులు దీగ మెట్టి యిరులన్న నోయనియడు తమ్మిసగాడు పడి పొలము 
లెల్టదిరిగి తూర్పు తెల్లనౌ తరినొక్క శూన్య గహనవాటిజొచ్చి చనుచు" 1! 
(ల ౧ 


మరులు తీగెను మధ్దమూతంగి యని యందురు. అదొక అలుము. సన్న 
అకు లుండును, దానిపండు గురిగింజంత ఎ;రగానండును, దానిలో రెండు 
విత్తులు దోసవిత్తులవలె నుండును. ఆ రెండు విత్తులు ఒకే దిక్కు ననుండును, 
ఒకదాని కొకటి ఎదురుగా వేరు వేరు దిక్కుల మొగమై యుండును. _పియులను 
కూర్చుటకును తాంగతికులు దీనిని వాడుదురు. దీన్ని గురించి ఆయుర్వేద వైద్యు 
లెరుగుదురు. భర్తలు భార్యలపై పేమ లేనివారై న వారిని వశీకరించుకొనుట 
యం[త మంత తంతాలను సేవించి వశీకరణ మూలికలనుగొని భర్తలకు 
భోజనమందు కలివి తినిపించి పలుమారు వారిని తెలియక చంపుకొనెడి స్ర్రిలు 
కొంద రానాటినుండి యీనాటివర కుండిరి, సంసృకాం ధ భారతములందు 
పాండవుల యరణ్యవాస కొలమందు దౌపది భర్తల వళీకృతి కాళశ్చుర్య పడి సత్య 
భామ యామెను వశీకరణపు మణి మంత"షధము లేవియో తెలుపుమని యడిగి 
నట్లు వర్షించినారు. దిన్ని బట్టి శ్రీల వశీకరణ (వపయోగము లతి (ప్రాచీన భార 
తీయ యోగమలే యనవలెను. వాత్స్యాయనుని మొదలుకొని తర్వాతి కామళాస్త్ర 
(ప్రవర్తకులందరును వశీకరణ యోగాలను గురించి వాయనే (వాసిరి. కాని 
ఇవెందును పనిచేసినట్లు నిదర్శనములే లేవు. ఉన్న నిదర్శనాలవలన భర్తలు 
వశీకృతులగుటకు మారుగా భస్మీకృతులై రనియే తెలియవచ్చినది. రుక్మాంగ 
దలో నిట్లున్నది :- 


'పతి నను నొల్ప డవ్విభుని బాయుట కోర్వగ జాల నక్కటా 
గతియిక నాకు నెద్ది గజా మిని యానతి యిమ్మటంచుదు 
ర్మతమున సిదురాలికి [కమంబున జెప్పిన చెట్లుమందు స 

© రి 
పతికిది పాలతో నిడుము భ_ర్థవశుండగు నంచు బల్కగని 


“వలపు మందిట్లిడ మొక, లమున పతి సమసె........,(8-౨౩౯) 


ఆధ ఇ ఇతో “ అ or yA 
బ్రాహ్మణులు శిరస్సాానము చేయునప్పుడు ఇప్పపిండిని రుద్దుకొనిరి. 


2 ఆము క్రమాల్యద, అజాత 
ఇటీ 


విజయనగర సొ|మాజ్యు కాలము 529 


రెడ్డిరాజ్యకాఅములోని దొంగ లలక్షణా లను చూచినాముం విజయనగర 
రాజ్యకాల క వులును ఇంచుమిం చవే లక్షణాలను వర్షించనారు. తాళ్ళపాక చిన్నన్న 
యిట్లు [వాసెనుం 


“చేయమ్ము, ఎకవారు చెప్పులు, రాగి చాయలు దేరు నచ్చపు నీలిదట్టి 
మొలవంకియను ఓ... .... ఇనుము, కన్న పుగ త్తి, యెడ దట్టిలోన 
పొనగిన దివ్యార్పు [బువ్యులకోవి తలముళ్ళు, చెక్కు, నిద్దపుదద్దగోరు 
బలపంబు, బదగికల్క్‌ బంతి క_ల్తరయు, 1 


మున్నగు సాధనములతో దొంగలు దొంగతనాలు చేసిరి. పూర్వ పకర 
ణమున (తాడు, వంకకొండియు దొంగల పరికరాలలో చేరినట్లును వంక ఇనుప 
కొండి [తాట గట్టి గవాక్షములద్వారా వస్తువుల చేదుకొనుటకై యుండునని 
(వాసీయుంటిని, అద యుపయోగమును చిన్నన్న యిట్లు తెలిపినాడు. ఒకదొంగ 
యింటిలో నికి దిగి, 


“గురు హేమబింబంబు గొలుసునం గట్టి కదలింప నా సన్న గని మీది 
వారలది యందుకొని యంత నతని 'గమ్మరను అల గొలుసున తొంటి 
యట్ట నెన్నడుమ బలసి చెరుకొనంగ....' 2 


దొంగల దోపిడివిధానమును (చెక్నిక్‌ ) రాయలు విపులముగ సమగ 
ముగా వాసినారు ఒక బాహ్మణుడు తసభార్య యాూరికి శిమ్యనితోను కొత్త 
కోకలు రూకలసంచితోను పయనమయ్యెను, (పయాణముచేయువా రొక్కరొక్క 
రుగా పోకుండిరి. కాన యితరబాటసార్హ్ణ పయనము చూచుకొని అతడు పయన 
మయ్యెను. ఒక దొంగ యతని వెంట తానును ఒక బాటసారివలె సిద్ధమయ్యెను, 
రాతి పథికులు [ప్రయాణము చేయక మజిలీలలోని సత్రాలలో దిగెడివారు, తెల్ల 
వారకముందు వారు లేచి ఉత్తరదిక్కు (పయాణమైరి, వారిలో పథిషడుగా చేరిన 
దొంగ ముందే తనవారి కీసంగతి తెలిపి వారిని దారికాచుటకు పంపెను. సాతు 
(వాటసారులగుంపు) _పయాణము చేయుచుండగా దొంగ తనకు బాగా తెలిసి 
నట్టుగా బాట చూపువాడై వారి నొక యడవిలోసకి తప్పించి ఒక సెలయేరు 
రాగానే ఈల వేసేను. ఈల దొంగల సంకేతము. వాగులు, వంకలు, కనుమలు, 
అలల న పలు 


ఆ 


జిప మయో. విలాసము, పు ౫-౨౬. 


280 ఆం|ధుల సాంఘీక చరిత 


దొంగలకు దోచుకొను అనుకూలస్తావాలు. ఈల వేయగానే దాపునుండి ఓక 
బాణము సంచకరముగొ సొతుపై బడెను. వెను వెంటనే రివ్వురివ్వున రాళ్ళ 
వాన గురిపెను, బాటసారులాగి వాల్లకల్లోలము చెందిరి. తర్వాత దొంగలు 
కనబడి సాతును చుట్టివేసి కొట్టి గాయపరచి దోచుకొనిరి. బాటసారులలో 
కొందరు ఫారిని. కొందరు మూటల చెట్లచాటున పారవేసిరి. కొందరు కొట్టవద్దు, 
మా స్త్రీల నంటవద్దు, కావలసిన దిడిగో అని యిచ్చిరి. కొంద రమ్ముల నెక్కు 
పెట్టిరి. అట్టివారి వేలికి పోలేదు ఏమి లేనివారిని పరీక్షించి వదిలిరి. పొదలలో 
దాగినవారిని ఈ టెలతో పొడిచి, వారి బట్టలను గూడా లాగికొని, పాత గుడ్డలను 
గోచులకై (పసాదించిరి. బాటసారుల చెప్పుల అట్టలను- గన్నెరాకువంటి బాణా 
లతో చీల్చి ఆందేమనా దాచిరేమో చూచిరి. [పయాణీకులును దొంగలకు 
దొంగలు, చెప్పులలో, జుట్లలో, టోపీలలో, వనువులదాచి తీనుకొని పోవు 
చుంశిీరి. బాహ్మ ఆడు తనళిష్యుని వానిగతికి వదలి తన వరాలసంచి 
యొక్కయు, తన పొట్టయొక్క యు బరువుతో ఉరుకలేక ఉరికెను. బాటసారుల 
వెంట వచ్చిన దొంగబాటసారి వానిని వెన్నంటి కొంకుల పె సురియతో నరికెను. 
మొల తాట గట్టిన నరాలసంచిని ధోవతిలాగి (తెంచుకొ నను. గౌదకట్టుటోపీని 
ఏప్పి పరీకీంచెను. వాడు పొరుగూరు మాలదొంగకాన [బాహ్మణుడు గుర్తుపట్టి, 
తెలివి తక్కువతో, ఒరే యెటు తప్పించుకొందువో చూతాములే, అనిఅన్నాడు. 
గుర్తుపట్టినవాన్ని చంపవలసి వాడు చావగొట్టెను. అంతలో మరొకబిడారు 
(బాటసారులగుంపు) ఆ దారినిరాగా వాగడ్డావెడ్డి పోట్లుపొడిచి తనవారిని కలుసు 
కొని పారిపోయెను. ఆ బిడారులో _బాహ్మణుని బావ యుండెను. కాన తనను 
కావడిలో పట్టించుకొని పోయెను. కాని బాటలోనే (బాహ్మణుడు గుటుక్కు 
మనెను, ! 

దొంగల పట్టుటలో భటులు, వారి ఆధికారులు, (గామాధికారులు “ఘల్లు 
ఘల్లున గిలుకల తోడి గుదియలు" చేత బట్టిన తలారులు బాగా గ్రద్ద వహించెడి 
వారు. దొంగతనపు సొమ్ము లను ఆమ్ము టను గమనించి దొంగల పట్టుచుండిరి, 
దొంగసొమ్ములు బోగమువారి యిండ్డకు, కమసాలులకు చేరునని మొదలు వారి 
నాకకంట ఛూచెడివారు. దొంగల దొరికిన వారిని బాధలు పెట్టి పట్టుకాగులతో 
హింసించి దాచినతావులను తలునుక్గొని దోచిన సొమ్ములు తెప్పించెడివారు. 

1 ఆము. అ ౭. పద్యములు ౭ నుండి ౨౧ వరకు, 


విజయనగటీ స్మామాజ్య కొలము | 


తర్వాత _గామపెద్దల రచ్చకట్ట పంచాయతిలో వారిని విచారించి పెద్దలిచ్చిన 
శిక్షను ఆపరాధులపై విధిన్తూవుండిరి. అపరాధులను నిర్భంధములోనుంచి వారిచే 
భవనాలకు, కోటల నిర్మాణాలకు సున్నము రాళ్ళు మోయించెడువారు, i 


దొంగలు తప్పు నొప్పుకొననిచో, 


'ఇడుమ కట్టున వేడి యెండలో మిగుల జడియ వీపులమీద చాపరాలెత్తి 
పొగడదండలువై చి పోనీక యెదుట బెగడ దిట్టుచు నడ్డపెట్టి.... (2) 


బాధించెడువారు. ఇడుమకట్టున అన ఇంటిముందట యని యర్థమను 
కొందును. పొగడదండ ఆనుపదమునకు శ. ర, లో అర్ధములేడు. తప్పు చేసిన 
వారికి పొగడపూలదండ వేసి పూజించి (ప్రార్థించి తప్పు నొప్పించు కొనరుకదా! 
(శ్రినాథునికిని చేతికి కళ్టైకోడెము వేసి వెదురు గూటముతో బిగించి గుండు 
నెతత్తించి వీపున బండలు వెట్టిరి, ఆ శిక్షలలో పొగడదండను కూడా వేసి శిక్షిం 
చిరి, 


“కవిరాజుకంఠంబు కౌగిలించేను కదా పురవీధి నెదురెండపొగడదండి 


అని యతడు దుఃఖించెనుగదా ! ఇచ్చటకూడ వేడియెండలో నిలబెట్టి 
బండలె త్రి పొగడదండలు వేసిరన్నారు ఒక్క పొగడదండకాదు, పొగడదం 
డలు అని అన్నారు, అవేటివి? అవి పొగడపూలవలె నుండు యినుపసంకెళ్ళో 
లేక (తాక్ళో అయియుండును. నేటికిని అప్పులు చెల్లించనివారిని మెడికు (తాడో 
'సెల్లానో చుట్టి లాగుకొనిపోవుదురు. మెడపట్టి లాగింతుమనుటయు కిలడు. 
రుదక వికృత నిరంకుళో పాఖ్యానమందు నిరంకుళుడు గుడిలో శివవి గహముతో 
తనదియు వ్మిగహముదియగు జూదమాడి, తానే గెలిచి శివుని తన పందెము 
చెల్లించుమనెను, వ్మిగవాము పలుకలేదు. పలుకకుండిన విడతునా? అని అత 
డిట్లనెను. 


*లగునె పన్నిద మీక యీగతి దప్పు మౌనము దాల్పగా 
తగవు నీకును నాకు బెద్దల దండ( బెధిద జ(డనై 


1. ఆము, ౪౧౮౩5, 
వీ పఠకుయోగి విలాసము ద్విపద పు. ౩౨౨౪. 


282 ఆం[ధుల సాంఘీక చరిత 


గగనకేశ ' యటంచు జందురు కావి సేలు గళంబునన్‌ 
పొగడదండ యొనర్చెనా విట భూనుర్గాగణి దిట్టయై” 
నిరంకుశో పాఖ్యానము, అ. 3. ప, ౨౬. 


దీనినిబట్టి పొగడదండ "క్షణము కొద్దిగా వెల్లడి యవుతున్నది. మెడలో 
తాడో, గొలసో, దుష్పటో, సెల్హయో పెనవేసి ఇయ్యవలసిన పెక మిచ్చు 
వరకు కదలరామనుమా ! అని ఆజ్ఞ పెట్టుటకు పొగడ దండ వేయుట అని 
చెప్పవచ్చును. సెల్లను నిరంకుశుడు శివమూ ర్తి కంఠమున వై చినప్పుడు 
* సైగ డ్రదండయు బోలె నప్పు గడదండ, కాలకంధరుమెడ కలంకార మయ్యె” 
అనుటచేత పొగడపూల దండవలె 'సెల్పను మెడకువే సెనని యర్ణమగును. 


క్ష. పార్వతీధవుని కంఠమునన్‌ దగిలించినట్టి కాం 
చన మణి రుచ్యమాన నిజ కాటి చెరంగులు గూడ బట్టి నీ 
పని యన నెంత వేగిరమ పన్నిద మిమ్మని దీయ నయ్యెడన్‌” 


ఈశ్వరుడు |పత్యక్షమై ఓటమి యొప్పుకొని పందెపునప్పు నిచ్చు 
కొనెను. దీనినిబట్టి సెల్లాయంచులను కూర్చిపట్టి నీ “పని” పట్టించెద చూడుము; 
. లేకున్న అప్పును చెల్లించుము అని సెల్లాతో లాగెను. 'రీయ"” ఆనగా తివియకా 
లాగగా అని యిచ్చట అర్థము చెప్పుకోవలెను. ఈ కథాభాగము పొగడదండ 
లక్షణమును మనకు కొంత వెల్లడి చేసినది. రుదకవి [కీ శ. ౧౬౨౦[పాంతము 
వాడు. ఈ ౨౦౦ ఏండ్లలోనే మన పూర్వుల మాటలు, ఆచార వ్యవహారాలు 
కొన్ని మనకు తెలియరానివై పోయినవి. ఇంకనూ ఉపేక్షించిన మిగిలిన కొద్ది 
పాటి జాడలు కూడ పూడిపోగ లవు. 


“నేరములకు శిక్షలు చాలా ఘోరముగా నుండెను. చిన్న దొంగతనాలు 
చేసినవారికి ఒకకాలు ఒకచేయి నరకెడివారు. పెద్ద దొంగతనాలు చేసినవారిని 
గొంతు(క్రింద కొండి (కుచ్చి (వేలాడగట్టి చంపిరి, ఉత్తమ కుల స్రీలనుగాని, 
కన్యలనుగాని చెరిచినవారిని ఉరికొండిపె చంపిరి. రాజ దోహము చేసిన పాలె 
గార్లను బంధించి ళూలాలను పొట్టలలో పొడిచి హలారోపణము చేసెడువారు, 
చిన్నకులాలవారు నేరములు చేసిన సాధారణముగా వారిని తలగొట్టుచుండిరి, 
అపరాధుల కొందరిని ఏనుగులచే (తొక్కించిరి. కొన్ని అల్చపు నేరములకు 
అధికారులు జనుల వీపులపై బండ లెత్తించి దినమంతయు వంగబెబ్టెడివారు.”* 


విజయనగర సా్యమాజ్య కాలము 88 


పరిపాలన కై దేశమును ౨౦౦ మండలాలుగా విభజించి యుండిరి. 
(పతిమండల మొక పాలెగారు అధీనమం దుండెను. వారు నిర్ణయమగు పన్నును 
చెల్లి ంచుటకును నియమిత సైన్యముతో సిద్ధముగా నుండి ఆజ్జయైనప్పు డంతయు 
ఆ సైన్యముతో రాజసేవలోకి వెళ్ళుటకు బాధ్యులై యుండిరి. 


పూటకూళ్లు పెట్టి జీవించునాబారము మనకు కాకతీయుల కొలమునుండియు 
కానవస్తున్నది. పూటకూళ్ళలో “ఆహారవిహారమలు” దొరకుచుండెనని |క్రీడాథి 
రామమండు వర్చింపబడెను. విజయనగరమందు పూటకూళ్ళు సమృద్ధిగా 
నుండెను 1 పూటకూలివారు [ద్రవ్య మార్జించువారు కాన కల్తీ భోజనము పెట్టి, 
పాసిన వంటకాలు ఉడుకువాటిలో కలిపి వాసన నెమ్యిని తెచ్చి, మజ్జిగలో 
నీరెక్కువగా పోసి, ఇట్టి దుష్ట చర్యలను చేసెడివారు. ““పూటకూళ్ళది పుణ్యము 
నకు జొరదు!'” అనుటచే స్త్రీలే అందును బహుళా వితంతువులే. వారును 
దాహ్మణులే యీవృతిిపై జీవించువారు. ““అక్క వాడల నరకూళ్ళు మెక్కి"? 
అనుటలో వీధులలోనికి పోయి అక్కా అమ్మా అని స్త్రీలను మంచివారిని చేసు 
కొని సగము గడుపున కన్నము తిని-అని వేదమువారు వ్యాఖ్యానించినారు. 
కాని పూటకూళ్ళ ఆక్కలవద్ద హితవుకాని యన్నము లభించుటచేత సగము 
గడుప్పునకే తిని-అని యర్థమగును. [కీడాభిరామమందు కూడ పూటకూటింటికి 
పోవునప్పుడు అక్కలవాడకు పోదమన్నారు. 'వంటలక్క_' అని నేటికిని పూట 
కూళ్ళయామె నందురు, 


నగరాలలో క్షౌరళాలలుండెను. అవి విజయనగరములో సమృద్ధిగా 
నుండెను. 


“కూర్చుంబు గొరిగించుకొని యుష్టతోయంపు 
టంగడి తలగడుగుి 'కి 


క్షారశాలలేకాక తలంటి అంగమర్గనము చేసి ఉడుకునీళ్ళతో నలుగుతో 
స్నానము చేయించి పైకము తీసుకొను అంగళ్ళుకూడా నెగడి యుండెను, 


1, ఆము, 2-౬ 
వీ, ఆము, 8-౫, 


శీ. అము, ౭-౭. 
(30) 


284 ఆం!ధుల సొంఘిక చరిత 


నగరాల దుర్లక్షణాలలో లంచాలు, కూటసాశ్య్యాలు ముఖ్యమైనవి. ఆవి 
విజయనగరమందు |పబరలియుండెను, పెకమ తీసుకొని కూటసావష్యాలిచ్చువారు, 
లంచాలు తీసుకొని అన్యాయపుతిర్చు చెప్పు పెద్దలు .డిరి.] 


వైష్షవభ కులు “గర్భమంటపి గొడిగిన కలక జలములోని రాతొట్టినిండి 
కాలువగ జాగి గుడివెడలి వచ్చునది శ్నూదు డిడగ గోరి” పోయెడివారు.ి 
దీన్నిబట్టి శూదవైష్టవులు కొందరు గుళ్ళలో ఆర్బకు లనియు, గుళ్ళలో 
రాతొట్లుండెననియు, మురికినీరే తీర్థమనియు, హరి పాదోదకమనుపేర అ మురికి 
నీటినే ఆ భూదుడు |బాహ్మణాదివర్దముల వారికి తీర్థముగ నిచ్చెననియు తెలియ 
వచ్చెడి. తీర్థ పసాదా౭కు అంటు ముట్టు దోషములేకుండెను. ఆ యాచారమిప్పుడు 
పూర్తీగా మృగ్యము. ఆనాడు వీరశైవమున కెదురొడ్డిన (్రీవైష్ష్టవములోను 
జనాకర్షణము సంస్కార (పియత్వముండెను. తర్వాత మరల చాటియవసరము 
కానరాలేదు. 


జనులు భూమిలో పాతిన ధనపుజాడలను పెద్దలు చచ్చువరకు చెప్పక, 
చచ్చునాడు చెప్పక చచ్చుటచెత, వారి సంతతివారు ధనాంజనాది-త౦ంతజాలము 
నెరిగినవారి నాళశయించి ధనము నావరించిన భూతాలకు బలినిచ్చి ధనమును 
తీసుకొనెడివారు. భూతాలకు నెత్తుటికూటిని తూరుపుతట్టు బలిగా పెట్టి ధనమును 
తవ్వి తీసుకొనెడివారు.ి 


పెండ్రిండ్రలో నేట్రికాలమ. లోవలెనే బంధుమిత్రులు చీరలు, వస్త్రములు, 
భూషణములు మున్నగునవి చదివించెడువారు.* అల్లం డకు మామలు విలువగు 
వస్తభూషణములను చదివించిరి.్‌ ధనికులగు తల్లిదండలు తమ కూతుండ 
కరణముగా మంచములు, పరుపులు, ప శ్లములు, వీలు, ఉ య్యెలమంచ ములు, 
తమ్మ పడిగములు, బిందెలు, కొప్పెరలు, వక్కలాకుల పె'పైలు, రత్నమౌక్రీక 
 స్వర్ణభూషణమలు, పట్టుబట్టలు, అగరు, కస్తూరి, జవ్వాజి, కుంకుమపువ్వు, 
1. నీతి సీసపద్యశతక ము-తాళ్ళపాక,. 

2. ఆము, ౬-౮. 

తీ. మను. ౩-౨౧. 

క. మనుః, ౫-౮౬-౯౭, 

5. మనుచరిిత ౫-౯౭. 


అ 


విజయనగర సా్కామాజ్య కాలము 28 


గంధము, పచ్చకర్పూరము, పన్నీరు, పునుగు అత్తకు మున్నగువాని నిస్తూ. 
వుండిరి. కూతుం్యడ సేవలో నుండుటకు దాసీలను (ఆడపాపలను) కూడా ఇచ్చి 
పంపెడివారు.! 


జనులు సాధారణజాడ్యాలకు చికిత్సలు కొంతవరకు తెలిసియుండిరిం 
నిన్న మొన్నటివరకు (పతి [గామములో కొందరు ముసలమ్మలు వామ్ము మిరి 
యాలు, దుంపరాష్ట్రము, పిప్పళ్లు, సొంఠి మున్నగునవి మందుల మూటగా కటి 
ల ౧ ల 
యుంచుకొనెడివారు. తులసి చెట్లు చాలాయిండ్ల లో నుండెడీవి వాటి రసము 
జ్వరాల కిచ్చెడువారు. ఇంకా కొంత తేలిసినవారు దుప్పికొమ్ము, గోరోజనము, 
కస్తూరి, కుంకుమ పుప్పు, వైష్టవి, భి రవి మా(తలు ఉంచుకొనెడివారు, గడ్డలకు 
గోధుమవిండి యుడికించి కట్టిరి. నెత్తి నొప్పులకు గులకరాళ్ళ ఆవిరియిచ్చిరిం 
నొప్పులకు వేపాకు మున్నగునవి కాచి కాక వేసెడివారు. నేతరోగాలకు ఆకాల 
మందు చెసిన చికిత్స యిట్లుండెను. 
“కోక పొట్లం బావిగొన నూది యొత్తుచు 
38) ఆ 
కషణోష్టకరభభాగమున గాచి 
నెత్తి తంగేడాకు మెత్తి రేచకీనిమ్మ 
పంటిపుల్సున నూరి పట్టు వెట్టి 
తెల్ల దించెనపువ్వు దెచ్చి త్మదస మిడి 
జలివెపువ్వులు గోసి నిలిచి పిడిచి 
పేరననెయి వెట్టి పెరుగువత్తులువై చి 
చనుబాలతో రాచి సంకు చమిరి''2 


నానావిధ చికిత్సలు చేసిరి, దెబ్బలు తగిలినప్పు డీ [కింది చికిత్సలు 
చేసిరి ;-= 

““కొంగవాల్నరకు లంగుళుల బట్టుచు జబ్బ లంట గుట్టిడ వెజ్జునరయు 

వారు తలబడ్డ గుదియ [పప్పుల (బాతమసి యిడి''కి 


1, మనుచర్మిత ౫-౧౦౧. 
వ, శ్రీ కాళహ_స్టి మాహాత్మ్యము, ౩-వ ఆళ్వాసము ౧౧౧. 
8, ఆము క్రమాల్యద 2 =౨౦. 


౨06 ఆం|ధుల సాంఘిక చరిత 


చికిత్సలు చేసుకొనిరి. కొంగవలె వంకరగా నుండు మాదిగక త్తిచేత 
బుజములు చీలినప్పుడు వె ద్యులచే కుట్టు వేయించుకొనిరి. తలవై దెబ్బలు పడి 
చీలగా పాఠగుడ్డల కాల్చి దానిమసి నందు పూసి తాత్కాలిక చికిత్సలు చేసు 
కొనిరి. వైద్యుల వేషము, వారికాస్త్రమునుగురించి యింతకుముందే తెలుషనె నది. 


అప్పుడ ప్పుడు వామ మేర్పడినప్పుడు పూర్యకాలమందు జనులు చాలా కష్ట 
పడెడివారు. పలువురు ఆకలిచే చచ్చిరి. పలువురు పిల్లల కూటి_కె అమ్ము 
కొనిరి, మన కాలమందే ౧౯౪౧ [పాంతములో బెంగాలు కామము వల్ల ౨౦ 
లశల జనులు బావలేదా ! రైళ్ళు, రోడ్డు, మోటారులు లేని అఆ కాలములో క్షామ 
బాధ లెట్టివిగా నుండెనో యూహించు కోవచ్చును, ధాన్యము దొరకక జనులు 
ఊదర్లు ఈతగుజ్జు మొదలయినవి తినిరి. 


“గునుగు లూదర్లు బరపటల్‌ గోళ్ళగొండు 
లల్లిబియ్య ంబు వెదురుబియ్యంబుగొ ట్రై 
చెట్లు నింజెట్లు తుంగముసైయలు నీత 
గుంజు మొదలు" దిన దొరకొనియె జనము 
ఆరువడు గంపెతవిందయ లరువది 
దినములకు బండునని |బతుకాసనస్‌ 
తరచుగ నేతా లె_తగ బరిపరియై 
యవియు మల్లెపడి చెడిపోయెన్‌.” 


పెద్ద పెద్దగామాలలో వారపుసంత లుండెను, వర్షాకాలములో అవి సరిగా 
సాగ నేరకుండెను. (1) సంతకు తిరుగు బేపారులు గుర్రాల నుంచుకొని వానిపై 
నెక్కి. వెళ్లుతూ వుండిరి. “ఉరూరి సంతకం దిరుగ పెద్ద లింటింట సంతరించు 
విలుకువాటు గోడిగ జావడములు” వారి కుండెను(£). 


విజయనగర రాజ్యములో కృష్ణ దేవరాయలును, తదితర చకవర్వులును 
స|తాలు కట్టించి యుంచి (బాహ్మణులకు ఉచితముగా భోజనము పెట్టుతూ 
వుండిరి. (ల) 
1 “సంతల కూటములకు విచ్చు మొగ్గలొద వె” ఆము, ౪-౧౨౩, 
వి ఆము కృమాల్యద ౪-౩౫ 

ఇటీ 
శీ రాధామాధవం, ౩-౮౫, 


/ 


విజయనగర సా మాజ్య కాలము 297 
జనుల వినోద విలాసము 


పండుగలు జనులకు ఉత్సవకాలాలు. ఆనాటి పండుగలే యీనాడును 
కలవు, అదంతగా భేదము లేదు. ఏరువాక పున్నమ వ్యవసాయకులకు ముఖ్య 
మైనట్టిది, పలువురు ఏరువాక అనగా ఏరులు వచ్చేకాలమందు చేయు పండుగ 
అని 'ప|తికలలో పెద్ద వ పెద్ద వ్యాసాలు (వాసివేన్తూ ఉన్నారు. ఏరు అనగా ొ నాగలి. 
ఏరువాక పతన. త్ర దున్నుట కారంభించుట. జ్యేష్టపూర్ణిమనాడు ఎద్దు. 
లను కడిగి రంగులతో అలంకరించి నాగండ్తకు. ఎ డదమన్ను నున్న షద్దెలు వేసి 
నూనెరంగులు పూసి చీరలు కట్టించి సొమ్ములు. పెట్టి సాయం[తము. మంగళ 
వాద్యముతో నాగళ్ళను గ్మొరులను బుజాల ప తీసుకొని ఎద్దులతో రేగి పొలా 
లకు పోయి దుక్కి [పారంభము చేసి వతురు. తనో. భక్యభోజ్యములతో 
గాటికి నై వేద్యమిత్తురు. ఇది ఏరువాక పున్నమ పండుగ. ఇది వై దికోత్సవమే! 
సందేహములేదు ! జ్యేవ్షమాసన్య పౌర్జిమాస్యాం బలీవర్జాన్‌ అభ్యర్చ్య ధావంతి 
సోయం ఉద్స్ఫృష భయజః" అని జె మినీ న్యాయమాలలో నుదాహృతము. 

"కాలుని దున్ననంది నయి గంటలు దున్నక మంటినా, మహా 

కాలునినంది దుశ్నసనయి కరమ మగ్నతలేక మంటినా, 

హాలికు లెన్నడున్‌ దెగని యౌరుల చేలును, బౌకుమళ్ళునున్‌ 

గా, లలినేరు సాగిరిల గల్లు పసి గొని పేద మున్నుగస్‌.” ! 


కాపులు దొరికిన దున్నలను, ఎద్దులను కట్టి గడ్డినట్లు, దుబ్బలు దున్నుట 
కానా డారంభించిరన్న మాట, 


దసరా పండుగ రాయల యాస్థానము లోను, సామంతుల యాస్థానము 
లందును మహావై 'భవముగా జ జరుగుతూ వుండెను. అది కీ తియల పండుగ, 
సెన్యమునకు పాధాన్యమిచ్చిన చ కవరు లా పండుగను అకరణీయ 
ముగా చేయుట సమంజసమే. ఆం|ధుల పండుగలలో విదేశీయులకు దసరా, 
హోలీ చాలా ముఖ్యమైనవిగా గనబడెను, అబ్బు రజాఖ్‌ స్వయముగా దసరా 
నన అలలో! 
పండుగను జూచి యిట్లు |వాసెను, 


“చ| కవలర్తి తమపాలెగాం[డను, నాయకులను అందరిని తన నగరానికి 
విలివించుకొనుచుండెను. మూడునాల్గునెలల ప్రయాణము చేయునంతటి దూర 


1 ఆము కృమాల్యద ౪=ం౧ఎలిళ౪, 
అనీ 


288 ఆం|ధుల సాంఘిక చరిత 


దేశపు సామంతులును వచ్చెడివారు. ౧౦౦౦ ఏనుగులకు రంగులు వేసి అలంక 
రించి పండుగడినాలలో మైదానములో నిలిపెడివారు, అందమైన ఒక పెద్దమైదాన 
ములో ఆయిదారంతస్గుల బంగ్లాలుండెడివి. అన్నియంత స్థులలోను గోడలపై 
చిత్తరువులు వాయబడి యుండెను. మనుష్యులు, జంతువుల, ఈగలు, న తలు 
కూడా చితింపబడెను. ఆ చిత్తరువులు ఆతినుందరమై కళాకాంతులతో శోభ 
నిచ్చెను. ఆదే మైదానములో _స్తంభాలతో కూడిన తొమ్మిది అంతస్తులమేడ 
యుండెను. అది సాటిలేని అందచందాలమేటిమాలె. చకవ ర్తి సింహాసనము 
తొమ్మిదవ యంతస్తుపె నుండెను. ఆది చాలా పెద్దసింహాసనమై, సువర్ణ 
మయమై, రత్నాలతో నిండినడ్డై యుండెను. దాని ఆందాన్ని అలంకరణాన్ని 
చూచి |సేక్షకులు మ గ్గులవుతూ వుండిరి. ఆ సింహాసనముమై ఆసీనుడై చక 
వర్తి దసరావేడుక ల నవలోకించెడివాడు. ఆయుత్సవము మూడుదినాలు జరుగు 
తుండెను. వేషగాం డ వినోదాలు, గారడివారి పదర్శనాలు, బోగంవారి అట 
పాటలు చ[క్రవర్సియెదుట [పదర్శింపబడుతుండెను .” 


పీస్‌ అనువా డిదే యుత్సవమును విపులముగా వర్ణించినాడు. పై విషయ 
ములతో పాటు మరికొన్ని యిట్లు తెలిపినాడు. 


“ జెట్టిలు కుస్తీలను [పదర్శించిరి. రాతులందు బాణసంచాలను కాల్చు 
తుండిరి. అందు నానావి గహాలు, వాటినుండి పటపటమను బాణాలు ఆకాళాని 
కెగిరి పగులుచుండెను, కాళీ కీకి నవరాతులలో (ప్రతిదినము ౨౪ దున్నపో 
తులు, ౧౫౦ మేకలు బలి ఇచ్చుచుండిరి. తుది దినమునాడు ౨౫౦ దున్నలను, 
౪౦౦ మేకలను బలియిచ్చిరి. | పతీదినము (బబాహ్మణులు దేఏపూజలు చేసిరి. 
గురాల నలంక రింది ఊ రేగించిరి.” 


ఒకతడవ కృష్ణరాయలు స్వయముగా ఒక అడవిదున్నను వేటాడి పట్టు 

కొని వచ్చెను. దానీని దేవీనవరా!తులలో దేవికి బలి యియ్య నేర్పాటు చేసెను. 

ఆచార[పకారము ఒకే ఒక కత్తి (వేటుతో దున్నతల తెగిపడవలెను. తెచ్చిన 

యడవిదున్న ఏనుగంతటిది. దాని కొమ్ములుసాగి తోకను తాకుచుండెను, అంతటి 

జంతువును ఒక్షేవేటుతో నరకుటకు వీరులందరును వెనుకముందాడిరి. అప్పుడు 

విశ్వనాథనాయకుడు ఖడ్గము తీసుకొని సులభముగా ఒక్క కత్తిఊపుతో దాని 
తలను ఎగురమీటెను (1), 
(1) Salatore Il 


విజయనగర సా్యమాజ్య కాలము 289 


హోలీపండుగను రాయలకాలములో_ వసఃతోత్సవనమనిరి, నికలోకాంటి 
దాన్ని గరించి యిట్లు |వాసెను. “వీధులలో ఎరుపురంగు నీరుంచెడి వారు. వసం 
తోత్సవదినా లలో వీధులలో పోవువారి యందరి.పైనను ఎవరు బట్టిే వారు 
రంగునీటిని చల్లుతుండిరి. తుదకు రాజుకాన్సి రాణి కాని ఆదారిని వెళ్ళితే వారికి 
ఈ సంప్రోక్షణ తప్పకు.డెను (1). వసంతోత్సవ కాలమందు నాన్నాపాంత 
నమాగత కపులవర్ణనలు విని ఆనందించి వారికి బహుమానము లిస్తూవుండిరి. 


“పతివర్గ వసంతోత్సవ కుతుకాగత సుకవి నికరగుంభీ స్మృతి 
రోమాంచవిళంకితి చతురాంతఃపురవధూ |పసాధనరసికా!” £ అని ముక్కు, 
తిమ్మన రాయలను సంబోదించెను. 


దీపావళినిగూర్చి కూడ మనకు విపులముగా తెలియవళ్చనది. విజయ 
ఎగర చక్రవర్తుల కాలములో (కీ. శ. ౧౪౫౦---౧౫౫౦ ప్రాంతములో) రచిత 
మైన “ఆకాళభై రవకల్పము" అను సంస్కృత (గంథములో దీపావశీవర్ణన 
మెక్కువగా కలదని భండార్కరుసంస్థ కధ్యవ్షలగు వీ. కే. గోడేగారు |వాసిరి. 
(Annals of Bhandarkar Institute, Vol. XXVI), “రాజు ఆశ కయుజ 
కృష్ణ చతుర్దశినాడు తెల్లవారకమును పే |బాహ్మీ ముహూ_ర్థమందు లేచి శుచియై, 
(బాహ్మ జాశీర్వాదము లందవలెను. తర్వాత బయట మంగళ పంచ వాద్యాలు 
|మోగవలెను, ముత్తైదువలు వారిని స్నానమునకు సిద్ధము చేయవలెను. మల్లులు 
తలంటి గో ర్వెచ్చనినీటితో స్నానము చేయించవలెను. 


“నదత్సు పంచ వాద్యెషు బాహ్యకష్యాంతరే తతః 
కణత, ౦క ణయా వధ్వా దర వల దురోజయా 
అభ్య క్తః స్నాపితో మల్లెః కైెశ్సితీ కోణ వారిణా॥” 


“ఇదంతయు సూర్యోద యానికి మునుపే ముగించుకొని తర్వాత దర్చారు 
చేసి గాననృత్యవినోదముల నానందించి అందరికిని బహుమతులిచ్చి మధ్యా 
హ్నము భుజింపవలెను. రా!తివేశ పటాకాలను కాల్చ్బవలెను” అని యాకల్చ 
ములో |వౌసినారు, 


(1) 52126016. 
(2) పారిజాతాపహరణము ౧-౧౩౯ 


240 ఆం[ధుల సొంఘక చరిత 


ఆ కొలములోని ఆం ధులవినోదాలలో కొన్ని ముఖ్యమైన విపష్వూ డంతే 
రీంచిపోయినవి. అందు ముఖ్యమైనథ్య సీడ్‌ అనుఫిట్టిది. దానిని కేవలము వినోద 
మనుటకు వీలులేదు. ఆది భక్తిపధానముగా ఆత్మహింసాత్మకముగా చేయునట్టి 
[ప్రదర్శనమ' జనులు (మొక్కుబళ్లు చెల్రించుటకై సిడిపై | వేలాడుతుండిరి. 
జక పెద్దగడయొక్క కొనయందు ఒకయినుప కొండిని కట్టి అది గడచుట్టు 
తిరుగుటకై ఒక యినుపక డెను గడెకొనయందమర్చి దానికాకొండిని తగిలించెడి 
వారు. ఆ కొండిని శ్రీపురుమలు తమ వీపుచర్మములోనో నరాలలోనో [కుచ్చు 
కొని దానిపై _వేలాడి స్తంభము చుట్టును గిరగిర తిప్పబడుచుండెడివారు. దీనిని 
బొర్బ్చోసా చూచి యిట్లు (వాసెను, “ఈ దేశములోని (విజయనగర రాజ్య 
మందలి) స్రీలు అతి సాహసికురాండు, తమ।ముక్కుల చెల్లించుకొనుటలో 
భయంకరములగు పనులను చేతురు. ఒక యువతి ఒక యువకుని (పేమించి 
నచోో ఆమె తన మొక్కు. చెల్లినచో సిడిపె (వెలాడెడిది. నిర్ణయమైన ఒక 
దినమున ఆలంక రీంపబడిన యెద్దులబండి పై ఒక మోకును దానీ కొక యినుప 
కోండి యుంచి తీసుకొనిపోదురు. మంగళవాద్యములతో ఆమె బయలుదేరును. 
అమె నడుమునకు మాతము బట్ట కట్టుకొనును. సిడి స్తంభమువద్దకు వెళ్ళి 
యినువకొండినీ అమె వీపుచర్మములోనికి (గుచ్చి సిడిపె కెత్తుదురు. ఆమె 
యెడను చేతిలో చిన్న బాకుండును. గిరకను స్తంభానికి తగిలించి ఆమెను 
దానిపైకి లాగుదురు. ఆమె గాలిలో కొండిపె వేలాడను. రకము కాళ్ళపొడ 
వునను కారినను ఏ మా్మాతమన్న్నూ తాపమును (ప్రకటింపదు. పైగా కూతలు 
పెట్టుచు కత్తి _తిప్పుచు నిమ్మకాయలతో తన్మపియుని కొట్టుతుండును. కొంత 
సేపటికి ఆమెను దింవి గాయమునకు కట్టు కట్టుదురు. ఆమె దేవళమున కందరి 
లోపాటు నడిచి (బాహ్మణులకు దానాలు చేయును.” 


సిడిని సిడ్మిమాను అనయు నందురు. దాని నిట్లు వర్ణించినారు. ఒక 
స్తంభమును పాతి దానికొనను ఒక గుండ్రని లొతిలో రం(ధ్రముచేసి తగిలిం 
తురు. దానిపై సన్నని దూలమును పెట్టుదురు. ఆ దూలమును గుం,డముగా 
(తిప్పుదురు. దానికే గిరకతోటి కొండిని తగిలింతురు. ఆ కొండిపై మనిషి 
(వేలాడుమ. (1) కృష్ణదేవరాయల ఆష్టదిగజాలలో నొకడని (పతీతియేకాని, 


(1) Salatore. (1) 


విజయనగర సా మాజ్య కాలము 241 


తర్వాతి కొాలమువొడగు తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యములో 
ఈ సిడినిగురించి వర్తించెను. ఇది రెడ్డలోనే యెక్కువగా నుండినట్లు తెలిపినాడు. 


“ఆంభోధరము।[కింన నసియాడు, నై రావ 
తియుటోలె సిడి వేలె తెరవయోర్తు” 


అన్నాడు. (ఈ కవి రాయలతర్వాతి వానినిగా పరిగణించినందున ముందు 
(పకరణములో చర్చింతును.) ఈ సిడియాట నేడు లేదు. ౪౦౦ ఏండ్డలోనే 
యింత మార్చు! 


కోలాటమందు జనుల కాస క్తి యెక్కువగానుండను. రాయలసీమలో 
నేటికిని వెన్నెలరా[తులందు జనుల కది పాముఖ్య మైనది. కోడి పందెములు 
చాలా విరివిగా నుండెనని వీన్‌ (వాసెను, అదొక్కటి కాదు. దున్నపోతుల 
యుద్ధాలు, డేగ వేటలు, పాచికలాటలు, జనులకు (పీతి పాృాతమని కీస్‌ వాసెను. 
“కాసె కట్టుటయు క త్తిదాల్చుటయు, కృకవాకుల కలహం౦ంబులంద” అని 
రాయలు వర్ణించెను. () 


చతురంగపు ఆట చ।క్రవర్తులనుండి సాధారణజనులవరకు ఆస కని 

కలిగించినట్టిది. దీనిని మోసిన్‌ పుట్టక ముందే హిందువులు కని పెట్టరని (పతీతి 

నౌషిర్వాన్‌ అను [పసిద్ర పారసీకచకవ రి యీ యాట గొప్పదనమును విని 
0 ఆలి 

హిం దూస్తానమునుండి అదేపనిగా చతురంగపు పలకలను, కాయలను తెప్పించు 

కొని ఆ విద్యను నేర్పు గురువును పిలిపించుకొనెను. బాణు డీ యాటను వర్ణిం 


1 ఆము ౪-౧౮౭. 


(31) 


242 ఆం(ధుల సాంఘిక చరిత 


రుదటుడు తనకావ్యాలంకారములో దీనిని పేర్కొనెను. బొడ్డుచర్ణ తిమ్మన్న 
అనునతడు రాయలకాలములో నీ యూటయం దతినిపుణుడు. లోకల్‌ రికార్డులలో 
నీత్తిని గూర్చి యిట్లు _ వాసినారు, “అతడు క వీశ్వరదిగ్గంతి అనివించుకొని 
కృష్ణరాయలవారి యొద్దకు పోయి వారితో చదుకంగం ఆడు తూవుండే వాడున్నూ, 
ఆట గెలిస్తే వెయ్యార్లుపందెంవేసి గెలుస్తూ పుండేశాడున్నూ; అప్పుడు 
అణాల రా poe. 
కృష్ణదేవరాయలు చాలా సంతోషించి కొప్పోలుగామం, సర్వాగవహారముగా 
ధారపోసి యిచ్చెను.” ఈ విషయాన్ని పురన్మరించుకొనియే ఒక చాటు విట్లు 
కలదు. 


“శతసంఖ్యులొక , 'దెనను సతతము శ) కృష్ణరాయ జగలీపతితో 
చతురంగమాడి గెలుచును ధృతిమంతుడు బొ డ్డుచర్ల తిమ్మన భళి దే!” 


ఆ కాలపు విల్రలాటలను కవులు కొందరు వర్ణించనారు. కాని అందు 
నకు తెలియనివే యక్కు వగా కలవు నిఘంటుకారులును మనకుండు సందే 
హాలతో “బాల[కీడావి శేషము” అని అర్ధము (వాని దాటుకొన్నారు. వింగళి 


సూరన యిటు [(వాసెను. 
ళం 


కన ప గొన్ని చనంగ నంత కడు వరిన్‌ బొమ్మ పెండ్రిండ్డు, గు 
జైనగూళ్ళచ్చగగండ్డు, పింపిళులు కుచి ల్‌ గీరనగింజ, లో 
జ్‌ గ్‌ ఎ | 
మనగుంటల్క్‌ కనుమూసిగంతనలు, కంబాలాట లోనైన ఖే 
లనముల్‌ మీరగ బోంట్లతో నలరె బాలారత్న మెల్లప్పుడున్‌”! 

౧ ౧ 


గుజ్జెనగూళ్ళు=(కూజళ్బు) పిల్లలు గురుగులలో వంటలు వండి వడ్డించి 
నట్లు ఆడుకొను ఆట. వింవిళ్ళు అన పిల్లలు పెదవులతో ఘర్షణ ధ్వనులు చేస్తూ 
గొంతుకూర్చొని పాదాల నాడించి ఆడెకియాట. కుచ్చి ళ్ళన గూఢ మణి యని 
సూ. రా, నిఘంటువులో కలదు. అనగా మట్టిలో లేక ఇసుకలో బారెడు 
మూరెడు పొడవు కట్ట చేసి ఆందేదై న వస్తువును దాచిన దానిని రెండవవారు 
కనుగొనుట, గీరనగింజల కదేగతి పట్టినద. ఆచ్చనగండ్లలోవలె గులక రాళ్ళతో 
ఆడుయాటగా తారాశళాంక మందలి యీ పద్యభాగ మునుబట్టి యూహింప 
వచ్చును. 


విజయనగర సా(మాజ్య కాలము 243 


వె శ్యకన్యకల్‌ గీరనగింజ లాడుతరి 
(కందను జిందిన దివ్యరత్నముల్‌ -” 


ధనికుల పిల్లలు, అందులో కవిత-అందుచేత వారు రత్నాలతో ఆడిరి. 
ఇవి ఆడువిల్ల లాటలు. మగ పిల్లలాటలను గురించి ధూర్ణ టి యిట్టు తెలిపినాడు, 


“చిట్టపొట్టాకాయ నిరిసింగణావత్తి గుడుగుడుగుంచాలు కుందెనగుడి 
డాగిలి ముచ్చుటాటలు (గచ్చకాయలు వెన్నెలచిప్పలు తన్నుబిల్ల 
తూరనతుంకాలు గీరనగింజలు పిల్లదిపా లంకిబల్లిగోడు 

చిడుగుడు లవ్యలపోటి చెండుగట్టిన బోది యల్లి యుప్పనబ ది లప్పళాలు 
చిక్కనాబిల్ల లోటిల్లు చిందవాది మైన శైశవ కీడావిహారనరణి 
చెంచుకొమరులతోడ నుద్దించు కాడుతిన్న డభినవ బాల్యసంపన్ను డగుచు“! 


విష్ణు పురాణములో మరికొన్ని తెలిపినారు :- 


“కోల[కోతులు దిలగో చ్చ దూరనగోల 
లందలంబులు మది కుందికాళ్ళు* (ఆశ్యాసం ౭.) 


నె యాటలలో మనకు తెలియని వన్నియు నై ఘంటుక “బాల్య |కీడా 
విశేషాలే'' అని యిప్పటికి తృ ప్రిపడవలెను. 


సంపన్నుల యిండ్ల పెండిండలోని విందు లెటివనగా :. 
య భా భా చక 


కలవంటకములు బూరెలు తేనెతొలలు 
చాపటు మండదిగ బొబ్బట్లు వడలు 
య య 
కుడుములు సుకియలు గడియంపుటట్లు 
వెన్నప్పాలు వడియంబు లప్పడాలు 
బొంగరములు సొజ్జెబూ రెతాగులు Fs 
లుక్కె_ర లరిసెలు జక్కి.లములు 
కరూర గో ననీ కదళికా సహకార 
జ్‌ =D 
వలములు కొబ్బరి పనసతొనలు 


కేం కాళహస్తి మాహాత్మ్యము 58-58. 


44 ఆం(ధుల సాంఘీక చరిత 


తేనియలు జున్ను మీగడ లానవాలు 
పానకములు రసావళ్ళ పచ్చడులు న 

వాజ్య మొలుపు బప్పులు కూర లనుపమాన్న 
నపుడు _పజనెల్ల దనియించె నహరహంబు”1 


తుదకు పాకములందును కొన్నిజాడ లెరుగలేకున్నాము ! పెవన్నియు 
(బాహ్మణుల విందులే! ఇతరులలో ఇన్ని లేవు, వాటికి మారుగా మాంస 
మత్స్యాదిపాక ములు చేరును. రాయలు (బాహ్మణుల మరికొన్నితిండ్తను గూర్చి 
తెలిపినారు. పొరివిళంగాయ (వేపుడుబియ్యపు విండితో బెల్బపుపాకాన చేసిన 
యుండలు), పెరుగు వడియములు, పచ్చివరుగు ఇవి పయాణభు_క్‌ సంబార 
ములు.8 వానకాలమలో కలమాన్నము, ఒల్చినవప్పు, నాలుగ దుపొగసిన 
కూరలు, వరుగుల్కా పెరుగు. వడియమలు, నెయ్యియు- వే సవికాలమ లో ఉలి 
వెచ్చ అన్నము, తియ్యని చారులు, మజ్ఞిగపులును, పలుచనియంబల్కి చెరకు 
పాలు, ఎడ సిళ్ళు రసావళులు (అతిరసిమలు), వడ విందె_యూరుగాయ్మ నిరు 
చల్ల యును-చలికాలములో పునుగువియ్యప్త్వ అన్నము (పునుగువాననగల 
రాజనములు). మికియ పుపొళ్ళతో కూడిన ఉడుకుకూరలు, ముక్కు wig ఆవ 
గాటు కల వచ్చళ్ళును, ఉరుగాయలను. పాయసాన్నమ.లు, ఉడుకునేయ్యి 
ఇవురగాచిన వాలును ,బాహ్మణులు కొందరు భుజించిరి.® జాతరలకు ఉత్సవా 
లకు పోవువారు పెరుగుసద్దిని తీసుకొని బాటలందఠి కాల వలవద్ద తోటబావుల 
వద్ద చద్దిమూటపిప్పి కలిసి భుజిస్తూ వుండిరి. బ రెయుక,. మీగడ పెరుగు 
అన్నముతో అక్కగా కలిపి అందు నిమ్మరస సము వీండి, అల్లము ముక్కులు 
కలిపి యుండెడివారు * ఇదొక విధమగు దధ్యన్నము, 


కళలు 


విజయనగర చృకవర్తుల కాలములో కళాభివృద్ధి పరమావధి పొందెను. 
చక్రవర్తులు, సామంతులు, మంతులు, ధనికులు-భ వనములను, దేవాలయము 


1. కళాపూర్ణోదయము త్రజలాలి? 

బొ, 406 .... ౧-౮౦ నుండి ౮-౨. 
లి ౪.౭2 ౫. 

తీ, ఆముక్తమాల్యద ౧-౯౭ 


వెజయనగజి సామాజ్య కాఒము 245 


అను కట్టించుటచేత శిల్పవృద్ధి యెక్కువగా నయ్యెను. రాజులు, జనులు, చిత 
లేఖనమును, కవితను, అద్దక మును సంగీతమును పోషించిరి, అచ్యుతరాయ 
కృష్టరాయల కాలమందేశాక విజయనిర పతనానంతరము వేంకటపతిరాయల 
కాలమందును చి తకారులుండిరి, దెదాలయములయొ ౪, యు, భవనముల 
యొక్కయు గోడల పె చిత్తరువులు [వాయించిరి. అనంతపురము జిల్లాలోని 
లేపాక్షి దేవాలయములోని చిత్తరువులు తర్వాకిదారి తెలివితక్కువవలన చెడ 
గ్‌'ట్రబడెన నను మిగిలినవై నను బాలా నుందరమనవి, అందు అచ్యుతరాయని 
కాలపు శాననాలున్నవి. కప్పుపై చిత్తరువు లున్నవి. _ృంభాలపై చక్కని 
శిల్పము లున్నవి. కాసి తర్వాలివారు ఎ “టిప ఎరమన్ను సున్నము పక్షులు వేసి 
తమచి|తమును |పదర్శిందినారు. ఆంది ఈకళరునికి సంబంధించిన సుందర 
చితమిలున్నవి, నిజయసగరరాజులే తంజావూరిలోని బ్బహదిశ్వరా లయము 


చి తరువులు డాయింబరి, వీనస్‌ ముటు ; వా సెను, 
యం వే 


“కృషదెనరాయల ఆంత ఃపురథవనమంమ రాజుయొక,_యు, వారి 
తండయొక్కయు చిత్రయుపులను గోడలపై | వాసినారు. ఆవి యారాజులను 
చాలా చక్కగా పోలియున్నవి* అచటనే గోడలపై నానాపిధజనుల యాకా 
రములను తీర్చి నారు, తుద కందు పోర్చుగిను రూపులను కూడా దించినారు. 
ఆ చితరువులు అంతఃప్పుగకాంతలకు (పాప:చిక జ్ఞానము క ల్రిషించెడివి.” 
బోగపుసానులయిండ్రలో కూడా సింహాలు, పులులు, ఇతర జంతువులు, అవి 
ఆద్నముగా [బదికిశవా అన్నట్లు చితించి యుండిరి. అని అబ్బురజాఖ్‌ 

ల Kk oa) అం 2 
[వా సెను, “గోడల చెలువార కృష లీలలు లిఖించి” అని పొఢకళకవి మల్లన 
ణ త 


(౧-౧౧౮) (వొ సెను, 


రాయలనాటి కవితలోను, అందు ముఖ్యముగా రాయలే |వాసిన ఆము క్త 
మాల్యదలో ఆనాటి సాంఘిక చరిత యిమిడినది. పాళ్చాత్యులవర్ణ నలు మనకు 
లేకుండిన ఆ కవితలు ఊహాగానములనుచుండిరో ఏమో! ఆనాడు స్రీలుకూడా 
“శాస్రసరణి”గా “తూలి”తో చిత్తరువులు |వాసిరి. (1) చ్మితలఖినిని తూలి, 
వాగర లేక కుంచె యనిరి. దానినే సంస్కృతములో ఏషికా, తూలికా యనిరి. 
గోడలపై మంచిగచ్చుచేసి వాటిపై రంగురంగు చిత్తరువులు |వాసిరి. పూబోణి 
1. Salatore, 11 


846 ఆం[ధుల సాంఘ్‌క చరిత 


నేర్పూది... ....శాస్త్రసరణిన్‌ తూలిన్‌ వారిన్‌ (వాసి'! అని రాయలు తెలిపెను. 
పసిడి గచ్చమర సోపానముల్‌ మూట దుంగిత విశాలితయు చితితయు నైన 
సభి అనియు తెలిపెను. ఇచట గచ్చుముచ్చట కలదు. ఆ గచ్చు చాల 
గట్టిదిగా నుండుటక్షై! సన్ననియినుక లో బెల్బమునీరు, చమురు, సున్నము కలివి 
గానుగబట్టి సిద్దము చేయుచు .డీరి. 8 ఇంత మాత్రము కవితలో పతివింబించినది 
కాని ఆ గచ్చులో గోందు, కళక్కాయ, బెండకాయలు, అమృతవల్లి (పాచితీగ) 
ఆకురసము, తుమ్మచెక్కకూడా కల్పుతుండిరి. అట్టి గచ్చు కలకాలముండెడిది. 
భవనాలలో నెట్టి చిత్తరువులు | వాయించిరో అవియు మనకు తెలియవచ్చినపి 


“*ఆదినారాయణు డమృతాద్ది మధియించి 
యబ్దవాసిని 'పెండ్డియైన కథలు 
చంద శేఖరుడు పుష్పశరాసను గెల్చి 

హిమాచలతనయ బెండ్డయిన కథలు 
శ్రీరామచందుండు శివధనుర్భంజన 

మడరించి నీత బెండ్రయిన కథలు. 
నలచ [కవరర్తి వేల్పులు సిగ్గువడగ 

భీమాధీశ కన్య బెండ్రయిన కథలు 
చికత్తభవ కేశి బంధ విది|తగతులు 

హంస కలరవ కీర రథాంగగతులు 
వాసి రలవడ తత్ఫ్యయంవర మహో 

స్థలాంతికి స్వర్ణసౌధ కుడ్యముల నెల్ల.” 

బోగముసానులయిండ్ల చ్మితమలు వారికి తగినట్టివే ! 

“రగివధూమదనుల రంభాకుబేర 

పుత్రకు లూర్యశీపురూరవులు మేన 
కాకౌశికులు గోపికాముకుందులు 

ధాన్య మాలినీరావణుల్‌ మత్స్యలోచ 


2, ఆము ౫-౧౪౯. 

లం 0 అ అంకారా 

లీ. మను, ౫-౩౮. 

4. రాధామాధవం, ౧-౧౮౮ 


విజయనగర సాామాజ్య కాలము 247 


నర్శ్యశృంగులు దాశనళినేక్షణా పఠా 
శరులు తారానిశాకరులు గౌత 

మాంగనాదేవేందు లమర వేశ్యాజయం 
తులు |ద్రౌపడీ పాండవుల్లు పృథాబ్ద 

హితులు నడచినగతు లాత్మ సుతలనుంచు 
నింటిగోడల (చాయించునిందువదన, 1 


అంతేకాదు :- 


“వనిత చతుర్గాతి వయో వనజావుల 
బంధవై భవము భ!|డుని, ద 

తుని గూచిమారు, పాంచాలుని వాయించెన్‌ 
గృహంబు లోపలిగోడన్‌ 2” 


“కూచిమార మనోజ ఘోణికా పుాదికానీత కామ సిడ్దాంతములను.” 
ఇంకను నిట్టి వనేక ములను బిడ్డలకు నేర్పించెను. * 


విజయనగర చక్రవర్తులలో కృష్ణడేవరాయలే ఉత్తమ శిల్పములతో 
కూడిన దెవాలయములను నిర్మింపజేసెను. హజార రామాలయము విఠలాలయము 
చాలా సుందరములయినవని కిల్చవే త్తలు పొగడినారు. కృష్ణరాయల సభాభవన 
మును భువన విజయము అనిరి. 


“భువన విజయాఖ్య సంపన్నవరత్న విభా|పభాత నలినా పరమా 
ధవ చరణకమల సేవా (పవణమతీ ఏరరు[ద పర్వత వ (జీ''* 


ఆతడు నివసించు సొధమునకు మలయకూటము అని పేరుండిను, 
““మలయకూట ప్రాసాదనివేశ కృష్ణరాయమహీశా!'్‌ భువనవిజయమం దతి 
సుందర శిలృములు నిండుగా నుండెను. కోతులు, రాయబారులు, రాణీలు 

lL, థ్రీ కాళహస్తి మాహాత్మ్యము, ౪వ ఆళ్వాసము ౧౪. 

2, కక్‌ షో ౪=ఎ౧౮. 

8. వ్‌ 9 v0 

4. పారిజాతాపహరణము. 

ర్‌, పః నే=౧౦౮, 


2485 ఆం;ధుల సాంఘిక చరిత 


నృత్యము చూచుట, వేటలు, స్తీఆ (పసాధన కియలు, నర్తకీలు, బందీలు 
మున్నగున వు-డెను. అనగా ఆ కాలపు సాంఘిక చరిత విజయనగర శిల్పము 
లందు పూర్తిగా పతిబించీత మయ్యెను. ఆ నగర విధ్వంసమువలన మన 
చర్మితకు చెప్పరాని అపార నష్టము కలిగినది. రాజసొధముఖళాల (మోసాల)పై 
ఘటికాయం[త ముండెను. ఘడీయ కొకసారి గంఓలు లెక్క, పకారము కొట్టుతూ 
వుండిరి 


““... ఘటికావర్యా ప్తి ఘంటారవాం, తరనిర్గీతములై వినంగ బడియెన్‌ 
మధ్యాహ్న శంఖధ్యనుల్‌.” 


ఆని రాయలే తెలిపినాడు. 


కృష్ణరాయలు సాహిత్యమ: దేగాక సంగీతమందుకు మంచి ప్రావీణ్యత కల 
వాడు. విజయనగర చ(కవరుల కాలమంద బహుశా తెనుగులో పాడినన్తు అర 
వములో పాడినను దాక్షిణాత్యసంగీతమునకు కర్షాటసంగీతమను పేరుకలిగెను. 
“కృష్ణా ఆను పేరుగల విద్వాంసుడు రాయలవారికి సంగీతము నేర్పెను. ఆతడు 
రాయలకు వీజ్రావాద్యమ కూడా నేర్చినందు కుశిష్యుడు గురువునకు గురుదక్షిణగా 
విలువైన ముత్యాల వోరాలన్కు వ్యజాల హోరాలను నిచ్చెనని కర్ణాటభాషలో 
నారాయణ కవిచే వాయబడిన రాఘవేం్యదవిజయములో తెలిపినారు[1) సంగీతము 
ళా స్త్రపకారము అత్యంతా భివృద్ధి నొందెను, ఒకొక్క బుతువులో ఒక్కా క్క 
రాగమునకు _పాధాన్యమ౦డెను. వసంతకాలమ. దు హిందోళరాగము పాడిరి.(2) 
రాయలకు పోర్చుగీసు రాయబారి తమ దేశపు వాద్యములను కానుక యివ్వగా 
వారు చాల నంతోవషించిరట! కీ. శ. ౧౫౧౪ లో బార్బోసా యిట్లు [వొసెను. 
"పతి దినము స్రీలు రాయలవారికి కడవల కొలది నీళ్ళతో స్నానము 
చేయించి పాటలు పాడుదురు.” చకవర్రి నభ చేసినప్పుడు గానము చేసెడి 
వొరు. అనాటి శిలాశిల్పములలో నృత్య ములు, వాద్య ములు, కోలాటము, 
కాహళలు మున్నగునవి బహువిధముల నిరూపింపబడినవి, బోగముసానులు 
సంగీత విద్యలో పత్యేక కృషి చేసిరి. అంతేకాక నృత్య విద్యను తమ వీల్ల లకు 
౧౦ ఏండ్లకు ముందుకుండియే నేర్పరి, తమ పిల్లలకు ౧౦ ఏండ్లు పడువర కే 
“దెవదాసీలనుోగా చేసెకివారు. వ్యభిచార వృ _తిలోని వారగుటచే వారికి 


CTT TTT DMT NT rrr] 
1. Salatore, Vol. Il, 
2 ఆముక్తమాల్యద ౫-౧౧౮, 


విజయనగర సామాజ్య కాలము 249 


గౌరవము తగ్గుటకు మారుగా హెచ్చినదనియు గొప్పగొప్ప అధికారులు 
వారి నుంపుడుగ తెలుగా బాహాటముగా నుంచుకొనిరనియు పీన్‌ ఆశ్చర్యపడి 
(వా సెను. బోగము చ్రీలకు రాజభవనా౨లో నిరాఘాట పవేళ ముండెను. 
హజార రామాలయములో నానాభూషణములతో మురున్తూ వున్న సానులను 
సంభాలపై తీర్చినారు. వాటిని జూడగా వలువురు బిరులాగులను దొడిగి 
వాటిపై లంగాలు కట్టినారు, దేవీ నవరా|తులలో (పతిదినము (పొద్దున భువన 
విజయములోను, రథోత్సవము లన్నింటను, దేవాలయములలో (పతి శనివార 
మున్ఫూ, వారు నృత్యము చేయవలసినవారై యుండిరి. నవరా(తులందు మధ్యా 
హ్నము భోగ పుసానుల కు సీకూడా జరిగెకిది, (కుస్తీ కిచ్చిన పాముఖ్యమును 
కూడ ఇది నిరూపించును.) దేవాలయములలో నాట్యమంటప ముండిెడిది. అందు 
సానులు నృత్యము నేర్పెడివారు. వారికి నృత్యము నేర్చించు గురువునకు కొన్ని 
యినామలు రొాయలవా రిచ్చిరి. సంస్కృతములోను, కన్నడములోను సంగీత 
థాస్త్రములు వెలువడెను. 


కూచిపూడివారి భరతాభినయముల |పభ్యాతి యూ కాలములో నుండెను, 
మాచుపల్రి కె ఫియత్తులో ఇట్లు (వాసినారు. “స_బెట గురువరాజు (పభుత్వ 
ములో [పజలకు ఆతి దారుణశిక్ష చేన్తూ వుండేవాడు. (పవజలు సొమ్ము త్వరగా 
ఇయ్యకపోతే స్రీలను రీసుక వచ్చి _సనాలకు చిరుతలు పట్టించేవాడు. ఆలాంటి 
దినాలలో వినుకొండ, బెల్లంకొండ తట్టునుంచి వచ్చిన కూచిపూడివారు అదిచూచి 
అక్కడనుండి లేచిపోయి విద్యానగరము పోయి అక్కడ వీరనరసింహరాయలు 
రాజ్య పరిపాలనం చేస్తూవుండగా భాగవతులు దర్శనం అయి కేళి అడుగగా 
సెలవు ఇచ్చినారు. అక్కడ కీర్తన వినికి చేసే అప్పుడు ఒకడు సంబెట గురు 
వరాజు వేషం వేసుకొని, ఇద్దరు బం|టోతుల వేషం వేసుకొని, ఒకడు గ్రీవేషం 
వేసుకొని, సంబెట గురువరాజువలెనే అన్ర్రీయొక్క స్థనాలకు చిరుతలు పట్టించి 
సొమ్ము యివ్వుమని తహశ్మీలు చేసినట్లు వినికిచేసినారు..........రాయలు సంగ 
తులు కనుక్కొని మరునాడు సైన్యం సిద్ధంచేసి రామయలకుమారుడు అనిపించు 
కొన్న ఇసుమాలుఖొనుడ నే తురకను సర్హారుగా మొక్కరారుచీసి పంపెను. అతడు 
సంబెట గురువరాజు పె లడాయిచేసి గురువరాజును పట్టుకొని తలకోని తీసుకొని 


పోయినాడు. కోటలో స్త్రీలు బాలురు అందరు దేహత్యాగం చేసినారు.” 
(32) 


250 ఆం|ధుల సాంఘిక చర్మిత 


ఆనాటినుండి నిన్న మొన్నటివరకు కూచిపూడివారు భరణాభినయాన్ని 
కాపాడి దేశమందు ప్రచారము చేసినట్టివారు. “*కడిపోని తెరనాటకపుటూరి 
జంగాలు” (వేంకటనాథపంచ ౪-౨౪౦) అనుటచే ఊరి జంగాలు కృష్టా గోదా - 
వరి జిల్లాలలో నాటకొలాడెడివారని తలపవచ్చును. 


ఆం|ధభాష సంగీతానికి అత్యంతానుకూల మైసట్టిది. దక్షిణా పథమందంత 
టను, కన్యాక చూరినుండి కటకం వరకును ఇతర (దావిడ భోషలవారు తెనుగు 
పాటలనే యక్కుువగా పాడుదురు. విజయనగర రాజులు కన్నడ రాజ్యమున 
క ధీశులగుటచేత సంగీతముకూడా కర్ణాట సంగీతమయ్యెను. నిజముగా ఆంధ 
సంగీతమని దానికి జేరుండెను. తం కోతులు సంగిత ఏద్యయందు (పత్యేక 
కృషిచేసిరి, తంజావూరి రఘునాథరాయలు రఘునాథ మేళ యను [కొ త్తవీణను 
సృష్టించెను. పూర్వము ఓక రాగమునకు ఆం్మధ్రీరాగము అను పేరుండెను. అనగా 
గాంధార దేశము గానమున కెట్లు పసిద్దివపాంచెనో ఆంధదేశ మిట్లు మరొక 
విధమగు (కర్ణాట సంగీతము) గానమునకు పసిద్ధి వహించెనన్నమాట, 


*'విభ్రావిసీతు పౌరాళీ వేగవంతీతు పంచమా 
ఆంధీ గాంధారికా చైవ సత్స్యుర్మాలవపంచమా”, 


తనుగు సంగీత విద్వాంసులు హిందూస్థానములో పరరాజులను, ముస 
ల్మానులను మెప్పించిరి. విఠలుడు అనునతడు సంగీత రక్నాకరభాష్యము 
(వాసెను, అతని తండి ఎవి రాగ శుతులలో (పవీణు డగుటచే గుజరాతులోని 
మాండ్వీసులాను అను గయాసుద్దిన్‌ మహమ్మద్‌ ౧౦౦౦ తులాల బంగారు నిచ్చి 
బహూకరించెను.! ఆ కాలపు కం వాజ్మ యములో గొండి ల 
వలుమారు (వౌసినారు, ఢీ) మానవల్లి రామకృష్ణక విగా రిట్లు పానినారు జాయ 
సేనాని తననృత్త రత్నావళిలో_దాజక్య భూలోక మల ల, సో మేశ్వరుడు దానిని 
[పచారము చేసే” నని తెలిపి యీ (కింది [ప్రమాణము నిచ్చెను. 


'“కల్యాణకటికే పూర్వం భూతమాత్య మహోత్పవే 
సోమేశః రుత్తుకీ కాంచిత్స్‌ భిల్లవేష ముకే పేయుషీం 
నృత్యంతీ మథ గాయంతీం స్వయం (పేష్య మనోహరం 
1 శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు. 

Journal of Andhra H; R. Vol. గృ, P. 174 


విజయనగర సా[మాజ్య కొలము లర్‌ 1 


[పీతో నిర్మితవాన్‌ చి[తం గోండలీవిధి మత్యయం 
యతో భిల్లీ మహారాష్టే గోడిగీత, భిధీయతే."! 


దీనినిబట్టి గోండు లను ఆటవికుల నృత్యము దేశమందు వ్యాపించె 
ననియు దానికి గోండినీ అని పేరై (క్రమముగా గొండిలి, గొండ్లి యయ్యెనన 
వచ్చును. | య. 


దేవాలయములందు, రాజసభలయందు బోగమువారు నృత్యముచేసి రను 
టకు “హరి కొల్వు*న్‌ వివిధలాస్యస్పర్థి సుభ్రూభుకుంసుల వాదుల్‌ సరిదేర్చి 
పుచ్చి" ఆని రాయలు |వాసినదే !పమాణము.? |భుకుంసులు ఆన త్రీ వేషములు 
వేయు పురుషులు. నాట్యపు పోటీలు కూడా జరిగెననియు నిపుణులు ఉత్తమ 
మధ్యమాది నృత్యములను నిర్ణయించి రనియు వె యుదాహరణము తెలుపు 
తున్నది. మృదంగాదివాద్యములలో కొన్నింటిని రాయ లెట్లు తెలిపినారు. 
“మృదంగం బుపాంగంబావజంబు దండెతాళం బురుమ కిన్నెర సన్నగా? వీణె 
మఖఏష వాసె (గోలుడోలు మౌని భేరి గౌరు గుమ్మెట తమ్మెటంబు డుక్కి 
డక్కి. చక్కి చుయ్యంకి లోనగు నసంఖ్యాత వాద్మిత తితయపరంపరలు మొర సె” 
అన తేలును. 


విజయనగర కాల మందలి తెనుగు కవిత [పబంధయుగముగా పేర్కాన 
బడినది. మహోాకవు లీ కాలమందు వెలసిరి. కవిసార్వభ్రాములు, ఆం[ధకవితా 
పితామహులు, సాహిత్యరసపోషణ సంవిధాన చక్రవర్తులు, ఈ కాలమందె వెల 
సిరి, రొజులు కత్రి (తిప్పిన వడితో నే గంటము (తీవ్పీరి. శ్రీల కూడా సంస్కృ 
తాంధములందు సుందరక విత ల ల్రిరి. గంగాదేవి, తిరుమలాంబ రామభ|దాంబ 
మున్నగు స్రీలు [పసిద్ద కవయితులు., గోలకొండ మలక లచేతను జిలిబిలి తెలుగు 
పలుకులను పలికించిరి. ఇ|బహీం ఇభరాముడయ్యెను ఈవిధముగా కళ లానాడు 
సర్యతో ముఖముగా వర్ధిల్లి దేశి విదేశీజనులను ముగ్గు లగునట్లు చేసెను. 


1 శ) మానవలి .... ఉత? 
య 

వి ఆము క్రమాల్యద, వ | = 

కీ ఆము, ౪-౩౫. 


252 ఆం|ధుల సాంఘీక చరిత 
పంచాయతీ సభలు 


ఆ కాలమందు కోర్టులు లేకుండెను. (ప్రతిగామమందు (గామపెద్దలు 
(పతిఫలాపేక్ష లేక తగవులు తీర్పుచేసిరి. విజ్ఞానేశ్వరీయమే ముఖ్యాధార భూత 
శాస్త్రము. (బాహ్మణులే సభాసదులు. వారి తీర్పులపై రాజువద్ద పునర్విమర్శ 
(అపీలు) కావచ్చును. సాధారణముగా వారి తీర్పునకు తిరుగు లేకుండెను. ధరో 
ద్భవ (సివిల్‌ ), హింసోద్భవ (_కిమినల్‌ ) అని మోగములను (కేసులను) వారే 
విచారించిరి. ముఖ్యమైన నేరమ లను రాజు స్వయముగా విచారించినను “సభి 
వారిని పిలిచి వారి సహాయముతో తీర్పు చెప్పెడివారు. 


“సభ”ను చావడిలోనో, దేనాలయవాందో, ఊ౦మధ్య మండు “రచ్చ” 
కట్టపెననో చేసిరి. అందుచేత వివాదమునకు సభగా కూడుటకును “రచ్చ” 
యనిరి.(1) రాజు స్వయముగా విచారించినప్పుడు, 


“తీర్చరిం బిలిచి చేతికి నిచ్చి కనలి యీ చోరునకు నాజ్ఞయేది శాస్త్రంబు 
చూచి సేయింపు డచ్చుగ మీ రటంచు 
తెలియ విద్వాంసుల దిక్కు వీక్షించి“ పలికె(2) 


ఒకతడవ ఒక వె షవునికి, జైనులకు ఇయ్య వలసిన పత్రము పెకము.పె 
వివాద మయ్యెను. అప్పుడు, 


“ఘనుల గొందర సభగా గూడబెట్టి తనవారిపనలు చందము జెప్పి 
కొన్ని దినమ.లు గడువిడి తేటతెల్లముగ సమ మాస తిథి వార సరణు 
లేర్పరచి ఆమర జైనుల కిచ్చినట్టి పృతంబు క్రమ మెట్టిదనిన.......” 


సభ వారియెదుట ఉభయులును తమతమ వాదాలు వినిపించిరి, సభవారు 
సాక్షు లెవరని విచారించిరి. 


“....మా కిచ్చిన పత మదె సాక్షులున్నార లౌ గాములకు” 
“అనిన వారాప్యత మాసాకి వారు వినుచుండ వడి చదివింపో”() 


సభవారు విని తీర్పు చెప్పిరి. 


(1) ఆము, ౪-౧౧౧. 
(2), (8) పరమయోగివిలాసము, పుట ౩౪౦. 


విజయనగర సా|మాజ్య కాలము 0. 


రచ్చకట్టకు వాది పతివాదుళలు కానుక లిచ్చెడివారు. 


*ళళ్రగవ్చ వారలతోట తమకను ల్నొ డివి 
కట్టకానుక లిడి కడపట నిలుప 

గట్టిగా నా కార్యగతి విచారించి 
ఆల మున్న సభవార లాయిరువురను 

see బిలిచి యిట్లనిరి ఆరఠయంగ 
నీమాన్యమైన యందులకు 

పరగంగ సావ్షసంబంధములు కలవె 
యనిన ఎక్కడసాక్షు లలనాడె పోయి 

రనిన పతముకలదా యని యనిన 
అడర మాతొటి యేడవ పెద్దతాత 

కిడిన ప|తము చెడ కిన్నాళ్ళదాక 
దనరుచునుండంగ తామళాసనమె 


యనిన సత్యము సేయుమన. ,.పలుమాట లేల తప్పదు శౌరిసాక్షి 
యని సత్య మొనరించి యలవాని గెలిచి........జనుదెంచె” 1 


=) 


పె పంకు లానాటి పంచాయతీ న్యాయస్థాన విధానమును వెల్పడించును. 
సభవారు వాదములను విని సాక్ష్యములు తీసుకొని “సత్యము ((పమాణము) 
చేయించి”' శాస్ర్రములను చూచి త్రీక్పు చెప్పెడివారు. “సత్యము చేయట” 
సామాన్య విషయము కాదు, (పజలు అ|పమాణము చేసిన నిర్వుంశ మగు 
ననియు, సంపద తొలగిపోవుననియు భయపడిరి. పంచాయతి సభ్యులును ఆన్యా 
యముగా తీర్పు చెప్పుటకు భయపడెడివారు. అయినను అందందు లంచాలు 
తీసుకొని తప్పుడు తీర్పులు చెప్పువా రుండి రని వేంక టేశశతకములోని సూచన 
లను తెలిపినాము. కాని ఆది యరుదు. ఆట్టివారికి సంఘమందు మర్యాద లేకుం 
డెను. పంచాయతీ సభా విశిష్టతలు అనాటి తెనుగు సారస్వతములో పలుకావు 
లలో వెల్లడించినారు, అది యు త్తమ పద్ధతిగా నుండెను, ఇంగ్లీషు కోర్టులు, 
వకీళ్ళు, శాసనములు, బారీకులు, ఆ[పమాణాల నిర్భయత _పబలిన యీ కాఆ 
ములో ఇక, ఆనాటి అచ్చపు పంచాయతీ రాజ్యముయొక్క- పునస్థాపన కానే 
రదు. ఇది విజయనగర సామాజ్య |పథమకాల సాంఘిక చర్చాలేశళము, 


1- పవ, యో. విలాసము పు, ౫3౨-8, 


204 ఆం[ధుల సాంఘిక చరిత 
ఈ సమీక్షాకాల సాంఘికచరి(త్ర కుపకరించు (గంథములు ;ా 


౧. ఆము క్షమాల్యద ;:_ శ్రీకృష్ణదేవరాయ (పణీతమ, శ్రీ వేదం వేంకట 
రాయ శాస్త్రిగారి వ్యాఖ్యాన సహితము. శ్రీ కళా పపూర్ణుల నొకమారు తమ 
మనఃపూర్వకాళి [ప్రాయములను విచారింపగా “రాయలవారు చేసినారు; పెద్దన 
గారు చూచినారు” ఆని ఒకేమాటతో సెలవిచ్చిని, అదే నాయభి పాయము. 
గట్టిగా రాయలవారే యీ (గంథాన్ని |వాసినారని వేను విశ్వసింతును, 
సంపూర్ణ లోకానుభవ మి-దు కలదు. ఆడుగడుగునకు సాంఘిక చరితకు 
వనికి వచ్చును. ఈ విషయమందది తెనుగుసారస్వతమున ఆగస్థాన మలంక 
రించును. అపూర్వ స్వాభావిక వర్ణనలు, తేలికయగు హాస్యము ఇందు 
నిండుగా కలవు. సర్వతంత స్వతంతులవ్యాఖ్య లేకుండిన సగము మన 
కర్ణము కాకుండెడిది. 


౨ పరమయోగివిలాసము : తాళ్ళపాక తిరువేంగళనాథుడు. ఇది ద్విపద 
కావ్యము. కవిని చిన్నన్న అనియు విలిచిరి. “చిన్నన్న ద్విపద కెరుగును” 
అన్న సూ క్రి యితనిగురించియే. వేణుగోపాలశతక కారుడు “అల తాళ్ళ 
పాక చిన్నన్న...” అని తిట్టిన దితనినే! ఇతని కవిత్వములో ఒక పం క్రీ 
పూర్తి సంస్కృతసమాస మొక్కటియు లేదు. తెలుగు నుడికారమే అంత 
టను కలదు. పాండిత్యములో పాల్కురికి సోమనాథునికన్న, గౌరనకన్న 
తక్కువదేయగును. కాని మనసాంఘిక చరిత కడిచాలా పనికివచ్చును. 
ఈ దృవ్షిలో వసు, వను చరిత్రాది బహ్నుపబంధాలకన్న నిది చాలా 

మేలై నది." 

౩, మధురావిజయము :--గంగాదేవీకృతమగు సంస్కృత బారి తిక ,గంథము. 


దీనిని [ప్రకటించిన చర్మితాబార్యులు ఇందు సత్యమగు చరిత్ర కలదని 
నిరూవించినారు. చక్కని సుంవరక విత. తెనుగర్భముతో ము[దింపదగినది. 


౪. కృష్ణరాయ విజయము కుమార ధూర్జటి. కవిత్వము అపాటిదే. పేరు 
బారిత్రాత్మ క మైనను అందలివిషయాలు పనికివచ్చునవి కావు, : 


౫ (క్రీ కాళవా సీ సి మాహాత్మ్యము : సాచాధూర్డటి, మూడన యాళ్వాసమే కొంత 
పనికి వచ్చునది, 


విజయనగర సా మాజ్య కాలము వీగ్‌ర్‌ 


ఇ, రాధామొధవము = ఎల్హనార్యక వి 1౧ ఈ రెండును చాలా 
| కొదిగా ఉపకరించును, 
9, కళాపూర్ణోదయము ఫాచావీంగళి సూరన ది 


TC. Vijaianagar Sexcentenary Commemoration, Volume (1936): 
ఇదిబాగా పనికివచ్చును, కొన ఇందు రాజుఠవ౦ళాలు, వారి పరిపాలన కాలాలు 
లేవు. ఇది కర్ణాటక దృష్టితో బౌయింపబడినది, 


౯. Social Political Life in the Vijaianagar Empire Salatore 2015 
ఇది చాలా సహాయకారి. ఇదియు కేవల కర్ణాటక వాదిచే [వాయబడినందు 


నను, (గంధక _ర్థకు తెనుగు రానందునను, మనకు (పధానముగా పనికి 
వచ్చునది కాదు, 


౧ం. రాజవాహన విజయము - కొకమాని మూర్తి, 


౫వ [పరరణము 


విజయనగర నామ్రాజ్య కాలము 


(క్రీ॥ శ।|। ౧౫౩౦ నుండి ౧౬౩౦ వరకు. 


(శ్రీకృష్ణదేవరాయ నిర్యాణానంతరము విజయనగర సామాజ్యము ౧౫౬౫ 
వరకు మహోజ్జ్వలముగా సాగి, తళ్ళికోట యుద్ధములో దానికి మొదటి 
పెద్దదెబ్బ తగిలెను. దక్కన్‌ సుల్తాను లేకమై రామరాజును చంవి ఆతని పైన్య 
మును చెదఠగొట్టి విజయనగరాన్ని ఆకమించుకొని ఆరునెలలు ఆదేపనిగా 
విధ్వంసనకర్మలో నుండిరి. కాని విజయనగర బలము కీణించలేదు. తిరుమల 
దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేనుకొని రాజ్యముచే సెను ఆతని 
నంతరము శ్రీరంగరాయలు చాలా దుర్భలుడగు రాజగుటచేత తిరుపతివడ్ద 
నుండు చందగిరికి రాజధానిని మార్చుకొనెను. మొతానికి క్రీ. ళ. ౧౬౩౦ 
త ర్వాత విజయనగర సా[మాజ్యము అంతరించెను. దానిశాఖ యొక టిమా(తము 
తంజావూరులో రెండుతరాలు దేదీప్యమానముగా వెలిగెను, 


ఓరుగంటిరాజ్య పతనానంతరము మహమ్మదీయ లనుండి హిందువులను 
విజయనగర సా(మాజ్యము ఇంచుమించు ౨౩౦ ఏండ్లు రక్షించెను. (కీ, శ 
౧౬౦౦ తర్వాత ముసల్మాను నులానుల పాలనములోనికి ఆం(ధదేశమంతయు 
చేరినదయ్యెను. ఆంతలోనే [ఫెంచివారు, ఇంగ్లీమవారు దక్షిణాపథరంగముపై 
(పత్యతమైరి. వారుకూడా దేశమును దోచుకొని పోదలిదినవారే కాని రక్షంప 
దలచినవారు కారు. అందుచేత (క్రీ శ. ౧౬౦౦ నుండి ౧౮౦౦ వరకు ఆంధ 
దేశములో అరాచకము పూరిగా తాండవించెను. అదొక అంధకార యుగము. 
౧౮౦౦ నుండియైనను ఉతరసర్కారులు రాయలసీమ ఒక విధమగు స్థితికి 
వచ్చెను. కాని తెలంగాణా మా|తము ఆధునిక కాలమువరకు దుర్భరస్థితిని 
యెటులో భరిన్తూ వచ్చినది. 


విజయనగర సా|మాజ్య కాలము 257 
మతము 


కృష్ణరాయల కాలములోని పరిస్థితులలో మార్పు లంతగా రాలేదు. కాని 
తర్వాతి వాజ్మయములోని కొన్ని విశేషముల నిందు తెలుపుట యవసరము, 
హిందువులను వారిమతమును, వారిసృవ్షిని, (Culture ) నిరంకరము ముస 
ల్యానులు ద్వేషించినను పాండూరాజులు సుల్తానులతో రాజకీ యముగా భిన్నంచిరే 
కాసి వారి మతాన్ని ద్యేషించినవారు కారు. (ప్రజలుకూడ ఇస్తాముమతమును 
ద్వేషించినవారు కారు. పల్నాటిసీమలో పల్నాటి వీరాలయములలో ఒక ముస్తిం 
గోరీ కూడా దేవాలయావరణమందే కలదు. నేటికిని ముసల్యా నులు హడా 
కార్షికమాసమందు జరుగు పల్నాటి వీర పూజలలో పాల్గొందురు. గుల్బర్గాలోని 
(పసిద్ధమగు వలీదర్గాపె భవనమును సేర్‌ నారాయణ మహోరాజ్‌ అనుశనతడు 
కల్లించెనని |పతీతి కలరు, 


టె 

పెనుగొండలోని బాబయ్య అను తురక వలీదర్షాకు సాళువ నరసింగ 
రాయలు కొన్ని [గామాలు దానముచేసెను. దానికే తర్వాతి రాజులును దానా 
లిచ్చిరి. జటిలవర్మ కులశేఖర పాండ్యరాజు కా॥ శ॥ ౧౪౭౭లో ఒక మసీదుకు 
గామము దానము చేసెను. ముసల్మానుల మసీదులు ఓరుగంటిలో నుండెను, 
“ఇదె కరారుడుండు తుర్క్శలమసేదు” అని (కీడాభిరామమలో స్థలని దేశము 
కూడా చేయబడినది. ఈ కర్తారుడు ,కర్తార్‌) అన యే మస్థిందేవతయో. 
తెలియదు. 


“కరారుం డనుచుం దురుష్కు.లు మొదల్లా గొల్వ _బత్యక్షమై 

మార్తాండుం డుదయించె నద్దితటసీమ (పాళితౌర్వాకృతిన్‌ "! 

అని EL శ1॥ ౧౫౮౫లో నుండిన మల్పనక వి వర్ణించెను. దీనినిబట్టి 
సూర్యుని తురకలు కరారు డనిరని తలపవచ్చును. కాని ఇస్తాము మతములోను, 
దానికి సంబంధించిన భాషలలోను కరఠారుపద ముండినట్టు కానరాదు. మునల్యా 
నుల రంజానును రోజాను ఒక కవి యిట్లు వర్ణించెను, 


1 విపనారాయణచరిత-_చదలవాడ మల్లయ ౩-౫౦. 
(33, 


958 ఆం|ధుల సాంఘిక చరిత 


“చనుపకముల తావిగొనక రోజాలుండి తేటిమలక మల్లెతెల్ల విరుల 
చందు చూచి విరహ జయకాంక్షమైదుగానా యొనర్చె నుత్త 
రాయణమున.'! 


(చనుపకము=చంపకము మలిక్‌ శబ్దమును మలక చేసినారు. చందుకా 
చంద్రుడు. దు౮నా=రెండు నమాజులు.) 


శైవ వైవ్పవులలో పరస్పరాసహనము పూర్వమువలెనే యుండెను. 
వ్మిపనారాయబణుని పై దొంగతనమును మోవి ధర్మాసనసభయందు విచారణ 
చేసిన కాలమందు *“'వైష్టవులకుం దలవంపులుచేసె” నని వెష్టవులిట్లు ఖేదపడరి. 


“ఆభ్రియాతుల్‌ మొద లీమతంబునకు మాయావాదు లాత్మీయ దు 
ర్వ్య్యులిచారం బది మేరువంతయిన మాయన్‌ మిథ్య లేదం|డు "పె 
ల్రభియోగింపదు రన్యదుష్కృతము గోరంతైన గొండంతగా 

పభువుల్‌ హాస్యరస ప్రియుల్‌ మశల నీపాటైన మన్నింతురే ?” 


మొదలే మామతానికి శ|తువులున్నారు. వారు తమవారి తప్పులను కప్పి 
పుత్తురు. మన తప్పులైతే కొంచెమున్నను కొండ ంతచేసి రచ్చుకెక్కి౦తురు. అను 
టచే ఈ సూచనయంతయు ఆద్వైతుల దిక్కే_ యనుట స్పష్టము. “_బహ్మ 
సత్యం జగ న్మిథ్యా'” అను మా మామిథ్యావాదమును ఆదె తులు చేసిరి. ఇత 
రులు “ఈతన్ని చోరు డనగాదు; జారు డనరాదు; అనాచారు డనరాదు.” 
“పోరన మీర లీతనికి బూనుడు ఖహ్మరథంబు వైష్టవుల్‌'” అని సోల్లుంథనము 
లాడిరి. () ఇతరులనగా అదై ఇతులునుు, శై వులును కావచ్చును. 


హిందూసంఘమునకు విశేషముగా కష్టము కలిగించినది సాం్మపదాయి 
కతయే, వివిధసం,పదాయక ములలోని జనులలో అశేకకుటుంబములవారు కేవలము 
సంపదాయము పేరుపైననే బదుకటకు మొదలు పెట్టిరి. 3 వులమని మఠాల 
నాశోయించినవార్కు వైస్టవులమని దేవాలయముల నాకయించినవారు, మతము 
పేరుతో దిచ్చమత్తుకొను వారును ఈ కాలములో బహుళమైరి. నంబులు పలు 
వురు 'దాసరిటుట్లి” లతో బయలుదేరి బిచ్చమె తిరి. వ్నిపనారాయణుడు ''తిరు 

l సాంబోపాభ్యానమా--రామరాజు రంగప్ప-.౨-౧౦౩, (ఇత డిందు 

మించు bu శ॥ ౧౫౬౦ (పాంతనులోని వాడు.) 

() సారంగు 4... 


విజయనగర సా్యమాజ్య కొలము 259 


వరంగం బెరయకోవె” లనుచు వికిర మెత్తె '*1 శ్రీరంగ మే పెద్దకోవెల అని 
పై అరవమున కర్గమని భాషాత_త్హ్య కాస్తానునరణి నూహంతును, పై చరణ 
ముతో (పారంభమగు ఒక _పసిద్ధమగు తమిళపాటగా ఆది కానవస్తున్నది. 
చూడథభూచి మఠం వేంకటాచార్యులగారు తమ పాళురసరిమళములు అను పుస్తక 
ములో నిట్లు |వాసిరి. 


తీరువరంగము అను శబ్దము ,(దావిడమున శ్రీరంగము తిరువ రంగం 
తిరుమాల అనునది [దావిడ దివ్య,పబంధములోని మొదటి వేయిగానములలోనిది. 
చీనిని బాడినవారు ఆంధలోకవిదితులై న వి(పనారాయణులవారు. వారి చరి త 
మును---వై జయంతీ విలాసమును చదువని యార్మధుడుండడు. వారు పన్నిద్ద 
రాళ్యారులలో నొకరు. వారి తిరువరంగం తిరుమల (శ్రీ వెష్టవాలయంబుల లో 
గానము చేయబడును.” అందలి యొకగానమును మాడభూషివారు తెనుగులో 
నిట్లు చౌసినారు. 

చ॥ ోధనువొకటన్‌ మహాజలది దర్పమణంచి జగంబు పొంగ భం 
డనమున రావణాసురు నడంచిన యామన సేవకుండు నె 
కొ్కానీవసియించు నీ శేరియకోవెలరంగని దామమంచుబే 
ర్కానకయె కాలముం గడవ [దోతురె తత్క రుణావిదూరులై ”' 


ఇత్యాది సో, తములలో "తిరువరంగం పెరి నకోవెలి' ఆను భావము 
లిమిడి యున్నవి. 


““బలియ, బికిరంబు, జోగు, గోపాళ మనుచు? మరికొందరు బయలు 
దేరిరి. జోగు అనునది ఎక్కలి దేవిని కొలుచు జక్కుులవారు యాచించు 
బిచ్చము* వారు *ఎక్కలేజోగు” అని నేటికిని యాచింతురు. గోపాళముకా 
సందెగోపాళ మనునదే. గత పకరణములో తెలివినట్టిదే 


శ్రీరంగ ములో “రామానుజకూటము లుండెను "లి కొని తెనుగు దేశ 
ములో నుండెనోలేదో చెప్పజాలము. తంబళ్ళనుగురించి యిదివరలో కొంత 
నాన న 

l వై జయంతీవిలాసము త్రి=డాఎి 

2 విపనారాయణచరి త. ౩-౧౫. 

8 వ్మిపనారాయణచరి[త, ౨.౬, 


£60 ఆంధధుల సాంఘీక చరిత 


తెలిపినాము. వారికి పధానముగా శివాలయములందు పూజారితన ముండెను. 
తంబళిపదమున కమర్థమో తెలియరాలేదు, వారు దేగాలయములకు విస్తళ్లు 
(వతిదినము తెచ్చి యిచ్చువారు. “తిరుమల దేవరాయల కాలములోని ఒకళాసన 
మునుబట్టి వాటికి ఆదెప్పనాయనింగారి కార్యక గ ఆయిన నూరపరాజు గోరంట్ల 
లోని సోమేశ్వరదెవాలయమునకు వి సళ్లు తంబళివా రిచ్చుకొనుటను వారి [పార్ల 

జ ర్‌) ® 
నపై నిలుపుదలచేసి అందుకుమారుగా దేవాలయమును బాగుచేయునట్టు కాసించె 
నని తెలియ వస్తున్నది (1)." 


వైష్టవాలయములు కట్టించినప్పుడు “విష్ణుపతిమోత్సవము'' చేసెడి 
వారు, (శివాలయములకుకు అల్లే చేసిరి.) శ్రీవై షవులు ద్వాదశ పుం|డక ధారు లై 
శ్రీచూర్ణ రేఖలు దిద్ది “తిరుమణి వడములో" తో “'తిరుపగూడలి' తో “చెర్వము 
లతో ఆ యుత్సవానికి వేంచేసిరి. తిరుమణి వడముణాశామరపూసలదండ. తిరుప 
గూడ=నామాల సాధనమలు కల తాటాకబుట్ట. చెర్వము=చరువ =పాత ,£ 
వైష్ణవమత _పచారమును వైష్టవకవులుకూడా చేసిరి. సాంబోపాఖ్యావము వాసిన 
రామరాజు రంగప్న ఇట్లు |వాసెను. ''సిద్ధాంతద వృణుఎడను గురుడు హస్తి 
నాపురికి పోయి భీష్మ ఇ పిదూదులను పంచ సంస్కార సంస్కృతులను 
గావించి శరణాగత ధర్మంబుల భాగవతవాత్సశ/్యంబును తెలిపి, హరికథా [శవ 
ణము కావించి అష్టవిధ భక్తి !పకారంబును, నవవిధభ క్రి యుక్తులను తిరు 
వారాధనా మర్యాదలను ఆదిగాగల వరమవై ప్టిప సిద్ధాంతంబు బుద్ధి గోచరంబున 
జేయుచుండె.''క 


వై ష్టవాలయములలో పూజారులు “తాతలతరంబు నాటినుంటి యా.ళ 
యించి జీవస్తూవుండిరి. నై వేద్యములను వారే ఆనుభవించెడివారు. ఖక్తులిచ్చిన 
దీపారాధనపు నూనెను వీలుకొలది తీసుకొనెడివారు. భక్వలిచ్చు దక్షిణలవల్ల 
మంచి లాభము పొందిరి. 


“విను మేము (పాలుమాలిన దీవె సుడిగాక, కినిసిన రెండు గుగ్గిళ్లుగాక 
తక్కిన నింత _గంథ(పసాదమ గాక, మనపైన నొక వడతునుక గాక యట 

(1) Salatore. II 

2 పాంబోపాభ్యానము! ౪-౧౪౭ 

కీ సాంబోపాఖ్యానము, ౪-౧౫౨. 


విజయనగర సా(మాజ్య కాలము విగ్ర] 


మటించిన కుంచెడంత సాదముగాక, కాదేని యొక గుల కాసుగాక దాఓకొన్నను 
బలితంపుజింపుడు గాక, విక్కిన నౌక పోకవక్క.గాక...”! 


ఆని పూజారులనుటచే వారు గుడి పె జీవించు విధానము కానరాగలదు. 
“"ధర్మస తపు బాహ్మణులు" పలుపురుండిరి.* 

లత్మీదేవిపండగను జనులు చేసెడివారు. దీనిని శరత్కాలమున చేసిరి" 
ఆ పండుగనాడు విటులు బోగమువారికి “పండుగదండుగలు" సమక్సెంచు 
కొనిరి 

“మింఠజనద త్త మేషి కంఠ సముద్భ్ఫూత రవము కడు నెమ్మది, ను 

త్కంఠ సలిపె, వెళ్యాకలక ంఠుల క తరి గృహోపకంఠములందున్‌." 


ఈ విధముగా రూకలు, కోకలు, ఆకులు, పోకలు, మేకలు ఇవన్నీ 
సానులకు కానుకలుగా విటు లం౦పిరి.శ్‌ ఈ వర్ణననుబట్టి యీపండుగ దీపావ? 
పండుగయని తోచును. నేటికిని దీపావళినాడు బోగపుసానులు ధనికులలిండ్లకు 
వేకువన వెళ్ళి, మంగళవోరతు లిచ్చి అను[గహీత లగుదురు, 


సంతానము లేకుండిన పున్నామనరకములో పడుదురని శాస్త్రాలలో 
పూర్యకాలపువారు వాసి పోయినందున, హిందువులలో నేటివరకును పడరాని 

పాట్లు పడుతున్నారు. ఆ కాలములో సంతు లేనివారి యవసలు మరీ యెక్కువగా 
రా థి 

నుండెను, 


“ఉపవాసంబులు, సత్య ధర్మ మపి తోద్యోగాది క్చత్య౦బులున్‌ 
జపముల్‌, విపకుటుంబభోజనములన్‌ , శాంతుల్‌ పయస్స|తముల్‌, 
తపమల్‌ దైవతపూజన క్రియలు, తీర్గస్నానముల్‌, దానముల్‌, 

విపరీత పతిబంధ మోక్లీణవిధుల్‌, వేమారు గాపించుచున్‌.” 

ఇంతేకాక బహువిధ దేవతాస్తోతాలు పఠించుట్క పొర్లుదండాలు పెట్టుట, 


చూపిన వేల్పుల కంకా మొక్కుకొనుట, చెప్పిన దానాలు చేయుట పరిపాటియై 
యు౦డెను.* 


1. విసనారాయణ చరిత. ౫-౧౯. 
2 కుక స పతి అ, ౨. 

జాలీ 
లిం వై జయంతీ విలాసము, 3-౮౦0 
తీ, మల్హణచరి త, ఆ. ౧ పుట ౧౩. 


262 ఆం|ధుల సౌంఘక చరిత 


(శ్రీమ[దొమానుజులవారి కాలములో [శీపతి పండితుల యభిపాయ 
(వకారమ్ము తిరుపతి వీఠభదుడు వెంగళయ్యకాగా ఆతని |పభావము తెనుగు 
దేళమువై బహుశీ(ఘముగా వ్యావించుకొనిపోయెను. ఈనాటివలెనే క్రీ, క. 
౧౫౦౦ లో కూడా తిరుపతి మాహాత్మ్యము దక్షిణాపథమం దంతటను నిండు 
కొనిపోయెను. వేంక టళ బ్దమునకు (వేం; కటతీతి. వేం ఆంచి పాపాలట! 
ఎక్క డిధాతువో యేమో?) ఒక కొత్త అర్ధమును ఇటీవలిపండితులు కల్పించి 
నారు. ఇది సంస్కృతళబ్దము కాదు. ఇది వెంగడము ఆను అరవపదము. 
తెలుపుగల బొల్లిగట్లు అగుటచేత తెల్లనిగట్లు అనుటకు ఆరవములో వెంగడము 
అన్నారు, చెంగళ దాని పర్యాయపదము. తిరుపతికి వెళ్ళు భక్తులు పడినపాట్లు 
నాకొలపుకవి యిట్లు వర్ణించెను. 


“ఆగళన్మవతముచే నకుల కార్మ్య్యంబున 
గనువట్టు నోరి బీగములవారు 
(మొక్కు దీర్చుటకునై మూకమూకలు గూడి 
యేతెంచు తలమోపుటిండ్ల వారు 

[పాణముల్‌ చిడికిట బట్లుక యిటట్లు 
దెమలని శిరనుకోడములవారు 
దై హికాయాసంబు దలపక్‌ దొర్షుచు 
నడతెంచు ఫొరలుదండములవారు 
నామటామట (మొక్కు వా రడుగునడుగు 
దండములవారు మిగుల సందడి యునర్చ 
నడరి పన్నగ సార్యభౌమాచలేం[దు గొలువ 
కోటానుకోట్లు పెన్లూట” మరిగె. 


దిగువతిరుపతిలో ఆళ్యారుతీర్ణ సేవ, గోవింద స్వామి సేన చేస్తుండీరి, 
సానావిధభిక్షరులు దారిలో నగపడుతుండిరి. 


“తోవగూర్చుండి బొంతలు |మోలబరచి ముదురుటిండల కోరగా ముసుగు 
జేర్చి పట్టైదండలు మొరయించి పాడుకొనుచు నలరు దాసళ్ళు....” 


బహుళముగా నుండిరి. తర్వాత భక్తులు “మందలుగూడి” శేషశె లము 


విజయనగర సా (మాజ్య కాలము 968 


నెక్కి, అచ్చట పావనాళనిని, పుష్కరిణిని, వెంకన్నను వామన తిర్భమును 
సేవించెడివారు! 


ఇంచుమించు (రీ, శ. ౧౩౦౦ పాంతమువాడగు మంచన, తన కేయూర 
బాహుచరి తలో రథోత్సవమునుు జాతరను సూచించినాడు. ముఖ్య స్థలాలలో 
(పతి సంవత్సర మొక నిర్ణయ మయిన దినమున రథోత్సవము చేస్తుండిరి. 
అదియే తీర్ధయ్యాతగా నుండెను, ఆ య్మాత్రయే జాతర యయ్యెను. రథోత్సవ 
కాలమందు పల్రిజను లెట్లాచరింఛుకొనిరో కదిరిపతి మహాకవి యిట్లు వర్షించి 
నాడు. 


“* ఉ త్సవాలోక నాయాతనానాజన వాతంబులో తమ తమ జనంబుల 
గానక కాందిశీకులైన వారల మీవారిం జూపెదమని తోడుకొనిపోయి విజన 
స్థలంబుల నొడబడకుండిన (యువతులను) పుగడమిం బడవై చ యీలువు గొని 
విడిచినం [గమ్మరి తమ్మన్వేషించు నత్తిమామల గలిసికొని జేలుగుట్టిన దొంగ 
లం బోలె మెలంగు మగ్గాంగనలును.,,, మరియు క టిఘటి తార వసనఖండం 
బులతో బొర్లుదండంబు లిడువారలకు గడతంపు పచ్చడంబు లుల్లెడల వడువు 
నం బట్టువారును, నిట్టసిగల భాగవతులకు వ్యజన వీజనంబుల వీచువారును, 
ఆగంతులకు శీతలోదకంబుభుం భానకంబులును నీడు మబ్దిగయుదెచ్చి గైకొను 
డని ప్రార్థించి యిచ్చువారును” అందుండిరి.* (ఉల్లిగ పదము శబ్దరత్నాకర 
ములో లేడు వివాహాలలో గండదీపము మోయునగప్సుడు ఒక దుప్పటిని తీసుకొని 
నలుగుకు నాలుగంచులు పట్టి మధ్యన నొక కర్రతో ఎ_క్రి డెరాలవలె పైన 
పట్టిన దానిని రాయల సీమలో ఉల్లెడ యందురు.) 


సం|కొంతి పండుగ తెవుగువారి ముఖ్యమగు పండుగలలో నొకటి. 
రాయల సీమలో దానిని పనుల పొంగలి యనిరి, 


“ఇంక నాల్గావంబు లిడనై తిగా యంచు 
గుమ్మరి నెమ్మది గుందికొనక 


1. చం[దఖానుభఠ్నితము, ౫-౪౦ మండీ ౮౫ వరకు, 

కవి; తరిగొప్పుల మల్హన. ఇతడు (కీ శ, ౧౬౦౦ల [పాంతముదాడు, 

2 కుకస పతి. ఆ. ౨. కవి: కదిరీపతి. ఛూ కవి ఇంచుమించు tt శ 
౧౬౩౦ [పొంతము వాడు, 


264 అం|ధుల సారఘీక్‌ చరత 


కుడుము రూకల కెల్ల గొననై తిగాయందు 
బేర లేరని యూరివేర మొంద 

గొరియమందల నించుకొననే తిగా యంచు 
గొల్లవా డూరక కుళ్ళుకొనగ 

పెనుపసుపుపే విత్తుకొననై తిగా యంచు 
కాపు నిద్దరలేక రి శవళింప 

మొనసి వెలచూపి చూపకమునుపె 
వారిసరకు లమ్ము డువోయె నేజాతివారి 

కేన్‌ పాటింపవలసి పేరెక్కి నట్టి యా 

నంబున నంబురుహాయతా&ీ"” 1 


ఆనాడు పొంగలి చేనుకొనెడివారు. ఆ పండుగనాడు కొ త్రకుండలు 
కొనుట, గొరెలనకోసి వాటిమాంసము తినుట, మున్నగునవి చేయుదురని కవి 
తెలిసినాడు. కుడుము తప్పుపాఠ మనుకొందును. ' సనడము" అంటే సరిపోవును. 
ఆ పండుగ కాలములో చింతకాయతాక్కు. క్రై పసుపు వాడుదురు. 


కాపువారికి ఏరువాకవలెనే “వింతటిపండుగ'* యనునది ముఖ్యమైనది, 
వింతటి అనుపదము నిఘంటువులలో లేదు. జొన్నలు విత్తునాడు చేయు పండుగ 
అని దానియర్థము. నేటికిని జొన్నవిత్తనమునకు ముహూర్తముపెట్టి యీ 
పండుగ చేయుదురు. జొన్నవి త్తనము వేయునప్పుడు చేని వద్దనుండు రెడ్డిని, 
చేనివద్ద విత్తనముగింజల భిచ్చమును పొందు నిమిత్తమై (గామపురోహితుడు 
పోయెను. 


“వచ్చిన పెద్దరెడ్డి సుగవాసివి, మే లిపుడై న నీడకున్‌ 

వచ్చితె యంచు బావయను వావిని ద _స్తరలాడి, దాపడా |! 
యిచ్చట జల్లు విత్తు ఫలియించునె వేళ గుణం బెరంగి నా 
యిచ్చకు మెచ్చుగా వదరు మిప్పు డనన్‌ విని యాత డుబ్బునన్‌ "= 


అతనికి [పీతియగు మొచ్చట్లుచెవ్పి-యపుడు చేజేత దీసికొనియె పుద్దెడు 
విత్తులు” (పు బైెడు=పుటికెడుజగ ౦ పెడు.) 


1 శకస ప్రతి, ఆ ౨ 
2 కుకసప్తతి. ఆ ౨, 


విజయనగర సామాజ్య కాలము 265 


ఈ కాలములో మరికొన్ని గామ దేవతలు పుట్టుకొని వచ్చెను. “నయన 
పోలయ్య' అనున దొకదేవత. “నయన పోలయ్యకు నంజలిఘటించి ఆని యొక 
కవి తెలిపినాడు!. ఇట్టి దేవర్లకు అర్భముండదు. ఎవరయినా హాఠాన్మరణ 
మొందిన లేక అద్భుత మరణమందిన వారిని జనులు దేవర్లనుగా జేసి కొలుచు 
వారు, 

(గామగంగ మరొక దేవత. ఆ దేవతకు కాపు పడుచులు పొంగళ్ళు పెట్టి 
పాలుపోసిరి. దొరలు పొట్టెళ్ళ నరికించిరి. మాంటతికులు కోళ్ళ నర్పించిరి.* 
తెనాలి రామకృష్లుడును గామగంగలను గాలిగంగ లనుపేర వర్ణించినాడు. 
గామాధికారి గంగమ్మజాతర చేయుదినము నిర్ణయించి చాటించెను, జాతర 
దినము “పామరజనులి స్త్రీలు గో రెచ్చ చమురంటుకొని శిరస్స్యాన మాడిరి.* 
కొ త్తబట్టలు కట్టి కంట కాటుక బెట్టి, సిందూర తిలకము పెట్టి, కొప్పులో పూలు 
పెట్టుకొని, వేపాకు దండలు వేసుకొని, తాంబూలము వేసుకొని బయలుదేరిరి. 

“ఎడ్డెతనపు గయిసేతల రడ్డులు నడిచిరి పురస్పరద్భార్యంగా 

గుడ్డంబు చక్కి గొట్టం బడ్డ మహోళ కి దివ్యభ వనంబునకున్‌ .” 

ఆ యుత్సవమున మేకపోతుల బలి ముఖ్యమైనది. జనులు కల్లు బాగా 
[తాగి చిందులాడిరి, ఆ జాతరలో పామర స్రీలు చేసిన వేడుకలను కవి యిట్లు 
వర్ణించినాడు. 

“సిడి వేలి తెరవయోర్తు, నిప్పుటేట జరించె నెంతయోర్తు, 
చొచ్చె నిప్పుల పందిరిగుండ మింతియో రు, అనటాకు నంర్హించె 
నతివ యోర్తు.” అంతేకాదు ;-- 

“కాంత యొకర్తు మూపునగండ లిచ్చె 
మారుగా లిచ్చె నొక సుధామధురవాణి 
లలన యొక్క_రు నోరితాళంబు లిచ్భె 
శక జాతర సద్భక్తి శకు లెసగ”లీ 

1 మల్పణచరి త పెదపాటి యె రగార్యుడు, ఆ. ౨ పుట ౩౭; 

ఇతడు El శ॥ ౧౭ వ శతాబ్ది వాడు, 

బ్ర శుక్ర సప్తతి ౨-౭౬. 

§ పాండురంగమాహాత్మకము. 8-౭౫ మరియు ౭౭ తెనాలిరామకృష్ణుడు, 


[కీ॥ శ॥ ౧౫౩౦ |[పాంతమువాడు. 
(34, 


266 ఆం(ధుల సాంఘిక చరిత 


“* ఎక్క-లిదేవికి [గామగంగకున్‌ చవ్పిడిదించి _మొక్కుకొనుటియు 
ఈాబారమై యుండెను(1) సిడిని గురించి యిదివరలో తెళివినాము. భ కీ పార 
వళ్యమున శై వులు నిప్పుల గుండాల పై సుఖముగా నడీచెడిదియు తెలివినాము. 
అకటాకు చినుగకుండ దానిపై నాట్యమాడుట యింకొక విశేషము. స్త్రీలు 
మూప్పను కోసి కండ లిచ్చుట భయంకరాచార మే. మారుగాలిచ్చుట యన 
నేమో! నోరి తాళము లిచ్చుట యన నోటికి బంధనాలు వేసుకుని లేక దబ్బ 
నాలు కుచ్చుకొని [మొక్కులు చెల్టించుట యని యర్థము దేవరకు [మొక్కు 
కొనుటను తీనె లేక తిన్నె పెట్టుట యనిరి. తిన్నె, తీనె అన ఆరుగని శబ్రరత్నా 
కరమందు |వాసినారు. ఇక్కడ అది సరిపోదు. ఇంట్లో ఒక చిన్నకట్టపె దేవ 
రిను బెట్టి నిలుపుకొని మొక్కులు చెల్లించుటకు తీనెబెట్టుట యని యందురు. 
ఒక రెడ్డి భార్య చనిపోయి పురోహితుని కలలో వచ్చి, 


టి బాపడ | రెడ్డికి దెల్పరాదె, న 
న్నాన్నడు తిన్నె వెట్టి నుతి 
యించుచు గొల్వరటంచు బల్కె=*. (2) 
దెవర్ల కింకా కొదువ లేకుండెను, పుట్టలమ్మ సందివీరులు, ఎక్కు లమ్మ, 
పోతురాజు, ధర్మరాజు, క ంబమయ్య, దేవాదులు, కాటిరేడు అనువారును వెలి 
సిరి.,€) చెం? లమ్మ అని మరొక దేవత యుండెను"). నెల్లూరిలో పూర్వము 
చెంగలష్ము అనునామె సహగమనము చేసెను. ఆమె దేవత యయ్యెను. ఆ 
సీమలో నేటికిని చెంగలయ్య, చెంగలమ్మ పేర్లు బహుళము. దెవర్హకు (మొక్కు 
కొని “సాత్కాలు కోరించుటి మరొక యాచారమై యుండెము(5), సాత్కాలు 
అననేమో నిఘంటువులలో లేదు నాకు తెలియదు. 


రోగాలువస్తే భూతబలిగా స్రీలు దివదీసి నాలుగ బాటలు కలియు చోట 
బల్యన్నము పోసి పోయెడివారు. “శృంగాటక ౦బుల కొపు గరితలు ఆగ్గలంబుగా 
భగ్గునం దరికొన బలియర్చించు పొంగళ్ళవలనం గొంతకొంత సంతసింతు.” 


(1) శుకస ప్రతి, D-౪9౫2. 


(2) 9 ౨-౪౪౬ం 
(8) 1» 3-౫౦. 
(1) +, ౩3-౪౦9. 


(5) శుకస ప్రతి సుతు 


విజయనగర సాామాజ్య కొలము _ 267 


అని యొకదయ్య మనెను(1). సివసత్తులకును, తలారులకును, బవనీలకు, ఆట 
పాటలవారికి తిరిపెపృ కల్లు దొరికెడిడి(2). సివసత్తు లను పదము నిఘంటువు 
లలో లీదు. అది శివళ రి తద్భనము. కొందరు స్రీలు సాధారణముగా బసీవి 
రాం|డు శీవమె త్తి (వెనిండి- ఆని తెలంగాణము మాట. అనగా మైనింద 
ఊగుతూ దేవరను నిల్పుటకై ఆర్భాటము చేయుదురు. వారిని సివసత్తులు అని 
నే బికిని రాయలసీమలోను, తెలంగాణ మందలి బహు[పాంతాలలోను అందురు. 


తెలతెలవారువేళ పూర్వము దేవాలయములందు నగారా [మోయించెడి 
వారు. రాజుల భవనాలముందు మేలుకొలుపుల మంగళ వాద్యము లెట్లో అట్లీ 
దేవాలయములందును దేవునికి మేలుకొలుపులుగా నుండెను. “దేవనిలయ (పాంచ 
న్మహామర్గల ధ్వనిచే వేగు టెరింగి””(8) జనులు వ_ర్రించుకొంటూ వుండిరి. 


....రంగకాయి గేహమ్మున బోరున న్మారసె 

నప్పు డహర్ముఖసూచకంబులై యిమ్ముల శంఖదుందుభి సమా 
హిత మంజుల వాద్య ఘోషముల్‌”' 

అని విప్రనారాయణచరి్శిత (౪-౯౮) లోను [నాసినారు. 


పూర్వము వైష్టవాచార్మ్యులకు |గామాలపె కొన్ని హక్కులను అప్పటి 
రాజు లిచ్చియుండిరి. పెమ్మాసాని తిమ్మానాయడు ఆను కమ్మదొర ళా. శ. 
౧౫౬౬ (కీ. శ ౧౬౪౪) లో ఒక శాసనము ఇట్లు [వాయించి యిచ్చెను. 


“తాతాచార్యుల [పపొతులయిన తిరుమల బుక్కు పట్నం కుమార తాణా 
చార్యులవారికి ముసళ్ళ గో(త పెమ్మసాని తిమ్మనాయనింగారు [వాయించి 
యిచ్చిన దేశ సమాచారపతిక--పూర్యంమీ తిరుమాళి ఘెకు కృష్ణ దేవరాయలనాటి 
నుంచి నడిచే దేశసమాచారం దేశం మ్లచ్చా'కాంతమై పోయినందున మా తిరు 
మా? మఘెకు నడిచే |గామాదులు వర్హాశనములు మాకు నడిపించమని ఆజ్ఞనేమి సిరి 
గనుక తమ సన్నిధిలో మేము పంచ సంస్కారములు అయ్యే సమయమందు 
మా గోలుకొండ పాదుషావారు మనసబు యిచ్చిన గండికోటతాలూకా ౪ లక్షల 
౫౦ వేల సీమకు హరిసేవ, గురుసేవ ముదకొనికె గుడి! ట్నం బసివిము|ద 


(1) +; 3-౫౮౩ 
2) ౩, 3౧౧౬. 


(8) ), ౨-5౫౬ 


౨80 ఆం ధుల సాంఘిక చరిత 


తప్పువొప్పు దండనఖండన పదుపావాడం మొదలయిన దేశసమాచారసపవీ 
తమకు సమర్పిస్పిమి" (పెమ్మసాని తిమ్మానాయడు-గండికోట ముట్టడి యను 
లఘుపు స్తకమునుండి |. 

(కీ. శ, ౧౬౫౨ లో గోలకొండ మం తియగు మీర్‌ జుమ్లా గండి 
కోటను మోసము చేసి పోర్చుగిసుల సహాయముతో ఆకమించుకొని కోటలోని 
విగహాలను తెప్పించి ౨౦ ఫిరంగీలు చేయుమని మైలే అను బుడతకీచు వానికి 
చెప్పినాడు. వాడు ౪౮ పొనులవి ౧౦ ఫీరంగీలు, ౨౪ పౌనులవి ౧౦ ఫిరంగీలు 
కావలెనన్నాడు. రాగి విగహాలను కరిగించినారు. అన్నీ కరిగినవి మూసలో, 
మాధవస్వామి మూర్తులు మిగిలియుండెను. వాటిని మూసలోవేసి ఎంత [పయ 
త్నించినా కరగలేదు. ఇందులో (బాహ్మణులమ౦ త ముందని ఆర్బకులను 
బాధించిరి. లాభములేక పోయెను. ఫిరంగి యొక్క టికూడా సిద్ధము కాలేదు. 
టావర్నియర్‌ అనువాడు తానీ సంఘటనను స్యయముగా చూచి తన (౫2౪013 
in 10612) | గంథములో నిట్లు (వాసెను. 

“The Nawab {Mir Jumla) collected a quantity of idols 
from the Pagodas: Among these, there were Six of Copper, 
there of which were 10 ft. high. It was impossible for Maille to 
melt these six, no matter how much the Nawab expended. In 
short, Maille never accomplished making 2 single Cannon.” 

(గండికోటముట్లడి అను లఘుపు సకములనుండి ఉద్ధ్భృత ము. కర్త 
పే రందులెదు. “ఈ వ్యాసము సమదర్శిని అంగీరస సంచిక కోసము ఉధ్హేశింప 
బడింది" అని అందు కలదు.) 


జనుల వేషాలు 


జనులకట్టులో, బొట్టులో, ఆలంరణములలో వై విధ్యముండెను 
నన్నూరు ఎండ్ర కిందట మనయాం[ధులలో ఏవధవృత్తులవారు, కులములవారు 
ఎట్లుండిరో ఇంచుమించు చిత్తరువుపటాలవలె మనకు తనవర్ణనలతో చూపిన 
(పతిభాళాలి పాలవేకరి కదిరీపతి. ఒకొక్క జాతి మనిషిని, స్త్రీని, చక్కగా 
వర్ణించి మనయెదుట నిలబెట్టినాడు. అట్టిపద్యము లన్నియు నుద హరింప యోగ్య 
మైనవి. కాని అటులచేసిన (గంథము పెరుగును. కావున ముఖ్యమైనవి కొన్ని 
యుడ హరించి తక్కిన వానిని సూచింతును, 


విజయనగర సా[మాజ్య కాలము 269 


ఎరుక పాశెగాడు :- 


అంపపొదికి నెమిలిపురిచుట్టి, సెలను అను కపైతోచేసిన విల్లును బూని, 
మొలకు పులితోలుచుట్టి, నడుముదట్టీతో కురుచ విడెము దోపి; పికిలపూలదండలు 
వేసుకొని కుడిచెతిసందిపై గొరగింజల దండ చుట్టి “జుంజురు సికమీద జుట్టిన 
తలముళ్ళు దట్టిలోపల నజ పెట్టుచుట్లు ” కోర మీసలు, మిడి గుడ్డు, వలుద, 
ఓరచ్చులు కలిగి, నట్టివాడు.! (తలముళ్ళు అన చోర సాధనము, వేటసాధనము 
అన్నారు నిఘంటుకారులు. ఇదివరలో ఈ పదము రెండుమారులు వచ్చెను. 
అజ పెట్టుచట్టు అంటే ఏమిటో నిఘంటువులలో లేదు. ఓరచ్చులనగా అట్టల 
చెప్పులు. 


వేట వేషం ;- 


రాజులు వేటకు వెళ్ళినప్పుడు ధరించు విధాన మిట్లుండెను. “పట్టుచర్జి 
డము ధరించి, దట్టి గట్టి, “సరిగెకొంబని కందుసాలెయంగియ బూని, 
చలుప చెంగావి పచ్చడముకప్పి, పచ్చల పోగులు వహించి, కసూరీతిలకము 
తీర్చి, కుడివంక బాకు నుంచుకొని, మెడలో కెంపుల హారము వేనుకుని డాలు 
పట్టి, తళుకువన్నెకుళాయి నె త్తినబెట్టి బయలుదేరుతూ వుండిరి.2 కందుసాలె 
అననేమో? వేపుడు పనిచేయుకాల ఆని సూ. రా. నిఘంటువులో (వాసినారు 
ఇక్కడ ఆ యర్థము సరిపోదు, ఒక విధమగు సాలెజాతివారు నేసిన జలతారు 
అంచుగల అఆంగీయనశి యర్థము చెప్పవలసి యుండును. 


కోమటి సెట్టి వేషం :-- 


“గందపుబొట్టు, వీడియము, కచ్చల పాగయు, కావిదుప్పటిస్‌, 

సందులపూనలున్‌, చెవుల చాటున నీలపుదంటపోగులున్‌, 

క ౦డినయట్టి ఎండిమొల కట్టును, పీలపుటుంగరంబులున్‌, 

బొందవు కి|రుచెప్పులుస్కు బొల్పెనగన్‌ ధసదత్తు చెంతయున్‌. + 

1 చందభాను. ౨. ౨. (తలముడి బహువచనం తలముళ్ళు, నల్పని 
సీలిబట్లను తలకు గుర్తుపడకుండా చుట్టిరిని అర్హముచేసుకొనవచ్చును-) 

ట్‌ ఆ రు & 
ద. చందభాను, ౨-౧౫. 


తి, మల్లణ; ఆ. ౨' పుటం, ౪౫. 


మ అం్యధుల సాంఘక చరిత 


(కచ్చలపాగజుచుంగులరుమాల, దంట=జంటి. 
వృద్ధ వేళ; ne 


అమ్మ గారిపుట్టము కట్టి, అక్కలదేవి తోలుపాదాల చిహ్నూములుకల హారము 
ధరించి, చిట్టికుంకుమబొట్టు పెట్టి, ముల్తెపుకంటె ధరించియుండెడివారు.! 


భటుల పెద్ద నూ 


“కొనముక్కు- పైనుండి కనుబొమ్మలకు వెళ్ళ 

నాభినామమును సన్న ముగ దీర్చి 
చెవిచెంత కొరగ వేసిన కోరసిగసందు తల్పచెంగులబట్ట వెళ్ళ జుట్టి 
చెరుగు దిక్కున తోకచెరగు దూలగ నీలి 

కాసెచే హనుమంతు కాసె వేసి” 


తలవరి మంటపమున (Police Station) దండనాయకుడు (Sub Inspectory 
అమీన్‌) ఉండెను.! వారి దర్జా కూడా ఇప్పటి అమీన్లకు తక్కువది కాదు. 


చలదయః ప|తికో జ్వల దండకాండముల్‌ 
ఘల్లు ఘల్హనుచు ముంగల చెలంగ 
నునుపారి చికిలి బేసిన విచ్చుకత్తులు 
తపనదీప్తుల తళ త్త యనంగ 
హనుమదాకృతులు [వాసిన కంచు 
టరిగలు జాళించు రవళిచే డాలు మించ 
అదరు |కోవుల [మోత కదరి నట్టిక్కుల 
నార్తరావముల వాయసము లరుగ 
ముందటను కంచుకొమ్ము మిన్నంది మొరయ 
జార చోరుల గుండియల్‌ రుల్లనంగ 
వెడలి కోలాహలంబుగా వేళ్యవాటి జేరి 
యప్పట్టణము తలవారి గాంచె” 


lu వై జయంతీవిలాసము 8-౭౧-౭౨. 
వి, వై జయంతీవిలాసము ౪-౬౭, 


8, 99 99 ఇ=౭ట౮ాం 


విజయనగర స్నామాజ్య కారము 971 


తలార్లు కట్టికు చిన్నచిన్న ఉక్కు ఇనుము బిళ్ళల గుత్తులను కట్టి చేత 
బపెడివారు. ఆరిగె లనిన కేడెము అన్నారు నిఘంటుకారులు. డాలులను తోలు 
తోను, ఇ త్తడితోను, కంచుతోను, ఇనుముతోను చేయించెడివారు. ఇచ్చట 
తెలిపినది కందుడాలు, దానికి మూడుకాని, నాలుగు కాని గుడుపలుండును, ఆ 
గుడుపలలో సన్నని ఇనుప గోలీలు వేసెడివారు. అవియే “రవళి చేసినవి, 
ఉక్కు పై విగహాలు వేయించెడివారు. పలువురు సింహాలను, పులులను వేయిం 
చడివారు. ఇచ్చట హనుమంతుని వేయించినారు. ఒకటోగముది శివుని గొలిచి 
దేవాలయమును౦డి వెళ్ళుడు, 
క, గుడివెడలి వైష్పపులు గనుపడకం 
డగ జెలుల సరిగ పట్టుమటంచున్‌ 
పడతి తనయింటికడకున్‌ వడీ జని 
నిజజనని బిలిచి నగుమొగ మలరన్‌.! 


అని మరొక కవి వర్ణించుటచే కేవలము డాలే యని యర్థము చెప్పుటకు 
వీలులేదు, ఛతివంటి సాధన మనవలెను, 


దాసరిసాని ;-- కావి కుప్పసము తొడిగి, కొప్పు బయలుపడకుండ ఖండళాటి 
(చీరబట్ట) బిగించి, జమిలి పూసలక౦టె పెట్టుకొని హరిహరీ 
యనుచు నడిచెను. 

కరణము .ా 


“ముదుక తలపాగయును బాహుమూలమందు 
క్రవిలెచర్మపు టొరలోని క త్తిగంట 

మఠఅతీి నీర్కా విదోవతు లమర (గామ 

కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించెళి. 


మారిగెజోగురాలు  పసుపుబొట్టి, మెడలో (దేవి) తోలు పాదాలు, నీడుద్‌ 
గవ్యలదండ, దర్శనపుదండ, “*ఎడమచే బళ్ళిక నిడిన బండారన్యపాణీ 
లలా లొ 
1. శుకస ప్రతి, 3-౪2. 


2, విపనారాయణచరి(త, తిథి? 


క్‌ 
శి. శకస ప్రతి, ౨-౪౧౭ 


279 ఆం;ధుల సాంఘిక చరిత 


బట్టిన నాగపడిగకోల”' కా సెకట్టిగా కట్టిన చెంగావిచీర, సీలిరవిక్క 
కాళ్ళకు గజ్జెలు కట్టి పరశురామునిపాట పాడుకొనుచు ఎక్కలోజోగు 
అని నిచ్చమెత్తుసట్టిది. 1 (దర్శనపు దండ నిఘంటువలలో లేదు. గవ్వల 
దండయని యర్థము.) 


తురక జవాను :-- 


మెలి పెట్ట చుట్టిన తిలిపరంగిముడాసు పె 
లపేటాడబ్బు పనుల జిలగు 
బంగారు. వాతల పట్టుహిజారు కంబరు 
చీన్గినిమతాని పొడు నొసలు 
తనుకొంతి గనువింప దనరు నంగీజోడు 
వలిపెంపు కొలువ వల్లెవాటు 
వడుదలలోస డాబాక త్తి వదలు పాపో 
సులు గోరంట బొలుచుగోళ్ళు 


నడుము సీలున్న తోలుడాల్‌ బెడగునూప 
అభయముగ వెంట నరుదెంచు నభరువాడు 


అమరు ముస్తెదు తేజితో నరుగుదెంచె 
దారుణాకారుడై న యుద్దారుడొకడు. 
వచ్చియయ్యూరి వెలుపల రచ్చ రావి 
(కేవ దుర్వారుడై “తలారికి బులావు 
ధగిడి కే” యను మాటకు తలకి రెడ్డి 
తోడివారలతో eg బష్టె”? 


(పై పద్యములో కొన్ని పదాలకు నిఘంటువులలో అర్థాలులేపు. చుంగు 
పాగాను మెలికలు వడచుట్టినాడు. తెలి ఫరంగి ముడాసు అనగా “వరంగీ((ఫెంచి) 
వారివద్ద కొన్న తెల్ల బోవి. ఫర్‌ంగీవా రమ్మిన తెల్లని నెత్తి టోపీ (ముడాసు) 
వె లపేటా (షమ్లా, చుంగుపాగా) చుట్టినాడు. జరీ అంచులుకల పట్టిలాగు 


వీజయనగర సా్యమాజ్య కొలము 978 


(హీజారు) తొడిగినాడు. చీనీ దేశపు నీంతాన్‌ బట్టను నెతత్తిమీదుగా కట్టినాడు. 
(కంబరు అంటే యేమో ?) శరీరము కసబడునట్టి సన్నని నూలు ఆంగీ తొడిగి 
నాడు, సెల్లాను చంకల (కిందుగా (తిప్పి బుజముపెై వేసినాడు. చంకలో (పడు 
దల) జందెమువలె తోలుపట్టీ వేసుకొని దానికొక డాబాక త్తిని తగిలించినాడు, 
పాపోసులు (ముచ్చెలు) తొడిగినాడు. వెంట గురపుసెను మాదిగ (నభరు 
వాడు) వచ్చినాడు. సీలు అంటే తెలియదు. పాపోసు ఫార్సీపదము. పాయె 
పోష్‌ (పాదమును రక్షించునది) అనుదాని నుండి యేర్పడినది. ఆచ్చులో సభరు 
వాడు అని ము(ది-చినారు. అది ఆర్థములేనిమాట. నథరు ఆని యుండవలెను, 
ఇది నిఘంటువులలో లేదు. తెలంగాణా పల్లెలలోని రెడ్డు సైనువాన్ని “నఫర్‌ 
వాడు” అని యందురు. అదే యీ నభరు పదము. ము స్తయీగ్‌ అను ఆరబీ 
పదమే ముస్తైదు (Ready) సిద్ధముగా తయారుగా నుండునట్టిది అని యర్థము. 
అట్టి “తురక బంటు [గామ మధ్యనుండు రావిచెట్టుకల రచ్చకట్టువద్ద నిలిచి 
“తలారికీ బులావ్‌ ధగిడీకే” అని అరచినాడు. ఈ వేషము, ఈ తిట్టు నేటికిని 
తెలంగాణాలో పత్యశానుభవమే ! చిన్నబంటు వేషము వాని గుర్రము, వాని 
సెసు, వాని దర్జా, వాని తిట్లు చూచి విని రెడ్డి, కరణాలే పారిపోయిరి ! గోల 
కొండ సుల్తానులు కొ తగా ఆం ధదేళాన్ని అ|కమించుకొని తమ తురక భటుల 
కిచ్చిన దర్గాను తెలుపుతున్న దీపద్యము. అనగా ఇంచుమించు (కీ, శ, 
౧౬౩౦- ౫౦ [పాంతను. 


రెడి $= 
డి 


“మొలకు సగంబును తలకు సగంబుగా 
గట్టిన యయగారి కరలచీర 

పె నల్ల కమ్ముల పచ్చడంబును తోలు 
పావలు చేతిలో బట్లుక ర 

కత్తెర గడ్డంబు, కరకు జుంజురమీ 
సములు రోమళంబై న పలక రొమ్ము 

మొలయుంగరము (వేల వలముగా దీర్చిన 
నాఖినామము బవీదవరము లమరు 

గ డఊసుపిక్కలు గలిగిన మడిమ లమర 


వెంట నిరువంక పెంపుడు వేపు లరుగ 
(35) 


974 ఆం ధుల సౌంఘీక చరిత్ర 


కెలనదగు నెడ్డకొట్ట మీషీంచుకొనుచు 
నింబివెలుపలి తీన్నియ కేగుదెంచె”! 


(అయగారి పదము నిఘంటువులలో లేదు ) రెడ్డ నంసారములను, జీవ 
నమ లను చాలా చక్కగా విరివిగా వేంకటనాథకవియ వర్ణించెను. (౪-౪౧౬, 
౪౫౫) ఇతడు రెడిసాని ఆని పయోగించెను. 
పురోహితుడు :-- 

బుజముపై మూడు తరాలనుండి భ దముగా వస్తూ వచ్చిన ధావళి (మడి 
పంచె) మరియు అసిమి సంచి, ముతక నీర్కావి ధోవతి, తిల చుట్టుకొన్న 
చింపుల బై రవాసము (వస్త్రము) చెమటచే గరగెడు సేసబొట్టు, మారేడు 
బుర్రలో మం్యతాక్షతలును, ఓక చేత పంచాంగము, పొడుపు వేల (చూపుడు 
(వేల) వెండి యుంగరము, మెడలో మురికి జందెములు కలిగి, హరేకృష్ణ ! 
హరే రామ! ఆంటూ వెళ్ళినాడు. పొడుపు వేలు పదాలు నిఘంటువులలో లేవు. 
తెల్లని (ధవళ) ఉన్నితో నేసిన మడిపంచెను ధావళి యందురు, ఇది మహో 
రామ్ష9లలో నుండు ఆచారము. సూ. రా, నిఘంటువులో ధావశి యన వస్త్ర 
విశేషమని [వాసి వేసినారు. 


ఎరుక లి :__.- 


నవరనిపని వన్నెరవిక తొడిగి, మంజేతులపె ముఖముపె పచ్చబొట్టులు 
కలిగి, కురుమాపుపైటలో చిన్ని బుడుతని కట్టుకొని, తరతరాలనాటి పుత్తడి 
పెడిబుట్టి నెత్తిన బెట్టి, కనుబొమలసందున నామము, నొసట భూతిపూత కను 
లకు కాటుక, క లిగినట్టిది += (పుత్తడి, పెడి రెండును బంగారు కర్ణము. ఇచ్చట 
ఆది సరిపోదు. ఎరుకలిబుట్టి కర్థము కావలెను. వెదురుబుట్టి అని యర్థ 
ముండును.) ఆది దారికట్టు, మొనకట్టు, స్రీవళ్యము కలిగించు బదనిక లమ్ము 
కొనెకిది. “దీనిని మా సింగడు కొండనుండి తెచ్చినాడు” అన్నది. దానిని 
కొరవంజీ ! అని సంటోధించిరి, సింగడు అకు పదము నరసింగడు ఆనుదాని 
నుండి యేర్చడినది. చెంచులకు నరసింగడు ముఖ్యదేవత, కొరవంజి, సింగి, 
సింగడు యకత్షగానాలలోని నటి సూత ధారులు దీన్నిబట్టి యక్షగానాలు చాలొ 


1, శుకస పతి. ౨౪౧౩. 
అజాన్‌ 


2. శక్ర స ప్రతీ, ౧-౯2, 


విజయనగర సా్యమాజ్య కొలము 275 


(పొదీనమయిన నృత్యగానాలనియు, అవి చెంచువారినుండి స్వీకరించి సంస్క 
రించినవసోయిు నూహింపవచ్చును. 


రాజులు : 


సిగలో తాయెతులు, నెత్తిపై కుళాయి, చెవులలో యొంటులు (పోగులు), 
మెడలో ముత్యాల హారాలు, బంగరు గట్టికమ్ముల వలిపె దుప్పటి వలెవాటు 
ధరించెడివారు.! పసరు పట్టు హిజారు (లాగు, అంగీ, పచ్చరాళ్ళ పోగులు, 
జీవదంతపు పావలుకూడా ధరించెడివారు. 


భటుడు ( జెట్టి) ; 


గిరునామము, చిన్న కోరమీసలు, వెనుకకట్లు రుమాలు, కమ్మిపంచె, 
కమ్మి దుప్పటి వల్లెవాటు, కెంగేలిలో వంకవంకి, అపరంజి పరజుతో దగు 
కత్తి (పరజు నిఘంటువులలో లేదు.) బచ్చెన (రంగువేసిన) పావుకోళ్ళు, 
చౌకట్లు (నాలుగు ముత్యాలపోగులు) ఇవి అయుధోపజీవుల వేషములు.2 


(బ్రాహ్మణ స్త్రి 
ఒక పంచాంగమయ్య రెడ్డికోడలిని మోహించి తన భార్య అంద 
చందాలు మెచ్చక యిట్లు పోరుపె ట్రైను. 


కీలుగంటిది యేల పోలగా నునుగొప్పు 
గీల్కాల్పు కొమ్మంచు గీజుపోరు 
పసుపుబొట్టిదియేల నొసట విభూతిరేఖ 
యమర్చి కొమ్మంచు కంటగించు 
కా సెకట్టీదియేల కవురుగా మైజారు 
చీర దాల్చు మటంచు చిమ్మ రేగు 
లత్కాకు లివియేల చొక్క ౦ంపుటంచు 
కమ్మలు ధరించుమటంచు నలుకగాంచు 
భార్యతో నా యమయు వెరిపట్రైనేమొ 
యనుచు నాలాగే కావింప నతడు హలిక. 
1. శకస పతి ౧-౧౧౬; ౧-౨౪౯ 


2 శుకస ప్రతి ౨-౨౪౧ 


276 ఆం|ధుల సాంఘీక చర్మిత 


లికుచ కుచ వేషమేకాన యకట | 
దాని యొరప్పులేదని యాత్మలో పరితవించు"! 


రెడ్డి స్రీ: 
పె పద్యములో కొంత తెలియవచ్చినది, మరికొన్ని విశేషములు 
గమనింపదగినవి :-- 


*గొంటుపూసలు రెండుగుండ్హ ముంగరలు, 
మెజారుచీరలు పెన సన్న గొలుసు 
పిెదవ టెలు. మటివీలా౦డు, బొబ్బిల 
on) లు ది గ ng) 
కాయలొత్తులతోడి కడియములును 
కప్పు పల్యరుస లుంగరములు తూలెడు 
కొంగులు బలు చెంప కొప్పులందు 
కమ్మ గవల్‌ సన్న కాటుక రేఖలు నాభినామంబులు నానుచుట్లు 


పసుపుపూతలు,......బిగువు రవికలు......."”£ 


కలిగియుండిరి. పె పద్యములో బొబ్బిలికాయలు నిఘంటువులలో లేదు. 
కాలి మూడవ (వేలి మష్టెలను బొబ్బిలికాయ అందురు. 


జంగమురాలు ;-- 
మ,రిపాలుపూసిన జడలదిండు. చింతాకంత విభూతిరేఖ, సందిట 


రు[దాశ్షపూసలు, నాగబె త్రము, త్నామపు నందిముద యుంగరము, జన్నిదపు 
వాటు, యోగప'పై కలది. 
ముత్తె దువులు : 

ఆ కాళపు ముత్తె దువలు పసుపు పూసుకొనిరి, కాటుక పెట్టిరి. పలి 
బొట్టు పెట్టిరి,* 

1 శుకస ప్రతి ౨-౪౫౭. 

2 ౭. ఎలి-తిరిలిం 


8 తివి, 


& +, ౨ ౧౦౫ 


విజయనగర సామౌజ్య కాలము వ్ర” 


టోగముసాని ;- 


“హిజారు (లాగు) మీద తొటిలువడి నొంటికట్టున ఘటించిన చీద 
సగంబు మూపుపై నలవడ్‌ బోటిదట్టి” గ ట్రెడివారు. వారికి “తిరు మంజనము” 
(దేవుని స్నానము, వేశలందు దేవాాఆయములండు సేవలో నుండుటకై ఏర్పా 
టుండెను. మరియు దేవునికి కొడుమెత్తునప్పుడు (నిండు కుండను తీసుకొని 
ఫోవునప్పుడు) కూడా వెంట నుండవలెను. 


“కొడుమెత్తుకొరకు గుడికిస్‌ నడచులా 
వెలపడుచుు నాఖినామమునుర (గొ 
మ్మాడి సౌఠన్‌ మడిచారున్‌ వడి 
జారుం బైట వింతవగ గన్పింపళా.! 


మాప్పీడు (కూరభటుడు) ఫలా 


“తలపాగ పొరమీద జెలగెడు నాయుధార్చన సల్పినట్టి దోసనపుపూవు.” 
ఎడమకేల గొలుసును, కుడికేల పెద్దప తి, దట్లితో చెక్కు నిద్దావంకి (క్తి) 
ది =D అ ళు అణాల 

దుప్పటివల్లెవాటు, ముందరి దిరుదడవిణ కలవాడు. 


(పజా జీవనము 


(బాహ్మణుల యిండ్లు వారి జీవన మెట్టుండెనో కొంత తెలియ 
వసున్న ది. 


“అలికి (ముగ్గులు పెట్టినట్టి తిన్నెలు, 
కంచు టోరుతల్పులు, పాలుపోసి చాల 
యూర్చవచ్చుననంగ నొసర చావడి 
తాళువారంబుు చిన్నగవాక్ష మలరు 
వంటకొట్టము, చిలువాన మించిన మిద్దె, 
ప ప్రైమంచముతోడి పడుకటిల్లు 
పడసార ముంగిలి నందిరి, పసిగాడి, 
కాయధాన్యములున్న క ఎజములును, 


1 కుక, ౩-౧౭, 
2 + au To 


278 ఆం[ధుల సొంఘీక చరిత 


పెరటిలో నారికేళ జంబీకముఖ్య 
నిఖిలఫలవృక్షములు మంచినీళ్ళబావి, 

నమరనయ్యింట నిత్యక ల్యాణములును 
సచ్చతోరణములు మించణర గునతడు"! 


(బోరుతల్పులు= పెద్దగ వని తలుపులు, కణజములు పాతరల్కు తాప 
వారము శ. ర. నిఘంటువులో లేదు. వాచస్పత్యములో _నంథముల మీదికి 
దించిన సోఫా అని [వాసినారు. చిలువానము శ. ర. లో లేదు. ఆంధవాచస్ప 
త్యములో ధనము అన్నారు, సూ. రా. నిఘంటువులో ఇంటిఖర్చు, చిలరఖర్చు 
అని |వాసినారు. ఆ యర్థము లిచ్చట సరిపోవు, (బాహ్మణులు కొందరు గొప్ప 
భూస్వామ్ములె యుండిరి. వారియడ “బాపల సేద్యం బాలవెద్యం” అనుసామెత 
చెల్లకుండెను, వారి సేద్యము వారి తోటలు, పంటలు, గరిసెలు, యబుట్లుండెను. 


గాదెలగోొలుచు ముక్కారు బండెడు మళ్ళు 

అతోపు, నడబావు, లండ దొడ్డి 
ఆకుతో టలగుంపు, పోక|మాకలు, గుత్త 

చేలు, గొ రెలకదు పాలమంద 
చెలుకుగానుగ మొదల్టిడక వర్టిలునేర్చు, 

బానీసల్‌ పడవాళ్లు, బంటు, పెద 
పారిగోడలు, గొప్పపడసాల మేల్మచ్చు 

గారముంగిలి, వింతగాని పొరుగు 
రాగినగల్సు సదాబారరతియ, దేవ 

పూజు, నిత్యాన్న దానంబు, పూసబొట్టు 
చిదురు జల్లిన తులసెమ్మ చిన్ని తిన్నె 

కలిగి కనుపట్ట నాతని కాపురంబు,''2 


(పేద అన విల్లకాయ అని శ.ర.లో కలదు, అది తప్పు. వాచస్పత్యము 
సయద రూపము అన్నారు. ఆదియు తప్పు. శ. ర. లో పేద ఆనుదానికీ 
భటుడు అని (వాసినారు. అది సరి. ఆదే ఆర్థము పైదకును కలదు ప్యాదా 
అను ఫార్సీ పదము పాదచారి అను నర్థము కలదానినుండి పేద, పైద యేర్పడి 


1 శుక, రిాళఆదర్తిం 
బి, కకస పతి ౨-౧౪౫, 


విజయనగర సా _మాజ్య కాలము ల్లి'గృ 


చవి. ఆందుచేతనే కవ్చలు బంటు పేద, బంటు పెద అని జంటగా వాడిరి. 
ఆతోపు, ఆఅ తోపు అని యర్థమేమో ? పారిగోడ అన మట్టిగోడ కాడు. |పహరి 
గోడ అనియే యరము చేయవలెను. అయ్యలరాజు నారాయణ కవి “గొప్ప 
(పహరిగోడ” అసి శుకస్త్పతికాడున “గొప్ప పారిగోడొ అన్నదానికి 
మారుగా [వాసెను. గార అన గచ్చు.) 


బీద బాహ్మణులు కొందరిట్లు జీవించిరి ౩ 
భాం 


సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మరియాకులు తెచ్చి, 
చిస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, 
పేటి నన్నింటిని విశకయిలవి ధనము సంపాదించెడివారు.! అట్టి లుబ్బుల కుమా 
రులు సాధారణముగా దుమ లగుదురు, ఆ లుబ్బుని కుమారుడు, జోగి జంగాలని 
చూ స్టే మండిపడి లంజమందుల కుదారముగా నివ్చి “శతముకువేసిన వెన్క దా. 
జరించిన బట్టి యునుపకుండ దలార్లకొసగి యొసగ”, “"డర్భకాకార దాతలరాయ 
యని వెంటబడు బట్టువాఠికి పారవై చి“ పీటమర్జ విట చేత విదూషకులకే పస 
చనము లిచ్చి, “లాల్పగాడయ్యె నవ్వి _సవల్లభుండు ” ఏ, పూర్వము గామాలలో 
చీకటి పడగానే తప్పెట వేసి ఊరివాకిండ్డు మూసి ఆచ్చట తలార్లు కావలి 
యుండెడివారు. తప్పెట వేసిన తరువాత బయట సుచరించువాగు చోరులో, 
జారులో యగుదురు. కాన వారిని పట్టి థాణాలలో తెల్ల వారునర కంచి తలార్ష 
'పెద్దవద్ద విబారింపజేసి శిక్షించెడివారు- 


రెడ్డి సంసారము : 
“కొలుచు సమ।గభంగి నొనగూడ దివాణపువారి చేతి కొ 
కలు హుసి వోవగా కరవు కాల మెరుంగక, పూసబొట్టులం 
బలి కఠినీళ్ళు చందనపు మానికె గొల్చిన మాళ్ళు గల్లి శో 
భిలుదురు రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్హ లనంగ నచ్చటన్‌ ,9 


(దిజాణమువారుడారాజు కొలుపుకూటమువారుు, హుసిపోవుట = అధిక 
మగుట, ఈ పదము నిఘంటువులలో లేదు.) (పభుతాధనికి వ్యవసాయకులు 
రాన్యరూపముగా పన్ని చ్చిరని యిందు సూచింతము, చందనపుమానికి చండ 
ర ర ర ర యతని 

1. కుక స పతి, భ=౧౦౯«. 


9 »  ¥-00౧0, 
వ్ర 19 DCO 


280 ఆర ధుల సాంఘీక చరిత 


నపు కటైతో చేసిన కపేసోల. కడపజిల్లాలో శ్రీచందనము అను నొక సాధారణ 
వృషము విశేషము, దానితో నేటికిని కట్టెసోలలు, జడిగములు చేయుదురు. 
మాళ్లు నిఘంటువులలో లేదు, పెసరవంటి కాయధాన్యమని యర్థము.) 


రెడ యిండిటుండెను := 
౧ ౧ 


“అచ్చమై వాకిట రచ్చరాయిమెరుంగు 

పంచతిన్నెలు, గొప్ప పారిగోడ 
రంప తెట్టులును, రాకట్టు ముంగిలి 

మల్లె సాలె, దేవర యిరచవికె యొకటి 
కోళ్ళగూండ్లనుిగ్నొరు, గురుగాడి, 

యేడికోలలు కొడి పలుపులు గలుగు నటుక 
దూడలు, పెనుమూవకోడెలు కురుగాడి 

గి త్తలీనిన మెటి గిడ్డదొడ్డి 
ఇరుకు |మాను, పెరంటిలో నెక్కుబావి, 
మునుగలును, చొప్పు పెనువామి, జనుముదుబ్బు, 
రోలు విడి కెలకుచ్చెల, దాలిగుంత దనర 
నీరతంబు వెలయు నాతని గృహంబు.! 


మళల్దసాల అన భోజనశాల అని నిఘంటుకారులన్నారు. అది సరికాదు. 
హరిచ్చిన యుదాహరణ మిది. 


ఎల్లెడ పరదేశులకును ! గుళ్లుం బంచలును, రచ్చకొట్టంబులు, నం 
గళునుగాక తలంపగ | చలని సున్న౦పు మలసాలలు గలవే? 
«య ఇ యా 
హరిశ్చ. ౪. ౫ ౧౯౪. 


భో జనశాలలకు చల్చనిసున్న ముండుట అరుదు, తెలంగాణమందు మల్‌ 
సాల అన భవంతి (Drawing Room ) అను నర్థము కొన్నీ తావుల వాడు 


రెడ్డి స్రీలు జొన్న చేలకు మందచెవేసి కావలి కాసిడివారు, ఇప్పపూవు లేరి 
వాటితో సారాయి చేసుకొనెడివారు, ఆనాడు లై సెమ్స లేకుండెను. మధ్యావ్నాము 


1 కకం ౨-౪౦౮, 


విజయనగర సాామాజ్య కాలము 281 


రొటము (తిప్పెడివారు. వారు నొక్కు పూసల పేరు, కుందనపుకమ్మలు, నాను, 
కడియములు, చుట్టుమెట్టెలజోడు, కెంపురవలయుంగగము, వెండికుప్పె సౌధము 
ధరించి, కురుమాపు కూనలమ్మ చీర కట్టి, కుడిపెటలోపల సిస్తురవిక తొడి 
గెడివారు!, (కూనలమ్మ బీర= ఈ పదము నిఘంటువులలో లేదు. పిల్లలు లని 
గొడాండు కూనలమ్మ (కూనలిచ్చు దేవతకు) ఎ[రఅంచుకల తెల్పనిచీర ను 
నై వెద్య మిచ్చి కొలిచి ఆ చీరను కట్టుకొనెడివారు ఆ చీరను కూనలమ్మ చీర 
యందురు. ఇది రాయలసీమలోని యాచారమై యుండెను, వైజయంతి విలా 
సములో “కూనలమ్మ పటంబు” అని వర్ణించుటచె తెలంగాణమందు కూడా యీ 
ఆచార ముండి ననవలెను. (వైజ. ౩-౧౦౦.) 

“కుడి పైటలోపలి సిస్తురవిక” అనుటలో చాలా యర్ధమున్నది. రెడ్డలో 
మోటాబిన్రీలు కుడిబుజముమీదకి కొంగు వేనుకొందురు. పాకనాటివారు ఎడమ 
బుజము మీద వేనుకొందురు. ఇప్పుడు మోటాటి వారుకూడా ఎడమపైఏ 
వేనుకొందురు. పూర్వము కుడియెడమపైటల పట్టింపు చాలా యుండెను 
చాలా యేండ్హ్మకిందట కుడ్తి యెడమపైటల వారికి పోట్లాటలు జరిగి. 
మ(దాసు హైకోర్టులో తీర్పు చెయించుకొనిరి. శుకస_ప్హతిలోని రెడ్డిన్రే మోటాటి 
దని ఆర్థ మగును. 

రాటమును [బాహ్మణులు తప్ప తక్కిన వారంద రా కాలములో వడి 
కినవారే. అందు రెడ్లు (ప త్తిపండించేవారుకాన [వధానముగా ఇంటింట తప్పక 
మధ్యాహ్నములందు వడికేవారు. స్రీలు మ్మాతమే వడికిరి, (గాంధీయుగమందే 
పురుషులున్నూ వడికిరి.) పదారింటి తరము (16 ౦౪౧0౧ దారము వడికిరి, 


“వడి దారము చెవులుం, దొక్కుడుపలకయు, 
దిండు, కదుర్తు గుంజలునుం, (దొ 
క్కుడుబొమ్మయును, [దిప్ప్తుడు పుడుకయునుం 
గలుగు రాట్నములు గై కొనుచున్‌, 

ఎడమదెస దొడ్డుగా వైచి యేకు లెల్ల 

గెలిన పలువగ వేపుడుగింజ లునిచి 
చేవపీటలమీద నాసీనలై న వారలై 

వావి వరుసలు వది6కొనుచు.” 


1! శుక ౨-౪౦-౪౧౧. 
(36) 


£82 ఆం|ధుల సాంఘీక చరిత 


“ పాయంపుపడుచులా పని గొంటివే దూది 
యనెడు పాటల దేనె చినుకులీన” 


“నసాసగ చరణాభ దొ క్కెడు బొమ్మమీద 

బచ్చెన ఘటింప వడికి రప్పద్మముఖులు” 

“ఎన్నికలు పట్టి పుంజంబు లేర్పరించి 

పంటక[రలు మరి తోడువడగ లూచో 

“కండె లొనరించి చాలించి కాపుటింతు 

లున్న యవ్వేళ నద్భుతం బుట్టిపడగ' 

ఈనాటి థాదీ పాముఖ్యమునుబట్టి యీ వివరములు తెలుపనై నవి. రాటము 

యొక్క అంగముల పేర్లు చాలావర కిప్పుడు తెలియనివై నవి. 


౧ కదురు ౨ చెవులు కదు రుపెట్లు తావు. ౩. (తొక్కుడు పలక, 
౪. దిండు--కదురుకు చ (కానికి దారము తగిలింతురు. కదురుకకు దారము 
తగిలించుతావును దిండు అందురు. ౫. చ[కము తిరుగుటకై రెండు గుంజ 


లుండును. వాటిపై చ|కము ఇరుసు తిరుగును. ౬* దాటము చ[కమును వేలు 
పెట్టి శిప్పుదువు. దానిని (తిప్పుడుపుడ కందురు. 


(తొక్కుడుబొమ్మ, చరణాభ, ఐబచ్చెన అంటే యిచ్చట ఏమర్థ మో 
తెలియరాలేదు, చేవవీట...మూరెడెత్తుది; నాలుగుకొళ్ళు కలది దానికి నలుక 


1 కకస పతి ౨౨-౪౨౦ ౪. 
on.) 


విజయనగర సామాజ్య కాలము 288 


అల్లుదురు. అట్టిపీటకు ఆనుకొనుటకు కుర్చీవలె వీపుపలక అతికి యుండును. 
దానిని చేవపీట యందురు. ఒరుగుపీట యనియు నందురు. 


వంటకూలియిండ్లను స్త్రీలే, అందును వితంతువులే, వారును దాహ్మణ 
వితంతువులే, ఎక్కువగా నడిపించెడువారు. అదటికీ నానా పాంతాల కపి 
గాయక పండితులు ఉద్యోగులు పథికులు వెళ్ళి “మినుకులు” ఇచ్చి అన్నము 
భుజించెడివారు. ఆ పూటకూళ్ళు కాక తీయులకాలము నుండియు బంధకీ జారులకు 
రాయబారాలు జరిపే స్థానాలు, ! 


కోమటు ;-- 
య 


కోమట్టకు “గౌర యను పేరుకూడ నుండెనని మూడవ్యపకరణములో 
తెలుపనై నది. శకస ప్రతిలో కొన్ని తావుల నీపదమును (పయోగించిరి. “వసు 
మంతు డను గౌర చెలువుమీర,” - “ఆ గౌర మనుచున్న' తన్నగరీరత్నముి, 
'సరి బేరులై న గౌరలు, “అని గౌర పలు తెరంగులి అని మొదటికథలోనే 
యిన్ని మారులు వాడినారు. కోమట్టలో గౌరయ్య, గౌరమ్మ అకు పేరు 
లెక్కువ. కోమటికొమ్మలు మణులకమ్మలు, సూల చేకట్లు (కంకణాలు) "సిరాబ్రి 
గను పులగళ్ళ చేకటులు, (పర్షియాలోని మిరాజ్‌ పట్టణమునుండి వచ్చిన 
కంకణములు) పొప్పశికుచ్చెలచీర ధరించెడివారు, కోమట్టకు వ్యాసారము 
| పధానవృత్తిగా నుండెను. వారు సాధారణముగా ధనికులు ఆయితే వారు 
బహుళముగా లోభులై యుండిరని కవులు వర్ణించిరి. వేములవాడ ఫీమకవి 
యిట్లు కోమట్ల తిర్హును, 

“గొనకొని మ ర్ర్యలోకమున కోమటి పుట్టగ పుధై దోన్న బొం 

కును కపటంబు, లాలనయు, కుత్సిత బుద్ధియు, రిత్తభ_కియున్‌, 

ననువరిమాటలున్‌, బరధనంబుకు [గ్రక్కున మెక్కజూచుటల్‌ , 

కొనుటలు నమ్ముటల్‌ మిగులగొంటుద నంబును మూర్గవాదమున్‌ +" 


“కోమటి కొక్క టిచ్చి పదిగొన్నను దోసము లేదు; యింటికిన్‌ 
సేమ మెరింగి చిచ్చిడిన పాపము తేదు........ క 


అన్న భీమకవియే యీ విషయములో ఉదారుడట. ఇంకొకకవి భీమ 
కవిపై యౌదార్యమును చాలా యాక్షేవించెను. 


1 శుకిసప్పతి ౧-౧౧౬;౪౯ మరియు “క్రీడాభి”. 


£84 ఆం|ధుల సాంమిక చరిత 


“వేములవాడ భీమ! భళిరే! కవి శేఖర సార్వభౌమ! నీ 
వేమని యానతిచ్చితివి యిమ్ముల గోమటి పక్షపాతివై 
మటి కొక్క టిచ్చి పది గొన్నను దోషము లేదటంటివా ? 
పది గొన వ పదతిన్‌.”'! 
కోమటి కొక్కటీక పది గొన్నను ధర్మము ధర్మ పద్ధతిన్‌ 


మల్త ణకవి ఒక కోమటినోటనే యీమాటలు చెప్పించెను, 


“దె వాలకును రితదండాలు గిండాలు గాని యెన్నడు నొకకాను నీయ, 
కవి గాయకులు వచ్చి గణుతించి వెడిన వదలిపోవుటెగాని పెకమియ్య 
చుట్టాలకును వట్టిసుద్దులు దుద్దులు గాని యెన్నడును డగ్గరగ నీయ 
బైెతోవ వచ్చిన పరదేసి యొరదెసి మోసపుచ్చుటె గాని గాసమీయ 
పట్టుకొని బందికాం[డను బాధ పెట్ట బెంచులే చూవ నొక బలువీసమైన 
(జహ్మరాక్షసి కాకిని _పతిదిన్తంబు కూతలే కాని ముద్దెడుకూడు వెట్ట.” 


మరియు “బాపలకు గోదాన మియ్యను, వడ్డికాసుళ వల్ల (బదుకుదు. 
ఈగకు, పాముకు బలిపెట్టను. ఎంగిలిచేత కాకి నేయను” అని అన్నాడు. ఈ 
భావములన్నియు పక్షపాత యు కమలే. అవది తిప్పయ వంటి వారెందరో 
యుండ లేదా ? 


కటె లమ్మక ము ఆ 
అం 


ఆ కాలములో అడవి సుంకాలుండెను. కద్రైల నెత్తిమోపు కింత యని 
తిసుకొనెడివారు. మొదలే సుంకము చెల్లించి అడచెలోనికి పోవలసియుండెను, 
ఒక బీదవాడు క టైైలకై పోయిన విధానమిట్టి వి 1 


“వలనగు పుట్టగోచి బిగు వాళ్ళును సుంకపు కాసులున్‌ విభా 
సిలు కరసాన గొడ్డలియు, చిక మునన్‌ సొరకాయ బురలో 
చలివియు నుంది,.....నరిగాన్‌ గహనంబున కై రయంబునన్‌ ,ీ 


బిగువాళ్ళు అనునది నిఘంటువులలో లేదు. బిగువగు వార్లుకల చెప్పులని 
యర ము: 
థి 


|. చాటుపద్యమణిమంజరి-పుటలు ౧౧౧-౨, 
2 మల్హణ ఆ. ౨. పుట ౩౫-౩౬. 


8. కుకస పతి 39-౨౪౫. 
అబాట్‌ 


విజయనగర సా|మాజ్య కాలము 285 


భోగ స్రీలు ఫ్‌ ఆ 


భోగముయువతులు బుధ శనివారములందు శిరస్సాానము చేసెడివారు. 
మినుపపిండి నలుగుగా వాడెడివారు. “తల నిమ్మ పండ్ల జొబ్బిలపిండి, సీకాయ 
బులిమి, తలపు జిడ్డువోవ దువ్వి" ఈర్వాత మడుగు వల్వలు ధరించి అలంక 
రించుకొనెడివారు.! బ్రీదవారు నూనెపోవుటకు “అటకలి” రుద్దుకొనెడి వారు. 
(శుక. ౨౨౩౭౮.) జొన్నపిండిలో కలిబోసి ఉడుకబెట్టిన దానిని అటకలి 
యందురు. బోగము పడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యము చేసి 
తర్వాత నాట్యమును వృత్తిగా సాగించెడువారు. 


“తొలుఏనికి నభవుముందట నలికుం 
తల పుష్పగంధి యాడెడు ననుచున్‌ 
కలయంగ పురములోపలపొల 

తుక చాటించె దిశలు భోరున గగన్‌. 


(తొలువినికి పదము నిఘంటువులలో లేదు. మొదటిసారి సంగీతమును 
సభలో వినిపించి నాట్యమాడుటకు తొలువినికి యందురు.) 


బోగంవారి పడుక టిండ్లు చాలా ఆకర్ష ణీయిములు. బంగారు కాళంబి 
(తమ్మ పడిగె), పూలపాన్సు, సకినెల పధిమంచము, కుంకుమ తలగడ, సురటి, 
నిలువు టద్దము, దంతపు వావలు మున్నగున వందుండెను.8 తాపితా (పట్టు) 
పరుపు, పట్టుతలాడము (తలగడ), పడిగము, కంచు దీపపు కంబము, పర్తి 
మంచము ఇవి “రతిధామముి'లో నుండెడివి.క 


ఎండకాలమందు బాటసారులు పడన పాట్లు :_ 
“చక్కెర చింతపం డొడిని, సందిట నేలకి చద్ది, మౌళిప 
జెక్కిన కొనుగాక్కు వలచే జలకుండిక, ఏజనంబు వే 
1. వె జయంతీఏలాసము ౩-౫౧. 
2, మల్తణ. పుట ౩౮. 


లీ, 9 పుట రోడ. 


4. శకస వతి. ౪-౨౨. 
అరే 


266 ఆం|ధుల సాంఘీక చరిత 


రొక్కు కరంబునందు, పద యుగ్యమునం బిగివాళ్ళు గల్లి న 
ల్సిక్కు ల నధ్వగుల్బడలి (తిమ్మరి రట్టి క డిందియెండలన్‌ .” 


(బిగువాళ్ళు అన బిగువగు వారులుకల చెప్పులని యిప్పుడే [వాసినాను 
కదా! ఇచ్చట “పదయుగ్మమునన్‌ బిగివాళ్ళు అనుటచే ఆది సుస్పష్టమైనది, 
చక్కెర చింతపండు నోరెండకుండుటకు ఏలకి చద్దియన ఎలకి, మిరియాలు, 
అల్పము, సొంటి, ఉప్పు, తిరుగవాతకల దధ్యన్నమని యర్థము, నెత్తిన కాను 
గాకు చలువకైె ఎండవడ (SUn-Stroke) తాకకుండుటకై_ పెట్టుకొందురు, 
కానుగాకు చాలా చలువ యిచ్చునది. క్షయ, తాపము కలవా రా చెట్టుకింద 
కూర్చునిన తాపము పోవును. తెలంగాణమందు ఎండకాలమందు కూలిపని చేయు 
వారు తమ గుండు రుమాళ్ళలో తంగెడాకు దట్టముగా పెట్టుకొని రుమాలను 
నెత్తిన ఆదిమి ఎంత యెండలోనై నను పని చేయుదురు. తంగెడాకు సులభముగా 
సర్వ|త లభ్యమగును. కానుగాకు అరుదు. కానుగాకు తర్వాత తంగెడాకు పనిక్రి 
వచ్చును. ఈ పద్యము కవియొక్క చక్కని లోకానుభవమును వ్య క్రీకరించి 
నది.) పుణ్యము కోరువారు బాటలందు చలివెందలు పెట్ట స్త్రీలను సీర్రుపోయుట 
కుంచిరి. కవులు నస్ర్రీలనే _పపాపాలికలనుగా జేసి సరసాలాడిరి. మన్మథుడను 
వేటకాడు నీటిపల్లములను కుండలనుంచి, అందు (పపాపాలికలను దీమములుంచి, 
వారి కటాశాలను వలలుంచి, పాంధమృగాలను బోయవలె వేటాడెనని కవి వర్షిం 
చుటయు అతని అనుభవమునకు తార్కాణ.1 వర్షాకాలఅమందు బాటసారులు 
బురదలో దిగబడి బాటతప్పి పొలమర్హ (జాడలు తెలిసినవారి) పిలిచి, నల్ల 
రేగడిలో జారిపడి, ఎదురువానకు తలయె త్తక, ముందర కానక్క జల్లుకు చెట్ల 
[కింద చేరి వాన వెలసినతర్వాత వంగుళ్ళ (ఆకులనుండి జారు తటుకుల) వల్ల 
తడిసి జమ్ము గూడలపైన వేసుకొని చేతులలో చెప్పులను పట్టుకొని నానావస్థలు 
పడిరి. ఇది జమ్ము సమృద్ధిగా పెరుగు కృష్ణాజిల్లాను సూచించును. 


“శిభినిండ తాయెతు చేరుచుట్టి” ఆని కవులు పలుమారు వర్ణించినారు. 
కకస_ప్టతిలోను ఇట్లే కలదు. తాయెతులు చేతికి మొల|తాటికి మెడకు కట్టు 
1. చందదభాను. ౧-౧౬౧, ౨ 


2, ౫-౩8౯, 
తీ. చం|దభాను ౩-౭౭. 


విజయనగర సా|మాజ్య కాలము 287 


కొందురు. జుట్టకు దండగా పలుతాయెతులు చేర్చి కట్టుకొనుట యనుటచే అదొక 
యాభరణ విశేష మయ్యెనో యేమో స్పష్టము కాదు. రాజుల వేటసాధనాలు 
పెరు 

ధా 


“వలలు నురుల్‌ సిడుల్‌ పిసులు వంకరదుడ్డులు పదిపోట్టు దీ 
ములు గొరకల్‌ తెరల్‌ జిగురు మోకులు టోనులు కాలియుర్లు టొం 
గులు ముడ్రివింద్ధు బండగులు కొమ్ములు పాదులు వల్లి తాళ్ళు చి 
వ్వలతడి కెల్‌ ధరించి యిరువంకలు జేరిరి కొంద రుద్ధతిన్‌.” 


జింకలకు కొమ్ముటురులు పెట్టి తీసుకొని పోయిరి. డేగలను తీసుకొని 
పోయిరి. పుట్టచెండు, చింబోతులు, తుపాకి, తుటారి, లకోరి మున్నగు పేరులు 
గల వేటకుక్క_ల వెంట నుంచిరి. వేటవేషాలతో ఆయుధాలతో రాజు, పరివా 
వారము బయలుదేరెశు.! (సాంబోపాఖ్యాన మందును ఇట్టి వర్ణనలు కలవు, 
చూడుడు ఆక్వాసము ౨, పద్యము ౩ నుండి ౨౫ వరకు,) శుకస ప్పతిలో 
(రెండవ కథలో) వేటను చాలా విపులముగా వర్షించిరి. అభిలాషులు చూచుకొన 
గలరు. 


“మో సెన్‌ గడియారమున మహాసంకులరవముగాగ యామద్వయ సం 
క్యాసూచక ఘంటాధ్వని వాసర మద కేసరి _పపరగర్జితమై.”'£ 


అనుటచే గడియారాల ఆచారము విరివిగా నుండెనని తెలియవచ్చును. 
వైప్ప్లవాచారాలకు అరవ పదవానన్క, తిరుపదపూర్వుకత, యొక విశిష్టత నాటికిని 
నేటికిని కలదు. భోజనము చేసినప్పుడు అన్న మనక సాదము ఆని, పరమాన్న 
మనక తిరుకణామరు ఆని, భ శ్యాలు ఆనక తిరుపణార్యము అని ఈ విధముగా 
అన్నియు అరవముతోనే అడుగవలెను. లేకున్న వైష్టవుడు మైలపడి పోవును. 
ఇది వైష్టవము తెచ్చి పెట్టిన అరవ దాస్యము! 


“తిరుక స్టై సేవ జేసెద తిరుమాళిహ నలికి పూసి తీర్చెద ముగ్గుల్‌ 


తిరువంజనంబు దీర్చెద తిరుపుట్టము లుతికి వేగ దెచ్చెద దినమున్‌.” 


l. 99 అలం యలు (లుల రాం 


2. సాంబోపాథ్యానము ౨=౪౮, 


268 ఆంధుల సాంఘీక చరిత 


తిరుక బై సేవజేయుట అనగా ఊడ్చుట. తిరుమాళహ (తిరుమాలె) దేవా 
లయము కాని, వైష్టవభక్తుల యిండ్లుకాని యని యర్థము. తిరువంజనము (తిరు 
మజ్జగముడాస్నానము.) తిరువళకు (తిరువెలుగు=దీపము) అని వారందరు. 


“కూరలు నన్నము, తిరుపణ్యారము పచ్చళ్ళు తిరుక ణామధు మధురా 
హారములు నవ్యధూ టికి సౌరుచి ముప్పూుట లునుప సాపడ బెట్టుస్‌"” 
“స్నామి యల కంచినుండిట మీ తిరువడిఘళాశయించుట విసో 1 


అనుటలో తిరువడిఘక్‌ అన పాదములు అని యర్థము. విపనారాయణ 
చరితలోను తిరువీసము, తిరుసావులు, తిరువందేరనులు (భక్ష్యములు) గండ 
"వడములు (తెరలు) మున్నగు ఆరవపదాలు వాడినారు (౫-౮, ౧౨) శ్రీవైష్ష 
వులకు గండవడములు, తిరుమణిపెట్టె, విరులగడి (బుట్ట), కావి వెష్టువ 
(ధోవతి), జింకతోలు, ఊర్ధ్యచూర్ణకరండము, తులసి పేరు “అధ్య ఖేదాప 
హంబైన దవి|తము," కుశా స్తరణము ముఖ్యసాధనములు. (దవిత్రము తప్పు; 
ధవిత్రము అనవలెను. అనగా జింక చర్మముతో చేసిన విసనకర్ర అనియర్థము.) 


దాసరిసాని వేషములో చీనిపడవ దానిమీద “ముసుగువడ జుట్టిన పైలక 
ముది యొక విశేషము, పైలకమ్ముద పదము నిఘంటువులో లేదు. ఈపదము 
తర్వాత ఇదే వేషమును వర్ణించి కవి యిట్లు (వాసినాడు. 


* ఆడచి [కొమ్ముడి బయల్పడకుండగా ఖండ 
కాటి యౌదలను మించగ విగించి” 


అనుటబే చిన్నబట్టతో నెత్తి కొప్పును ఎత్తి బిగించుట అని యర్థమగును. 
అందుచేత ఇదే శులక మ(దయై యుండును, 


తాంబూలము వేసుకొనువారు పాన్‌ దానుల నుంచుకొనిరి, వాటిపై 
సన్నని తీగెలపని చేసియుండెడివారు. అందుచే వాటిని జాలవల్లిక లనిరి. 
“జాలివల్లికతోడ బాగాలు తెల్లనాకులు క్షైరవళ్ళు నెదుట బెట్టెను” 8 (కైర 


1 వై జయంతి ౨-౧౫. ౧౨౧ ౧౩౧ 
2 విపనారాయణ చరిత ౨-౮౭. 
8 వై జయంతి ౪౭ 


విజయనగర సా(మాజ్య కాలము 229 


వడి=కాచులో పాలు, మొగలిపూల రసము వేసుకొని గోలీలుగా చేయుదానికి 
పేరు) (కప్పురపు వీడియంబును కైరవళ్లు నొసగె” 1 అనియు వర్శించినారు, 
సంపన్నులు సంపెంగ నూనెతో తలంటుకొని మాష చూర్ణము (మినువ పిండి) 
తో రుద్దుకొని స్నానము చేసెడివారు. 2 గార చెక్కను దంచి బావులలో చెరుపు 
లలో కలిపిన చేపలు వాటిని తిని చచ్చితేలును. 


రాజులు భోగమువారికి (సంగీత నృత్యములను మెచ్చుకొని.) అటులే 
కవులకు, కళావిదులకు ౧౧౬ లేక ౧౧౧౬ లు, మరియు ఇతర బహుమతులిచ్చి 
యాదరించెడివారు, 


“అపు డాచోళవసుంధరాధిపతియున్‌ నానార్హ్య్య భూషాంబరా 

ది పదార్థపకరంబు త్యాగమహిగా దీనారము ల్వేయూనూ 

ట పదార్లుం గృపచేసె... ...''క 

నూటపదార్ల సంఖ్య ఇంచుమించు [పాచీనమగు తెనుగు ఆచారమే ! 

విందులలోని భక్ష్య భోజ్యూల వివరాలు పూర్వ [పకరణాలలో తెలుపనై నది, 
ఈ కాలమందును అట్టివే యుండెను. బావమరుదులవరుస వారు భోజన నమ 
యాలలో వ్యంగ్యంగా దన్న్యర్థిగా హాస్యాలాడుకొనికని జుగుప్సాకరముగా సాంటో 
పాభ్యాన మందు వాసిశారు. (ఆ. ౫-౨౮౯) ఆది కవితకు న్యూనత. 
విందులలో మొదట నేయిగలిపి తియ్యగూరలతో అన్నము తినిరి. తర్వాత 
మధుర వంజనములు తర్వాత ఆమసారళాకములతో అన్నము తినిరి, తర్వాత 
రసప(పాకముల భు క్తితో, శిఖరిణితో, అటు పై 'పెరుగన్నముతో ముగించెడి 
వారు. ఇంతేకాదు. చాపట్టు, మాంసము కూరలు, (బాహ్మణేతరులలో పలల 
సారము (మాంసము పులుసు), మండెగలు, కుడుములు, మామిడిపండ్లు లేక 
అ బుతువున దొరకు పండ్లు ఆరగించెడివారు. 5 శిఖరిణి అన సిగరి అనియు, 
నది “కొన్ని సంబారువులు చేర్చి పక్వముచేసిన మజ్జిగ యనియు” శబ్దరత్నా 

1 మల్హ ణ్క పుట ౪౫ 

2 వై జయంతి ౪-౫౯ 

8 వై జయంతి ౨-౧౪౦. (గార [(దావినమీను) 

శీ వై జయంతి ౧-౧౩౨. 

ర్‌ సాంబోపాఖభ్యానము. (౨౯౬-౩౦౩) 

(37) 


290 ఆంధుల సాంమిక చరిత 


కరములో (వాసినారు. ఇది తప్పు. విక మోర్యశ్రీయములో (తృతీయాంక ములో) 
“ఆహమపి యదా శిఖరిణీ రసాలం చ న లభేతదైతత్‌ _పార్థయమానః సంకీ ర్త 


యన్నాళ్వసిమి” (నాకు శిఖరిణియు తియ్యమామిడియ దొరక నప్పుడు వాటిని 
మెచ్చి కోరిక వెలిబుచ్చి అనందింతును.) అని తిండిపోతు విదూషకు డంటాడు. 
దానిపై రంగనాథుడను పండితు డిట్లు వ్యాఖ్యానించెను. “ఎలాలవంగ కర్పూూ 
రాది సురభిదవ్య మిశ్రితం దుగ్గేన సహ గాలితం సితాసంగతం దధిశిఖరిణీ 
త్యుచ్యతే దధ్యతిరిక్త పూర్వోక్త _దవ్య మి శితః పక్యకదళీ ఫలాంతస్సారోపి 
తత్సదవాచ్యః" అనగా ఏలకిపొడి లవంగముసొడి పచ్చకర్పూరము మున్నగు 
సుగంధ |[దవ్యమలు పాలలో కలిపి వస్త్రగాలితంచేసి తెల్లని చక్కెర కలిపిన 
పెరుగు కలిపితే అది శిఖరిణి యనబడును. లేక పెరుగుకు మారుగా అరటి 
పండ్ల ముక్కలు కలిపితే శిఖరిణి యగును. భారత దేశమందు వివధ [పాంతము 
లందు వివిధాచారము లీ శిఖరిణిలో కానవస్తున్నవి. మవోరాష్ట్రులు పెరుగును 
బట్టలోక ట్టి నీరేమియు లేకుండా ఒల్పి రిక పాకు బట్టకట్టి దానిపై ఎలకీ, 
లవంగము, జాజికాయ, జూవదత్రి పొడియు, కుంకుమపువ్వును వడియగట్టిన 
పెరుగును చక్కె.రను వేసి కలిపి రుద్దుదురు. ఆ విధముగా వస్త్రగాలితమగు 
దాన్ని శిఖరిణి యందురు. రాయలసీమ 'పాంతాలలో ఏలకి లవంగ జాజిపొడిని 
చక్కెరను మామిడిసండ్త రసములో కలిపిన దానిని శిఖరిణ్‌ యందురు. 
వాల్మీకి రామాయణములో (అయోధ్య ౯౧-౭౩) 'రసాలస్యదధ్నః ఆని భర 
ద్యాజుడు రాముని కిచ్చిన విందుపట్టికలో చేర్చినారు. దానిపై వ్యాఖ్యాతలు 
' శుంఠి పిప్పలి మిరియాలు ఏలకులు లవంగాలు తక్కోోలము శర్క్యర అల్లము 
జీలక[ర వేసి తాళింపుచేసిని పెరుగు" అని వొసినారు. అదియు శిఖరిణియై 
యుండునా? పాండురంగ మాహాత్మ్యములో ఒలుప్పు పప్పులు కజాయములు 
దబ్బెడలు ఒ రచేపలు సగరులు ముక్నగుసవి కలవు, అంబళ్ళు ఆస విందుల 
పట్టికలో ఆముక్తమాల్యదలో, సాంబోపాఖ్యానములో, పాండురంగ మాహాత్మ్య 
ములో ఇచ్చినారు తె దంబలి, జొన్న ంబలి కాదు. పరమాన్నమువంటి చోష్య 
ములని యర్థము. 


వైప్టవాదిస్వాములు చందనపు పావలు ధరించిరి. (వి(పనాకాయణ 
చరిత) రాజులు “పలుచని దంతపుందళుకు పాదుకలు” ధరించిరి.! కోమట్లలో 


1, కుక ౧-8, ౭౦. 


విజయనగర సా[మాజ్య కాలము 99 1 


ఓలియిచ్చు యాచారముండెడిది. ఒక కోమటి తన భార్య క్రై ౧౦౦ మాడల ఓలి 
నిచ్చితి ననెను ! హ్నృదులలో సాధారణముగా ౧౦ మాడల ఓలి యుండెను. 
(శుక. 8-౧౩౭) 


అంగ మర్ల నము చేసి జీవించెడివారు కొందరుండిరి :___ 


కూలికి నూనెలంటి కల గూరలక్ర పొల మెల్ల జుట్టి పొ 

ల్యాలక యాత్మ బంధుజనులం దరియం జని |పాతబట్టకె 

కూళ తనంబునన్‌ (పభులకుం దనుమర్గన మాచరించుచున్‌ 
పాలుడు |పొద్దుతోడ గృహ వాటికి జేరు నతండు నిత్యమున్‌.”'£ి 


ధనికులు తివాసీల పై కూర్చొనెడివారు. (శుక, ౧-౨౬-౨) బురునీసు 
దుష్పటులు కప్పుకొనెడివారు, (శుక, ౨-౨౬౫) (/(బురునీసు పదము నిఘంటువు 
లలో లేదు. మెత్తని మేలైన ఉన్ని కంబడిని బురునీసు అందురు. తెలంగాణా 
లోని కొన్ని తావులలో ఈ పదము వాడుదురు.) 


వ్యభిచారము, చిన్నజాతులతో భుజించుట, బాంధవ్యము చేయుట, 
దొంగతనము మున్నగు తప్పులకు కులంతప్పు సపెట్దెడివారు.! యుద్ధము చాలిం 
చుటకు, నంధిచేసుకొనుటకు ఓడినవారు 'ధర్మధారి పట్టెడివారు. అనగా 
కొమ్మూదువారు. ఆంత ఉభయవర్గాలు యుద్ధము చాలించెడీవి. కీడాభిరామ 
ములో వలెనే శుకస ప్పతిలో “విరహిజన మథనంబు మనసిజుండు పట్టించు ధర్మ 
ధారోదయంబును బోలికుక్కుటారవంబున ఆరుణోదయం బగుట యెరింగె'క 
అని వర్ణించినారు. 


అప్పులవారిని పొగడదండలతో శిష్షించిరి. (శుక. ౨-౧౬). దీనిని 
గురించి యిదివరలో చర్చింపనై నది. మరియు అప్పుల పోతుల నిలబెట్టి చుట్టూ 
గీతగీసి అప్పు చెల్లించువరకు ఆ గీటును దాటరాదని అప్పిచ్చినవారు శాసింబెడి 
వారు, 


1. 94 =రిండొ6ాఎం 
వి, శుకం ౨-౩౬౩. 
8, 99 ౨౧౩౯ 


4. ,, 2౨-5308, 


292 ఆంధుల సాంఘిక చరిత 


“ఆన మాయప్పు లీకపోతేని యనుచు 
ధరణీ పంపున తొలుకారు తరువుకాడు 
నింగి గుడివాసియాగిన భంగినపుడు 
చండకరుడఃండె సరివేష మండలముని!! 


దొంగలను పట్టి “బొండకొయ్య" నుంకెడివారు.? రెండు పలకల 
తొలచి అందు రెండు కాళ్ళను పెట్టించి _పక్కలలో క ర్రైకొయ్యను దిగగొట్టు 
౬ రు లు 

దురు. అటులే చేతులకును తగిలింతురు. వాటిని బొండకొయ్య లందురు. 


ము త్రెదువగా చనిపోవుటను “కడియంపు చేమీదుగాగ దివము సేరుటి” 
యనిరి.® అనగా ముత్రెదువగా చనిపోయెనని యర్థము. నేటికిని రెండ వభార్యను 
చేనుకొన్నప్పుడు ఆమెకు “సవతికడెము” అని యొక సన్నని కడెమునకు 
రెండు చుక్కలు పెట్టి ఆమె కుడిచేతికి పెట్టుదురు. 


నందులు గుడిపూజారులై జీవించిరి. గుళ్ళలో గన్నేరు పూవులు 
సమృద్ధిగా పెంచి వాటిని సంపన్నుల యిండ్ల స్రీలకిచ్చి (పతిఫల మందెడివారు. 
“ ఊరినందికి మోహ మూరించి తెప్పించి పూను మాపటి వేళ పూవుటెళత్తులు శ, 
“నరసిన సిగలోన నంబివాడిచ్చిన గన్నేరు పూవులు కొన్ని తురిమి” అనుటచే 
నంబులవృ త్తి కొంత తెలియ వస్తున్నది, 


యతుల జీవనము లిట్లుండెను : 


“తిషవణస్నానములు నిష్టదేవపూజ 
[గంథపారాయణము పర బహ్మచింత 
భెచభుకక్రి హరీతకీ భతీణంబు 

ఆజిన శయనంబు గల్గి యయ్యతి వొసంగు.*6 


1 వై జయంతి. Dees 

ఏ శుకస పతి ౩-౨౦౪. 
PR 0 

తీ శుకం ౩3-33౭. 

4 శుక, ౨-౪౩౫. 

రీ శుక. ౨-౪౮౭. 

6 కుక, ౩-౫౪౫. 


విజయనగర సా[మాజ్య కాలము 998 


'జథవమ్రూత్రా హరీతకీ” అని వైద్యళాస్త్రము. ఆది చాలా యుపయోగ 
కారి, చక్కెర పాకులో మురబ్బాగా ఊర వేసిన కరక్కాయ దినమొకటి వంతున 
ఆరు నెలలు తింటే నరసిన వెంటుకలు నల్హనగునందురు. కాని పురుషులకు 
పుంసత్వమును చీణింప జేయుననియు నందురు, ఇచ్చట యతి దాన్ని సేవిం 
చుట పుం_స్వ్వమును తగ్గించుకొనుట కే! 

బాహ్మణుల యిండ్లలో “ద్యారావతిగలంతి” చెంబులు (టూటీదార్‌ 
లోటా) లుండెడివి.! ఇప్పుడు మట్టిపా[తలను ద్రాహ్మణు లెక్కు వగా వాడరు, 
వేదకాలమం దవే హెచ్చు. “మృణ్మయం దేవపాతం' ఆన్నారు. నేటికిని శుభా 
శుభ కార్యాలకు విధిగా మిట్టిపాాతల వాడవలెను. తెనాలి రామకృమని కాలములో 
(దాహ్మణుల యి:డ్హలో వంటలు మట్టిప్మాతలందే యెక్కువగా చేసిరి. ఒక 
బాపనమ్మ “వార్ధా రాధౌతము కుండయూడ్చి యొసగెన్‌ రంభాపలాళంబునన్‌' 
అతిధి ఆ కుండెడు మా యంచేసి 'చూడు మీసారి భాండమో శోభనాంగి' అని 
కొసరెను. ఆపుడా యిల్లాలు “నాథుడు పల్లియకేగి భుజింపకున్కి భరితంబయి 
అట్టుక సట్టుకట్టి యొప్పు నోదనం బొసగె తదాజైను _శావమూకుటన్‌' అటుక 
లోని యన్నమును మట్టి మూకుటి (చిప్పలో తెచ్చి వడ్డించెను.? 

నిగమశర్మ ఆం|ధుడుగా నే సిరూవీతుడు, ఆతని సోదరి పక్కా ఆం|ధి. 
ఏరి తండి “కళింగ దేశాభరణంబగు పీఠికాపురం బధిస్టించి సకల మహీసుపర్వ 
(శష్టుండై వలిసె”*, నిగమళ ర్మ వ్యభిచారియై ఆ స్పినంతయు పోగొట్టుకొన్న 
బధ మెట్టిదనగా 3 ఎలా 

“దినవెచ్చమునకై తన మేనగల సొమ్ము 

కొదుకక బచ్చింట కుదువవైచు 
ఇందు గీసిన రీతి నించుకించుక చేరి 

గిలుబాడు తల్లి పగల పసిండి 
తండికి నిడ్డప తములు దొంగిలిపోయి 

పోయి నంతకునిచ్చి పొరయు గొంత 

మిండ వడ్డికి నోర్చి మృత్యురూపములై న 

సాహులచే బుణ[గాహియగుచు 


9, ?9 99 P= క జు. 


294 ఆం|ధుల సాంఘీక చరిత 


గుడ్డవృత్తులు... కొలుచు, గుత చేలు, 

అలాటి a) 
(గామాంశములు నాధినేల లెల్ల 

చనవరుల కమ్మజూపు నిచ్చావివిరవర్రి 
వాడేమి గానున్నవాడొ మీది 


ఆ కాలమందు పలువురి [బాహ్మణుల యిండ్లలో (గంథాలయము లు౦డే 
డివి. హర్షుడు తన నైషధమందు 'మూర్గాంధకూప పతనాదివ పు స్తకానాంి 
అని యుండెను. నిగమశర్మ అక్క. “పుస్తక భాండాగారంబు నిజభ_ర్హృ హస్తాం 
తరంబున ఆకుకుక్షణి 9థిల బంధన యాచక _పముఖోవ![దవంబులవలనం బాచి 
(పోచుచు' రక్షించెను. తాటియాకుల కట్టలకు ఆగ్ని శై థిల్యము, పురుగులు, 
యాచకులు, ముఖ్యశతువులు, నిగమశర్మ ఒకనాడు 'చలిది వంటకంబు గుడు 
పం జనుదెంచినప్పుడు' అతని యక్క 'నిజనందనుం జిరుతవాని మేనల్లుని 
నిందమని చంకకిచ్చి” ఎచటి కేగెదవు మీ బావ బంతి నారగింతువుగాక అని 
చెప్పి వడ్డించి పిమ్మట, 

“ఇంతలు నంతలు నగు తన 
సంతానము చంటవెంట సందడి సేయన్‌ 


[ప్రాంతమున నిలిచి తమ్ముని 
కుంతల బంధందు విడిచి కుశ లాళయయె” 


ఎలయు సీత్కారములతోడ సీళ్ళుగుక్కి 
యంటు సంటులు పరికించి యంట్లబొడిచె 
గోరు ముక్కుల దిగదువ్వి తూరుపెత్తి 

నెరుల గలిగిన పేల నన్నింటి దిగిచె 


* మెడమన్ను నలచి యలకలు 
ముడిగొని సిజ పాణిపద్మములు గరగరగా 


గడుగుకొని తనకు మరదలు 
విడె మొసగుచు పసిమి పసిడి వీవన వీవన్‌.” 


“చేటికానీత పీఠికాసన యగుచు 
సద్మకర్ణిక కొలువున్న పద్మవోలె 


విజయనగర స్మామాజ్య కొలము 895 


కుడివలన నింత యోరగా కొమరు మెరసి 
బిడ్డ చను దావ నిట్లను బి ఏరువోక్షి” 


(పారంభించిన వేదపాఠములకున్‌ [పత్యూహ మౌనంచునో 
యేరా; తమ్ముడ। నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనో యుండి, చ 
తూరాజీవయుగంబు వాచ్చె నిను కన్గోకున్కి., మీబావయున్‌ 

నీ రాకల్‌ మదిగోరు చం[దుపొడుపున్‌ నీరాకరంబుం బలెన్‌.' 


అని తదీయ దురాచరణ స్మరణ సంత పస్యాంతయె ఇటనియె :— 
RU 9) (+ Wn య 


పడబడ బారుచున్‌ వడకు పట్టిన తల్లిని దండ్రి, నేలలో 
వెడలని తమ్ము గురల, నవీన కులాంగన, నోరులేని యీ 
తొడుకుల్క బంటుపెద; విడ దోవక (పోవగ నెందు, నీక పా 
ల్పడినది కర్లు నౌదలనె భారత సంహిత నిల్చు చాడ్పునన్‌, 


అని యింకను కరుణాభరితముగా చక్కని యుపదేళ మిచ్చెను. ఇదం 
తయు అతి సుందరముగా |బాహ్మణ కుటుంబ జీవనమును వర్ణించిన ఘట్టము. 
ఈ నిగమళర్శ్మోపాభ్యానము ఉత్తమ రనపూరితమగు గాథ. మన చరితకు 
చాలా పనికివచ్చునట్టిది ! పాము కరచిన విష చికిత్సలను నానావిధములుగా 
చేయుచుండిరి. “పాము కాటువేసిన తావున కత్తితో కాటుపెట్టి రక్తము (స్రవింప 
దఉయుట, ఘట పూర్ణ మంత పుష్క రధార లెత్తింయట, వసరు నడినెత్తిన 
రుద్దింది బెత్తముతో నిట్టటు మోదుట, బిగించుకొనివోయిన దౌడలలో కరు 
జొనిపి మందులుపోసి మం(తాలు చదివించుట యనెకివి కొన్ని యవస్థలై 
యుండెను (వేంకటనాథుని పంచతంత్రము ౧-౧౧౯ ౧౨౦ 


సంస్కృత పంచతంతములో లేనివై వేంకటనాథునిచే [కొత్తగా చేర్చ 
బడిన విషయాలను మాతమే చర్చకు తీనుకొందును. బహు విషయములను 


బహువర్ణనలను మూలములో లేనివి వేంకటనాథుడు తెనుగులో నెక్కు.వగా 
(వాసినౌడు, 


చలికాలములో జను లెట్లు జీవించెడివారో వేంకటనాథ్రుడు చాలా చక్కగా 
నిళూపించినాడు. తాంబూలము, సొంటి, అగరు ధూపము, గొంగళ్ళు, దొడ్డు 


1. పాండురంగ విజయము, ౩ వ ఆళ్వాసము, 


ల96 ఆం'ధుల సాంఘిక చరిత 


బట్టలు జనులకు (వియమయ్యిను, ఆరికకూడు, పుచ్చవరుగు, ఆవుల వెన్న 
తిని మజ్జిగ సద్దులతో రెడ్లు దున్నా&కు బోయిరి. (పంచతం|తము ౧-౬౮౬ 
నుండి ౬౮౮.) 


వై దిక [బాహ్మణుని లక్షణాలను వేంకటనాథు డిట్లు తెలిపినాడు. నీర్కావి 
ధోవతి పింజపోసి, ధౌతో తరీయము వేసికొని గోపి చందనముతో ఫాలము 
నలంకరి. చుకొని బిళ్ళ సిగలో పూలు వెట్టి యుండెను. (పంచ. 3-౨౪౪.) 


గొల్లల జీవనమును వెంకటనాథుడు చాలా విపులముగా వర్రించెను. “ఓక 
గొల్లకు గొర్హమంద, ఆవులు, దుక్కి బెడ్డు, దొడ్డి, గరిసెలు ఉండెను. ఆ గొల్లి 
పెద్దకు కులబిరుదు “బోయడు' అని యుండెను, ఆతడు అట్టలె త్రిన పాత చెప్పులు 
దొడిగి, అంబటికుండ మోసికొని, గోచిపెట్టి ములుగ త్తి నడుమున కట్టి కొడిది 
పూసల మొలతాడు కలిగి, ఒడిసెల, పాలకావడి పట్టి బుజముపై గొంగడి 
వేనుకొని, పిల న|గోవి బటి యింటికి వె ళ్ళిను, (పంచ. లజషకాలా?. 
ne) లు 


ఆ కాలమందు లెక్కలు |వాయుటకు తాటాకులేకాక కాగిదాలమీద 
“కోవలువడ” వాసిరి. (కోవలు నిఘంటువులలో పిలలగొంతు జబ్బు అని 
[వాసినారు, ఇక్క డది సరిపోదు. కట్టలు కట్టలుగా వాయుట అని యర్థము, 
పూర్వము కాగిదాలను ఒకదానికొకటి యతికించి వాసీ చుట్టగా చుట్టి యు౨చెడి 
వారు. ఆ చుట్ట పదిబారల వరకు కూడా పెరిగిపోయెడిది. మరొక విధము 
“కడితముిలో (వాయట. కడితము ఆన మసిపూసి గట్టన చేసిన చదరపు 
గోనెపట్టతో జేసిన లెక్క పుస్తకము. అని పాండురంగ విజయ టీకాకారులు 
(వాసినారు. గత |పకిరణములో ఇట్టి విషయము చర్చించి ఇంచుమించు ౪౦ 
ఏండ్ల [కిందట పాలమూరు జిల్లాలో వ్యాపారులు కోపు బలపాలతో నల్లని పూత 
గల అట్టలపై [వాసి తుడిచి మరల [వాసుకొనుచుండిరని తెలిపినాము. అదే యీ 
కడ్రితము ; లేక కళితము. కడితము జేనెడు పొడవును ఆరే డంగుళముల 
వెడల్పును కల ౫-౬ అట్టలు కలిగి అవన్నియు మడుచుకొను నట్లతికించి చేసి 
నట్టి [వాతకు సాధన మగునట్టి ఫలకము. ఇంచుమించు (క్రీ॥ శ॥ ౧౯౨౦ వరకు 
ఇవి హై(దాబాదు రాష్ట్రములో కోమట్టవద్ద వాడుకలో నుండెను. వృద్దుల వలన 
నేను విచారించి తెలుసుకొన్నంత వరకు వాటి నీ (కింది విధముగా సిద్ధము 
చేయుచుండిరి. 


విజయనగర సా మౌజ్య కాలము 89? 


ఓక టిట్టపై లావు కాగిదములను రెండు (పక్కల అతికింతురు. లేదా 
లావు ఆట్టలను bసుకొందురు. వాటిపై క క్టెబొగ్గును రాయుదురు,. దానిపై కుంట 
గల్దర (భృంగరాజము) ఆకు రసమును పిండి ఆకుతో రాయుదురు. కొందరు 
ఆ పసరులో గోందును కలివీ రాయుదురు, కంటగల్డర లభించని పక్షమున 
బీర ఆకు రసము, అదియు లభింపని పక్షాన అముడుక అను పొలాలలో సమృ 
ద్ధిగా దొరకు ఆలమును దానిపై రుద్దుదురు, బొగ్గు, బంక, పసరు మూడును 
అట్లపె కలిసి నల్లని గట్టి పూత (Paste గా ఏర్పడును. అది బాగా ఆరిన 
తర్వాత దానిపై కోపు బలపము అను మెత్తని తెల్లగా వాయు రాతి బలపముతో 
వాసికొని తుడుచుచు వాయుచుండురు. ఇప్పుడు నష్టకారులగు రాతిపలక రలు, 
బలపాలు వచ్చినవి. పూర్ణము కళై పలక పై |వానుకొనుచుండిరి, విద్యార్థులు తమ 
కళ్టైపలకలపైన పై గోందు, బొగ్గు, కుంట గల్లెర వసరును రుద్దు చుండిరి. 
ఇప్పుడు ఆట్టతో చేసిన కడితాలుకాని, కరు పలకలు కాని మోది పూర్తిగా 
మాయమైనవి, పాండురంగ విజయములో కోప, కడితము, కళితము, కవిలె 
అను పదాలు కలవు. 1 


అచ్చనగండ్ల యాటలు ఆడువారి యాటగానే యుండెను, నేటికిని అంతే 
(సాంబో. ఎవి-౧౨౦౧). కొన్ని వేశ్యవాటిక లలో పందెములతో కూడిన ఆటలు 
పండుగుల వేళ సాగడీవి, 


“కచ్చించి సొగటాలు గణకలతో కుక్కు 
టాండముల్‌ పణముగా నొడువారు 
[దవిణము పై పన్నిదము టౌడ్జి మాత్సర్య 
గతి కోడి పందెముల్‌ కట్టువారు 
నెచి|తిగాగోల గాచి సన్నిదమాడి 
చెరుకుమోపులు లీల నరుకువారు 
గురిచూసి యటకేగ పరతెంచునందాక 
నొనగిన భత్యుముల్‌ మెసగువారు 
ఆఢ్యులై గో తళాలల నధివనీంచి వి 
టుల వేళ్యాజనముల చక్కటుల దీర్చు 
1 పాండురంగ మాహాత్మ్యము ౫-౭౪-౮౦, లాడె, భతి, 
(36) 


298 ఆం|ధుల సాంఘిక చరిత 


వారలును_ గల్లి శంబరివెరి సంత పేట 
యన న్లొప్పు నవ్వేశ్యలాటమునను”£ 


(నైచి;తికి నై చ్మితి యని యుండవలెనేమో ?). 


 గొల్లపడుచులు పేరుగు, పాలు, వెన్న అమ్ముకొని జీవించెడివారు. అందు 
కొందరు దధి తక విికంయంబు లుపదేశమాత.౦బులుగా జారాన్యేషణంబుభు 
(పధాన కార్యంబులుగా సమీప జనపదంబుల నుంచి వచ్చియున్న యాభీర 
ఖీరువుల్లై యుండిరి, ' (శుక. ౩-౫ఇం) 


వ్యవసాయము = వ్యాపారము 


రాజులే కాక మంతులు, వారి భార్యలును చెరువులు కట్టించుచుండిర్‌ 
గుంటూరు మండలములో పంకాయలపాడు ఆను గామములో గోపీనాథ సము_ద 
మను చెరువును రామమయభాస్క రమం తి సోదరియగు చిన్నాంబ కట్టించి, శా॥ శ! 
౧౪౬౨లో శాసనము  వాయించెణు. 1 అదే విధముగా కడప జిల్లాలోని సిద్ధ 
వటము చెరువును కా॥ శ॥ ౧౫౨౭లో మట్ట అనంత భూపాలుడు కల్పించి 
శాసనము [వాయించెను.* . 


ఆ కాలపు వ్యవసాయ వ్యవస్థ ఆయగాండ్ల పద్ధతి, మిరాసీలు, మున్నగు 
పవరాలు తెలుపునట్టి తామళాసన మొకటి కర్నూలు జిల్లా ఫెద బెళ గళ్ళు 
(గామకరణం ధర్మన్నవద్ద నుండు దానిని (శ్రీ మానపల్లి రామకృష్ణ కవిగా 
రించుమించు ౪౦ ఏండ్ల [కిందట వనపర్తిలో |పక్షటించెను. అందలి ముఖ్య 
విషయాలను అందున్నట్లుగానే యచ్చట నుదాహరింతును. 

“రా॥ శ॥ ౧౪౧౪ లో శ్రీకృష్ణదేవరాయలు నాయకసమూపవోన్న వచ్చిన 
ముమ్మడి రెడ్డినాయక మొదలై నవారికి మిరాశి, రెడ్డి మిరాళీలు యిచ్చిన పివరం:-= 
గొల్లలు పాలెగాళ్ళు అయి, దుర్గాలు సా/:నీయక చాలా వుషదవం చెస్తూవుండగా 
వారిని మీరు గెల్పినారు కనక మీకు చెరువు బెళగళ్ళు ఆదిగాను చామల 
గూడూరు కంభంపాడు తిమ్మునదొడ్డి మొదలైన షోడళ స్థలాలకు ఆయినారు 

1 వె జయంతి. ౩-౬౯, 

2. కానన పద మంజరి. శాసన సంఖ్యా: లాంశాళుటి -౧౮౩౩-- . 


ft; ల్‌ శ వ్‌ ౮౪, పుట ౧౦౬. 


విజయనగర సా|ఘాజ్య కొలము 299 


గనుక ఈ,స్థలాలు సురక్షితంగా నడిపించి శ్రీ విరూపాక్షేశ్వరుని రాజ్యం 
పసిద్ధి చేసేది. (గ్రామాలకు పొలిమేరలు యేర్చాటుచేసి రాయసం వీరమరసును 
అంపించి శిలాశాసనాలు యేర్పరచిన- వివరం....యీ !పకారం 'ఫొలిమేరకు 
శాసనాలు యేర్పరచిన వివరం. బారా బలవంతులు యెవరంటే, 


శ్లోకం! కరణం, ముచ్చి, కంసాల్కి కుమ్మర, కమ్మర, గణక, 
. శ్శిల్పక స్వర్గ మృదయస్కార తక్షకాః | కసారకళ్చ. 
భకార శ్చండాలవ్వితలం । తెభ్రా నికృష్ట కారి 
_ కాంచిష్టో రజకశ్చ యథ్యాకమం, ఏతే 
ద్వాదళ జాతీనాం (గామభార న్య వాహకాః॥ 


కర్నూలుసీమలో అడవు లెక్కువగ్గా నుండినందున విజయనగర చక్ర 
చద్తులు మీరాశీ లిచ్చి కొన్ని సంవత్సరాలపన్ను తీసుకొనక [పజలను ఆక 
రించి అనేక గామాలను నె౭కొల్సిరి. కర్నూలు జిల్లాలోని అన్వరి 'గామ 
కంణంవద్దనుండు. తామళాసనమందలి విశేషా లేమనగా : ఫా 


“రా॥ శ॥_ ౧౪౧౨ లో సాళువ శ్రీ నరసింగరాయల అయ్యగారు దోణా 
చలంభూమి, " అశ ంపురిభూమి అరణ్య మై యుండగాను ఇందుకు [గామాదులు 
ఆకారం అయ్యేటందుకు పట యేయే స్థలాలనుంచి యెవరెవరు వచ్చినా ఆ 
[గౌమాదులు _ ఆకారం. చేస్తున్నారో వారిది కాణియాచ్చి మిరాసులని రాసులు 
చెల్లి ంచగలవారమని కవులు వాయించి యిచ్చి పంపిస్తేను మలకసీమలోను, 
గోరంటసీమలోను బిల్ల కల్లుబాణాల అమరువాలు కాతనకోట ధ్యావనకొండ..,. 
మొదలై న గామాలనుంచి వచ్చిన అహ్హాదళవర్గాలవారు |ప్రజలున్నూ 'బారాబళ 
వంతులున్నూ, పౌరోహాత మఠపతి జంగాలు తమ్మిళవారున్నూ, మేటి గొల్ప 
లున్నూ, బోయవారున్నూ, నే శెగమళ్ళు (నే సేగౌండ్లుణా సాలెవారు అని యర్థము) 
మొదల్సైన _షజలున్నూ....వచ్చి చెరువు బెళగల్లు చేరి స్థాయిచేశిశ్రీరాయలయ్య 
గారి సముఖానరు వచ్చిన రాయలవారు అనిన వివరం......ఆ(గొమం యెవరు 
ఆకృతి చేస్తున్నారో వారివే మిరాసులు........ యా వచ్చిన (ప్రజలు. (గొమం 
చూపించి అష్టదిక్కుల భూమి. పొలం యేర్చాటుచేసి, పొలిమేర యేర్పాటు 
అన నిర్ణయం... 


మిరాసిదార్లను ఏ యేర్చరచిన వివరం రెడ్డ నిర్ణయం పొకనాటివారు జనులు 
కు ఎ, ల ౧, షత షల ౧ అంత ౪ భాగాలు. 


800 ఆంధుల సాంఘీక చరిత 


కరణాలు......కమ్మర, చాకల, మంగళ, కుమ్మర, అగసాల, తలార్లు 
దేవళ్ళ పెద్ద దెవినడు, చిన్న దెవినడు (వింత పేర్లు గమనించాడు.) మాదిగె 
నాగపాగా తీమ్మపాగా (ఈ పేర్లునూ గమనించుడు), బేగారి, పీరు బారా బల 
వంతులు, 

మాన్యాల నిర్ణయం :-బాలవి శ్వేశ్వరుడు అనాదీయములై న విగహములు 
గనుక తళిగె దీపారాధనకు మాన్యం యిచ్చినది నల్తుము బైరవేళ్వరునిక్రి 
తూమెడు నిరస, 


శివాలయ లింగానకు తూమెడు నిరస వామమంతరాయనికి అయిదు 
తూములు, పోతరాజునకు తూమెడు యిరస దెవమాన్యంలు సరి, రెడ్డి మాన్యం- 
కరణాలు, తలార్లు, కమ్మర, వడ్డ, చాకల, మంగల, కుమ్మర్క జంగం, 
తమ్మళ, దాసరి, మెరగౌళ్లు (ఇదేమి జాతియా)? నేశెగవుళ్ళు ఒకొక్కరి కింత 
అని నిర్ణయం చేసినారు) యీ |పకారం మాన్యాలు కాపులకు ౫ యేళ్లు 
కవులు చెల్లిన తర్వాతను తూము ౧కి అయిదు వరహాలు యేర్పాటు చేసినారము.” 


రాయల కాలమునుండి నేటివరకు పన్నిద్ద రాయగాండ్లు స్థిరపడి |క్రీ॥ళ॥ 
౧౬౦౦ నుండి ఈ [కింది వారు పన్నిద్ద రాయగాండ్డు గా లెకి, ౦పబడిరి. 
(౧) కరణము, (౨) రెడ్డి, (3) తలారి, (౪) చాకలి, (౫) మాదిగ (తనము 
చేయువాడు), (౬) మంగలి, (2) వడ్డ (౮) కిమనలి, (౯) పురోపాతుడు, 
(౧౦) నేరడి, (చెరువులుండు [గామాలలో) (౧౧) కుమ్మరి, (౧౨) కమ్మరి, 
ఈ లెక్కలో తర్వాత మరికొంత మార్పు కలిగెను. ఇప్పుడు కమసలి, పురో 
హితుడు ఆయగాండ్లలో చేరరు. రెడ్డి కరణాలకు తలార్హకు జీతాలు, స్కేచ్ల 
ఏర్పడినవి. కాన వారును ఈ పట్టికనుండి తొలగినారు. ఇప్పుడు నికరముగా 
మిగిలినవారు చాకలి, మంగలి, వడ్డ, కమ్మరి, చెరువు లుండుచోట నేరడి, 
మాదిగ, కొన్ని తావులలో కుమ్మరి. పూర్వము నుండియు కరణము లెక్కలు 
[వా సేవాడు. | 
“గంటము ఖడ్గము తోడుత 
నంటున పగ దీర్పవలయు నవసర మైనన్‌.” 


అన్న వరుస వారు కరణాలు. కత్తులకు గంటముల నే వారెదురొడ్డి పలు 
మారు గెలిచినవారు, 'రెడ్డధికారియైన (గామర్గె_తుల జెరచున్‌” అన్న సూ కిని 
స్థిర పరచినవారు రెడ్డు. 


విజయనగర సా్మామాజ్య కాలము 801 


ఆ కాలమందు (గామాలకు పంచాయతి సభ లుండెను. ఆ పెద్దలే పన్ను 
వసూలు చేసెడివారు. గామ తలార్డే పోలీసువారు. న్యాయ స్థానాలు పంచాయతీ 
సభలే | 


వ్యవసాయకులు పశుల తలుగులకుగాను మ[రియూడలను గూడ తెచ్చి 
తాళ్ళు వేసెడివారు. 


“ఈ రీతి నుండి యొకనా డారెడ్డన పసికి దలుగు లమరించుటకే. 
నారలు గావలెనని పొరుగూరికినై పోయె మరియూడలు దేన్‌? ! 


వ్యవసాయకులలో ముఖ్యులు రెడ్డు. సాధారణపు రెథ్డు స్వయముగా చేని 
పాటువడి' పండించేవారు, మధ్యాహ్నము వరకు |శమించి “యింటి కేగుదెంచిన 
తరి దాలి తోకషలు చేర్చిన కాగుల నీటితో స్నానం చేసి “బొడ్డు గిన్నెలో 
రాగిసంక టి" తినేవారు, 2. వ్యవసాయకు.కు పాడియు బాగా ఉండెడిది. ఆమా 
వాస్యలందు సేద్యములు చేయకుండిరి. (రుక్మాంగద ౨-౪౩). నేటికిని అనేక 
(పాంతాలలో ఈ ఆచారమున్న ది. 


వ్యాపారాన్ని |పధానముగా కోమట్లే సాగించెడివారు. ఇంతకు పూర్వము 
ఆర బ్బుల్కు ఈరానీలు, చీనావారు, బర్మా, మలయా, పెగూ, కాంబోడియా, 
ఇండోనీషియా, సింహళము వారు మన దేశముతో వ్యాపారం చేసిరి. కృష్ణ 
రాయల కాలములో పోర్చుగీసువారు దిగిరి. ఈ సమీక్షా కాలములో (ఖంది 
(పరాసులు, పరంగీలు), ఇంగిలీషులు కూడా దిగిరి. వారితో మన బేరులు 
బేరాలు చేసిరి. “ఇంగిలీమల ముథాములు (వ్యాపారస్థానాలు), “విచిత్ర వేష 
భాషాభిరాములగు పరంగులి ముఖాములును సము[ద తీరాలలో నుండెనని కదిరీ 
పతి మొదటి కథ తెలిపినాడు. ఏయే దేశాలనుండి యేయే వస్తువులు దిగుమతి 
యగుచుండెనో మనకు చాలావరకు తెలియవచ్చినవి. తెలిదీవి?) నుండి పద్మ 
రాగములు, ఈళా దేశమునుండి నీలములు, మక్కానుండి తివాసులు, షీరాజ్‌ 
(ఈరాను భాగం) నుండి వచ్చిన సిరాజులు (కతులు), “అల్లనే రేడు వాగు జల 
ముల నైన యవి యపరంజి లప్పలు (జంబూ ద్వీపము అనగా కాశ్మీరములోని 
జమ్మూనుండి వచ్చిన బంగారు), కట్టాణి పూసలు (కట్టాణి శ॥ర॥ నిఘంటువులో 


1. శుక స పతి ౨.353౮. 


కం శుక స_పతి ౨-౩9౫. 


స్ట .2కోరి్రుర్నిసాంమిక చరిత్ర. 


లేదు. ఆంధ వాచసృృత్యములో జక. విధమగు బంగారు అసి వ్రాసినారు కట్టాణి 
అను. అయిదు, బ్వగారుగుండ్ల అయిదు సరుసలుకల కంఠాభర ణమ్సన్ను ఇప్పటికిని 
వాడుదురు. అదే వీధమగా కంఠవోరము గా" వాడు ముత్యాలను కట్టాణ ముత్తా 
లందురు ) కాళ్ళీ రపు కుంకుమపూవు, మలయగిరినుండి శ్రీగంధము, ఓీడల పై 
వబ్బీన' పోకలు అనగా" జహ, 'సుమి*తాదీవులనుండ్‌' నం? nm (రేవులో 
దిగిన) తేజీలు, దిగుమతి యగుచుండెను. 


I Nl 


'ఇవీగాక రత్నాలు? ముత్యాలు, దీనుగులు, కస్తూరి, సపరపువెంటుకలు, 
జవ్వాది, 'గాజుజుడ్డలో' వన్నీరు? పంచలోహాలతో ' “చేసిన విరంసలు, వెండి, 
వట్టుబట్టతో . చేసిన విసన నక్మరలు, ఫక్‌ ల్లారుబండ్లు, పింగాణీ. వింధ్లు, రాతిపిడుల 
బాకులు, :చలువర్గాతి గిన్నెలు, బానిసల గా కొన్ని యువతులు మున్నగునవికూడా 
థిగునుతి యయ్యెను.! (శ్రీలు విదేశాల నుండి కొని. .తెచ్చుటనుగూర్చి ఇతర 
క వులును తెలిపినారు. .) పాదరసము, జాజికాయ, యింగువ, లవంగాలు, పంచ 
లవణాలు,..గంధకము, కొచ్చి వేపులు (కుక్కలు) కూడా దిగుమతియయ్యెను,2 
వ్యాపారులు బేరాలకు వెళ్ళినపుడు బె_త్తపు బుట్టలు, ఇతర, పర్లికరాల్పు, గుడా 
రాలు తీసుకొని వెళ్ళిరి.క్‌ 'ఈళయు, నిశిందయు బంగాళయు మొదలేన పేర్లు 
గల డీపులి నుండియు సరకులు" దిగుతుండెను. (శుక. ౧-౧౭౬) ge 
విశీంగయు అనియు నాకపాఠము కలదు. శుకస పతిలో మరొకచోట “ఈళయు, 
ముమ్మెంగియు, బంగాళము, సెగోవ మొదలుగా 'బొదీలేడు ద్వీపావళి" (3- ౭) 
అని వాసినారు, ఈ రెండు 'పద్యాలలోని 'పౌళము. "తప్పుగా కానవసున్నది+ 
శక న ప్రతీకారుని తర్వాతి ౨౦౦ ఏండ్లకు 'ఆయ్యలరాజు 'నారాయణామాత్యుడను 
కవి వంసవింశతిని రచించెను. అరదతేడు ' అమాంతముగా శకస ప్రతిలోని 
పంక్రులు, పద్యాలు. 'భోవాల్కు వధానోలు అన్నీ స్వీకరిస్తూ వచ్చినాడు. కావున 
పై పద్యాలకు సమాగమ పద్యము హంసవింశతీలో దొరికిన మనము సరి 
యగు పాశ్రమును. నిర్ణయించుకోవచ్చును.' వాంసవింశతి' [ప్రథమోళ్వాసములో 
౧౧౨వ పద్యమట్టున్నేది : పం. | 

1. జకస్పద్దతి ౧-౨౨౨ (ఈ రగడలో, కొన్నిపదాలు నిఘంటుకారు 
లకు తైలియక నుదాహరించినవారు కారు) , 


ధ్‌ 


2. కు, ౧-౧౯౨. 


రీ. కు, ౧-౩౮౯. 


విజయనగర సొయాజ్య"జా లేము 808 


"= క్కడము, వళంద బందర' లింగేలీమ కళము, "మొదలైన పేటల 
గౌరలెల్ల సౌరభ (దవ్యములు బేరసౌరమాడ ' బిలువనంపిరి '' తమతమ 
పేటలకును” 

"ఈ పద్యములో 'మ్పైద్రటిపం" “క్రినిబట్టి శుకస' పతిలోని' "మొదటి పద్యపాఠ 
మిట్లు దిద్దుకోవలేను. “(కళము. అన కొల్లం (Kollam) మల బారు తీరముది) 
శకము, “వళందయును, బంగారము ” మొదలై న జశీరుగల  దివపలలోో.__'ళ' 

డికు భేదములేదు. ఇచ్చట “లికు [ప్రాస కదురవలెను. కాన ఈడెమునకు 
మారు ఈళము ఆని [వాసినాడు. కవిత్వమయ కాన 'ఈళమును: ఊళ కూడా చేసి 
నాడు. అయితే ఈ సవరజలోని విశేషమేమి ?-మనకు వాటిజాడ కొంతవరకు 
తెలియవస్తున్నది., ఈడము. అనగా..ఏడన్‌ (A0౭0) అన్ను అరేబియా. రేవు. 
ఆచ్చుటినుండి బహు (ప్రాచీనమునుండి దక్షిణాపథ. తీరాలలో వ్యాపారము సాగు 
తుండెను, ,వృళంద అనగా హోలెండు. దేశము. ఇ దేశ ఘువారిసి గచ్చివారందురు. 
వారు ఇంగ్సిషువ్లారికం టె (వెంచివారికంటె. ముందు. మన తీర్గాల్ధన్లు తగుల్లుత్తూ 
విశేషముగా ఇండొనీషియా దీవులతో వ్యాపారము. చేసిరి, అచ్చటి ౨౧బాయినా ాల్లో 
ఇంగ్లిషు వర్తకులను వధింపగ్యా ఇంగ్నీషుపీడ మ“ దేశానికి వచ్చెను. డచ్చివారిని 
మనవారు వళందులన్నందుక వారిదేశము వళంద దేశమని కదిరీపతి అన్నాడు. 
కదిరీపతికి ఈడము, వళంద అంటే తెలిసీయుండును. అతన్ని “అనుకరించిన 
నారాయణ కవికి తెలియక పోవచ్చును. కాని అతని హాథమ మనకు చాలా సహాయ 
పడినది, భకస ప్రతి తప్పుపాఠాలను సరిచూచువాడు హ హరసివీంశతిని బాగా చదివి 

దృష్టిలో నుంచుకోవలెను. శుకస ప్రతి రెండవ" పంక్తి అబే: యుంచవలెను. 
అందలి పెగోవ అనగా పెగూ దేశము. 


కోమళ్లే కాక “గు త్తగొల్టల్‌ 'కూడా "కొంత వ్యాపారము. చెసిరి. 
(కుక. ౧- Sea) పటలాంపక్రములు (శ సక, ౩- ౭) దిగుమతి యయ్యెను., పటల 
శబ్దానికి నిఘంటువులలో ఇంటికప్ప నేత్రరోగము, పరివారము, బొట్లు ' అని 
యర్థాలిల్చ్‌హా నారు. ఇవి సరిపోవు: ఆంశుక మన “వస్త్రము లుకాన 'పట్లల్రాంకకములన 
ఒకవిధమగు వస్త్రమను, నర్థము కావలెను. శబ్దకల్ప దుమములో పటలమున్లకు 
పరిచ్చదము (కష్ఫకొను వస్త్రము) ఆ అని యర్థము (వాసినాడ్యు | అదిచ్చట సరి 
టో తెనుగు నిఘంటుకారులు దానినీ ఇంటిక ష న చి 
రు, పన్నీరునకు పర్షియా దేశమే ముఖ్య స్థానము. ఆ డేళష నీలావీ పూలకు 


80% ఆం[ధుల సాంఘిక చరిత 


ఆదిజన్మ స్థానము. ఆచ్చట యివి కొల్లలు పచ్చక ర్ఫూరము, హారతి కర్పూరము 
తూర్పుదీవులనుండి వచ్చెడివి, పారువాతిన్నెలు కూడ అమ్మిరట 1 (కుత. ౩=౭) 
అంటే యేమో సిఘుటులలో లేదు. 


బండ్లకు బాటలు యోగ్యముగా లేనందున వ్యాపారము గాడిదలపె, 
గిత్తలపె, గురాలపె సాగుచుండెను. గృురాలపై సరకులతో నిండిన పెరిక 
లెత్తి సంతసంతలకు తిరునాళ్ళకును తిప్పుచుండిరి. ఒక గుద్ర మిట్లు వాపో 
యెను. 


“ురికయే బాలు నానడ్డి విరుగ జేయ 
దానిపై దాను కాట! 


“బరువుల్నెత్తిన యొద్దుపె” కూడా వ్యాపారము చేసిరి. (కుక. ౨-౫౪౯) 

ఆ కాలములో వ్యవహార ములు పలువిధములగు నాణెములలో జరుగు 
చుండెను. అందు మాడలకే యెక్కువ (పాముఖ్య ముండెను. ఓలికి మాడలే 
ముఖ్యము. మాళ్ళబిందెలను జనులు పూడ్చి దొచుకొనెడివారు. (శుక, ౧-౪౯౫) 
రూకలు (శుక. ౨-౨౫) కూడా విరివీగా వాడుకలో నుండెను, ఒకరూక విలు 
వను దాన్ని పోగొట్వకొన్న గొల్లది యిట్లు తెలిపినది ;-- 

“వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును, నట్టు లాయెనో 

బలఎల వేగ వచ్చునల బాపని కిచ్చినయట్టు లాయెనో 

అలయక నాల్లుచ ట్ల "పెరు గమ్మిన రార సాల రూక, నో 

వలె నల సంతలోన ఐడపవై చినవారల గాన నెచ్చటన్‌. 


శుక, ఎదీ రో 


మరియు పుట్టికనిండుగా ఒకరూకకు బీయ్యము లభించెడిది. (శుక, 
౨-౫౬౬ ) కల్లు దావు స్రీలు “తమ మునిచెరగులందు కాసుదుడ్డును బంగారు 
పూస వెండితునక మొదలింటి చిటువాడు గోనినదెల్డ గొనుచు” గుట్టుగా వెశ్రిడి 
వారు. (శుక, 8-౧౧౭.) (చిణువాడుపదము నిఘంటువులలో లేదు.) మినుకులు, 
ట౦కాలు, దీనారాలుకూడా వాడుకతోనుండెను. పేకమును జొలెలలో నుంచు 
కొనిరి: (శుక. ౨-౨౧౬). వాటినే వల్లము, వట్టువము అనిరి. (శుక, 
అవి ౩౬౫). మాసములలో 'చిట్టి యొకటి “చిప్టిడు నూనె” నెత్తియంటు 


క. శకస పతి. ౩-౪౦౩, 
రీ 


విజయనగర సా[మాజ్య కాలము 805 


కొనుటకు సరిపోయెడిది. (కుక. ౨ 3౮౧౨) చిట్టిపావును, చటాకులో నర్భమును 
చిద్దిడందురు., మానికెలు, తూములు, ఇరుసలు, ఖండి (పుట్టి) అనునవియు 
దారులలో నుండెను. “ఇనుపరట్ట మాని ముంతలు" ధాన్యంకొలతలకు వాడిరి, 
(శుక, ౨-౩౬ ౦) 

శుకస వ్రతిలో అడిదము, ఖ౦డా, కత్తి, దువేదారి, బాకు, జముదాడి, 
డాబా, అను "ఖడ్లభేదములను తెలిపినారు, 'దునేదారికటారి (శుకం ౨- ౩౬౪) 
అన రెండు దిక్కుల ధారకల (డ్విధారా) ఖడ్గమై యుండును. 


పంచాయతి సభలు 


తమిళదెశమందు [కీ॥ శ॥ ౮౦౦ నుండి పంచాయతి సభలు (గాసు[గామ 

మందు స్థిరపడి యుండెను కులింపివాదాలు, సంఘసంస్కారపు కట్టుబాట్లు, 
due విచా-ణ, పన్నుల వసూళ్ళు (గామముఖ్యులే చేయుచుండిరి. 
ఏడాది కొకమారు (గామస్సు లందరును చెరి పెద్దల నెన్నుకొనుచుండిరి* 
వారే అన్ని తీర్పులకును ఆధారభూతులు. ఆ పద్ధతులే తెనుగుసీమలోనూ 
[కమ్మకమముగా బలపడెను,. తెనుగు సీమలో ఎన్నికలు మాతమున్నట్లు 
కొనరాదు, తలార్లు అపరాధులను ప్టెడివారు, రా|తి వారు [గామమందు 
కోలదివిటీలతో సంచారము (గమ) చేసెడివారు. రాతి తప్పెట (తముకు) 
వేసిన తరువాత జనులు తిరుగాడ కూడదు. అనుమాన మున్నవారిని రాతి 
యంతయు తను ఠానాలో బండకొయ్య తగిలించి కూర్చోబెట్టి తెల్లవారిసత ర్వాత 
వాడు “ అచ్చో, ముచ్చో” తేల్చుకొని అపరాధి కాకున్న వద లివే సెడివారు. 
(శుక, ౩-౨౦౪) వెండి బంగారు దొంగతనమైతే మొట్టమొదట తలార్లు కమ 
సాలివారిని పట్టి పిచారించి వారికి దొంగసొత్తులు వచ్చిన తెల్పుడని కక 
చెడివారు. 

“కంపును రాగియు వెండియు 

గాంచనమును మౌ క్రికాదికములగు సుణులున్‌ 

పంచాణము వారిండ్లకు 

గొంచక కొనవత్తు రమ్ముకొనుటకు చోరుల్‌,'! 

అందరికంటే ధనికుడు తీర్థస్టలాలలో నుండు దేవుడు, అతని సొత్తులు 

పలుమారు దొంగతనమయ్యుడివి అప్పుడు: 


(39) 


£06 ఆం[ధుల సాంఘీక చరిత 


“బడిపసులవారి గొలల గుడినంబుల జంగవరున గొని చేకొలదిన్‌ 
బడిమారు (తిదండమున నెడమ కుడిన్‌ నారసింహ మె త్తినరీతిన్‌, 
ఇట్లు కోలాహలంబుగా పెట్లబెట్టి పీక నండర నచట నాయ్యాక చేసి”! 


బాధించెడివారు. (బడివనులవారు, జంగవరుస్క బడిమారు ఆను పదాలకు 
నిఘంటువులలో అర్థాలు లేవు. బయ్యాకనో, నాయ్యాకనో డీనికిని అర్థము లేదు. 


దొంగ దొరికిన తర్వాత సాక్షులతోసహా తలార్లు, వారి ఆధికారులు 
దొంగను “సభిలో విచారశకు తీసుకొనిపోదురు. సభాసదులు (గామముఖ్యులే ! 
వారు సాధారణముగా ధర్మశాస్తాంలు, వేదాలు తెలిసిన బాహ్మణులుగా నుండ 
వలెను. వారు తమ పంచాయతీ సభను ఊరుమధ్యనో, ఊరిముందో, దేవాల 
యముముందో ఉండు రచ్చకట్టపె చేయుదురు. గామ జనులున్నూ వచ్చి 
[పక్క.ను కూర్చుని విచారణను వినెడివారు, పంచాయతి విచారణ యెట్లు 
జరిగెనో విిపనారాయణుని విచారణ నుదాహరణముగా తీసికొనిన తెలియ 
రాగలదు. రంగనాథుని గుడిలో బంగారుగిన్నె దొంగతనమయ్యెను. ఒక 
కంసాలి అది బోగముదానియింట కలదని జాడ తెలిపెను. కత్తులు కకైలు పట్టు 
కొని తలార్లు దానియింటి కేగి “పరివారజన సివహంబునం దద్భృహంబు శోధిం 
. పందగు, వారిబనిచినం జని వారును” ఇల్హ్లంతయు వెదుకగా ఒకచోట చందనపు 
పెపైలో గుందనపు గిన్నెను తీసి తలవరియెదుట బెట్టగా వారు గిన్నెను, 
బోగముదానిని తీసుకొనిపోయిరి. ఆప్పుడు బోగముదానితల్లి “ఆయ్యా! మాకు 
దీనిని విటు డొక డిచ్చెను. వాడు మా యింట నున్నాిడని యనెను. అన విని 
య త్తలవరి యతనిం దోడితెండని నిజభృత్యులం బనిచినం జని వారలు విప 
నారాయణునిం గనుంగొని, 


దండము దండ మి దెవ్వరు తొండరిడిప్పొడులు గిన్నె దొంగై నారో! 
రండిట !! వంచేయుం డిదె దండ మిడన్‌ వచ్చినాడు తలవరి మీకున్‌, 
అని బహువిధముల సోల్లుంఠనముల నాడుచును దొంగనాసామీ! గొ 
బ్బున వేంచేయుం డనుచును జని యతనిం జియ్యగారి నమ్ము ఖమునకున్‌. 
“తోడ్కొని చని యత్తలవరి వారల నక్క నకపా|తంబుతో జియ్యల 
కొప్పించిన నతండు వేళ్యం గనుంగొని యగ్గిన్నియ మీకు నే క్రియం జేరె, నెరి 


1. వైజయంతి, ౪-౬౫ ౬౬, 


విజయనగర సా|మాజ్య కాలము 807 


గింపు మనిన న విపిశారాయణుం జూవి ఈ దాసరయ్య తా నేడాదినుండి 
మా దేవదేవికి విటుడై వసించెను.” ఆతనివలన లాభములేక వెడలింపగా ఒక 
చిన్న బమ్మ చారిచేత గిన్నెను బు తెంచె ననిన వి|పనారాయణుడు “*సభావితతి' 
కిట్లనెను, “నాకు శీమ్యడు లేడు, నే నేకాకిని. కాన ఇది అబద్ధము”. వేశ్య 
యిట్లనెను. ఆ వటుడు తనపేరు రంగడని చెప్పెను. అత డితనివలెనేయుండెను, 
మే మాడువారము, ఈ యరవ యింతపని చేస్తాడని అనుకోలేదు. ఆ యుభ 
యుల మాటలు విని “విద్వజ్ఞనముల నా జియ్య ధర్మ సభ కూర్చించెన్‌ ,” ఇట్లు 
కూడిన విద్వత్సభా జనులు వి'పనారాయణుని నిందించిరి. అచ్చట విచారణ 
వినుటకు గూడిన |పజలు తమలో నానావిధమలుగా ముచ్చటించుకొనిరి. అప్పుడు 
జియ్యరు వేశ్యాంబ పలుకులను వి|పనారాయణు వొక్యంబులును సభాంతరంబుసె 
సవిసారముగా వారలకుం దెలివీ, ధర్మంబు లెట్లుండు ననిసి వారలు తమలోన 
యిట్లు తరి, ంచుకొనిరి, 'వేశ్ళలు బంగారుగిన్నె పొంది లుతన్ని పిలిపించి 
నారు. ఇతడు కోవెలకు సదా వెళ్ళును. కావున యితడే దొంగ' అని నిశ్చయించి 
యవ్విిసనారాయణుసందు చోరత్వం బాపాదించి, సభాసదు లందరు నేకత్వం 
బున నత్తెజంగు జియ్య కెరింగించిన వినీ యతండు దీనికిం దగిన కాపి 
యెట్లుండు ననిన వార లిట్లనిరి : 


ధనముగొనుట యొండె తలగొరుగుట యొండె నాలయంబువెడలనడుదు టొండె 
గాని చంపదగిన కార్యంబు జేసిన జంపదగదు వి_పజాశిబతికి. 
అని విజ్ఞానేశ్వరుని వచన మన్నది గాన నట్టికాస్టి యొకటి యీ 


యన కొనరింపందగు న య్యనువున వేయించి పరిపనగు నొండెడకున్‌. 
ధనము నెరయలేదు, తల మున్నె గొరిగించు కొన్నవాడు, గాన నున్నతలపు 


లుడిగి సీమ వెడల నడుచుటె శాస్తో9 క్ష శిక్ష యితనికట్ట సేయుడనుచు॥ 


సభవా రెకో కీగా నాడిరి, 

అటుపై శ్రీరంగనాథుడు సభలో (సత్యక్షమై విపనారాయణుడు నిర్చాషి 
యని చెప్పగా, “(బహ్మసభయెల్స నప్పరమ వెష్టవోత్తమనికి |బహ్మరథము 
పట్టిరి.” బహ్మ సభ యనుటచే పంచామితి సభ్యులందరు | బాహ్మణఎలని తేలి 
నది1. ఈ విిపనారాయణుని కేను విచారణను బట్టి ఆనాటి పంచాయతీ విధా 

1 వై జయంతి. అ-౬౨ నుండి ౧౨౮ వరకు, 


803 ఆం|ధుల సాంమీక చరిత 


నము స్పష్టముగా వెల్పడి యైనది. పంచాయతి విధానమను వేంకటనాథు డను 


మరొక కవి తస పంచతంతమలో నాక కథయందు చక్కగా వరించిన 
దిచ్చట సంగహముగా తెలుపుట అవసరము. 


“ఒక పుఠములో ధర్మబుద్ధి, దుష్టబుద్ధి యను అన్వర్థనాములగు 
కోమటి నే స్తగాండ్లుండిరి. ఒకనాడు ధర్మ బుద్ధికి నొకచో ౧౦౦౦ దీరారములు 
భూస్థావిళ మనవి దొరికెను. ఆ సంగతి మితుడగు దుష్టబుద్ధికి తెలుప, వాడు 
దాని నొక పొగడచెట్టువద్ద సౌలిమేరలో దాచిపెట్టించెను. ఆదేరా|తి ఒంటిగా 
దాచినచోటికి దుష్టబుద్ధి వెళ్ళి, బలికూడు చల్లి, ధనమును తీసుకొని కొన్నిదినాల 
తర్వాత మన నిక్నేపమును చూచివత్తమని ధర్మబుద్ధిని గొంపోయి అందు 
నిక్షేపమును గానక యిద్దరును వౌదురాడి రచ్చకీడ్చుకొని చని “నగరంబడి 
ధర్మ ౦బునకొప్పి పిన్న పెద్దల గూడ బెట్టిన ధర్మ వదు లుభయవాదుల నాలోకించి 
తమకింపక, రంతుసేయక, అడ్డంబు సొరక, ఇరువురు గలసిపలుకక, ఒక 
రొకరి పూర్వో త్తరంబులు తెలియునట్టుగా, మీమీ సుద్దు లుగ్గడింపుడనుటయు 
నందు ధర్మబుద్ధి కృతాంజలిరయ్లు సభ వారి కిట్లనియె. (ఇప్పటికోర్టుల నియమములు 
కూడ ఇట్టివే !) “అయ్యా, నేను ఇతడను |పయాణించుతరి నేను ఒక నిష్క. 
భాండమును కనుగొంటిని. స్నేహితుడని యితనికి తెలుపగా నొక చెట్టువద్ద 
సంకేత మేర్పరచి భూస్థావితము చేయించెను. ఇతడే కొన్ని దినాలతర్వాత 
నికేపకేమమును చూచి వ త్తమని పిలుచుకొనిపోయి చూడగా నది లేకుండెను, 
నేను దొంగనని నాపె తప్పు పెట్టి యీ సభకు తెచ్చినాడు. ఇంతియయని ధర్మ 
బుద్ధి యూరకుండె, నప్పుడు దుష్టబుద్ధి ధర్మాసనస్థులకు [పణామంబు లాచరించి 
యిట్లనియె. “చెట్టుసాక్షిగా ఆ ధనమును వీడే తీసుకొన్నాడు. 


“నా విని ధర్మాధికృతుల్‌ వావాదం౦బేల యేనువాఠరము లెడ మీ 
రే వివరము నారవనా డావిష్కృత బుద్ది దెలుపు డడుగును మగుడన్‌” 


అని పేషీ వేసిరి. కాని దుష్టబుద్ధి అంతదూర మెంగుకండీ ; నేనిప్పుడే 
సాక్ష్యమిప్పింతుననెను. ఎవ్వరయ్యా నీ సాక్షీయన ఏ చెట్టువద్ద ధనము దాచి 
తిమో ఆ చెట్లే నాకు సాత్యమిచ్చునని దుష్టబుద్ధి పలికెను. దానికి పెద్ద లాశ్చర్య 
పడి మరునాటికి కాలము నిశ్చయించిరి. దుష్టబుద్ధి రాత్రి తన తం (డివద్ద చేరి 
చెట్టుతొట్లలో రాతియే దాగి మరునాడు పరిషత్తు పెద్ద లచ్చటికి వచ్చినప్పుడు 
తన పక్షముగా బెట్టు పలికినట్లు చెప్పుమని నిర్బంధించెను. ముదుసలి కుమారు 


విజయనగర సా(మాజ్య కాలము 809 


నికి అన్యాయము కూగదని నిదర్శనముగా నొక కథను వినివీంచెను. కుమారు 
నికి కథలపై మనసుపోలేదు, కల్పలపైననే మనను నిలిచి యుండెను. పోగాలము 
వచ్చినందున ముదుసలి కొడుకు నిర్బంధముపె రాతియే వెళ్ళి చెట్టు తొరలో 
దాగియుండెను. అంత పొద్దుననే “పిన్న పెద్ద లుభయవాదుల రావించి వృక్ష 
సమీపంబునకు వచ్చి యర్చించి అయ్యిరువురిలోన వంచకు డెవ్వడు చెప్పుమని 
పాంజలులై నిలిచిన, ముదుసలి ధర్మ బుద్ధయె వంచకుడని తొ|రనుండి పలి 
'కెను. అందరును ఆ మాటకు వెరగందిరి. దుష్టబుద్ధి యానందించెను. విన్నవా 
రందరు కరతాళములతో మెచ్చుకొనిరి. చెట్లిమి పలుకుటేమి; ఇందేదో కుత్సిత 
మున్నదని ధర్మబుద్ధి చెట్టు తొరటవద్ద మంట పెట్టించెను' దానితో ముదుసలి 
చచ్చి బయట పడెను. అప్పుడు రాజపురుషు లాదుష్టబుద్దిని వీక్షించి “సెల్లు 
'సెల్లముల కిక్షీంప నిచ్చిన సొమ్ము మగుడ నీలేని కోమటి గులామ। చేసేత 
విశ్వసించిన వారి వెచ్చసచ్చముల గీడ్సరచు వెజాతి తొండ 1.....,చెడగరపు 
డొక్క ! యోరోరి సెట్టికుక్క !! అని తిట్టి సొమ్ము ధర్మబుద్ధి కిప్పించి దుష్ట 
బుద్దిని కొరత బెట్టిరి.' (పంచకం తము. ౧-౭౦౧) నుండి ౭౬౪ వరకు.) 


పంచాయతీ విధానమును సమ్యగముగా తెలుపు నీ కథ చాలా విలువ 
కలది, 


కళలు 


ముత్యాలవలె ముద్దుగా సుందరముగా _వాయుట యొక కళగా, ఒక 
ఘనతగా పరిగణించిరి. ఒక మంతియొక్క- వివిధలిపి సౌన్గవమును శ్రీనాథుడు 
వర్ణించి యుండెను. “వేంకటోర్పీశు [వాయసములు (వాయు చాతుర్యమును” 
చం(దభాను చర్మితమందు పొగడినారు ! గాజుకుప్పెలు, దంతపు బరణులు, 
శిల్పులు సిద్ధము చేయుచుండిరి.£ వైష్ణవులు దశావతారాలు (వాసిన బిల్వకరండ 
లలో తిరుచూర్ణ ముంచుకొనెడివారు. (విప. ౨-౨౮) ఆట పాటలకు భోగం 
వారే (పధానాధారములు. వారి సమ్మేళనమునకు మేళ మనిరి.8 నేడును “బోగం 
మేళం” అందురు. వృద్ద వేళ్య, పాటపాడు యువతులు, నాట్యమాడు సుందరులు' 


1, చం[దభాను. ౧-౩౯. 
VR విపనారాయణ 8-౨౮. 


8. వైజయంతి ౨ ౨. 


810 ఆం|ధుల సాంఘిక చరిత 


మద్దెలవాడు, తాళము వేయువాడు, (కుతి మేళవించువాడు, వెనుక తోడందు 
కొని రాగమును సాగదీయువాడు వీరి సమ్మేళనము మేళమగును. పాతరకత్తె 
లన నాటకాలలో నాట్యమాడు స్త్రీలు, 


“'అధికతరమైన తెర తిసినంతలోన 
బి తరము చూప పాతరక తెవోలె'! 
అహ్‌! — 


అనుటలో నాటక నూచన కలదు. 
నృత్యములలో దేశిమార్గ పద్ధతు లుండెను. ఒక వేశ్య నేర్చిన నృత్యము 
లీటిపి ఏ 
ల 
“మొగవరి" కట్టడ మొనవుకోలాటంబు చొక్కంపు మురువులు చిక్కి ణీలు 
బరవు బారడు బేసి బహుళరూపుల దగ బంధురగీత |పబంధవితతి 
వరుస పద్యము దేశి బంగాళ గీతంబు కొరుతికట్టడ బిందుకొటియకాడు 
పరశురాముడు వీరభ్యదుండు కళ్యాణి చౌకట్ల మెకతాళి శబ్దమాది 


దేశిశుద్ధాంగములయందు తీగెబోడి 
వపటుతర౦బుగ నిజపాద కటక యుగళి 
కభిళపాతమ్ములును బొమ్మలగుచు 
(వేలపూన్కి. వహియింపబొగడొందె పుష్పగంధి” 
పై పద్యములో చాలా పదాలు తెలియవు. కొన్ని అచ్చు తప్పులేమో? 
తర్వాతి పద్యములో జక్కిణియని యున్నది. చిక్కిణిలకు మారుగా జక్కిణీలై 
యుండు నే మో ?2 (మొగవరి= మొగ్గవాలుట యని యర్థమేమో? తక్కినవాబిలో 
బాలా పదాల కర్థమః తిలియదు.) 
దారణ దాగడ చర్చరీ బహురూప 
దండసాలాదిక భాండిక ములు 
కందుక కోలాటకా సాట్యతాసఖ 
(పేరణ కుండలి | పేతణములు 


l, నిరంకుశ. DE 
2. మల్హణ. పుట ౯. 


విజయనగర సా[మాజ్య కాలము తై! 1 


సూతముల్‌ పుహుడక శుద్ధ పద్ధతి 
చిత పద్ధతి ఘన దేళ పద్ధతులును 
రై లాట లంబక కరణైక తాళికో 
లాసాదీ గీత హల్టీసక ములు 
నాదిగాగల్లునృత్యనృతి కక ముఖ్య 
నాట్యవిధములుసూచించి నయ మెలర్చ 
జనుల కెల్లను లోచనోత్సవముగాగ 
నాదెినాయింద ముఖకొనియాడె జగము! 


(ఇందును కొన్ని పదాలు తెలియవు.) 


తాళాలలో జంపె (ధువాద్యాట తాళాలు విశేష (ప్రచారమందుండెను. 
(జంపె, (ధువ, ఆది, ఆట తాళాలు)? గానము, హస్తాభినయములలో అర్జాభి 
నయము, వివిధ ఏక్షణ విలాస విచ్మిత నటనలలో భావము, చరణ నూపుర 
నాదములో తాళమానము చూపుచు లాస్యమాడెడివారు.8 


“నట్టువకాని యందము గాక వింతగా 
కోపులు కల్పించుకొనుచు నాడు” (శుక. 3-౧౪) 


ఆనియు వర్ణించినాడు. (గాక అనక గాగ అనవలెనేమో!) 


యక్షగానాలను గురించి కందుకూరి రుదయ్య (వాసిన న్నుగ్రీవ విజయ 
మను యక్షగానానిక్రి శ్రీ వేటూరి _పభాకర కాన్త్రిగారు ఉత్తమ పీఠిక (వాసి 
నారు, ఈ [కింది దానినుండి కొంత యుదాహరింతును, 


“తొలుత [దావిడభాషలో వెలసిన దృశ్యరచనలు కురవంజు లనబడి 
నవి. కురవజాతివారి అంజె (అడుగు) కురవంజి అనబడును. చిందుగొండ్లి, 
అంజి ఇత్యాదులు నృత్య విశేషములు. పూర్వము మంగశళా(ది సింహో ,ది మొద 
లగు పర్వతాలమీద జాతరలకాలాలలో అక్కడి యాటవికులు నృత్యములు 
చేయుచుండువారు. చెంచిక మున్నగునవి కురవంజులుగా వెలసెను. అవి తొలుత 


1. మలణ, ౪౦. 
త్‌ 
2 వె జయంతి. ౧.౧౨౭-౨౪, 


లి, క్‌ ౧-౧౨౯ 


812 ఆంధుల సౌంఘీక చరిత 


అశ్యల్పముగా గేయభాగములును, విశేషముగా నృత్యమును, కలవై యుండెను. 
అవి సింగి, సింగడు అను పాతములు కలవై యుండెను. వీరిద్దరే కథాపా తము 
లగుచుందురు. మూడవవాడు కోణంగి విదూషక స్థానియుడు. సంస్కృత 
(ధువాగానమే కురువంజులలో దురు వనబడెను. నృత్యదృశ్యములు తర్వాత 
జక్కు లవారు నగరములందు _పయోగింప జొచ్చిరి. సింగి సింగడు మారి రామ 
నల సీతాది ప్మాతలు వచ్చినవి. కాని ఏనిలో ఆటవికరచనా సంస్కార సూచక 
ముగా ““ఎరుకతసాని'”ి పాతము వెలసినది. జాతరలలో యక్ష గంధర్వాది 
వేషముల ధరించి వేశ్యలు (పదర్శించినవి కావునను నృత్య ధర్మము లధికముగా 
గలవి కావునను నివి యక్షగానము లనబడెను. కళావంతులలో నొక తెగకు 
నేడు జక్క లవారను వేరు కలదు. అప్పకవి యక్షగాన లక్షణాలు తెలిపినాడు. 
దానినిబట్టి చూడగా యకగానమందలి _పధాన గేయరచనములు రగడలో కొంత 
మార్పు జరిపి |తిపుట జంపె ఎక ఆట అను తాళముల కనుగుణముగా కల్పింప 
బడిసవి. ఏలలు జోలలు సువ్వాలలు ధవళములు వెన్నెల పదములు విరాళి 
తుమ్మెద గొబ్బి కోవెలపదములు ద్విపద (తిపద చౌపద షట్పద మంబరులు 
మొదలగునవి యక్షగానాలలో చేరిసవి. విజయనగర మధుర తంజావూరు 
రాజ్యాలలో యత్షగానములు మిక్కిలి |పబలెను. కృష్టాతీరమందలి కూచిపూడి 
(గ్రామమున సిద్దేం!దుడను యోగి యొకడు భాగవత కథలను, పారిజాతము, 
గొల్లకలాపము, మొదలగు పేళ్ళతో యక్షగానములుగా రచించి, శాస్రీయముగా 
అయూరి (వాహ్మణుల చేతనే పదర్శనము చేయింప నేర్పాటు చేసెను. ఇంచు 
మించుగా తెనుగున ౫౦౦ దాక లెక, ౦పదగిన యకత్షగానములలో సుగీవవిజయ 
మొక పథ స్త కృతి రుదకవి [కీ శ॥ ౧౫౬౮ [పాంతమువాడు.” 


సుగీవవిజయములో |తీపుట, అర్ధచందికలు, ద్విపద, జంపె, కురుచ 
జంపె, ఆటతాళశము, ధవళములు, ఏలలు అనునవి వాడినారు. నాలుగు తేట 
గీతలు, రెండు సీసములు, ఒక ఉత్పలమాల, ఒక కందము ఇందలి పద్యాలు. 
ఇదే (పకరణములో శుకస ప్రతిలో ఎరుకలదానిని కొరవంజియని ర౦ియు, అది 
తన మగడు “సింగడు” ఆని చెప్పటయు సూచించినాను. యక్ష గంధర్వ శబ్దాలు 
గాన్నపాధాన్యమునకు వాడుదురు యక్ష గానము గంధర్వగానము అనునవి 
(పసిద్ధమైనవి. ఇప్పుడిప్పుడు పరదాలు సంస్కృతాంగ నాటక పద్ధతులు వచ్చి 
నవిగాని ౪౦ ఏండ్తకు పూర్వమువరకు యక్షగానాలకే (ప్రాధాన్యముండెను, నేటి 
కిని తెలుగుదేకపు పల్లెలలో చెంచులక్ష్మీ నాటకము బెడుదూరి హ రిశ్చం ద నాట 


విజయనగర సా(మాజ్య కాలము 818 


కము పారిజాతాపహరణము మున్నగు యక్షగానాలను [(పదర్శింతురు, సాధారణ 
ముగా సవతి పోరుల కథలు యక్షగాన రచయితల కిష్ణ ము* ఈ నాటకాలకు 
పర్దాలు లెవు. గజమెత్తుగా స్థలమునుచేసి దానిపై పలకలు వేసి వాటిపైదుముకుచు 
ఆడుదు పాడుచు పేక్షఫల కానందము కలిగించేవారు. రెండు దివటీలు 
ఆ రంగమమందు వెలుగుచుండును. కొంతదూరమందలి యొక ఇంటిలో 
వేషాలు తీర్చేవారు. వేషాలు రాగానే రేలంపొడి డివిటీల పె భగ్గున మండించే 
వారు. పాతధారులు ఆర్దశము, నీలి మున్నగు రంగులను బాగా పూసుకొని కిరి 
టాలు భుజకీర్తులు పెట్టుకొని సిద్ధమయ్యేవారు. (పతివేషాన్ని తప్పెటతో తీసు 
కొనివచ్చి రంగమెకి, ం౦తురు. ఆధ్యనితో న్నిదించినవారు మేల్కొ.ం0దుకు. ఎవ 
రయ్యా, స్వామీ, మీరు అని సూతధారు డడుగును. ఓరీ నేను ఫలానా, నీవెరు 
గవా అని పెద్ద పెద్ద బిరుదులతో తన [పశ స్టిని తానే చెప్పుకొనును. మధ్య 
మధ్య ఒక హాస్యగాడు ఎంత గంభీర పాతమునై నను అల్పహాస్యముతో కొంచె 
పరచి |పేక్షకుల నవ్వించును. పలుమారు ఆ వోస్యములో బూతులుండును. 
సంగీతము నాగరికులను ఆక ర్షించదు. నృత్యమ కూడా పలుకలు విరుగు గంతుల 
సాముగనే యుండును. అయినా ఇవి పూర్తిగా మాయం కాకముందే నాటకా 
లాడించి పటాలు తీసీ వివరాలతో [ప్రకటించుట మందిడి, జవాద్వీపములోని 
జాతీ యన్ఫత్యములను పలుమారు ఇంగ్లీషు ప|తికలలో కిరీటాలతో భుజకీ రులతో 
నుండు వేషాలను పకటింతురు, వాటిని జూచిన ఆవి మన యక్షగానాల వేషాల 
వలెనే యుండును. జవాలో రామాయణ భారతకథలను నాటకములుగా (పద 
ర్భింతురు. ఆ దేశానికి మనవారే యీ నాటకాలు తీసుకొనిపోయినారో లేక 
అక్కడే యక్షు లనే వారుండిరో వారినుండియే మనవారు గహించిరో ఆ దేశ 
నృత్య చరితను దాగాపరిశోధించిన తెలియగలదు. ఎరుకలు మనదేశమువారే 
కాని వారి భాష నేటికిని చెడిన అరవము. వారు ఆరవ దేశమునుండి వచ్చినారు. 
కొరవంజి అనువారు ఎరుకలసమానులై న కురువలో చెంచువంటి ఆటవికులో 
యెయుందురు. కకస ప్తతిలోని కురువంజి బదనికలు తన సింగడు ఆడవినుండి 
తెచ్చినవాటిని అమ్మెను. అనగా దానికి చెంచులకును సంబంధము కానవస్తున్నది. 
మొతానికి యక్షగానాలు ఆటవికులనుండి నాగరికులకు లభించిన గాన సమా 
యు క్ర నృత్య|పాధాన్య నాటకాలు. సంస్కృతములో ఉత్తమస్థాయి నొందిన 
నాటక విధానమును మనకాలమువర కొక్కురును అవలందించక పోవుటజూడ 
(40) : 


814 ఆం(ధుల సాంఘిక చరిత 


యక్షగానాలము[ దయే గట్టిగా మనవారిప్రెబడీ దానియందే వారి కభిమాన ముండె 
ననవచ్చును. 


యక్షగానాలలోని పాటలకు అప్పకవి లక్షణాలు (వ్రాసెను. ఆ పాట 
లేవనగా :- పెండ్లిపాట, లాలిపాట (రెండు లక్షణాలొక పే) శ్రీధవళము, 
సువ్వాలే, సువ్వి, ఆర్థచం|దికలు, ద్విపద భేదాలు, రగడలు, మున్నగునవి 
(ఉదాహరణాలకు అప్పక వీయము చతుర్థాశ్వాసము చూడవలెను.) ఈ పాటలలో 
పెంగ్లిపాట, లాలి, ధవళాలు, సువ్యాలు, మంగళహారతులు, నేటికిని 'పెండ్రిం 
డలో పాడుదురు, 


“అఆ లలనామణికా గయ్యాళి యొకానొక్క వేళ నక్కరతో, సు 
వ్యాలున్‌ కోభనములు ధవళాలున్‌ మొదలై నపాట లందగ నేర్చున్‌ '! 
అనుటచే ఆనాడు పల్లెలలో స్రీ లీ పాటలం దాస క్రి కలవారై యుండిరని 

యూహింపవచ్చును. శోభనములే కోబాన పాటలు (కుక. ౩-౩౪౯) గొబ్బిళ్ళ 
పాటలు కూడ వ్యా వ్రిలో నుండెను, గొబ్బి యనునది గర్భతదృవమైయుండును* 
స్రీలు వలయాకారముగా చప్పట్లు చరచుచు పాడు పాటల గొబ్బిళ్ళు అందురు, 
(శుక. ౨-౪౩౪) శిశువుల న్నిదపుచ్చుటకు జోలపాటలు పాడెడివారు. 
(శుక. ౩-౪౫౦) బాపనమ్మల పాటలకు విశిష్టత యుండెనేమో : 


“నున్న పురుషు చెడనాడు మగువ మీద 
బోయిపులుగాసి పురువయి పుట్టుననుచు 
బాపనమ్మలు చెప్పినపాటమేలె యనుచు 
నేనుందునిను దూరుకొనగ వెరచి”? 
ఆని యొక చాకలిది తన మగనితో ననెను. వలపదాలను స్రీపురుషులును 


పాడుకొనిరి, ఇవెక్కువగా (బాహ్మణేతరుల పాటలే! (శుకసప్తతి ౨-౧౭౨) 
నిలపదపిధానమును సు గీవవిజయమం దిట్లున్నది. 


౧ భానువంళమునబుట్టి దానవకా నిగొట్టి 
పూనిసుఖము నిర్వహింపవా-ఓరామచం ద మౌనివరులు సన్నుతింపగాన్‌ = 


1. శుకస ప్రతి, ౧-౫౨౩. 


2. ,, 3-౧౪౮ 


విజయనగర సా(మాజ్య జాలము 815 


౨ రాతినాతిజేసి పురారాతి చేతి విల్తువిరచి 
భూతలేం[దులెల్ల మెచ్చగా-ఓరామచ౦[ద సీతను వివాహమాడవా, 


లిపులను గురించి యొకమాట, నన్నయనాటి లిపిని ఈనాడు పట్టుమని 
పదిమందే చదువగల్లినవారు. కాక తీయకాలమునుండి (శ్రీనాథుని కాలమువరకు 
మనలిపివళె కొద్దిగా కళవచ్చినను తెనుగులివి పరిణామావస్థలోనే యుండెను. 
పొక్కిలి (శ్రీనాథుని కాలమువరకు కనిపెట్టబడలేదు. (కీ.శ. ౧౫౦౦ తర్వాతనే 
అది ఏర్పడినది. అప్పకవి కాలమువరకుకూడ తెనుగురిపి మారుచుండెను. 
అస్పకవీయము ద్వితీయాశ్వాసములో “దరశార్హపిప్పల' సూతమున్నూ దాని 
తర్వాతి సూతమున్నూ హల్లుల స్పర్శరూపాలము స్వరగుణితమును తెలుపునవి: 
అవేటివో అర్ధమగుటలేదు. పూర్వమువారికిని అర్థమైనట్టు తోచదు, ఆందుచేశనే 
వావిళ్ళవారి ము(ద్రిత _పతిలో “ఈ |పాతలిపులు (పతిపు స్తకమున వేరువేరుగా 
నుండుటంజేసి వీరి కుదిరిక చక్కగా తెలియబడదయ్యె” అని (వాసీవారు. 
నన్నయకు పూర్వము ౨౦౦ ఎండ్లకు ముందునుండి శాసనాలు దొరుకుతున్నవి, 
కావున ఇంచుమించు (కీ. శ, ౮౦౦ నుండి నూరేండ్ల కిందటినుండి ముదణ 
పారంభమగువరకు ఆశరాలెట్లు మారుతూ వచ్చెనో వాటి సమగ చరితను 
నిప్పణులు (వాయుట చాలా అవసరము, అప్పకవి [వాత పతులు వీలైనన్ని సేక 
రించి అతని భావమేమో కనుగొని సరిగా |ప్రకటింపవలెను. తెమగులిపి సంస్కృత 
లిపినుండి యేర్చడినది. కావున ఆరూప పరిణామ మెట్లయ్యెనో తెలుపవలెను, 
తమిళమునుండి “జ యొక్క. పూర్వరూపమును తీసుకొని దానిని డ, ళ, ఆ, 
ధ్యనులనుగా మార్చుకొన్నాము. ఎ, ఒ, చు జు లు [పాకృతమున కలవు. 
మహారాష్ట్రమున వాడుకలో నున్నవి. ఈ విషయాలన్నియు సమ్మగముగా 
చర్చించవలెను, అనగా ఒక పత్యేకోద్గ)ంథ మవసరము, 


ఈ [పకరణములు ముగించుటకు పూర్వము కుకస ప్రతిలోని కొన్నిపదా 
లను గూర్చి మాసరకై తెలుపుదును కొన్ని యీ (ప్రకరణములో నిదివరకే 
తెలిపినాను. శుకస ప్పతిలో కొల్లలుగా నిఘంటువులలో లేని పదాలు కలవు. 
సీతారామాబార్యులుంగారు దానిని వద్ద నుంచుకొని తమకు తెలిసినవి మా(త 
ముదాహరించి తక్కిన శతాధిక పదాల నుదావారింపకయే వదలి వేసినారు, 
వాచస్పత్యమందును అంతే; సూర్యరాయాంధ్ర నిఘంటులో నహితము చాలా 


816 ఆం[ధుల సాంఘీక చరిత 


పదాలు లేవు. ఉన్నవోట [కీడా విశేషము, పక్షివిశేషము ఆని కలదు. నిఘంటు 
వులలో లేనిపదాలు కొన్ని యిచ్చట సగ౧|గహముగా చర్చింతును, 


పసులగోడలు :-- ఫార్సీలో ఫసీల్‌ అన కోటగోడ. కావున పెద్దగోడ లను 
పనులగోడ యని యందురు (శుక. ౧౩౯) 


పెఠాణీ=రవిక. (శుక, ౧-౨౨౬ ) పైఠన్‌ పట్టణము ౦దు సిద్ధమైనవి. 


బండికండ్లు :._ “సెట్టితొత్తుల కేమో బాసలట బండికి డ్డట చేసన్నట, విన్న 
వారు చెప్పిరి నాతో” (శుక. ౨-౧౧౩) బాసలు చేయుట, సంకేతము 
చెప్పుట ఆని యర్గముండవలెను. ఆముక్త, మాల్యదలో నీ పద 
మొకచో వాసినారు. అక్క డను వేదంవారిచ్చిన అర్థము సరిపోలేదు, 


బందారాకు :_ 'గొంగడిమునుగుతో గొల్లులు చ్మటాతిపైన బందారాకు బరచి 
కొనగ" (శుక, ౨-౩౪౨) 'బందారు=ఒకానొక చెట్టు అని శబ్బ్దరత్నా 
కరము. అది చెట్లకాదు; ఆలము; తీగె. తెలంగాణములో బందాల 
అలము అందురు. అది పచ్చగా జడలుగా వౌసకాలమంను చేలలో (ప్రబలి 
యుండును. నలిపినకొద్ది సువాసన నిచ్చును. ఆ తీగెలను కూలిపడు 
చులు తమ కొప్పులలో నుంచుకొందుకు నేటికిని ఆ యలము కల తావు 
లలో వానాకాలమం దు గొల్పలు దానిని పరచుకొని గొంగడి మునుగుతన్ని 
వర్షము ఆగువరకు పండుకొందురు, 


గాజుగడపీనబ్లు ఫా గాజు గడ వీనట్టు దినము గడుపుచు నుండేన్‌' (శుకం 
3- ౨౪౩.) కష్టము గడవినాడని సందర్భ మునుబట్టి అర్థమగును. కాని 
యీ నుడికార మెట్టిదో తెలింయుదు, 


లీ 


గుడిము[ద :_ “ఆడుదై నను గుడిముద వైచికొనినన్‌' (శుక ౨-౫౦౭. 
పూర్వుము దేవాలయపు ఆవులకు కోడెలకు ముదలువేసి విడిచెడివారు. 
ఆ ము[దలను చూచి అవి కేవలం దేవునివే అని వాటిజోలికి పోకుండిరి. 


ఈలక త్తి :.__.. “వంటలక్క చిలుకం దరుగం ........ ఈలక తి సలుగడ నెమ 
కన్‌” (శుక. ౩-౫౭). ఇది నిఘంటువులలో లేదు. ఉత్తర సర్కారులలో, 
“క త్తీపీటి, అందురు. రాయలసీమలో, తెలంగాణములో వంటయింట్‌ 
కూరగాయలు కోయుదాగిని ఈలకత్తి అని సర్వ సాధారణముగా 
నందురు, 


విజయనగర సా(మాజ్య కాలము 817 


దింతాకు ముడుగుతరి (శకి, ౧-౫౩౩) మునిమాపు అని సంద ర్భార్థము. 
చింతాకు ముడుగుట ఆను (పయోగము కవి లోకానుభవమును, విశిష్ట 
తను తెలుపును, 


బడాపగలజూచి (శుక. ౧-౫౧౬ ) అదేపనిగా చూచి ఆని యర్థమిచ్చును, 
బహుఠథా ఇది బిగాబిగలయై యుండును. 


సబ్బిణి :--((తెలియలేని సబ్బిణుల్‌ మీరు-పక, ౪-౪౨) ఏమి తెలియని తిక్క 
వారు అని యర్థము, 


వీనుగుదిన్న వెలగ :---(నిరంకుళోపాఖ్యానం పుట ౩౫) సుమతిశతకమందును 
ఇదే యుపమానము కలదు. ఇది సరిగా తోచదు. 'గజభు క క పిత్ధపత్‌ ' 
ఆని *'గజమంటే ఒక (కిమిజాతి' అని ఆ శ్లోకాన్ని ఉదాహరించినవారు 
వ్యాఖ్యానించినారు. ఇచ్చట అదే అర్థము తీసుకోవలెను. 


భొమ్మకట్టుట ;--- 

శతువులను అవమానించుటను బొచ్ముకట్టుట లేక బొమ్మ పెట్టుట 
యందురు. ఈ యాచారము తెనుగు దేశములో ఎట్లు సృష్టియయ్యెనో చెప, 
జాలను. భారత కవితయమువా రీపదమును |పయోగించినట్లు కానరాదు 
తిక్కనకు ఎర్మాపెగడకును మధ్యకాలమం దుండిన నాచన సోమన మొద లీ 
బొమ్మకట్టుటను జెలిపినవాడనుకొందును, “పంతముతో దొహారమున బట్టుదు; 
పాసిక బొమ్మకట్టుదున్‌' (ఉ. హ. వంశము, ౩-౧౧౭) బొమ్మకట్టు ఆచారము 
రెడ్డి వెలమ రాజుల కాలములో విరివియైపోయినట్లు కానవచ్చును! నేటికిని ఈ 
యాచారము తెనుగువారిలో నిలిచియున్నది, ఈ యాచారమును శ్రీనాథుడు 
స్పష్టముగా కాశీఖండములో (పీఠికాపద్యాలు ౪౫) తెలిపినాడు, 

1 ఈ (గంథ (పథమ ముదణములో దీనిని పేర్కొనియుండలేదు, 
మదితమైన తర్వాత ఒక గారడివారిగుంపును చూచికిని. వారిలో నాకడు వరి 
గడ్డి పగ్గమునకు కోడిర క్షమును పూసి దానిని గట్టిగాచేసి దాని కొనను కుడి 
కాలికి ఎంటుగా కట్టి ఆ పగమును మెడపై ("ప్పివేసుకొని యుండెను. కుడి 
మోకాలివద్ద ఆ పగ్గాని కొక బొమ్మను కట్టియుండెను. అదేమన ఆది లోభి 
బొమ్మ యనియు తమకు కట్టడిమాట మేర కియ్యనియరి అపకీ ర్తిని _పకటించుట 
కీబొమ్మను కట్టినామనిరి, 


818 ఆంధుల సాంఘిక చరిత 


“డాకాలిగండ పెండారంబుదాపున 
బొమ్మలై వైరి భూభుజులు వేల 
నిండుకొలువుండి కన్నుల పండువగుచు 
విభవుడల్లాడ భూసతి ఏరవిభుడు" 


ముసల్మానులు చేసిన చేయుచుండిన బీభత్సములనునైన తలపక రెడ్డి 
వెలమరాజులు పరస్పరము ద్వేషించుకొని యుద్దాలు చేయుచుండిరి. ఒకరి 
నొకరు చంపుకొని వారి యాకారములుకల బొమ్మలు చేయించి తమ్మ పడిగ 
లలో పెట్టించిరి తమ బిరుదు గండ పెండారపు పగ్గాలకు శతువుల బొమ్మలను 
చేయించి కట్టించి అవి తమ మోకాళ్లవద్ద (వేలాడునట్టు చేసిరి, 


వెలుగోటివారి వంశావళి (నేలటూరి వేంకటరమణయ్యగారి మదదాసు 
యూనివర్సిటీ ఎడిషన్‌ ) నిండుగా బొమ్మ పెట్టుట బొమ్మ కట్టుట కాననగును, 


“కొమ్మని మచ్చ యౌబళుని గూల్చి శిరంబులు దుంచి గన్నయన్‌ 
పిమ్మట |దుంచి, తత్సుతుల బేర్చిన బొమ్మలు వెట్టి దారులన్‌ 
దమ్మటముల్‌ వెసంగొనియె దాచయసింగని పట్టి యెట్టిడో 

బొమ్మలు వెట్టునిట్టు లనపోతడు వైరము బూనువారికిన్‌ (ప. ౬౩)» 


“ఇ కొమార వేదగిరి నేడే యనవేమారెడ్డి తమ్ముని మాచారెడ్డిని గొట్టి 
తమ్మ పడిగాన బొదిగించిన్న నా యన వేమారెడ్డి పిన వేదగిరిని జంవి తమ్మ 
పడిగాన బొదిగించెను. 


a 


“ వెక్క_ సంబగు యుద్ధంబుజేసి యనవేమారెడ్డిని గొట్టి తమ్మపడి గాన 
బొదిగించి సింహతలాట బిరుదును, దనచేత శ్రీనాథు డడిగికొంచు బోయిన 
నందికంత పోతరాజు అను కరారిని బుచ్చుకొనెను.” (ప, ౧౦౭) 


ోకామర గి రెడ్డికి కోరి సింగయమాదు 
తనర బెట్టిన బొమ్మ తలపవె తి, (స.౧౦౮) 


ఈ బొమ్మకట్టుట, బొమ్మ పెట్టక అను నాచారము తెనుగు వారిలోనే 
విశేషముగా గానవచ్చును. అది క్రీ. శ, ౧౨౦౦నుండి (శాచన సోమనకు 
కొంత ముందు కాలమునుండి ఏర్పడినట్లున్నది.) 


విజయనగర సా్మామాజ్య కాలము 819 
రణము కుడుపు :-- 


తెనుగు దేశములో ఆతి |పావీనమునుండియు వై దిక విధానమునకు భిన్న 
ముగా [దావిడ దేవతల కొలుపు శ క్వలుగా ఆంగీక్సృతములయిన దేవర్ణ మొక్కు. 
బళ్లు స్థిరపడి పోయినవి. (బాహ్మణతరులకు ఈ ముద దేవతలపై గల భరి 
శివ కేశవులపయిన లేదని చెప్పవచ్చును. నేటికిని చిన్న దేవర్లను, పెద్ద దేవరను 
(పతి తెనుగు పల్లెలో చేయుదురు, పెద్దదేవర పూజలో దున్నపోతును బలియిచ్చి 
“పొలి” యన్నమును రక్తముతో కలివి దేవరముందు “'బోనము. పెట్టి దాన్ని 
ఊరి పోలిమేర చుట్లు (పొలియన్నము వేయుమేర-పొలిమేర) చల్లుచు మధ్య 
మధ్య మేకలను, కోళ్ళను కోసి భూతబలి యిత్తురు. భూతబలిని (పొలియన్న 
మును) చల్లువాన్ని *భూతపిల్లిగాడు* అని యందురు. అది భూతబలిగాడు అను 
పదమే, వాడు నె త్రినుండి కాలిగోరువరకు కనుబొమ్మలతో సవా ళరీరమందంత 
తటను ఒక వెంటుకకూడా వెదకినను కానరా నట్టుగా గొరిగించుకొని సంపూర్ణ 
ముగా నగ్నుడై పొలి, పొలి యని పొలికేకలు వేసి పొలియన్నమును చల్లి 
రాసినుండి యన్నమును కుండలో పెట్టుకొని కావలివారితో సహా ఊరి చుట్టు 
తిరిగి వచ్చును, పూర్వము యుద్ధమునకు పోవువారు శాకినీ ఢాకిన్యాది భూతా 
లకు పొలియిచ్చి పోవుచుండిరేమో, యుద్ధములో గెలిచినవారు శ |తువుల మాంస 
ముతో, రక్తముతో ఉడికించిన యన్నమును కలిపి రణ పిశాచాలకు బలి 
యిచ్చి వచ్చెడివారేమో. వెలమరాజు లట్లు చేసినట్లు వెలుగోటి వారి వంళావళిలో 
(ప. ౬౦) ఇట్లు తెలిపినారు, *........ కొండమ్మలాజు మొదలగు రాజుల రణం 
బులో జంపి నూటొక్క రాజుల శిరంబులు ఖండించి, ఏబదియొక్క రాజులను 
కలుగానుగ లాడించి మరియు ముప్పది ముగ్గురు రాజుల బట్టి పూజించి గణ 
బలిగా దెచ్చి, ఆ రఎ4వోణి నర్చించి దిగంబరీ, కాళీ, మవోకాళి, శాకినీ, ఢాకినీ, 
బాయళా, కాయినీ, భూత పేత విశాచంబుల దలచి, రణదేవరా ! మహారణ 
రాజా! రణహరా, రణవీర భేతాళ, ఖై రవ, వీరభద, రణపోతురాజా, కలహ 
కంటకీ, అని నిజబలంబులకు జయంబు కలిగెననుచు, కలహాధిదేవతల నారా 
ధించి, తలంచి, పూజించి, మహాకాళికి వీరరాజుల నరబలిగా నరికించి, భట్టును 
తామును రణము గుడివించి వారి రక్రంబుల తమ తండ్రికీ తిలోదకవితృ తర్ప 
ణంబులు చేసిరి.” దిగంబరీ దేవిని (పెద్ద దేవరను) కొలుచువొడు దిగంబరు 
డుగా నుండవలెనేమో ! ఆర్యులీ దక్షిణమునకు రాకముందు ఈ దండకారణ్య 
వాసులు నగ్నులుగా తిరిగిన నాటి ఆచార శకలముగా ఇది కానవస్తున్నది. భూత 


820 ఆం|ధుల సాంఘీక చరిత 


బలిగాడంటిని. మహారజరాజు రణపోతురాజు ఒక టేయై యుండును. పోతు 
రాజుకు దున్న ఫోతులు చాలా ఇష్టమున్న మాట, వెలమరాజుల కాలములో విజృం 
భించిన యీ యాచారములు నేటికిని మన పెద్ద దేవరలో నిలిచి పోయినవి, 
విషుమాయా నాటకము అను (పబంధముయొక్క_ పీఠికలో నిట్లు [వాసినారు, 
“శివునికి మోహినికిని పుట్టినవాడు శాస్త అనువాడే పోతరాజు. శాస్త అను 
దేవత నేటికిని మళయాళ దేశమందు (ప్రజలచే పూజలందుచున్నాడు. మళయా 
శ్రీలు, అరవలు, శ స్తన్‌ లేక చాత్తన్‌ దేవతయని ఇతనిని పూజింతురు. థా స్స 
కథ స్కాాందపురాణాని కెక్కి.నదట ! 


తాతాదారి ముద ;- 

ఈ కాలములో శైవవైష్టవ ద్వేషాలు విశేష మయ్యెను. అదై తి యెనను 
క్రై వమందే అత్యభిమానము కల అప్పయ దీక్షితులు భరతఖండ మంతటను 
(పభ్యాతుడ్డై ౧౦౪ (గంథాలు రచించి శైవము నుద్ధరించిన వాడని విశుతు 
డయ్యెను, అదేకాలములో శ్రీకృష్ణదేవరాయ ఆశియ రామరాజ చకవర్తులకు 
దీశాగురువై వారికిని తన విరవైష్టవము కొంత యెక్కి.ంచిన తాతాచార్యులు 
అసేతు వింధ్యాచ లము వైష్టవమతవ్యా విని జేసి బలవంతముగాకూడ శ వులను 
వెష్టవులనుగా మార్చెను. అట్టివారి నెందరినో మరల అప్పయ దీక్షితులు 
కె వులనుగా జేసెను. తాతాదారి బలవంతపు దీక్షను పురస్కరించుకొని తెలుగు 
దేశములో 'తాతాచారివారి ముద యెక్కడ తప్పినా వీపున దప్పదు అనకు 
సూక్తి యేర్పడెను. కొందరు “మరింగంటి వారి ముది అని పైవినూ కిని చెప్పు 
దురు. మరింగంటివారు నేటికిని తెలంగాణమున నిండుగా తామర తంవరగా 
నున్నారు. 

అప్పయను అప్పై అనియు, అప్పాదీక్షిత అనియు పేర్కొనిరి. ఆతడు 
తమిళుడు కాని తెనుగు చ్యకవర్తులను నాయక రాజులను ఆళయించిన వాడగు 
టచే తెనుగు నేర్చియుండును, అందుచేతనే ఆత డిట్టనెను, 


“అంధత్వ మాం[ధభాషాచ.., 96666 
నాల్పస్య తపసఃఫలం” 


అతడు bn ళ॥ ౧౫౨౦ నుండి ౧౫౯౩ వరకు జీవించెనని వై, మహో 
లింగ శాస్త్రిగారు నిర్ణయించిరి. అప్పయ దీక్షితుల జన్మస్థానము “అడ యపాశింో 


విజయనగర సా[మాజ్య కొలము 821 


అందతడు తన వార్ధక్యములో రీ శ, ౧౫౮౨లో కాలకంరేళ్యరాలయమును 
కట్టించి దానికి స్వయముగా పూజ చేసెను. ఆతని తండి (పసిద్ధుడగు రంగ 
రాజ మఖి. అప్పయ వేలూరు (ఆర్కాటులోని Vellore) నాయక రాజగు 
చిన్న బొమ్మనాయకు నాశ్రయించెను. అతడు (శ్రీకం భాష్యమును విస్కృతి 
నుండి యుద్ధరించి దానిపై శివార్క మణి దీపికయను వ్యాఖ్యను రచించి ఆరెంటిని 
౫౦౦ మంది శిష్యులకు బోధించి వారిని దేశమందు శైవ (పచారార్ణము విస్త 
రించెను. చిన్న బొమ్మడు అప్పయను "*దీనారటంకాల స్నానమాడించి" 
కనకాభి-షేకము చేసెను. 


ఇదే కాలపు మూడవ యుదంతమును గూడ పేర్కొనవలసి యున్నది. 
ఈ అప్పయకు తాతాచారికిని సమకాలికుడు మాధ్వమత [(పచారకుడగు “విజ 
యాం(ధ భిక్షు. అప్పయకు కనకాభి షేక మైతే ఇతనికి రత్నాభి షేక మయ్యెను. 


“విద్వద్వరో౬స్మా ద్విజయీం[|దయోగీ 
విద్యా సుహృద్యాస్వతుల పభావః 
రత్నాభిషేకం కిల రామరాజాత్‌ 
పాప్యా(గ్యలజ్మీ న కృతాగహారాన్‌” 

ఈ విజయీం[దుడు తన మతమును స్తావించుకొనువాడై అప్పాదీక్షీతుని 
కత్తిపై క త్తి తిప్పి దమ్మువచ్చువరకు సాధనచేసిన వాడే, తాతాచారికూడ తన 
జానకితాటి తుపాకితో వాదోర్ధతుడై అప్పా దీకితునిపె తుప్పుతుప్పున 
కాల్చెను కాని గురితప్పి వాదమం దోడి [కోధఘూర్టితుడై అప్పయను ఈ జీవ 
లోకమునుండి తప్పించుటకు కూడ జఒప్పందమువేసెనట : కాని తాతాదారి 
మంత త౦[తాలను ఆప్పయ లెక్క పెట్టక వేంకటపతి రాయలకాలమందుకూడ 
ఏ డేండ్డపాటు జీవించి ౭8 ఏండ్ల వృద్ధుడి కాలధర్మము నొందెను, 


మరొక నాల్లవ విషయ మిచ్చటనే తెలుపవలసినది కలదు. జింజీ నాయక 
రాజు మం|తిగా గురువుగా పండితుడుగానుండిన రత్నఖేటదీక్షితు లీ కాలమందే 
యుండెను. అతడు సామాన్యుడు కాడు, 


“విపళ్చితా మపళ్చిమే, వివాద కేశి నిశ్చలే 

సపత్నజణి త్యయత్న మేవ, రత్న ఖేటదీకీతే 

బృహస్పతిః క్వ జల్పతి [పసర్పరాట్‌ 

అసన్ముఖళ్ళ షణ్ముఖ శృతుర్ముఖళ్చదుర్ముఖః ” 
(41) 


$ లికి ఆం[ధుల సాంఘిక చరిత 


అత డిట్టివాడు. అదేకాలమందే మరొక పండిత దిగ్గజము గోవింద దీక్షి 
తుడను నతడు అచ్యుతరాయల కాలమందుండి (రీ, క, ౧౫౯౭లో తంబజా 
వూరులో రఘునాథ రాయలను అఖిషికుని చేసెను, 


ఇట్టికాలములో రామరాజు తాతాచారికి అతని యనంతరము తాతాబారి 
కుమారునికి అవలంబనమిచ్చి తాతాచారి వైష్ష్టవ దీశ్షాపచారమునకు గాఢమగు 
సహాయముచేసి శైవులకు కష్టములు కలిగించి వారి ద్వేషమును సంపాదించు 
కొనెను. ఈ కాలమందు మత[తయము వారు తమతమ మతవ్యా ప్తీకై పరస్పర 
హింసాదూషణములతో వివాదవడి హిందురాజ్యముల దుర్భలతకు తుదకు వినా 
శనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సాామాజ్య పతనమునకు తర్వాతి 
యిరాజక స్థితికి దెళముయొక్క ఆత్యంతదయనీయస్థితికి ఈ మత, తయము 
వారెంత బాధ్యులో ఎంత గొప్ప భాగస్వాములో నిరూవించుటకు [పత్యేక [గంథ 
మవసరమగును, 


ఇట్టి పదాలు మన సాంఘిక చరి[తకు పనికివచ్చునట్టి వే వందల కొలదిగా 
నిఘంటుకారులు చూచియు తమకు తోచక చల్లగా జారవిడిచినారు. కొన్ని 
తప్పుగా (పకాశకులు ముదించినారు. కొన్నింటికి నిఘంటువులలో తప్పు 
అర్థాలు _వాసినారు. ఆందుచేతనే మాటిమాటికి వ్యావహారిక పదాలను సేకరింప 
వలెననుట. పైనచూవిన మచ్చుపదపట్టికలోని పదాలు శిష్టసమ్మతమగు (గాంధి 
కాలేకదా ; అవేల నిఘంటువులలో లేకపోయెను. కావున |గాంథిక వ్యావహారిక 
మను ఖిన్నదృష్షి కలిగియుండుట సారస్వతానికి నష్టము కలిగించుటయే. 


ఈ (పకరణానికి ముఖ్యాధారములు 


౧. శుకసప్తతి :-- కదిరీపతి ప్రణీతము. ఇది ఉ_త్రమ్మ శ్రేణిలో చేరిన కవిత. 
సాంఘిక చరిత్రకు పనికివచ్చు (గంథాలలో నిది ఆ(గస్థాన మలంక 
రించును. దీనిని తప్పులతో రెండుమారులు |పకటించినారు. వావిళ్ళవారి 
(పతిలో కృత్యాది పద్యాలు కొన్ని లోపిందినవి. అవి నావద్ద కలవు, 
ఈ పుస్తకములోని శతాధిక పదాలు నిఘంటువులలో లేవు. ఇందులో 
రంకులేని కథలు ఎనిమిదివరకు కలవు. రంకుకథలని ఘోరాభఖినయము 
కల శిష్షలు ఈ రంకులేని ఎనిమిదింటినయినను వేరుగా |ప్రకబించ 
వచ్చును. ఈ కథలకు రంకను నిందయేకాని శిష్ట కావ్యాలనబడిన 


విజయనగర సామాజ్య కాలము 823 


శృంగారనై షధము, హరవిలాసము, వై జయంతీవిలాసము,బి ల్లణ్రీయము, 
కూచిమంచి తిమ్మకవి కృతులు, నన్నెచోడుని కుమారనంభవము 
మున్న గువాటిలో సంభోగాది వర్ణన లిందు లేవు. కృతిని చక్కని పీఠికతో 
నిఘంటువులలో లేని పదాల కర్ధముతో, తప్పుల సవరణతో లేనిపద్యాల 
పూరణతో ము[దించుబ యవసరము, 


౨ వై జయంతీవిలాసము :—- సారంగ తమ్మయ్య, ఇదే కథను చెదలవాడ 
మల్లయ్య వ్మిపనారాయణచరిత మను పేరుతో [వా సెను. మల్లయ కవిత 
తమ్మ యకపితకంచె బాలా పౌఢముగా నున్నది. కాని మన చరిత కది 
పనికిరాదు. వై జయంతీవిలాసమే చాలా పని కివచ్చునది. 


(౮ 
అ 


పాండురంగ మాహాత్మ్యము (లేక పాండురంగ విజయము) :- తెనాలి 
రామకృష్ణకవి. ఇతడు వేరే తెనాలి రామలింగడు వేరే అని తలతును, 
తుదకు రామలింగ డను వాడుండెనో లేదో |! పాండురంగ విజయములో 
మారుమూల పదాలు ఉద్దేశ పూరక ముగా వొడినారు. అయినను సాంఘిక 
చరిత కిది చాలా పనికివచ్చును, ముఖ్యముగా నిగమళర్మోపాథ్యానము 
ఈ [గంథానికి మకుటాయమానము, 


ళు 


| మల్హ ణచర్మిత ఫా పెదపాటి యెర్రనార్యుడు. సాధారణ కవిత అయినను 


ఫ్‌ 


. సాంబోపాభ్యానము :--రామరాజు రంగప్ప. 

౬. విపనారాయణ చరిత :-చదలవాడ మల్లన, 

౭. చందభాను చరిత :--శరిగొప్పుల మల్తన. 

౮. నిరంకుశోపాఖ్యానము .-సంకుసాల రుదకవి, ఇది మంచి కవిత, మన 
చరి(తకు పనికివచ్చునట్టిది. 


౯ అప్పకపవీయము :--కాకనూరి ఆప్పకవి. ఇతడు శుద్ధ సనాతనుడు, (బాహ్మ 
తుడు తప్ప ఇతరులు కవిత్వము చేయ నర్హులుకారని శాసించెను. అందు 
చేత [బాహ్మణేతరుల నుదాహరింపలేదు. రామరాజభూషణుని ఒకచో 
ఉదాహరించినది తప్పుపట్టుట కే. ఒకచో రామభ దునిచే నెత్తిన తన్నించి 
నాడు. చేమకూర వేంకటపతి “లక్మణామాత్యపుతుడని" నియోగి అని 


824 ఆంధుల సాంఘిక చర్విత 


((భమపడి బోగంవాడని తెలియక) ఉదాహరించెను. ఈవిధముగా ఇతడు 
సారస్యతాని కపచారము చేసెను. 


౧౦. గండికోట ముట్టడి :-(గంథక ర్రపేరు తెలియదు. ఇదొక లఘువు సకము, 
౧౫ ఏండ్ల | కిందట'నే మో సమదర్శిని కార్యాలయమందేమో [ప్రకటించిరి* 


౧౧ వేంక టనాథుడు-పంచతం త్రము :-తన వర్ణనల నన్నింటిని పజాజీవనము 
నుండి (గహించి తన లోకానుభవమును, హాస్య|పియత్వమును ఉభయ 
భాషా వై దువ్యమను, ఉత్తమ కవితను (పకాశింపజేసిన మహాకవి 
వేంక టనాథుడు. సంస్కృత మూలములో లేని కథలను, వర్ణనలను 
చాలా పెంచినాడు. లక్షణ విరుద్ధ [ప్రయోగము లతని కవితయందు కల 
వని (శ్రీ వీరేశలింగం పంతులుగా రన్నారు. ఈతని కవి తప్పులని 
తెలియక కాదు. వాటిని లెక్కపెట్టక భావమునకే (ప్రాధాన్య మిచ్చిన 
వాడు. కవి కృష్ణా గోదావరిజిల్లాలలో నేదేని యొక జిల్లావాడై యుండును. 
పేము (౧-౧౧౫) అధాటున (3౩-౧౬౩) అను పదాల [పయోగమును 
బట్టి అనుమానించుటకు వీలు కలుగుతుంది. రాచవారుకూడా ఆ జిల్లాల 
వారే. ఈతని కవిత ఉత్తమ. శేణిలోనిది. సాంఘిక చరిితకు చాలా 
పనికివచ్చునట్టిది. 


౧౨. వెలుగోటివారి వంశావళి (మదాసు యూనివర్శిటి ప్రచురము). 


౬వ (పకరణము 
8. శ, ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 


విజయనగర పతనముతో అనగా (కీ, శ. ౧౬౩౦ తో ఆం ధుల పతనము 


పరిపూ ర్రి యయ్యెను. హిందువుల పతనమునకు ముసల్మానుల విజృంభణ 
మునకుగల కారణములు ఆయా సందర్భములందు ఇంతకుపూర ్వపు [పకరణము 
లందు నిరూపితములయినవి, విన్సెంటు స్మిత్‌గారు తమ ఆక్సుఫర్ణీ ఇండియా 
చరి(తలో ఈ విషయమునే చర్చించెను. అతని భావములు నేను నిరూపించిన 
భావములతో సమానము లగుటచే నీ సందర్భమున వాటిని ఉదహరింతును, 


మలిక్‌ కాఫీర్‌ దశ్షిణమున మధురవరకు ఎత్తిన జండాను దించకుండా 
రాజ్యాలను జయించుతూ వెశ్లెను. అంతకన్న నాళ్చర్య జనక మగున దేమనగా 
మహమ్మద్‌ ఖిల్లీ అను సేనాని ౨౦౦ మంది సవార్లతోనే దిహారును కీ శ. 
౧౧౯౭ లో జయించెను, అంతకన్నను ఆశ్చర్యకరమయిన విషయ మేమన ఆ 
సేనానియే ౧౧౯౯ లో ౧౮ మంది సవార్గతోనే బెంగాలు రాజధానియగు 
నడియా పై బడగా వంగరాజు తొంగిచూడకయే దిడ్డితలుపునబడి పారిపోయెను, 
ఆ కాలములో బిహార్‌, బెంగాల్‌ రాజులును విశేషముగా బౌద్భలు అహింసా 
ధర్మము వారి నీగతికి తెచ్చెను, హిందూ బౌద్దుల పతన మత్యంత లజ్టాకర 
నుని యొప్పుకొనక తప్పదు. లిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు లక్షల 
హిందువులను ఈగలనువలె చంపిరి. ఫిరోజిషా అను బహమనీ సుల్తాను 
౨౦,౦౦౦ హిందువులను చంపుట పరిపూ ర్రియైనపుడంతయు మూడుదినములు 
చంపుడు విందు చేసెడివాడు. ఒకతడవ అయిదు లక్షల హిందువుల [పాణాలు 
తీసిన తర్వాతనే “రోజా” (ఉపవాస |వతమును) వదలెను. లక్షల హిందు 
వులు [ప్రాణాలు దక్కించుకొన ముసల్మానులై రి. దీని కంతయు కారణమేమి! 
స్మిత్‌ గారిట్టు (వాసిరి, 


826 ఆం ధుల సౌంమ్‌క చరిిత 


'యుద్ధతంతమందు ముస్లిం సుల్తానులు హిందువులకన్న విస్సందేవొ 
ముగా నిపుణుల యుండిర. వారు విషయ లోలురు కానంతవరకు వారిని జయిం 
చుటకు హిందువులకు సాధ్యముకాకుండిను. చలికొండల నుండి దిగి వచ్చిన 
తురకల శారీరక శక్తి చాలా హెచ్చు. వారి మాంస భుక్తి శాకాహారులను 
నిర్గించు శ క్రి నిచ్చెను. వారిలో కులభేదాలు లేవు. అంటు ముట్టు. భోజన నివే 
ధాలు వారికి లేవు. కాఫిర్సను చంపిన నేరుగా స్వర్గ మబ్బుననియు, యుద్ధాలలో 
మతానికై చచ్చిన “షహీదు'లై సూటిగా జన్నత్‌ లోనికి జొరబడుదురనియు 
వారికి బోధించి యుండిరి. వారు పరదేశమునుండి వచ్చినవారు. ఓడితే సర్వ 
నాళనమని వారికి తెలియును. కాన జయోవా మృత్యుర్వా అన్న సిద్ధాంతమును 
గట్టిగా నాశయించిరి. ఘోరకృళ్యాలతో హిందువులను బాగుగా బెదరించి 
యుంచిరి. దేవాలయాలలో, నగళ్ళలో, పట్టణాలలో అపారమగు ధనము, రత్న 
ములు, బంగారు దొరకునని వారెరిగినందున తమ సాహసానికి గొప్ప పతిఫలము 
దొరకునని ఉత్సాహముతో యుద్ధము చేసెడివారు. హిందువుల యుద్ధతం తము 
పురాణకాలము నాటిది. [పాచీన నీతిళాస్తాాలవైననే వారింకను ఆధారపడి 
యుండిరి. కొత్త పరిస్థితులకు తగినట్లు తమ తం|తాలను మార్చుకొన్న వారు 
కారు, తమ |పతిపక్షుల విధానాలను వారు గమనించినవారు కారై రి. హిందూ 
సైన్యములో కులభేదా లుండుటయే కాక నానారాజుల కూటమిచే సైన్య మొక 
నాయక్షునికి గాక పలువురి నాయకులకు లోబడిసద్దె. నానా ముఖాల నడిచెను, 
విదేశి సైన్యము ఏక నాయక పరిపాలితము. ఆ సేనలు హిందువుల నేరీతిగ 
కొతరులనుగా జేయవలెనో ఆ కీలకా లెరిగి యుండెను. ముఖ్యముగా తమ 
అశ్విక దళములతో భయంకరముగా హిందువులపై బడి వారిని చెల్లా చెదరు 
చేసెడివారు. పాచీన యుద్ధ తంత [పకారము హిందువు లేనుగులపై ఎక్కు 
వగా నాధారపడిరి. ఆది వారి పొరపాటు. ఘోటకముల ధాటి ముందు ఏనుగుల 
సుందగమనము పనికిరానిదయ్యెను. హిందువులు సహితము గురముల సేన 
కలవారై యున్నను దానిని వారు వృద్ధి చేసుకొన్న వారు కారు. (పుట ౨౫౭) 


ఈ చర్శితకారుని నిర్ణయములో |ప్రత్యశరము సత్యమే యని చెప్ప 
వలెను, 


అది విజయనగర రాజులు బహమనీ సుల్తానుల ఢాకకు తట్టుకొన జాలని 
వార్టె_రి, రెండవ దేవరాయలు (౧౪౨౧-౪౮) ముసల్మాను సవార్డ ఆధిక్యతను 


(కీ; శఈ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 827 


వారి ధానుష్కల చతురతను గుర్తుంచుకొని తమ “సెన్యములో ముసల్మానులనే 
భర్త చేసుకొనెను. వారి నాకర్షించుటకై వారికి మసీదులు కట్టించి వారు కోరిన 
వరాలను ఇచ్చెను. 'కొని లాభము లేకపోయెను. తుదకు దేవరాయలు సంధిచేసు 
కొని బహమనీ సులానులకు కప్పము కట్టెను." (స్మిత్‌ Oxford History of 
India P. 303) 


తళ్ళికోట లేక రక్షసతగడీ యుద్దము [కీ॥ ఈ1 ౧౫౬౫ లో జరీగను. దాని 
తర్వాత ఆం|ధదేశమలో రాజకీయ దౌర్బణ్య మేర్పడుచు వచ్చెను. కొంత 
కాలము పెనుగొండలో ఆం|ధరాజులు నిల దొక్కు కొసిరి, కాని ఆక్కడీ నుండి 
వీఠము చంద్రగిరికి కదలగానే ఆం|ధుల రాజకీయొస్నత్యము పరిసమాప్తి 
అయ్యె నన్నమాట. |క్రీ॥ శ॥ ౧౬౦౦ వరకు ఆంధ్రదేశములో ఒక గోలకొండ 
సుల్తానులు తప్ప తక్కిన తురక లెవ్వరును రాజ్యము చేయలేదు. గోలకొండ 
సుల్తానులు షియ్యాలగుట చేతను వారియాధిక్య మిప్పటి తెలంగాణములో 
వలెనే యుండినందునను వారికి [పక్కననే |పబల విజయనగర చ్మరవర్హు 
లుండుటచేతను వా రాం ధులను దుష్టముగా పాలించినవారు కారు. కాని తళ్ళికోట 
యనంతరము తెనుగుదేశములో తురకల విజృంభణము ఎక్కు వయ్యను. అంత 
వరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డిరాజులు తురకలను నిర్‌ 
ధించుచు వారిని తెనుగు సీమలోనికి రానీయనందున ఆం ధులకు ఉత్తర 
హిందూస్థాన ! హిందువులకు కలిగిన కష్టాలెట్టివో కాసరాకుండెను, తటాలున 
[కీ॥ ఈళ॥ ౧౬౦౦ తర్వాత ౧౫౦ ఏండ్లవరకు తురకల దాడు లెక్కు వై 
కర్పూలు, కడప, గుంటూరు నవాబు లేర్పడి ఉత్తర సర్కారులు వారి వశమై 
వారి దుష్పరిపాలన మొకదిక్కు సాగుచుండగా, మరొకదిక్కు పిండారీలు, 
దోపిడిగాండ్లు, తురకల దండులు ఎక్కువై జనుల హింసించి చంపి దోచి 
చెరచి, గుళ్ళను కూలదోసి నానాఘోరాలు చేయగా ఆంధులు హాహాకారాలు చేసి 
చాలా బాధపడిరి. ఆ బాధలు పద్యాలలోను, కావ్యాలలోను, పబంధాలలోను, 
చాటువులలోను |పతిఫలించినవి. గోగులపాటి కూర్మనాథుడను కవి విశాఖపట్టణ 
మండలములో తురకలదండు |పవేశించి బీభత్సములు చేయగా సింవోది నార 
సింహస్వామినే నానావిధాల తిట్టుచు సింవోది నారసింహ శతకమును వాసెను. 
ఆ కవి (కీ॥ శ॥ ౧౭౦౦-౧౭౫౦ [పాంతమువాడు, తురకదండు పొట్నూరు, 
భీమసింగి, జామి, చోడవరం మున్నగు [ప్రాంతాలలో దూరి దోచుకొని దెవాల 


§28 ఆం[ధుల సాంఘీక చరిత 


యాలను ధ్వంసము చేయుచు వీరవిహారము చేసెను. వారి దుండగాలను కవి 
యిట్లు వర్షించెను, 
* ఎలమితో సోమయాజుల పెద్దరూరీలు 
గుడిగుడీలుగా జేసికొనెడివారు 
యజ్ఞ వాటికలలో నగ్నిహో|తందబుల 
ధూమపానము బేసి |తుళ్ళువారు 
యాగపా|తలు తెచ్చిహౌసుగా, వడీ, 
లుడికీ చిప్పలుగ జేసి కేరువారు 
(సుక్సు)వముఖ్యదారుమయోపక రణముల్‌ 
గొని వంటపొయినిడుకొనెడివారు 
నగుచు యవనులు విపుల దెగడుచుండ 
సవనభో క్రవు నీవిట్లు సెపదగునె 
తినదినగ గారెలైనను కనరువేయు 
వెరిహరరంహ సింహాద్రి నారసింహ!” 


(రూరీలు=ర్ఫురీవలె ధారపడు నాళముళల చెంబులు ఉర్దూలో టూటీ 
దొర్‌ లోటా అందురు. గుడిగుడీ= హుక్కా.) 


ఆ కాలపు తురకల వేషా లెట్టుండెనో పై కవియే వర్ణించినాడు. నర 
సింహస్వామిని తన హిందూ వేషమను మార్చుకొని తురక వేషము వేసుకొమ్మని 
యిట్లు సంటోధించుచున్నా(డు ;-__- 


“జడవివ్పీ జులుపాలు సవరింపు మిరువంక 
బలుకీటికీదారు పాగ జుట్టు 
బొట్టునెన్నుదుటిపె బొ త్రిగాతుడుచుకో 
పోగులూడ్పుము చెవుల్‌ పూడవిడువు 
వడిగ నంగీ యిజార్థాడుగు దట్టి జుట్టు 

కై జూరుదోపు డాల్కత్రి బట్టు 
వీబినాంచారిని బిలివింపు వేగమే 

తుద కభ్యసింపుమీ తురక భాష 


(కీ॥ శ।॥। ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 3829 


శ కిలేకున్న నిట్టి వేషంబు పూను 
మన్న సురలోకవంద్యుడవె న నీవు 
నీచులకు సలాంసేయ నే సహింప॥ వెరోొ...” 


తురకలు చేసిన దౌష్టములను యిట్లు వర్లించినాడు :-- 
అ a ణి 


“కనిపించు కోవుగా ఖలులు మార్గన్లుల 
కొంకక ముక్కులు గోయునవుడు 
ఆలకింపవుగదా యయ్యయో |పజఘోష 
ధూ రులు వడి నిళ్ళు దోచునపుడు 
జాలిగాదాయెగా చటులతురుష్కులు 
భామినులను చెరల్‌ పట్టినపుడు....” 


మరియు .-- 
[గామముల్‌ నిరూమధామమ్ము లయను 
సస్యంబు లెల్ల నాశనము చెందె 
దొడ్లలో శాకముల్‌ దుంపకుద్దిగ బోయె 
దోచిరి సర్యంబు గోచిదక్క. 


తురకదండు సింహా ది పెకి వెళ్ళగా ఆక్కడ తుమ్మెదలదండు వచ్చి 
వారిని కరచి పారిపోవునట్లు చేసెనని అట్టి తావును తుమ్మెదల మెట్ట అందురని 
క్రవి వర్జించి ఒర్‌ పద్యాంత మందు ఇట్టి దేవుని సంబోధించినాడు ;-- 


“ (కాక) రోషంబు గలిగిన కఠినయవన 
సేన నిర్లించి యూ యాం సృష్షి నిలుపు” 


(ఇక్కడ సృష్టి అనగా (0౮21౧10. సంస్కృతి అనే ఆర్హమును నేను 
(గ్రహిస్తున్నాను. అదే కవిభావ మనుకొందును.) 


కాంచీ నగరవాసియగు వెంకటాధ్వరి |క్రీ॥ శ॥ ౧౬౦౦ (పాంతమువాడని 
యందురు. బహుళ ౧౬౫౦ [పాంతమువాడై యుండును. అతడు (వాసిన విళ్వ 
గుణాదర్శనము అను సంస్కృత కావ్యములోకూడ తురకలు చేసిన “ఘోరాల 


నిట్లు వర్ణించినాడు, తెనిగించిన భాగాలే యుద హరింతును, 
(42) 


980 ఆంధుల సాంఘిక చరిత 


“అయ్యో! ఈ ఆంధదేశములందు నమందదురితనిరతలై యెల్ల ప్రూడం 
బెల్లుగ తురకలే తిరుగుచున్నవారు : 


యవను లింద మంద జవనాశ్రముల నెక్కి దేవతాలయాల దీర గూల్సి 
సవనధర్మ సమితి సమసిపోవగ జేసి భువనభీకరులుగ భువి జరిం(తుః 


యవనులు ఒక్కాక్కుడు కోపముతో సవారియైై కత్తి తిప్పుతూ మెదాన 
ములో దూకిన ఒకచేయి (ఆంధ, యోధులు కూడా భయపడి పారిపోతున్నారు, 
మరియు ;-ా 


(తావగనిమ్ము కల్లు, పర దారల బెల్లు హరింపనిమ్ము, నా 
నావరదేశముల్‌ తిరిగి నాశము సేయగనిమ్ము, 'నేమముల్‌ 
వావిరి |దోవనిమ్ము మృధ వాటి దృణమ్మాను బోలె మాని మే 
నే, విబుధేంద్ర పట్టణ వినిష్ట కవాటము (పక లిం|తె పో॥” 


భ(దాచల _పాంతమువాడేమో క్రీ॥ శ॥ ౧౭౫౦ [పాంతమువాడయినట్టి 

భల్లా పేరకవి యనునతడు భ'దగిరి శతకములో పూర్తిగా గోగులపాటి కూర్మ 
నాథునివలెనే తురకలవలన చాలా బాధపడి భద్నాదిరాముని చెడ దిట్టినాడు. 
ఆ పద్యాల స్నెియు నుదాహరించిన [గంథము పెరుగును కాన తురక సర్హారులు, 
సేనానులు. స్థానికాధికారులు చెసిన దుండగాలను వరించిన భాగాంశములను 
కొన్నింటి నుదాహరింతును. 

'అచ్చిదకర్ణుల యాజ్ఞ నుండగలేక 

తురకల కెదురుగా నరుగలేక 

చేరి భానులకు తాజీము లీయగలేక 

మును నమాజు ధ్వనుల్‌ వినగిలేకి 


“కాడు చేసిరికదా కల్యాణమండపాగార వాహన గృహాంగణము లెల్ల 
“సంస్క ఎతాం(్రో కుల సారంబు లుడివోయె నపసవ్య భాషలనమరె జగము" 
'సతళాలాంగణల్‌ చలువ పందిరులు బబ్బరటఖానుల చప్పరము అయ్యి' 
“పారిపోవగనైన ప్టెలు నాకక విడుతురే వైష్టవ వితతి నెల్ల 


పేరకవి తన శతకములో 'ధంసాిను పేర్కొన్నాడు. ధంసాయుండినది 
హైద్రాబాదులోని నిర్భలలో. కావున కవి నిర్మల [పాంతమువాడై యుండునేమో? 


bn శ॥| ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 881 


ఆం|(ధదేళ మునకు మూడవ మూలయగు తిరుపతిలోకూడ ముసల్మానుల 
అక్రమాలు జరుగగా ఇదేకాలమున “శ తునంహార వేంకటాచల విహారి యని 
ఒరశతక ములో వడ్డికాసుల వెంకన్నను ఒకకవి చీవాట్లు పెదినట 1 ఈ విషయా 
లను చూడగా ఈ కాలములో ఆంధ దేశ మెంతటి దిక్కులేని దేశమె, అరాచ 
కమునకు గురియై, ఎంతటి ఆవేదన పడెనో ఊహంచుకొనవలెను, 


ఉత్రరమునుండి తెనుగుదేశముమీదికి క5స్టబరంపరలు ఒకదిక్కు 
దిగుమతికాగాా దక్షిణ దిక్కులో మరొకమూలనుండి ఇంకొక ఈతిబాధ 
ప్రారంభ మయ్యెను. అది సము[దాంతరమునుండి ఎగుమతి చేయబడి 
నట్టది. అదే క్ర స్తవ మతస్సుల దౌర్చస్యము, తంజావూరును ఆం|ధరాజులు 
పాలించెడు కాలము వరకే పోర్చుగీనువారు కాలికట్టులో కొలదిగా పబలులై 
కాలుసాపి తీరమంతయు వ్యాపించుకొని కత్తితో కాక తుపాకీ గుండ్లతో 
కై) స్తవ మత |పచారము [పారంభించిరి. ఆదిలో తంజావూరు రాజగు చెవ్యప్ప 
నాయకుడు పోర్చుగిను వారికి ఆశ్రయ మిచ్చెను. [కమముగా పోర్చుగీసువారు 
తమ దౌర్గన్యము సాగించిరి. 


వారితో పాటు డచ్చివారు (హాలెండు దేశ మువారు) తంజాపూరు రాజ్య 
మునందలి జనులను పట్టుకొనిపోయి విదెశాలలో బానిసఎటగా అమ్ముకొంరి. 
ఇంతేకాక మునల్మానులుకూడ తంజావూరు న్నాకమించుకొని దేశమునంతయు 
బీభత్సము పట్టించి, (పజల చంపి దోపిడులు చేసిరి, ఇదంతయు రంగీలా 
రాజగు విజయరాఘవ నాయకుని (అనగా (61 శ॥ ౧౬౩౩-౧౬౭౩ )కాలములో 
జరిగెను. ఈ పిచ్చివిజయరాఘవుడే తురకసైస్యముపై జపించిన తులసి తీర్థము 
చల్లితే వారు భస్మమగుదురని దానని పంపెసేట. కాని అతడ సమూలముగా నీ 
శిశు సమేతముగా నాశనమయ్యను. 

అట్టి పిరికి కాలములో ఒక్క. రాచవారు మాతమే ఆంధ్రుల కీ రిని 
నిలువ బెట్టిరి, వారు కత్తులతోనే శతువుల పె బడీ తాము నిశ్శేషముగా హత 
మగువరకు పోరాడి వీరస్వర్గ మలంకరించిరి. చూ. తంజావూరాం[ధ నాయక 
చరిత. కు॥ సీతారామయ్యగారు 

అట్టి సన్ని వేశములలో అనగా తురక 'కై_)_సవుల విజృంభణ కాలములో 
ఆం ధదేశమును రక్షించినది రాజులు కారు; తత్వ్వబోధకులే రక్షించిసవారు, 
దేశమంతటా వేదాంతులు బయలుదేరి గేయాలతో మతావేళమును కలిగించుచు 


382 ఆం[ధుల సాంఘిక చ రిత 


సంఘలోపాలను సంస్కరించుచు వచ్చిరి. అట్టివారిలో ముఖ్యులు వేమనయోగి, 
పోతులూరి వీర (బహ్మముగారు. 


పోతులూరి విర|బహ్మము కమసాలివాడు. |క్రీ॥ శ॥ ౧౭వ శతాబ్ద 
మధ్యమువాడు. కర్నూలులోని పోతులూరను [గామవాసి, చిన్నప్పుడు బనగాన 
పల్టెలోని వెంకట రెడ్డి అనువాని యింట పజల గాసినవాడు. “ఇతడు వి|గహో 
రాధనలు, జాతిభేదములు మన్న గువానిని ఖండించి, [పజలకు హితో పదేశము 
చేసెను. ఇతడు సంసారి. భార్య గోవిందమ్మ. ఇతని కనేక శిష్యులు గలరు. 
అందు దూదేకుల సిద్దయ్య అను తురక ముఖ్యశిష్యుడు.” (రాళ్ళపల్లి అనంత 

ది ౧ 

కృష్ణ శర్మగారు-వేమన) 


వేమన జగమెరిగిన వేదాంతి. సంఘసంస్కారి. అందరిని తిట్టుచునే 
సవ్వించి, బుద్ధిచెప్పి చక్కనిబాట చూపినవాడు. వేమనకాలములో లింగాయ 
తులు, వె ై_ప్పవులు తమతమ సుత|పబారాలు త మ ఆయిరువురిలోని 
లోపాలను వేమన బయట పెట్టినవాడు 


“లింగ మతములోన దొంగలుగా బుట్టి 
యొకరి నొకరు నింద నానర జేసి 
తురకజాతిచేత ధూశియై పోదురు 
విశ్వదాభిరామ | వినుర ముస 


తురకమతవ్యా ప్తి నిట్లు వేమన వర్ణించెను. 

“ ససరపుమాంసము బెట్టియు 

మసకల సులతౌను ముసలిమానుల జేసెన్‌ 
వె షవుల నిట్లు తూలనాడెను, 

* ఎంబెరుమతమందు నెసగ మాంసము దిని" 

“మారుపేర్లు పెట్టి మధువు [దావి 

వావి వరుస దప్పి వలికి పాలౌదురు ॥విశ్వ్వ॥” 

“రంగ ధామమునకు హంగుగా తానేగి 

కల్లుక ౦పు సొంపు కలిగియుండు.” 

పె నాలుగుపద్యాలు వేమనవి కావని నా అనుమానము. వేమన పేరుపెట్టి 
పరస్పరము దూవష్షించుకొన్నవారి వా స్తలాఘవముగ కనబడుచున్నది. వేమన 


bn ళ॥ ౧ ౦౦ నుండి ౧౭౫౭ వరకు 983 
bn శ ౧౭--వ లేక ౧౮-వ శతాబ్దములో నుండి యుండును, 


ఆకా 9నులోని ఆం|ధమందలి |బాహ్మణుల స్థితిగతులను గూర్చి వెంకటా 
ధ్వరి తన విశ్వగుణాదర్శమం డిట్లు [వాసెను. 


* ఈ ఆం[ధ దేశములో ఓకొ్క్కాక యూరియందు శ్నూదుడు (గామాధి కారి 
(యజమానుడు) గాను, వాని పక్కున _బాహ్మణుడు భృత్యుడె గణకవృ_త్తిని 
(కరణము పనిని) అవలంబించి నాడు. నీరు లేనిచోట తటాక మువలె వేదాధ్యాపకు 
డొక్కడే ఉన్నను ఇక్కడ వాడు మురికి పాతలు తోమెడి పనిలో నియమింవ 
బడి యున్నాడు.” ఈ వాక్యముల వల్ల ఆ కాలములో రెడ్డి కమ్మ మున్నగు 
జాతులవారు గామాధికారు లని ఆరువేల నియోగులు వారికి లోబడినవారై కరణీ 
కాలు చేయచుండిరనియు, వై దిక బాహ్మణులు (ఇప్పటి మంథికలోని పలుప్పురి 
వలె) వంటలు చేయుచు జీవించుచుండిరనియు కవి అభిపాయముగా కనబడు 
చున్నది. 


“ఆంధ దెళన్ధులగు (బావ్మ్యాణులు యజ్ఞాలు చేయరు. వేదాలు చదు 
వరు, ఆయినా ఈ దేశములో దేవతాభ రీ, (బాహ్మణపోషణ బాగా కలదు' 
అనియు, “ఇక్కడి | బాహ్మణులు గోదావరీ స్నానముచేసి ఇసుక లింగములో 
శివుని ధ్యానించి తిలాశతతసుమములతోను, విల్యపతాలతోను పూజలు సేతురు” 
అనియు, “గోదావరీతీర (బాహ్మణులు శివపూజలు చేసి వేదాధ్యయనముచేసి 
పరిశుద్దులెనవా' రనియు, కృష్ణ గోదావరీ మధ్య దేశవాసులగు వై దికులు యజ్ఞ 
యాగాలుచేసి ఉఊత్తమజీవితముల గడుపుచున్నా” రనియు అతడు వరించి 
యున్నా ఢు, 


వెంకటాధ్యరికాల మ పర కే ఇంగ్లీషువారు మ|దానులో బలపడి తమి 
వ్యాపారమును బాగుగా వృద్ధిచేసి తమ యధీనములోనున్న మృడాసులో న్యాయ 
స్థాన మేర్చాటుచేసిన ముచ్చటను అతడు ఇట్లు వర్ణించినాడు. 


“తిరువళిక్కేణి (పసిద్ధమగు క్షేతము. దానిని పార్థసారథి కే(త్రమనిరి, 
ధానినే కెరవిణి (తెల్లకలువకొ లను) అన్నారు, (బహుశః అప్పుడు సార్థసార థి 
కొలనులో తెల్బ కలువ లుండెనేమో ? ఇప్పుడు అందు నాచు మురికి|కిములు. 
నిండియున్న వి.) తిరువళ క్కేణిలో ఇంగ్రీషువారి (పాబల్య ముండెను', హూణు 


లలో అనగా ఇంగ్లీషవారిలో చెడ్డగుణా లేవనగా ౩- 


A 
/ 5 
జ్‌ 
| 
గీ 
(11 
శీ 
| 


884 ఆం|ధుల సాంఘిక చరిత 


' హృుణాః కరుణాహీనాః తృణవ బవ్మాణగణం న గణయంతి 
తెషాం దోషాః పారేవాచం యే నా చరంతి కౌచమపిి 


ఇంగ్లీషవారిలో కరుణయే కానరాదు. (బాహ్మణులనై తే వారు గడ్డి 
పోచలవలె చులకనగా చూతురు, వారిదోషాలు చెప్ప నలవికావు, వారు శౌచము 
నైనా చేయరు, అని శు శ్లోకభావము. ఇప్పటికిని ఇంగ్లీషు వారును తక్కిన 
తెల్పవారును కాలకృత్యముల తీర్చుకొన్న తర్వాత జల పక్షాళనము చేసుకొను 
వారు కారు. 


"శాచత్యాగిషమ హూణకాదిషు 
ధనం శిషైషు న కిషతాం” 
గాటు 
అని మరొకమారు కవి తెలిపినాడు. 


అట్టి శౌచరహితులగు ఇంగ్నషువారికి సంపన్నత నిచ్చిన హతవిధిని 
అతడు దూరినాడు, 


ఇక ఇంగీష వారిలోని మంచిగుణాల నిట్లు వర్తించినాడు. 

'ఈ హూణులు పరులసొత్తులను కోరక, అబద్ధములాడక, అద్భుతము 
లగు వస్తువులను సీద్ధముచేసి అమ్ముకొనువారు. తప్పుచేసిన వారిని విచారించి 
శిక్షీసున్నారు.” 

అయితే వెంకటాధ్వరి యీ కాలములో ఉండినట్రయితే తమ సాామాజ్య 


స్థిరతక్రె పచారముచేయు వీరిని 'పరులసొతులను అన్యాయముగా బలాత్క 
రించి వీరు రీసుకొనరు; అబద్ధాలు ఆడరు” ఆని [వొసియుండ ఈ, 


అడిదము సూరకవి |కీ॥ శ॥ ౧౭౫౦కి లోపలివాడని అందురు. అతని 
కాలములో (| ఫెంచివారు, ఇంగ్లీమ వారు, తురకలు దేశమందు ఆల్లకల్లోలములు 
చేసిరని కవి యిట్లు చాటువును రచించెను. 


“పచ్చిమాంసము కల్లు భక్షించి మత్తెక్కి 
రాణించి తిరుగు వరాసులై న 

గంజాయి గుండ హుక్కాలుడి రెడి నీళ్ళు 
(తాగ్మిమాన్పడెడు తురుష్కులై న 


Er శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 885 


గోవుల పడమొ త్తి కోసిముక్కలు మెక్కు 
సమదాందులగు కొండసవరుల్నె న 

తెరవాట్లు కొట్టి కి తెరదొంగలై 

చాల పాలించి తిరుగు చండాలురైన 

ఘాతుకత్వంబు సేయు ముష్క రులు గలరె” 


ఆ కాలములో గట్టి కేందరాజ్యము లేక తెనుగు దేశము చిల్లర పాలె 
గాండ వళమయ్యెను. వారును పరరాజుల సామంతులై రి. ఇంగ్లీషు, _ఖంది, 
ముస్తిములు రాజ్యాలకైె పోట్లాడుచుండిరి. అందుచేత దేశమంతయు ఆరాచక మై 
బందిపోటు దొంగతనాలు ఎక్కు వయ్యను. |క్రీ. శ, ౧౬౦౦ (ప్రాంతాన వాసిరెడ్డి 
వెంకటా[దినాయుడు అను [ప్రభువు అమరావతిలో చిన్న రాజ్య మేలెను, మహా 
దాత యనియు, శూరుడనియు ఇ్యాతిగాంచెను. “అటునుండి కొట్టుకరా అనే 
సామెత ఇతని నుండే పుట్టినదట. “ఆ కాలమందు దారి దోప్పుడుగాం[డు 
మెండుగా ఉండిరట. అనేకుల (పాణ, ధనముల గొనుచు (సజలకు మిక్కిలి 
పీడ గలిగించుచున్న యా దొంగలను బహు [పయత్నమున వెంకటా దినాయుడు 
నూర్గురను పట్టి తెప్పించి వరుసగా నిలువబెట్టి తలలు నరుక తలారుల కాజ్ఞ 
యిచ్చెనట. ఒక కొననుండి నరుక పారంభింపబోగా నచ్చటివాం[డు అటు 
నుండి కొట్టుకొనుచు రమ్మని కోరిరట. కొందరిని నరికిన తర్వాతనేని జాలి 
వొడమక పోదని దలచిరి, కాని నాయుడుగారు అందరిని నరికించి [పజలకు 
చోర భీతి మాన్చిరట.ి (చాటుపద్య మణిమంజరి) 


మనము సమీక్షీంచు కాలములో ఆంధ్రులవేషా లెట్లుండెనను విషయము 
మనకంతగా తెలియకున్నను ఈనాడు మారుమూలలలో నుండే ముసలివారికి 800 
ఏండ్ల [కిందటి వారికి అంతభేదము లేకుండెనని చెప్పవచ్చును. ఇప్పుడు (కాపులు 
జుట్లు, అంగీలు, కోట్లు, సెల్లాలు టోపీలు ఎక్కు_వై నవి. ఆ కాలములో పురుషులు 
విశేషముగా గుండు రుమాలనో లేక వంకర పాగల (షమ్లావంటి చుంగుకల 
మెలికల లపేటాల) నో కట్టుకొనుచుండిరి, ఆంగీలు చాలా తక్కువ. కాని ఆవి 
ఆచారములోనికి వచ్చియుండెను. బొందెలముళ్ళు ౬ తావుల వేసి అంగీలుతొడుగు 
చుండిరి. వాటినే బారాబందీఅనిరి, అది అప|భంళమె బాదరబందీ అయ్యెను 


Er ల అత i 
ఆం దమ మూ విన్‌ = 


836 ఆం ధుల సాంఘిక చరిత 


తరువాత నాలుగు తావుల ముళ్ళు వేయసాగిరి. కాని బారాబందీ పదమే నిల 
చెను. జనసామాన్యము మోటు దుప్పటి మాతమే కప్పుకొనుచుండెను. పురు 
లకు చెప్పులకు పోగులుండుట సర్వసాధారణము, అందులో థనికులగువారు 
చెవుల పై భాగములో కూడ ముత్యాలతో లేక రత్నాలతో కూడిన పోగులను 
ధ్రరించువారు, చాలామంది దండకండెములను ధరించెడివారు వేమన పలుమారు 
లిట్లు [వాసియున్నాడు, 

తలను పాగ, పైని తగు పచ్చడము, బొజ్జ, 

చెవులపోగు లరసి చేరు నర్జి 

శుద్ధ మూర్ధులనుచు బుద్ధిలో నరయక ॥విశ్వ్య॥ 

పాగ, పచ్చడంబు పెకీ కూసంబును, 

పోగు లుంగరములు బొజ్జకడుపు 

కలిగినట్టివాని కందురు చుట్టాలు 1 విశ ఏ॥ 

వేమన కాలములోని కొన్ని సాంఘిక జీవిత విశేషములు ఆతని పద్యాల 
వల్ల స్ఫురిస్తున్న వి, 

“గజపతింట నెన్న గవ్వలు చెల్లవా' అన్నాడు, గవ్వలుకూడా నాణెముగా 
నుండెను, *గవ్వ సేయనివాడు' అని పరమ నీచుని తిట్టటకే తెనుగులో సామెత 
యయ్యెను. 

“ఆశచేత ధనము నార్జింపగా నేల 
మట్టి [కిందబెట్టి మరువనేల” 

ఇనుప సెబైలు బ్యాంకులు లేని కాలములో భూమిలోనే ధనము పాతి 
పెద్దిడి ఆదారముండెను. 

“ఊసరిల్రి విచ్చి యుపమున రసమున 
చేర్చి నూరి సతులు చెలువముగను 
వళ్యమగును మగని వరియించి పెట్టంగ 
రోగ మమరి నీల్లు రూఢి వేమ' 

నేటికిని "మరులుముందు"”ను ఒల్లని భర్తలకు భార్యలు కొందరు పెట్టు 
టయు, ఆ మందుతో ఆ భర్తలు చచ్చుటయు వింటున్నాము, (కాని పెపద్యము 
వేమనది కాదని లియే తెలుపుచున్నది.) 


Bn శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 387 


నేయిలేని కూడు సీయాస కసవది 
కూర లేని తిండి కుకతిండి | 


నేయి, కూర ముఖ్యముగా జనుల భోజనములో చేరియుండె ననుట 
సాధారణ విషయమే. 


“నాగుబాముగన్న నంది ([జాహ్మణుగన్న 
చెవులపిల్రిగ న్న చేటువచ్చు 
గరుడుని గనుగొన్న గలుగును కోరికల్‌ ॥విశళ్య॥ 


ఇప్పటికిసీ జనులలో అవే విళ్వాసాలున్నవి, (కాని మూఢ విశ్వాసాలను 
ఖండించిన వేమన ఈ పద్యము [వాసియుండడు.) 


“ముండమోవి కేల ముత్యాల పాపటి అనుటచే సంపన్నులగు కొందరు 
ముత్తైదువలు పాపటలో ముత్యాలసరము నుంచుకొనిచుండి రనవచ్చును. 


వేమన, బసివిరాండను పలుమారు పేర్కొ నెను. బసవళబ్దము వృషభ 
ళబ్రభవము. ఇంటిలో ఒక యాదుదబిడ్డను వివాహము చేయక వదలుట కొందథి 
వీరశై వులలో నిప్పటికిని కలదు. వాగు వ్యభిచారపు వృ్తిచే జీవింతురు. వారికి 
బసివియని పేరు కల్గినది. తాతాచార్యులవారి వైష్టవము రాకమునుపు ఈ 
యాచార ముండెను. వైష్ట్రవ గురువులు శిష్యులలో బసివిరాండ్రకు భస్మ రుదా 
తలకు తిరుమణి తులసిపూసల నిచ్చి దాసర్దగుంపులో వారిని చేర్చిశారు. 
(ఆనంత కృష్టళర్మ - వేమన,) 


వేమన కాలములో చి,తములు [వాయుట కొంతయైన నుండినట్టు కాన 
వచ్చును. “చిత్తరువు (ప్రతిమ కైవడి చిత్తమ్మును గల్బ మడచి చిరతర 
బుద్ధిన్‌ " అని వర్ణించెను. మరియు, 
“ఇంగిలీకమ హిమ హేమింపనేరక 
చితపటము [వాసి చెరచినారు“ 
అనియు |వాసినారు. ఇంగిలీకాన్ని చిత్తరువుల రంగులకు వాడినారు, 
వేమన కాలములోని ఆయుర్వేద దేశీయవై ద్య మెట్లు సాగెనో కొంతకొంత జాడ 


కానవస్తున్నది, 
(43) 


388 ఆం|ధుల సాంఘిక చరిత 


“కుక్క గజచెనేని కూయనీయక పట్టి 
(పక్కవిరుగదన్ని పండ బెట్టి 
నిమ్మకాయదెచ్చి నెతిన రుద్దిన 
కుక్కు విషము దిగును కుదురు వేమ.“ 


'నేడుకూడా పిచ్చిలేచినవారికి నెత్తి గొరిగించి, కాట్లు పెట్టించి, ఆ కాటలో 
అలి య టె క, 
నిమ్మగసముతో బాగుగా మర్తింతురు. 


'. *తాంతసిందురంబు కడు పి త్తరోగికి 
ఒనర మధువుతోడ నొసంగినంతి 
తనదు దేహబలము ధన్యుడై గచైకుు ॥వథ్వ॥ 
యు ట 


ఉర్కుకళ్ళు దిన్న నొగి తేటగా నుండు 
ఉక్కు చూర్ణము దిన నుడుగు క్షయము 
ఉక్కు కిళ్ళకన్న నుర్వి కల్పము లేదు 10శ ఏ 


ఉక్కు. కుద్ధిచేసి యుంచి తినెడు వాడు 
ఉక్కుదిటవువలెనె యుండు జగతి 
ఉక్కు. చూర్ణము దీను టొప్పగు కల్పందు ॥ వశ్వ॥ 


ఈ పద్యాల శైలిని చూడగా ఇవి వేసునవని నమ్మను. ఇక పశువైద్య 
మానా డెట్టుండెనో ఈనాడును అట్లే కలదు. 


దొమ్మమాయుకొరకు ఆమ్మ వారికి వేట 
లిమ్మటండిదేమి దొమ్మతెవులొ 
అమ్మ వారి పేర నందరు తినుటకా ॥ని॥ 


వేమన కాలములో గాజు కుప్పెలు (Glass) చేయుచుండిరేమో : “గాజు 
కుప్పెలో వెలుగుచు దీపంటు' అనుటచే ధనికులు గాజు గిన్నెలలో దీపాలు 
వెలిగించుచుండిరని యూహింపవచ్చును. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణ 
ములో 'గాజుకుప్పెల గ సూరికా జలంబు | కర్ణికారాంబ ఎనించె గర్హమోటి' 
అని వర్ణించెను. 


చం|[ద శేఖర శతకము రచించిన కవి యెవ్యరోకాని _బాహ్యణు డని 
మాత్రము తోచును, అతడు నెల్లూరివాడని భాషనుబట్టి స్పష్టమగుచున్నది, 


కీ॥ శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 889 


అక్కడి (బాహ్మశతరులను వారి యాచారాలను అతడు వెక్కిరించి హేళన 
చేసినాడు. ఆతని కాల మేదో తెలియదుకాని ఇంచుమించు డీ. శ, ౧౭౦౦ 
ప్రాంతమువా డని విపులముగా ఊహించుకోవలసినదే. 


మన దేశములో పొగాకును (ప్రవేశ పెట్టి దేశమున్న నాళనం చేసిన మహ 
నీయులు పోర్చుగీసువారు. ఆది కీ, శ. ౧౬౦౦-౧౬౫౦ (ప్రాంతములో 
(పవేశ పెట్టబడెను. ఈ శతకములో దాని ముచ్చటవచ్చినందున ఈ కవి ౧౬౫౦ 
నుండి ౧౭౫౦ లోపలివాడుగా నుండియు౦డును. 


“సీ దగిడీల బాపల పసిద్ధిసరే, పోగ నిప్పకంట, పొమాదుగులింటి 

కోయి, బతి మాలితి, మూడు నెగళ్ళు మండుతే, లేదనితి ట్రై, 

పాపపు కలిగ్గము, యింత పరాక' దాట్లొ యీ 

రాదట, యంద సహ్యులు దురాత్ములు మూర్జులు చంద శేఖరా. 

మన చిన్నతనమువరకు పల్లెలలో భాగవత, భారత, రామాయణ పురా 
ణాదులను చదువుట చెప్పుట పల్రైెజనులు వినుట ఆచారముగా నుంచెను. ఈ 
శతక కాలములో భాగవతము, రామాయణము గరుడ పురాణము చెప్పువాడుక 
అతని |పాంతమున యుండెననవచ్చును. (గ్రామాలలోని జనులకు ధనికులయిన 
(గామ ముఖ్యులు ఉచితముగా వినోదాలను ఏర్పాటు చేస్తుండిరి. (గామరెడ్డి 
ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆకాలపు *సర్కసు. 

“మెడ్డుగ దొమ్మ రెక్కగన మించిన యిద్దె మరేడ లేదు నా 

తెడ్డొక బాప నిద్దెలని తిట్టును మూర్ధుడు చంద శేఖరా !” 

బాపల విద్య లేవికూడ దొమ్మరివిద్యతో సరిపోలవట | 

తందాన కథలను జంగము కథలన్నీ బుర్రకథలని అందురు. ఆ కథలు 
జనుల కత్యంత (వీతికరములై యుండెను, 

“ఇంటిని తిమ్మరాజుకత, యింటిని యీర్స కథా పసంగముల్‌ 

ఇంటిని పాండులాలి, యిబమింటిని నాయకురాలి శౌ! రెమె 

ప్పంటికి నందివాక్కముల పాండు చెరిత)ల నామభాగ్యమె 

న్నంటికి గల్లునోయను నవజ్ఞుడు మూర్ధుడు చంద శేఖరా.' 

(యీర్లక థ= వీరులక థ, నాయకురాలి శౌరె)ము=పల్నా టివీరుల సుద్దుల 
లోని ఆర్వెల్లి నాయకురాలి చరిత) పరల్గెజనులకు బయలునాటకాలు మరొక 


840 ఆంధుల సాంఘీక చరిత 


ఆనందకరమగు వినోదము, విశేషముగా భాగవత కథలను (పదర్శిశూ ఉండి 
నందున నాటకాలాడువారిని భాగోతులు (భాగవతులు) అని అనుచుందిరి. 


అం 


గోతుల సత్తెబామ, యనగూడని తాపములెల్ల సేసె, మా 
పాతకురాలు రాద, వలపచ్చము రుక్మి ణిసుద్ది కిష్టమం 
టీ తెరుగానడంచు వచిబించును మూర్భడు చంద శేఖరా॥ 


రాతిరి సూ_సి యేసములు రమ్మెముగా గురులాన, మొన్న బా 


“దస్తుగ మొన్ననే బురళదాసళచేత గడించి నాట్యమాడి సిని” 

అనుటచేత దాసళ్లే ఎక్కువగా బయలు నాటకాలాడు చుండిరని తోస్తు 
న్నది, 

నాటికిని 'నేజికిని జాతర లన పళ్లెజనులకు చాలా వేడుక. 

“ఇరిదిగ నూస్పి తీరతము లెన్నెనొ, ఆవనగొండ గంగజా 

తరసరిరావు, పంబలును తప్పెటులున్‌ కొముగాండ్ల సిండసం 

బరమరి దెల్పు మింకొక పబావము రంకుల రాటమెక్కెనే 

తిరిగిన సాటిరాదని నుతించును మూర్చుడు చంద శేఖరా॥ 


జాతర్లలో నేటికిని పై రెండు వేడుకలు జరుగును. 


ఆ కాలములో ఓనమాలు, ఎక్కాలు కా గుణితము ఇసుకలో దిద్దించి 
చెప్పీంచుచు౦ండిరి. నేటికిని దాన జాడలు "పెక్కు పల్లెలలో కలవు, పేర్లు వాయ 
డము నేర్చినవిమ్మట పలక పట్టించేవారు, తర్వాత భాగవత భారతాలు చది 
వించేవారు. ఆ ముచ్చటనే కవి యిట్లు వర్తించినాడు : 


నన్ను సదించె బొబు నీననాడు, తమానగా భాగత౦బు రా 

మాన్నము, బారతంబును, తమాముమ కిందివి ముందెవచ్చె, నే 

నిన్ని సదుండగా నే బపుయెత్తుము నోరిక బాపనాండ్లు నా 

కన్నను లొజ్జటం డు, పలుగాకులు మూర్చలు చంద్ర శేఖరా. 

(కిందివి ముందెవచ్చె= నేలపై ఇసుకలో నేర్చుకొను చదువు ముందు 


బడికాలము తెల్టవారుజామునుండియే చీకటి యుండగానే |పారంభ 
మయ్యెడిది. గురువు వద్ద బరిగయో కొరడాయో ఉండెడిది. మొదట వచ్చిన 


tL శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు ల్రిశ్తీ | 


వాని చేతిలో శ్రీకారము ఆ యాయుధముతోనే [వాసి పంపి రెండవ వానిచేతిలో 
ఆయుధమును ఊరక తాకించి (చుక్క పెట్టి) పంపి మూడవవాని కొక దెబ్బ, 
నాల్గవ వానికి రెండు ఈ |పకారముగా ఆలస్యముగా వచ్చిన వారికి శిక్ష యిచ్చే 
చారు. 


“చెలియ నభాంకురాళినెం చేడియ'సెకము తాను చుక, నున్‌” అవి విజయ 
విలాసములో చేమకూర వేంకటకవి సూచించినాడు. నక్ష తాలు ఆమె గోళ్ళ 
తళుకుముందు రెండవ స్థానము నొందినవే అని కచి చమత్కరించినాడు. 


వర్గమునకు ఎండకు గొడుగులు పట్టుకొనుట అరాలమందు కానవస్తున్న ది. 
కాని ఇప్పటి బట్ట గొడుగులు కాకపోవచ్చును. నేటికిని తిరువాన్కూరులో, 
కొచ్చిన్‌లో వెదురుక బైకు తాటియాకులను గుం(డముగా ఛతీవలె కట్టి వాడు 
దురు. వాటిని కొడే అందురు. ఆ పదమే మన గొడుగుపడ మనటలో నందే 
హము లేదు. అయితే బట్ట ఛతీల వాడుక మన పూర్వికులకు తెలియదని కాదు. 
దేవకా వి|గహాలను ఊరేగింపు కాలములోను, రాజుల ఊరేగింపు కాలములోను 
రెండు గజాల పొడవు కద్రైకు రంగుల పట్టుబట్టలతో ఛతీలనుగా కుట్టి వాడు 
చుండిరి. |కీ. శ. ౧౭౦౦ [ప్రాంతపువాడగు భాస్కర శతకకారుడు ఇట్లు వాసి 
నాడు, 


కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికు డొక్క డొక్కడే 
కలిగెడుగాక పెందజుచు గల్లగచేరరు చెట్టుచెట్టునన్‌ 

గలుగగ నేర్చునే గొడుగు కామలు చూడగ, నాడనాడ నిం 
పలరగ నాక్క చొక్కటి నయంబున జేకురు గాక భాస్క రొ 


ఆ కాలపు జనుల వేడుకలలో తోలుబొమ్మలాట ఒక్‌ టి. 


దిర్రిపద |పబంధఛాలు, వివిధములగు పాటలు, తోలుబొమ్మ లాటలు, మన 
తెనుగువారిలో ఆదికాలము నుండియు ఉఊండినట్టి వని యిదివర కే తెలుపనై నది. 
చాలి |పాచీనుడగు పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఇట్లు 
(వాసినాడు, 


(భమరాలుజా?ెముల్‌ బయనముల్‌ మెజసి 
రమణ పంచాంగ పేరణి యాడువారు 


€42 ఆం|ధుల సాంఘిక చరిత 


(పమథపురాతన పటుచర్మితములు 
[కమమొందు బహునౌటకిము లాడువారు 
% నః % న్‌్‌ 


అమరాంగనలు దివినాడెడుమాడ్కి. నమరంగ గడల పై నాడెడువారు 
ఆ వియధ్ధతి యక్షులాడెడునట్టి భావన /మోకుల పై నాడువారు 
భారతాది కథలు చీరమరుగుల నారంగ బొమ్మల నాడించువారు 
సాదట గంధర్య యక్ష విద్యాధరాదులై ప్నాతల నాడించువారు 


భాస్కర శతకకారు డెవ్వడో తెలియదు. ఆతని కాలములోను తోలు 
బొమ్మలాట వ్యాప్తిలో ఉండినది. 


“ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నా కవిత్వమన్‌ 
మించు వపించె నీకతన మిక్కిలి యెట్లన తోలుబొమ్మలన్‌ 
మంచి వివేకి వాని తెరమాటున నుండి (పళ సరీకి నా 
డించిన నాడవే జనుల డెండము నింపవె పీతి భాస్కరా" 


భాస్కర శతకమును జంటకవులు రచించిరని కొందరు వినుర్శకులు 
'వౌసినారు. ఈ పద్యములో “నా కవిత్వము అన్న మాటతో ఆ కథ యెగిరి 
పోయినది. 

తెనుగు దేళములో మరొక వినోద విశిషత కానవసున్నది. ఆది విప 
వినోదము అనునట్టిది, ఒకజాతి [బాహ్మణులు ఏదో మద దేవతోపాసనవలననో 
మం[త తం తాల వలననో చితమగు గారిడీ చేయుదురు. ఇప్పటికినీ ఆ వినో 
దము చేయు వి|పృలున్నారు. గుంటుపల్లి ముత్తరాజు అను సర్దారు గోలకొండ 
సులానుల తుదికాలములో ఉండెను. అతని గూర్చి యొక చాటు ఎట్టున్నది. 


“సంతత మారగించునెడ సజ్జనకోటుల పూ జ సేయు ఢీ) 
మంతుడు గుంటుపలి కల మంతి శిఖామణి ము త్రమం,తి దౌ 

య ఆట 
బంతియె బంతిగాక కడుపంద గులాముల బంతు లెల్ల నూల్‌ 
బంతులు, దుక్కి టెడ్డ మెడ బంతులు, విపవినోదిగార డీ 
బంతులు, దొంగవాం డ ములు బంతులు సుమ్ము ధరాతలంబునన్‌ '" 


డీ. శ, ౧౭౦౦ తర్వాత తెనుగు దేశములో భూవ్యవహార మంకయు 
మహారాష్ట్ర పద్ధతిపై సాగినట్లున్నది. ఒక చాటు విట్టున్నది, 


tL థ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౩ వరకు 348 
ల్‌ 


గురు యశళ్ళాలి యగునట్రి గుంటుపల్లి 
మంతి నరసింగరాయ సన్మ౦దిరమున 
ఒకనాటి వ్యయంబగు తక్క నట్టి 

దేశ పాండ్యాల యొకయేటి పాళనంబు. 


దేశ ముఖు దేశ పాండ్యాల నియామకము మహారాష్ట్ర) పద్ధతియే. 


పెమ్మయ సింగరాజు ఆను నతడు పౌఢ దేవరాయల నాటివాడని 
(రుందురు. ఉండవచ్చును. ఎందుకనగా ఆతని కాలము నాటికి మన హిందూ 
స్థానములో మిరపకాయలు నెగడళలేదు. వాటిని (కీ, శ, ౧౬౦౦ [పాంతములో 
అమెరికానుండి తెచ్చి మన [పాంతములో నెగిడించిరి. 


పెమ్మయ సింగరాజును గూర్చి ఒక చాటు పెట్టున్నది. 
“మిరియములేని కూరయును 
మెచ్చు నెరుంగనివాని యీవి మున్‌ 


ఈ విషయమును బట్టి కూడ (కీ. శ, ౧౬౦౦ తర్వాత మిరపకాయలు 
మన దేశములో వ్యాపించెనని తెలియగలదు. 


తెనుగు దేశములో కొంత భాగము సముదతీరమందుండుటచేత (పానీ 
నమునుండియు గొప్ప వ్యాపారము జరుగుచుండెను. కాని మన సమీక్షాకాలములో 
దేశము అరాచకమైనందున వ్యాపారమునకు రక్షణ లేకుండెను. గోలకొండ 
రాజ్యము వడిపోయెను. కర్నూలు కడపలలో అఫ్గన్‌ నవొబులు రాజ్యము చేసిరి. 
దకీణమున ఆర్కాటు నవాబు లేర్పడిరి. ఉత్తర సర్కారులలో ఇంగ్లీషు, 
(వెంచివారు వ్యాపారముతోపాటు యుద్దాలు కూడ చేయుచుండిరి. తెల్లవారు 
వ్యాపారము చేసినవోట మన దేశ వ్యాపారము నాటికిని నేటికిని ముందుపడుట 
లేదుకదా ; 


డీ. ౧౬౧౧ లో ఇంగ్లీషువారు మచిలీబందరులో ఒక ఫ్యాక్టరీ పెట్టిరి, 
అప్పుడు మచిలీఐందరు బట్టలు చాలా (పసిద్ధి కెక్కిియుండెను. ఇంగ్లీషులోని 
మస్టిస్‌ పదము మచిలీనుండియే వచ్చెను. గోలకొండ _రాజ్యమున్న పుడు 
అక్కన్న మాదన్నల న్నాళయించి వారికి నజరానా లిచ్చి బహుమానా లిచ్చి 
ఇంగ్లీషువారు మదరాసులో వ్యాపారము సౌగించుచుండిరి. గోలకొండ పడి 
పోగానే జౌరంగజేబునుండి చెన్న పట్టణములో, మసూలాలో, మోటు పల్లిలో, 


944 ఆం ధుల సాంఘీక చరిత 


విశాఖపట్టణములోను నున్న తెనుగు తీరపు మరికొన్ని స్థల లలోను కౌలుపర్ధతిపై 
వ్యాపారము చేసికొనుటకు సెలవు పొందిరి. 


తెనుగుసిమ మొత్తము భారత దేశములో వజాలగని యని |ప్రభ్యాతి 
పొందెను. గోలకొండరత్నాలు అని యూరోపునందంతటను మారు; మోగిపోయెను 
కాని నిజముగా గోలకొండ పట్టణము చుట్టును ఎక్కడా రత్నాలు లేకుండెను, 
గోలకొండ నుండి దక్షిణముగా అయిదు దినాలు |పయాణము చేసినచో కృష్ణా 
తీరములో లావుఃకొండ అనేత్రావున వ్యజాలగని యుండెనని ఆ కాలమందు 
_ సంచారము చేసిన టావర్నియర్‌ అనే తెల్లవాడు (వాసినాడు. అప్పు డందు 
౬౦౦౦౦ మంది గనిలో పనిచేయుచుండిరనియు (వాసినారు, కృష్టాతీరములో 
కొల్లూరు ఆనేతావున రత్నాలగని రీ. శం ౧౫౩౪ లో కని పెట్టిరి, 
అక్కడ నే కోహినూరు వజము దొరికెను, ఈ కొల్లూరు _పభ్యాతి 
ఎక్కువై ఒళ శతాబ్బములోనే అచ్చటి గనులు మూతబడెను, అప్పటి 
వైభవమును తర్వాత శై థిల్యమును గూర్చి జనులలో ఒక చిత్రమగు కథ 
బయలుడరెను. “కొల్లూరు సట్నము వలె వెలిగిపోయిండి.' అని సామెతగా 
అనెదరు. దానిపై పుట్టిన కథ యేమనగా:-__- 


కొల్లూరు పట్టణములో ఒకదేవుడు వెలిసెను. పతి జనుడు ధాన్యమును 
తన మ్యూతములో తడిపి ఆ దేవతా వి్యిగహముపె వేసిన అవన్నీ రత్నాలై 
రవ్వ లవుచుండెనట. అందరును ఆ |కి మను చేయుచు మేడలు కట్టరిం ఆ పట్టణ 
ములో ఒక పేద బాప డుండెను. ఆందరివలె నీవును చేసి సుఖపడరాదా అని 
అతనిభార్య తొందర పెట్టుచునుండెను. ఏమైననుకాని నేనా తుచ్చపుపని చేసి అప 
చారము చేయనని ఆ శిష్టు డనుచుండెను. ఒకనాటి మధ్యరాతి మరొక వృద్ధ 
దాహ్మణు డా పేదబాపని కుటుంబ సహితముగా పట్టణము బయటకు పిలుచు 
కొని పోయి అదిగో కొల్లూరుపట్టణ వైభవము చూడు అని ధగద్ధగితముగా మండు 
చుండే పట్టణమును వారికి చూపి మాయమయ్యెనట. అది కొల్లూరు పట్టణం వలె 
వెలిగినది అనేకథ. ఆ కథ నిజముగా ఈ వ(జాలగనికి సంబంధించినదని 
వెసనే కనబడుచున్నది. 


పైదరాబాదునుండి మచిలీబంద రుకు పొయ్యేమార్గంలో పరిటాల(Paritala ) 
కలదు. ఆది బందరునుండి ౫౦ మైళ్ళ దూరములో కలదు. అందునూ ఉ స్తిపల్లీ 
జగ్గయ్య పేటలోను రత్నాలగను లుండెను, హైదరాబాదు నగరమునకు ౩౦ 


[క్రీ॥ శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 845 


మైళ్ళ దూరములో షంషాబాదుకు ౨౦ మైళ్ళ దూరములో ఉన్న నర్కోడాలో 
'నిజాంరత్నం' అనునది దొరికెను. ఆది ౩౭౫ క్యారట్ల తూకముది* దాని వెల 
౨ లక్షల ౨౦ వేల పొనులు, పై |పదేశాలలో కాక కర్నూలు జిల్లాలోని 
రాదుళ్ళుకోటలో రవ్వలు దొరుకుచుండెను. రవ్వలకోటయే రామళ్ళకోటయయ్యెను. 
రాయలసీమలో వజకరూరు అను గామము కలదు. అందుకూడ వ(జాలు 
దొరుకుచుండెను. నేటికిని అచ్చట పలువురు వర్షాలు కురిసినవెంటనే వరద 
పారిపోయిన తావులందు రత్నాల[కై వెదుకుచుందురు. వారి కప్పుడప్పుడు 
రత్నాలు దొరుకుచునే ఉండును. ఇప్పుడీ |పదేశాలలో నెచ్చటను గనులు 
తవ్వుటలేదు. గు త్రివద్ద మునిమడుగులోను రత్నాల గనులుండెను, 


వేణుగోపాల శతకములోని 


అవనీశ్యరుడు మందుడయన నర్ధుల 
కియ్యవద్దని వద్ద దివాను చెప్పు 

మునిషి యొకడు చెప్పు బకిషి యొకడు 
చెప్పు తరువాత ముజుందారు చెప్పు 
తల|దిప్పుచును శిరసా చెప్పు 

వెంటనే కేలు మొగిడ్చి వకీలు చెప్పు 
దేళపాండ్యాతాను తినవలెనని చెప్ప 
ముతసద్ధి చెవిలోన మొనసి చెప్పు. 


అను పద్యములోని పై పదాలనుబట్టి నవాబుల _పభుత్వము బాగా తెనుగు 
సీమలో పాదుకొన్నదని తెలియరాగలదు. ఈ శతక కారుడు తన కాలపు తెనుగు 
త(తియులను వర్ణించినాడు. వారు రాజులు రాచవారు అయియుందురు. 


'కొండసిగల్‌ తలగుడ్డలు పాకోళ్ళు 
చలువ వస్త్రములు టొజ్జలు క్‌ ఠార్లు 
కాసెకోకలు గం పెడేసి జందెము 
లును తలవారు జలతారు డాలువార్లు 
సన్నపు తిరుచూర్ణ చిన్నెలు కట్టాలు 
జొల్లువీడెములును వల్లెవాటు 
దాడీలు వెదురాకు తరహాసొగను కోర్డు 

(44, 

లీ 


846 


ఆం|ధుల సాంఘీక చరిత 


సంతకు దొర గార్లటంచు పేర్లు 

సమరమును జొచ్చి రొమ్ముగాయ 

మున కోర్చి శా[తవుల [దుంచనేరని 

క్షృతియులకు నేలగాల్పన యావట్టి యెమ్మె లెల్ల ॥1మదన॥ 


వంకరపాగాలు వంపుముచ్చెలజోళ్ళు 
చెవిసందు కలములు చేరుమాళ్ళు 
మీగాళ్ళపైపింజె బాగె నదోవతుల్‌ 
జిగితరంబుగను పార్సీ మొహర్లు 
చేపలవలెను పు స్రీమీసముల్ర్‌ క లందాన్‌ 
పెప్రెయును పెద్ద ద స్త్రములును 

సొగసుగా దొరవద్ద తగినట్లు కూర్చుండి 
రచ్చ గాం[డకు సిఫారసులు జేసి 
కవిభటులకార్యము లనువిఘ్న ములు చేయు 
రాయకాల్సిండములు తినువాయసాలు ॥1మ॥ 


ఆ కాలములోని కొన్ని కులాలను ఆ కులాల నాశయించి |బరుకు మరి 


కొన్ని కులాలను అడిదము సూరకవి తన రామలి9గేశ శతకములో ఇట్లు వర్షించి 


నాడు. 


జంగాలపాలు దేవాంగుల ఐ_త్తంబు 
కాపుఏ త్రము పంబకానిపాలు 

బలిజీలవి తంబు ప'టైదాసరిపాలు 
గొల్లవిత్తము పిచ్చుగుంటిపాలు 
వ్యాపారి విత్తంబు వారకాంతలపాలు 
కల్డువి త్రము రుంజకానిపాలు 
పరజాలపాల్‌ శిష్షకరణాల సొమ్ము 
ఘూర్డ రుల ఏ త్తంబు త ఫ్కరులపాలు 
కవులకీగలజాతి యొక్క_టియులేదు 
వితరణము వై శ్యులకు పెండి వేశగలడు 
కొంగుబరచిరి నృపతులా కూటికొరకు 
రామలింగేళ రామచం[దపురవాస, 


ban శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 847 


(పంబకాడు = కొమ్ముపట్టుమాల, కల్లు, రుంజకాడు =బవసనీడు అను 
మాల, పరజాల అన నేమో తెలియదు.) - 


ఆడిదము నూరకవి కాలమువర కే పూర్వాచారాలు మాసిపోవుచు వచ్చెనని 
కవి యిట్లు వోపోయినొడు, 


ఆగహారములు నామావళిష్టములయ్యె 
మాన్యంబుఅన్నియు మంటగలిసె 
భత్యంబునకు దొంటి పడికట్టుత ప్పెను 
బుధజనంబుల రాకపోకలుడిగె 
వర్షాళనంబులు వరదపాలై పోయె 
మలవతీలను |పజల్‌ మాసిచనిరి 
సశియించిపోయె వంటరులు తురుష్కులు 
గజతురంగమలు తాకట్టుపడియె 
ధార్మిక శ నమున కిట్టి తళ్ళుబుట్టె 

కఠిన చిత్తుని రాజ్యాధికారి జేసి 

యింత పీడించి&ివి సత్క ఏం(దకోటి 1రా॥ 


డీ. శ. ౧౬౦౦ నుండి ఆం;ధులు రాజకీయ పతన మయ్యునని చెపు 
వచ్చును. దకిణములో రఘునాథ రాయలకాలములో ౧౬౧౪-౧౬౩౩) తంజా 
వూరులో ఆం[ధులగొప్పదనము నిలిచియుండెను. ఆతని కాలములో తెనుగు 
వారిపై మహమ్మదీయుల అకమమ.లుకాని, యుద్ధాలుకాని సాగనేరక పోయెను. 
వారిని రఘునాథుడు ఓడించి ఆంధుల సృష్టిని (Culture) మరికొంత కాలము 
నిలి పెను. 


అతని కాలములో దక్షిణమున తెనుగు యక్షగానాలు చాల వృద్దికి 
వచ్చెను. నాటకాలు, నాట్యకళ, సంగీతకళ (పళ స్తి కెక్కెను. ఇతర [పాంతా 
లలో తెలుగువారు తమ పూర్వులు నిర్మించిన శిల్పాలను కోలుపోయిరి, కాని 
తంజావూరులో (పాతవి నిలుపుటయేకాక రఘునాథ రాయలు చక్కని శీల్చ 
సౌందర్యముకల దేవాలయాలను, రాజభవనాలను, కోటలను నిర్మింపజే నెను, 
అతడు సంగీత . విద్యానిధి. అత డొక కొత వీణను కని పెట్టెను. దాని పేరు 
రఘునాథ మేళ, ఆంధ సరస్వతి ముత్యాల శాలలో అచ్చట నాట్యమాడెను, 
ఈ విధముగా సంగీతాలు, కవిత్వాలు, శిల్పము తంజావూరులో వృద్ధిపొందెను. 


848 ఆంధుల సాంఘీక చరిత 


కాని అతని కుమారుని mse తంజావూరులో స్వాతం|త్యము కూడా 
మట్టిలో కలిసెనుం 


మన సమీక్షా కాలములో ముసల్మానుల నీడలు తెలుగు వారిపై బాగుగా 
పారెను, . ఆనాటి కవుల కవితలలో ఫార్సీపదా లెక్కువగా మిళిత మయ్యెను. 
కీ. శ. ౧౭౦౦ తర్వాత తెనుగువారి పతనము పూర్తి అయ్యెను. అటు 
తర్వాత చిల్లర పాలెగార్లే మనకు మిగిలిరి. వారి దర్గా యెంతటిదో అంత మేరకే 
మన కళలన్నియు నిలిచిపో యెను. 


ఈ వధముగా ఆంధ దేశ సాంఘిక స్థితి డీ. శ, ౧౬౦౦నుండి ౧౭౫౭ 
వరకుండెనని స్థాలముగా చెప్పవచ్చును. 


ఈ [పకరణమునకు ముఖ్యాధారములు 


౧. వేమన పద్యములు ; వేమన పద్యాలు పెరుగుతూ వచ్చినవి, తమకు 
సరిపడనివారిని దూషించి వినురవెను అన్నవారు పలువురు, రసవాదాలు 
కల్పించి విశ కదాభిరాను అన్నవారు పలువురును బూతులు (వాసీ నోటి 
తీటను వదిలించుకొన్నవారు తమ పేరు తెలుపుకొను ధైర్యములేక వెరి 
వేమన్నకు వాటి నంటగట్టినవారు కొందరును ఊండినట్లూహించ వలెను. 
వేమన ఆటవెలదిలోనే, సరిగా యతిస్థానములో విరుపుచేసి చక్కని 
కవితను చెప్పినాడని నమ్ముదును. అట్టివానిని మొదలేరి వేరుగా [పకటిం 
చుట యవసరము, 


౨. వెంకటాధ్వరి-విశ్వగుణాదర్శము. మూలము సంస్కృతము తెనుగు 
పద్యాలను (వాసినవారు మంచి కవిత వ్రాయలేదు. 

8. గోగులపాటి కూర్మనాథుడు-సింహా ది నారసింహ శతకము, 

౪. భల్లా (ఛల్లా?) పేరకవి_భ|దాది శతకము. ఈ తుది రెండు శతకాలు 


పూర్తిగా తురకలు తెనుగు దేశమందు చేసిన “"ఘోరాలను వర్ణి ంచును. 
ఆ వివరములను తెబుసుకొనగోరువా రా రెంటిని పూర్తిగా చదువవలెను? 


ban శ॥ ౧౬౦౦ నుండి ౧౭౫౭ వరకు 


౫. చందశేఖర శతకము, కవి తన పేరు చెప్పుకోలేదు. ఇది హాస్య రస 
ముతో నిండినది. నెల్లూరి (గామ్యము ఏస ఇతర పాంతాల వారికి 
తలియనందున అట్టి పదాల కర్ణము [వాసి (ప్రకటించుట బాగు, 


౬. అడిదము సూరకవి-రామలింగేశ్వర శతకము, 
క, వేణుగోపాల శతకము, 
౮. భాస్కర శతకము. 


ఈ |పకరణానికి అన్నియు శతకాలే (వేమన శతకమందురు కాన 
అదియు నిందే చేరును.) ఆధారభూత ముల్లె నవి, 


మంచి కవు లీ కాలములో అరుదై రన్నమాట : అది యీ సమీక్షా కాల 
మందలి దుస్థితి కొక తార్మాణ. 


కి 
శ్రా 


౭వ (పకరణము 
(క శ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 


బొరంగజేబు ౧౭౦౭లో చచ్చెను. సిరాజుద్దాలా ౧౭౫౭లో చచ్చెను, ఈ ౫౦ 
ఏండ్లలో మొగల్‌ స్నామాజ్యము క్రమకమముగా ఉణిస్తూ వచ్చెను. ఈ 
కాలములో మహారాష్టులదే భారత దేశమందు [(ప[పథసు శక్తిగా నుండెను, 
౧౧౯౯ లో బెంగాలును తురకలు ౧౮ మంది సవార్హతోనే జయించిరి! (పపంచ 
చర్మితలో ఇంతకన్న చి తమగు ఘట్ట మింకొకటి కానరాదు !! ౫౫౦ ఏండ్డ 
తర్వాత ఆ తురక సుల్తానుల సంతతివారే ప్లాసీ యుద్ధములో గొప్పపరాజయము 
పొందిరి, ఇంగ్లిషువారి విజయం కూడా ౧౧౯౯ నాటి తురకల విజయ మంతటి 
కారుచౌక విజయమే: (The British Victory at Plassey was gained nearly 
as that of Md. KhilJi. VY. Smith) పాందువులపై అంత సులభముగా 
విజయాలుపొందిన ముసల్మానుల కేలయా దుర్గతి పట్టెను. హిందువులు నాలుగె దు 
నూర్త యేండ్ల అనుభవముతొకాని బుద్ధితచ్చుకోలెదు. మహారామ్ట్రంలు సహ్మా(ది పర్వ 
తాలలో గుర్రపు సవారీలలో, కరకుతసములో, కూబ యుద్ధములో, చాకచక్య 
ములో, సాధన పొంది ముసల్మానులకు మంచి జవాబిచ్చిరి, కాని రాజపుత 
సెన్యమే ఢిల్రీసులానులకు భారతదేశాన్ని గెలిచి యిచ్చెను, అనగా వారికి మతాభి 
మానము దేశాభిమాన మింకను కలుగ లేదన్నమాట. తురకలు బలహీనుల రి. 
విషయలోలురై రి అంతలో ఇంగ్లీషువారు భారతరంగముమీద [పత్యక్షమైరి. తుర 
కలు దౌర్జన్యము, మేలైన యుద్ధతం్యతము, మతావేశము, (క్రౌర్యము, మోసము; 
బీభత్సము తమతోపాటు తెచ్చుకాని యుండిరి. ఆ గుణాలు ప్లాసీ యుద్ధము 
వరకు వారిలో స్థిరమగానే యుండెను. కాని వారికి గురుస్థానమం దుండదగిన 
ఇంగషువారున్నూ కొన్ని గుణాలతో దేశమందు దిగుమతి అలయిరి. వారు మన 
దేశములో వరహాల చెట్ల నూపి రాలిన ద్రవ్యాన్ని మూట కట్టుకొని పోవుటకు 
ప్రధానముగా వచ్చియుండిరి. యూరోపు దేశములో మేలైన తుపాకులు, ఫిరం 
గులు కనిపెట్టి యుండిరి. అని వారి వెంట వచ్చెను. హిందూ ముసల్మానులు 
రంగులను క్రీ, శ. ౧౪౦౧ నుండి వాడుతూ వచ్చినను ఆవి కొద్దిపాటివి. 


ఇ 


(కీ శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 851 


ఎక్కువ పని చేసినట్టివి కావు. తుపాకులు కూడ కొద్దికొద్దిగా వాడుకలోకి వచ్చి 
యుండెను. కాని వాటి (పస క్తి వాజ్మయములో శుకస ప్రతికారుని నుండియే కాన 
వసున్నది. కదిరీపతి మన్మథుడు పాతకాలపు బాణాలను పారవేసి “తమ్మి 
రుమ్మీ ఫిరంగీలనుి చేబట్టైను, (తుమ్మిరుమ్మీ ఫిరంగి దొరతురంగీ విలాసముతో 
అనగా చిలుక వలె) ఒక రెడ్డికోటలు నేడిచెనట !- శుకసప్తతి ౧౫వ శథ. 
రూం అను యూరోపు పట్టణములో ఫికంగీలు (ప్రసిద్ధముగా నుండెనేమో ? భార 
తీయ సైన్యమునకు [కమవిధానమగు సాముదాయిక యుద్ద శికణము లేకుండెను, 
ఇంగ్లీమవారు యూనిఫారమును సిపాయీల కిచ్చి ఉత్తమ యుద్ధశిక్ష ణ మిచ్చిరి. 
వారు సంథ్యాబలము వై ఆధారపడలేదు, శిక్షణములేని “సెన్యము లక్షలున్నను 
దాసిని [కమశిక్షణము, మేలైన మారణ యం (తాలు, నిపుణతరల సేనానులు కల 
సైన్యము వేలసంఖ్యలో నున్నను తప్పక జయించినఘట్టాలు చరిత్రలో ఆడుగడు 
గునకు కానవస్తున్న వి. ఇంగ్లీషువారు మరొక తం|తమును వెంటదెచ్చిరి. మోసము 
వారి ముఖ్యాయుధము. వారు మసదేశ దోహులను సృష్టించినట్టుగా తురకలుకూడ 
సృష్టింపజాలిన వారు కారు. భారతదేళమందు బహు గాజుల యునికి, హిందూ 
ముసల్మానుల' సహజవై రము, మొగలాయి రాజ్యపతనము, అన్నియు ఇంగ్లీషు 
వారి కనుకూలమయ్యును,. డికరాణజు ని కొరనిపై ఉసికొల్సి సహాయపడి రాజ్యాలు 
సంపాదించిరి. బెంగాలును మిర్దాఫరు ;దోహము చేతను, తమ మోసముచేతను, 
జమించిరి. ఈ విశిష్టతలు గుర్తుంచుకొనిన మన దేశ చరిితలోని మార్పులు 
అవగాహనమగును. ముసల్మానులు బాహాటముగా అతి [కూరముగా కత్తితో 
తమ మత (వచారము చేసిర. ఇంగ్హీషవారు ఉపాయముతో కై9 స్తవ మత 
ప్రచారము చేసిరి. దక్షిణమున మలబారులో (కీ.ళ. ౫౨లో సంత్‌ తామన్‌ అను 
క్రై) స్తవ ఫ్నాదీ మత [పచారము చేసెను. ఆనాటి “సిరియన్‌ [కిస్పియనులు' 
నేడును అచ్చట నున్నారు. ఈ విధముగా |క్రీస్తుశకారంభము నుండియే మనకు 
కై 9న్తవ వాసన తగిలినది కాని ఆది అత్యల్చ్పము. |క్రీస్తుదుత వ్యా ప్తిని పోర్చుగీసు 
వారు తురకలవలెనే మలబారులోను, తమిళములోను, పళ్చిమ తీరములోను చేసి 
యుండిరి. (ఫెంచివారు అదే పనిచేసిరి. అబేడుబాయి (Abbe Dubois) అను 
ఛెంచి ఫాదీ హిందువులవలె రుమాల దోవతి అంగీ ధరించి తమిళములోని 
'పరయా'లలో తిరిగి పలువురిని క్రైం స్తవులనుగా చేసెను. అత డానాటి హిందూ 
మతమును పూర్తి గా దూషిస్తూ ఒక పెద్ద (గంథమే (వాసెను. ఘోర కులా 
చార భేదాలుకల తమిళ దేశపు హిందూమతము ఆ దూషణమున కర్ష్మత సంపా 


ఆం|ధుల సాంఘీక చరిత 


డించుకొనియుండె ననవలెను. నేటికిని అచ్చట ఎక్కువగా (ఇతర్యత తక్కు. 
వగా) కులభదాలు, అంటు ముట్టు బాధ, అంటరానితనము కలదు. (ఫెంచి 
బోర్బను రాజులను గూర్చి వారు కొత్తది నేర్వలేదు; పాతది మరువలేదు; 
అన్న సామెత హిందూ మతమునకు కొంతవరకయినా వర్షించె ననవచ్చును, 
శై9నవ మతటోధకులు పట్టుదలతో ౫౦౦ మైళ్ళ దూరమునుండి స్వప్త సము 
[దాలు స పఖండాలు దాటి ఆరు నెలలు ఓడ లలో [ప్రయాణము చేని తల్ల్తి పిల్లల 
వదలి మన దేశమందు నిలిచి మనభాషలూ ఆటవికుల భాషలూ నేర్చి (ప్రచారము 
చేసి బళ్ళను వైద్యాలయాలను స్టాపించి నానాసేవలు చేసి తమ మత్మపచారము 
చేసినది నేటికిని భారతీయులు చూస్తూ వారి సేవలో దశాంశమయినను చేయ 
నొల్లనివార్తై యున్నారు. మొత్తానికి ప్లాసీ యుద్ధానంశరము శుండి కై) స్తవ 
మత వ్యా పికి విజృంభణము కలిగెను. 


ఆరి కొనితి 
@ 


థి 


ఈ సమీఇాకాలములోని ఆంధుల అర్థికపరిస్థితి యెట్టిదో కనుగొందము. 
ప్లాసీ యుద్ధముతర్వాత దేశము యింగ్లీమవారి చేతుల లోనికి అతి వెగముగా 
పోయెను. తురకలు ౧౧౫౦ నుండి ౧౭౦౭ వరకు అనగా ౬౦౦ ఏండ్లలో 
,ఎంతబీభత్సము చేసినను పూర్తిగా దేశమును గెలువలేక పోయిరి. కాని ౧౦౦ 
ఎండ్లలో యావద్భారతమును పూర్తిగా ఇంగీమవారు గెలుచుకొనిరి. మన 
సమీ వాకా ములో ఇంగ్లీషఎజేతలకు [పజల సౌకర్యాల సమాలోచనము కించిత్తు 
కూడా లేకుండెను. వారిది (ప్రత్యక్ష పరోశాపహరణమే తమ దేశపు సరకులను 
ఇచ్చట అమ్ముటకై మన పరిశ్రమల నాశనము చేసిరి. మేరలేకుండా జనులు 
బావకుండానై న చూచుకొనక వన్నులు ళాగిరి. వారి పరిపాలనములో జామా 
లెక్కు వయ్యెనని వారి సజాతీయుడగు డిగ్బీ ౬౦ ఏండ్లనాడే |వాసెను. మున 
ల్మానులు హిందువులను దోచినదంతయు దేశమందే యుండెను. మరల [కమ 
ముగా అదంతయు జనులకు చెందెను. కాని ఇంగ్లీషువారు వ్యాపారము ద్వారా, 
పన్నులద్వారా, దోపిడీలద్వారా, ఉదో్యోగులద్వారా, గ్రహించిన దంతయు ఏడు 
సము[దాలు దాటి తిరిగిరాకుండా ఇంగ్లండు చేరెను. ఇది మన ఆర్థిక నాశనము 
నకు కోరణ మయ్యెను. 


[కీ॥ శ॥ ౧౭౫౭ నండి ౧౮౫౭ వరకు 358 


“ఉత్తర సర్కారులను రాయలసీమ అను కర్నూలు, కడప, బళ్ళారి 
అనంతపురము జిల్లాలును (6666 district5) గుంటూరు జిల్లాయు, క్రీ. శ. 
౧౮౦౦ లోపలనే ఇంగ్లీషవారికి వచ్చెను. తర్వాత ౧౮౫౭ వరకు భారత దేశ 
మంతయు వారి వళమగుటచేత తెనుగు దేశమంతయు వారి వళ మయ్యెనని 
వేరుగా చెప్పనవసరములేదు. తెనుగుదేశములో ఉత్తర సర్కారులకు విశిష్టత 
యుండెను. అందలి నాలుగు జిల్లాలలో (విశాఖపట్టణము, ఉభయ గోదావరిజిల్లాలు 
కృష్టా జిల్లాలలో) భూమి అంతయు జమీందారుల పాలెగారు తెగకు ఆప్పజెప్ప 
బడ యుండెను. ఈ జమీందార్లు మొగల్‌ సులానులకు కప్పము కట్టి ఇంచు 
మించు రాజులే వర్తించిరి, పెద్దాపురము జమీందారు మొగలాయి రాజ్యానికి 
8౭౦౦౦ పొనులు (8లక్షల ౭౦ వేల రూపాయలు) కప్పము కట్టుచుండెను. 
ఈస్టిండియా కంపెనీవారు అతనివద్ద ౫ లక్షల ౬౦ వేల రూపాయీల కప్పము 
లాగిరి. అదేవిధముగా ఇతర జమీందారుల పన్నులను హెచ్చించిరి. ఉత్తర 
సర్కారులలో ౩౧ జమీందారీ లుండను. అప్పటి కాలములో సర్కారు జిల్లాలను 
చికాకోలు, (శ్రీకాకుళం) రాజమండి, ఎల్లూర్క కొండపల్లి అని పెర్కొంనిరి. 
అవి మొగల్‌ సులానులనుండి ౧౭౬౫ లో ఇంగ్లీషువారు తీసికొనిరి. కంపెనీ 
వారు ఉత్తర సర్కారుల స్థితిగతుల నొక కమిటీచే విచారింప జేసిరి. వారు 
౧౭౮౮ లో తమ నివేదికను నమర్పించుకొనిరి, దానినిబట్టి కొన్ని వివరాలు 
తెలియవచ్చెను. కొందరు జమీందారులు ఓఢరాజుల సంతతివారని తెలియ 
వచ్చెను. ఉతర సర్కారుల జమీందారులకు హవేలీలు అను సొంత భూము 
లుండెను, ఈజమీందారీలలో సాముదాయిక వ్యవసాయ పద్ధతి (Village 60%" 
mune) ఉండెను. (పతి [గామానికి పన్నిద్ద రాయగాండ్లుండిరి. రెడ్డి కర 
ణము, తలారి, తోటీ, నేరడి, పురోహితుడు, బడిపంతులు జోసి, వడ, 
కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వైద్యుడు, బోగముది అందు చేరి 
యుండిరి. ఈ (పాచీన [గామ జీవనవిధానమును కంపెనీవారు నాశనము చేసిరి. 
ఉత్తర సర్కారులలో బెంగాలులో వలె ౧౮౦౨ లోను ౧౮౦౫ లోను కాశ్వుత 
భూమి పన్ను విధానమును (పర్మనెంటు సెటల్మెంటు) ఏర్పాటుచేసిరి. (పజల 
పంటలో మూడింట రెండుపాళ్ల పన్నుగా నిర్ణయించిరి. హవేలీ భూములను 
జమీందారులకే వేలం వేసీ యిచ్చివేసిరి." (India under early British rule 


by Romesh Dutt, Chapters VI&VIl) 
(45) 


864 ఆంధుల సౌంఘిక చరిత 


మదాసు సూబాలో ఉత్తర సర్కారులు కాక యితర జిల్లాలలో రయితు 
వారీ పద్ధతిని (పవేశపెట్టిరి. దీనికి ముఖ్యకారకులు సర్‌ తామన్‌ మ్మనోగారు 
ఆ కొలపు ఇంగ్లీమవారిలో అత డుత్తమోత్తము డనిపించుకొన్నాడు. అతడు 
మ।ద్రాసు సూబాలో ౨౪ ఏండ్లుండినాడు, తుది సంవత్సరాలలో రాయలసీమ క్రె 
చాలా పాటుపడినారు. అతడు కలరా తగిలి కర్నూలు జిల్లాలోని ప త్తికొండలో 
౧౮౨౭లో చనిపోయెను. అతన్ని రాయలసీమ [పజలు బాలా |పేమించిరి. 
పలువురు మనో అయ్య ఆని తమ విల్లలకు పేరుపెట్టుకొనిరి. మ్మనో సూచిం 
చిన పద్ధతియే యిప్పటి పట్టాదారు పద్ధతి. పూర్వము భూముల గు తేదారులుండిరి. 
(ప్రభుత్వానికి రైతులతో సంబంధము లేకుండెను. [పభుత్వానికి నేరుగా రైతుల 
సంబంధ ముండునట్లు రైతులకు తసు భూముల పై సంపూర్ణ క్రయ వికయాది 
స్వత్వము లుండునట్లును మనో రయిత్వారీ పద్ధతి నిర్ణయించెను. నునోకు 
ముందు కంపెనీవారు రైతుల పంటలో సగముకన్న హెచ్చుగా పన్నులుగా 
(గపాంచుచుండిరి. మనో దానిని తగ్గించెను. 


తెనుగు జిల్లాలలో రయిత్వారీ పద్ధతి మవక్రంతగా తెలియదు రొమేశదత్తు 
ఇట్లు ఒకటి రెండు తెనుగుజిల్లాల ముచ్చట తెలిపినాడు. 


“నెల్లూరుజిల్లా కలెక్టర్‌ కోవూరును రయిత్వారీ విధాన పరీక్షకై నిర్ణయిం 
చెను. ౧౮౧౮ లో అచట భూముల కొలివించి బందోబసు చేయించెను, తరీ 
(మాగాణీ) “భూములలో వరిఖండికి ౨౦ రూపాయల ధర నిర్ణయించిరి. దాని 
(పకారము బందోబస్తు అయిన భూమి పంట విలువ ౩౪౩౭౪ రూపాయలు. దాని 
నుండి ఎప్పటివలెనే “క లవసం నూటికి ఆరుంబావు [ప్రకారము తీసి వేసిరి. 
అనగా ౨౨౩౪ రూపాయలు తొలగించిరి, మిగిలిన ౩5౨౧8౯ రూపాయలు 
సర్కారున్నూ, ర్రతులున్నూ పంచుకొనవలసి యుండెను, రై తులకు ౨౦ 
పాళ్ళలో ౯ పాళ్ళు అవగా నూటికి ౪౫ పాళ్ళు ఇచ్చిరి. ఆ లెక్కచొప్పున రైతు 
లకు ౧౪౪౬౨ రూ, సర్కారుకు ౧౭౬౬౭ రూ.లు వచ్చెను. మెట్ట పొలాలలో 
(ఖుషీ )లో ఖండి ౨౮ రూ.లు బాజారుధర |పకారం లెక్కగట్టి పె విధముగా 
విభజింపగా సర్కారుకు ౭౬౮ రూ. వచ్చెను. మొత్తముపె కోవూరు [గామము 
భూములనుండి |పభుత్యానికి ౧౫౬౦౦ రూ. పన్ను వచ్చునని తేల్చిరి, అనగా 
పంటలలో సగము (ప్రభుత్వము తీసుకొనెను, Chapter IX P. 154. 


[కీ శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 855 


పూర్వము [గామాలలో పన్నిద్ద రాయగాండ్ల కెంత భాగమిస్తుండిరో తెనుగు 
సీమలోని వివరాలు తెలియవు. కాని బుకానన్‌ అనునతడు (క్రీ. శ. ౧౮౦౦ లో 
బెంగుళూరులోని ఒక (గ్రామములోని వివరాల నిచ్చినాడు. దాన్నిబట్టి మన 
తెనుగు దేశములోని విధానము నూహించుకొన వచ్చునని యుదాహరిస్తున్నాను, 


[గామం మొత్తము సేద్యమవల్ల ౨౪౦౦ సేర్ల ధాన్యముకుప్ప అయ్యెను 
ఆల ౧ వ్‌, 
దానినుండి ఈ కింది ఆయాలిచ్చిరి. 


24 
౩౯ 


పురోహితుడు 

ధర్మాలు 

జోసి 

(బాహ్మణుడు 

మంగలి 

కుమ్మరి 

కమ్మరి 

చాకలి 

సరాపు (ధాన్యం కొలుచువాడు) 
Beadle 

రడ 

కరణం 

తలారి 

దేశముఖు 

దేశాయి ౪౫ 
నేరడి ౨౦ 


మొత్తము ౧౬౯ సేర్లు, 


ance ౪౮66 96 6 9౨9౫ ౫ 


9 ౨ 
0 ౦ 


రు 
ఫీ 


అనగా నూటికి అయిదుంబావు భాగముతో (గామస్సులక చాకలి, కుమ్మరి, 
కమ్మరి, తలారి, మంగలి, వడ్ల మున్నగువారి సేవలు లభించుచుండెను. మిగత 
ధాన్యములో గుత్తేదారు నూటికి ౧౦ పాళ్ళు తీసుకొనెడివాడు, మిగిలిన దానిలో 
[పభుత్వమునకు సగమిచ్చి తక్కిన సగము రైతులు పంచుకొనెడివారు. 
(Chapter XII. Romesh Dutt.) తెనుగు దేశమును గురించిన వివరాలు 


లీర్‌68 ఆంధుల సాంఘిక చరిత 


ఈ [గంథమునుండి తెలియ రాలేదు. (మైసూరు, తమిళము, మలబారు జిల్లాల 
గూర్చివిరివిగా ఇందు (వాసినారు), 


౧౮౧౩ లో పార్లమెంటులో ఇండియానుగూర్చి విచారణ చేస్తూ మనోను 
ఈ దేశ పరిస్థితులను విచారించగా అతడిట్లు చెప్పెను. “సగటున ఇండియాలో 
వ్యవసాయపు కూలీలకు నెలకు ౨ రూపాయీలనుండ్‌ ౩ రూపాయీల కూలీ 
దొరకును. ఒక్కాక్క కూలీకి సంవత్సరానికి జీవన భృతికి ౯ నుండి౧౩-౮-౦ 
రూపాయీల వరకు వ్యయమగును. జనులు గట్టి మోటు కంబళ్ళగు నేసి వాడు 
కొందురు. అవి చాలా చౌక కాన ఇంగ్లీషు ఉన్ని కంబక్ళు వారు కొనజాలరు. 
భారతీయులు ఉతమ పరి(శసు కలవారు. తెలివితేటలు కలవారు. మేలైన 
ఇంగ్లీషు పరిశ్రమల ఆనుకరింప గలవారు.” ఆ దేశములో శ్రీలు బానిసలవంటి 
వారు కారా?' అన్న |పశ్నమునకు మనో యిట్లనెను. “మన న్ర్రీల కెంత పెద్ద 
రికము కుటుంబములో కలదో వారికినీ ఆంతే కలదు.’ “మన వ్యాపారము వల్ల 
హిందువుల నాగరికతను వృద్ధిచేయవచ్చుకదా' అన్న [పశ్నమునకు మనో 
పసిద్ధమగు (పత్యుత్తర మిట్లిచ్చెను. “హిందూ నాగరికత ఆంటి యేమిటి! 
సెన్ఫలో, రాజ్యతంతములో, విద్యలో మనకంటే వారు తక్కువే, కాని ఉత్తమ 
వ్యవసాయ పద్ధతి, సాటిలేని వస్తు నిర్మాణ నిపుణత, జీవిత సౌఖ్యమునకు 
కావలసిన వాటిని సమకూర్చుట, (పతి (గామమిలో పాఠశాలను స్థాపించుట, 
దానము ఆతిథ్యము ఇచ్చుటలోని వితరణ, క్ర్రీఅను గౌరవించి సంభాషించుట, 
అనునవి నాగరికతా లక్షణాలై తే హిందువులు యూరోపు జాతుల కెవ్వరికినీ తిసి 
పోరు. ఇంగ్లండు ఇండియాలకు నాగరికతయే వ్యాపార వస్తువైన మన దేశమే 
దాని దిగుమతి వల్ల లాభము పొందగలదు” మనో ఒక కాలువను ఇండియాలో 
కొని ఏడెండ్లు వాడుకొన్నను అది కొ త్తదాని వలెనే యుండెను. కాన “నాకు 
ఇంగ్లండు కాలువలు బహుమతిగా నిచ్చినను వాటిని తీసికొసమ.' అని తన దెళ 
పరిశ్రమల హైన్యమును | పకటించెను. 


స్టా9సీ (Str26Ey ) అనునత డదే విచారణ సమితి యెదుట యిట్లు 
చెప్పెను. “మనము హిందూస్తానీ పరిశమల నాశనం చేసిగాము. ఇప్పుడు 
భరత దేశము కేవలము భూమి పైననే ఆధారపకినది. నేటికిని (౧౮౧౩లో) 
ఇండియా పట్టునూలు బట్టలు ఇంగ్లండులో మన సరకులకంటే నూటికి ౬౦ 
పాళ్ళు తక్కు వధరల కమ్మును, ఆందుచేత మన _పభుత్యము వాటిపై 


(క శ; ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు $57 


నూటికి ౭౦ లేక ౮౦ పాళ్ల సుంకము వేసియో లేక అమ్మకుండా నిషీధించియా 
చారిని సష్టపెట్టుచున్నది. ఇట్లు చేయకుండిన మన మిల్లులు మూతబడి 
యుండెడివి.' 


మనో యిట్లనెను. “మ దాను సూబాలో కంపెనీవారు సాలెవాండ్ల ను పిలిచి 
బలవంతముగా కారుచౌకగా తమకు బట్టలు నేసి యిచ్చునట్లు బాధించి ఒప్పంద 
ములు చేసిరి. వారు బట్టలు నేయుటలో ఆలస్యము చేసిన కంపెనీ నౌకర్లు 
వారిపై కావలియెక్కి. దినము ఒర ఆణా జుక్మా నాను తీసుకొని వగా బెత్తాలతో 
సాలెవారిని కొట్టి బాధించెడి వారు. (Chapter 14.) 


ఇంగ్లీషువారు ప్లొసీ యుద్ధముతో జెంగాలును ౧౭౬౦ లో వండి వాష్‌ 
యుర్ధముతో మృదాసు సూబాను ఆ(కమించుకొన్న తర్వాత కూడ హిందూ 
స్థామునుండ భారతీయులు తమ సరకులను ఇంగ్లండుకు అమ్ము టకై, తమ ఓడ 
లలో తీసుకొని పోయిరి. అప్పుడు తేమ్ను నదిలో మన ఓడలను ఇంగ్లీషువారు 
చూచి తేమ్చుకు నిప్పంటుకొనెనా అన్నట్లు రిచ్చపడి మన యోడలను చూచిరట | 
భారతీయులే..మన బానిసలే మన దేశములోనే తమ యోడలలోనే మనకు 
పోటీగా వ్యాపారం చేస్తారా? అన్న య్యాగహము కలుగగా కొన్ని యేండ్లలో 
మన ఓడలు మన పరిశమలు మన సంపద అన్నియు మాయమై పోయెను. 
జనులకు భూములే మిగిలెను. కాని వాటి ఫలితములో సగము అంతకంటే 
యెక్కువ పన్నుల పేరుతో కంపెనీవారు లాగుకొనిపోయిరి. 


“౧౭౬౪ నుండి ౬౬ వరకు ఇంగ్లీషు సరకుల వ్యాపారము ఏటేట ఇంచు 
మించు ౨౨ లక్షల ౩౦ వేల రూపాయలదై యుండెను. ౧౭౮౦ లో ౩౫ లక్షల 
౫౦ వేల దయ్యెను. ౧౭౮౫లో ఇంగ్లండులో ఆవిరి యంతములు (పారంభ 
మయ్యెను. ఆ సంవత్సరం మన దేశానికి ౮౫ లతల ౫౦ రూపాయీల సరకు 
పంపిరి. ౧౭౯౦ వర కది ౧ కోటి ౨౦ లక్షల వరకు పెరిగెను ౧౮౦౦ వరకు 
అంత నాల్గంతలయ్యెను. ౧౮౦౯లో ౧౦కోట్ల ౮౪లక్షల రూపాలయీల సరకు 
మనదేశానికి దిగుమతి యయ్యెను. ౧౭౯౩లో పార్లమెంటు నివేదికలో ఇట్లు 
(వాసిరి. “హిందూస్థానమందళి పతి దుకాణములో ఇంగ్లీషు మల్లు బట్టలనే 
అమ్ముచున్నారు. ఆవి దేశి బట్టల ధరలో నాల్గవ సంతుకే అమ్మూచున్నారు, 
(History of India- Rush Brook Willims. 111. P, 132 - 3.) యంత 
యుగ మేర్పడుట, ఇంగ్లీష వారు మన దేళమును వళపరచుకొనుట, మన పరిిళ 


858 ఆం|ధుల సాంఘిక చరిత 


మలు నాశనమగుట, అన్నియు ఈ కాలమందే జరిగెను. ఈ దెబ్బనుండి మనము 
నిన్న మొన్నటి వరకు కోలుకొన్నవారము కాము, మనలను ఇంగ్లీషువారు కోలు 
కోనిచ్చినవారు కారు. ఈ సమీకః కాలములో మొగలాయి రాజ్యముకన్న 
కంపెనీ రాజ్యమే ఘోర మైనదయ్యను. 


ఆచారములు 


[కీ శ. ౧౭౫౭ నుండి యింగ్లీషు (పభుత్వము స్టిరపడుతూ వచ్చెను, 
దేశములో తీ వమగు మార్పులు | పాఠరంభమయ్యెను. మ సల్మానుల [ప్రభావము 
తగినకొలది ఇంగ్లీషువారి పభావము దేశముపై దేశజనుల ఆచారాలపై ఎక్కు 
వగుతూ వచ్చెను, 

కూచిమంచి తిమ్మకవి (క్రీ; శ॥ ౧౭౫౦ తర్వాతవాడు. ఆతడు తన 
కుక్కు టేశ్వరశతకములో ఇట్లు విచార పడెను. 

“వేదశాస్త్ర పురాణ విద్యలక్కరగావు పరిహాస విద్యలు వనికివచ్చు 

గద్యపద్య విచితకవితలు కొరగావు గొల్లసుద్దులకతల్‌ పెల్లుమీరు 

దేశీయ భాషలతీరు లేమియుగావు పారసీకోక్తులు పంణుతి కెక్కు 

ఇ వవైష్టవ మతాచారంబు లొప్పవు పాషండమతములు పాళినలరు.” 


గువ్వల చెన్న శతకము “గువ్వల చెన్నడను గొల్లవాడు రచించెనని 
కొందరు చెప్పుదురు. కవి ఫదునేడవ శతాబ్తాంతమున ఉండనోపు” అని 
వావిళ్ళ పీఠికలో కలదు. అనగా కపి t శ॥ ౧౬౦౦ నుండి ౧౭౦౦ లోపల 
నుండెనని వారి అభిిపాయము, 


గొల్లింట గోమటింటను తల్లియు దం|డ్రియు వసింప దాను వకీలై 
కీళ్ళ మదమెక్కి నతనికి గుళ్తయినం గానరావు గువ్యలచెన్నా! 
అని కవి గొల్లవాడై న వాసియుండడు, 
కవి బబాహ్మణుడు కాడనియు రాయలసీమవాడు కాడనియు ఈ [కింది 
పద్యము తెలుపుచున్నది. 
వెల్లుల్లి బెట్టి పొగిచిన పుల్తని గోంగూర రుచిని బొగడగ వళమా 
మొల్టముగ నూని వేసుక కొల్లగ భుజియింపపలయు గువ్వలచెన్నా! 


Lt శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 859 


రాయలసీమవారు గోంగూర అనరు; పుంటికూర ఆందురు. ఉల్తిగడ్డ 
తినిన (బాహ్మణులు దానినీ బయట పెట్టుకొనరు! 


“కలిసి షికారునెపంబున” 
అని షికారు పదమును వాడుటచే ఇతడు స్పష్టముగా ఉ త్తరసర్కారు 
వాడని తేలిపోయినది. 


“ పీడరులమని వకీళ్శీ వాడుక చెడ స్వేచ్చ దిరిగి పాడు మొగములన్‌ 
గూడనివారిం గూడుచు గూడెముల జరింతుముందు గువ్వులచెన్నా!” 


“ధనమైనంతట భూముల తనఖాలను వి|కీయములు తరువాత సతీ 

మణిభూషణాంబరమ్ములు గొనుట యవి లక్షణములు గువ్యలచెన్నా!' 

అను పద్యములోని ప్లీడరు పదముచేతను భూమి తనఖాలు (మార్డుగేజ్‌ ) 
ఆను పదముచేతను కవి డీ: శ. ౧౮౦౦-౧౮౫౦ |పాంతము వాడని స్పష్టము. 
కావున ఈ కాలములోని ఆంధుల స్థితిని ఈ శతకము కొంతవరకు మనకు 
తెలుపుచున్నది. 

ఆంగీలు పచ్చడంబులు సంగతిగను శాలు జోడు సరిగంచుల మేల్‌ 

రంగగు దుప్పటులన్నియు గొంగడి సరిపోలవన్న గువ్వలచెన్నా! 


ఆంగీలు బాగా వ్యా ప్తిలోనికి వచ్చెను. కాని గొంగడిని మరచిపోవద్దని 
చెన్నడు బోధిస్తున్నాడు. 


అల్పునకు నెన్ని తెల్పిన బొల్పుగ నిల్వవని పేడబొమ్మకు నెన్నో 
శిల్పపుబను లొనరించిన గోల్పోక యలారుచున్నె గువ్వఠచెన్నా! 


వేడబొమ్మఅ పరిశ్రమ మన వారికి పాతదే. ఇంకా ఇం గ్నీమ బొమ్మలు 
దిగుమతి కాలేదన్నమాట. 


జనులలో మొగలాయి వేషాలు పోయినవని కవి విచారపడినాడు, 


పాగా లంగ రకాలును మీగాళ్ళనలారం ఐంచె మేలిమికట్టుల్‌ 
సాగించు కండువాల్పయి కోగా యిక గానమెన్న గువ్యలచెన్నా! 


కీ. శ, ౧౬౦౦-౧౭౫౦లో (క మక మాభివృద్ధిగా దేశమందు వ్యావించి 
పోయిన పొగాకు ఈ సమీక్షా కాలములో మరింత వృద్ధికి వచ్చెను. కవ్చలు దాని 
యకోగానము చేసిరి, అనేక చాటువులు బయలుదేరెను. 


560 ఆం|ధుల సాంఘిక చరిత 


“*దంతలూటీ ఘోరదంతి హర్యక్షంబు 
కుష్ట రోగాచల కులిశధార....... 


మొదలగు పద్యాలను చూచిన వికదమగును. 


(చూడుడు చాటుపద్యమణిమంజరి, పుటలు౧౯౦-౧౯౨) భాషీయ 
దండకమును రచించిన కవి గండ్రూరి నరసింహకాన్త్రి (క్రీ. శ. ౧౮౦౦ ప్రాంత 
మలో కర్నూలు మండలములో ఉండినట్టివాడు, అప్పటి జనుల ఆచార వ్యవ 
హారములను చక్కగా ఈ దండకము విశదీకరించును. నంబి యెదురువ స్ట 
పనిచెడుతుంది అని జనుల విశ్వాసము నాటికి నేటికి కలదు. అదే మాటను ఇత 
డిట్లు చెప్పినాడు, 

“తాల్త పెండ్రిండ్దకున్‌ తర్చి పొయ్యేటి వారందరున్‌ 

ముందుగా మమ్ము ,పార్థించు చున్నారు మమ్మెందు 

సేవించి కార్యార్టులె పోయినా వారి కాపొద్దు 

వైకుంఠ యా తాసమంబె న సౌఖ్యంబు సిద్ధించు” 

పొగాకును చుట్టగా [తాగుటయేకాక పొగాకుకాడ పుల్లలను పొగాకు 
మొద్దుల చూర్ణాన్ని కర్ఫ్యూలు కడపలోని పనిపాటలవారు నోట్లో చేసుకొను 
ఆచార మిప్పటికినీ కలదు, ఈ కవి యిట్లు వర్జించినాడు. 

'ఇంగగొల్లేశ మొస్తుంది నోట్లోకికొంచెం పొగాక్పుల్ల గిల్బెట్టి........ పోరా 
పొగాక్సుల్ల కేయాడ కొట్టించుకొంటావురా బాలకి'న్నే శగాడా యటంచున్‌ 

వినోదంబుగా 
గూడెపుకా దాసరుల్‌ గుంపుగూడాడగా” 


రాయలసీమలో విల్లలపద్యాలు కొన్ని (పసిద్ధిగా నుండి యుండును. 
వాటి మొదటి పాదము మాతతము కవి యిట్లు సూచించినాడు: 
“చెప్పాలవో చెప్పితే లడ్డులప్పాల్‌ గొని 
_తావుగా” “శెతిలో యన్నముద్దాత్తు,” 
“"శంగలం పూదండ“ సెప్పేషురి 
ఆ పిల్లవాడిట్లన్నాడు “చేతిలో వెన్నముద్ద) అను పద్యము నాకు 
వచ్చును. “చెంగల్వపూదండ” అనేది నీవు చెప్పుము. "చేతలో వెన్నముద్ద- 
చె ల్వపూదండ”" అన్న పద్యమును వృద్ధు లీ విధముగా తెలిపినారు, 


(in శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 981 


“చేతిలో వెన్నముద్ద చెంగల్వపూదండ బంగారు మొల్మతాడు పట్టుదట్టి 
సందిటి తాయెతుల్‌ సరిమువ్వ గజ్జెలు చిన్న కృష్ణమ్మ నిన్ను నే జేరికొలుతు 


వై పద్యములో మొదటి మూడు పంక్తులు సీస పద్య పంక్తులు. తుది 
గీటు తేటగిత. ఇద్దరు భిన్న (ప్రాంత వ్యక్తులు నాకీ పద్య మంతేయని చెప్పిరి. 
తప్పో ఒప్పో ఈ పద్యమే తెనుగు దేశమండు బహుపాంతములలో (పచార 
మం దుండెనన్న మాట, 


వ ల్లెటూళ్ళలో ప లేవోలు, బస్సాలు, సూర్నాలు, తె లాలు” దొంగ 
వైద్యులు అమ్ముకొని జనులను మోసగించేవారు. ఇప్పటికిని ఈ పనీ జరుగు 
తూనే ఉన్నది. నాటు వైద్యుల మోసాలను ఈ కవి చక్కగా వర్ణించినాడు. 


హంసవింశతిని రచించిన అయ్యలరాజు నారాయణామాత్యుడు క్రీ. శ. 
౧౮౦౦-౧౮౫౦ |పాంతమువాడు, అతని [గంథ మా కాలములోని జనుల 
ఆచార వ్యవహారములను తెలుపునట్టి ఒక గని. అతడు కర్నూలు మండలము 
వాడందురు, (గంథాంతములో ఆతడు కందనూలు, గద్వాల, పాలవేకరి, 
రామళ్ళకోట, నెల్లూరు, కంభము, మార్కా పురము, వినుకొండ మొదలయిన 
తెనుగు సీమలోని స్థలాలను పేర్కొన్నాడు. ఆ పాంతాలలోని జనుల ఆదారా 
లను కవి యెక్కువగా గమనించిన ట్లూహింపవచ్చును,. హంస వింశతి నుండి 
మనకు తెలియవచ్చు కొన్ని విషయములను ఇందుదాహరింతును, తెనుగు దేశ 
ములో చాలా నాడులు ఏర్పడెను, అందు కొన్నింటిని ఈ కవి యిట్లు తెలిపినాడు, 


క. వెలనాడు వేంగినాడును పులుగులనా డ్చాకనాడు పొ తపినాడున్‌ 
క లమురికినాడు రేనా డలయక కనుగొంటి నచటియబలల గంటిన్‌. 


చెన్నపట్టణము, బందరు మంచి వ్యాపార స్థలాలని కవి తెలివినాడు. 
గుల్చర్గాలో జంభాకాలు, బందరులో చీటిబట్టలు, అ సరులు సిద్ధమగు చుండ 
నని కవి తెలిపినాడు. 
నారాయణకవినాటి కాలములో కొన్ని కులాల ఆచారాలు వ్యక్తమగు 
చున్నవి. 
“కాపు గుబ్బెత లెసటికై కుండలరయ” (౧-౧౩౭) 
(46) 


862 ఆం(ధుల సాంఘిక చరిత 


కాపువారిలో వంటలకు కుండలే యక్కుువగా వాడు ఆచారము. ఆనాడు 
గోల్తాండ వ్యాపారులలో కరణీకము చేయువారి వేషాలను కవి యిట్లు 
వర్ణించెను. 


మెలిబెట్టి చుట్టిన తెలిపైరిణీపాగ చెవిసందిపాగలో జెక్టుకలము 
తొడరిన నెరిచల్వనడరు నంగీజోడు జీరాడు నడికట్టు చెరగుకొనలు 
పదతలంబుల న్మెర్రపారు పాపోసులు చెక్టుగా జంక చీటీఖిలీతి 
సడికట్టులో మొల నికిన ఖలందాను హస్తాగమున (వేలు ద_స్టరంబు 
మించు బాహువుమీద కాశ్టీరశాలు 
చెవుల ముత్యాలపోగులు చెల వుదనర 
అలతి నీర్హావి దోవతి యమర నటకు 
పారుపత్యంబు సేయు వ్యావారి వచ్చె (౨-౩౦) 


కాపువారిలోని కొన్ని శాఖలను కవి యిట్లు తెలిపినాడు. 


పంట, మోటాటి, పెడగంటి, పాకనాటి, 

అరవెలమలాది కొండారె, మొరుసుగోన 

కొణిదెకాపులు, మొదలైన వోణిదనరు 

కొపులకునెల్హ్ల మిన్న యక్షా పుకొకుకు, 

--(౪-౧౩౬) 

సెట్టి బలిజల వేష మెట్టిదనగా: 
సరిపెణతోడిసజ్జ బలుసందిటి తాయెతు లింగవస్తుముల్‌ 
సరిగె చెరంగుపాగ విలసన్మణి ము దిక లంచుకమ్ములున్‌ 
మెరుగులు గుల్లు దోవతియు, మిన్నగు నీలపు పోగుజోడు బి 
త్తరప్పు విభూతి రేఖలరుతన్‌ రుదురాచ్చలు గల్లి భాసిలున్‌. (౫-౯౯) 


సెట్టి బలిజెలు ఎద్దులపై ఎకి పోవుచుండెడివారు, (౫-౧౦౦) 
తెల్లవారగానే గొల్లవారు మజ్జిగ చిలుచుండిరనియు, కాపు కూతులు 
ఇళలియావ నాళములు (దొ_క్రగ జేయుచుండి” రనియు కవి తెలివీనాడు. 
(౧ ఇ ౧౯౫) 
గొల సుదులు చెప్పు గొల జాతివారు కొంద రుండిరీ. వారు కృషలీలలను, 
౧% © ట్‌. $9 
కాటమరాజుకథను పధానముగ చెప్పుచుండెడివారు. (౨-౮౮) 


bn శ॥| ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 868 


నారాయణ కవి కాలములోని కొన్ని కులాలవారను కొన్ని వృత్తుల 
వారును ఇప్పుడు మనకు కానరారు. వారిలో కొందరిని గురించి కవి యిట్లు 
తెలిపినాడు, 


“కోమటి, కమ్మ, వెలమ్క వెంకరి, పట, గొల్ల, బలిజ, కుమ్మర 
వారును; పలగండలు, బె స్తలు, చిప్పెవారును; కమ్మరి, వడంగి, కాసె, 
కంచర, ఆగసాలవారును; అణికార్తి వడసాలె, సాలె, సాతుు సాతీన, 
సాతాని, కటికవారును; ఘటియకార, చితకార, నిమి తకారులును; భట్లు, జెట్లు, 
జాం్యడ, తొగట్క గాండ్ల వారును; వందిమాగధ, వైతాళిక, జైన, ఘూర్డరి 
క రజి, భాయతిలహడి, గౌడమిశులును; బేహరి, భణియ, ఛటిక సృగాలక, 
ఖతిజారులును; బోయలు, యెరుకులు, చెంచులు, యేనాదుల్కు జిలగరి, వానె, 
వన్నెగట్టు, తంబళి, యీడిగె, మేదరవారును; వీరముష్లులు, మావ్షీలు, ఒడ్జె 
యుప్పరులును, అసిధార క రబ్బాటు మెలారి, మన్నెరి, తలారులును; తురక 
పింజారి, విప్రవినోదులును; జాతిక ర్త దొమ్మరి, డొమిణి, బొమ్మలాటవారును; 
దాసళ్లు, తెరనాటకపు జంగాలు, బిద్దెమువాం(డు. .....ఇ0కా ఎన్నెన్నో వృత్తుల 
వారిని తలివియున్నాడు, (3-౨౮) 


నారాయణకవి కాలమునాటికి పాతవేషాచారములు కొన్ని పోలి కొత్తవి 
పొడసూపినవి, టోపీలు మెల్ల మెల్లగా మనవారి నెత్తికెకైను. శ్రీనాథుని కాలము 
లోని కుల్లాయియే టోపీ అయ్యెనా? లేక ఈనాడు కొందరు ధరించు(161 Cap) 
వెల్లు టోపీలా? అని తెలియరాదు. టోపీ అను పదమును, ఈ కవి 
విరివిగా వాడినాడు. “ముఖఘర్మముల టోపీ మునుగ జుట్టిన వల్లెకోసలు మరు 
లౌల్యమున హరింప (౧-౧౭౨) 
అని ఒక [బాహ్మణుని వేషమును వర్షించినాడు, 


డుబుడక్కి_వాని వేషము ఆనాటినుండి యీనాటివరకు ఏమిన్ని మారి 
నట్టు కానరాదు. 
నొసలుపె చుక్కల మిసిమినామపు రేఖ 
లనువొంద భుజము పె నసిమిసంచి 
వాలు వీనుల గాజు నీలాల పోగులు 


పెనొప్పు పొప్పు? పచ్చడంబు 


864 ఆంధుల సాంఘిక చర్నిత 


మెలిగొన జుట్టిన తలపాగ చెరగు౦చి 

పె లపేటా చుట్టు పట్టుళాలు 

కడిమి మీరగ చంకనిడిన బొట్టియకోల 

డాకమో సెడు డుబుడుబుక ,_ కేల (౨-౨౮) 


తాటాకులపై గంటములతో వాయుట ౧౦౦ యేండ్ల [కిందటి వరకు 
మనదేశమందు విరివిగా ప్రచారమందుండినను శ్రీనాథుని కాలము నరకే కాగి 
తాలపై మసితో [వాయు ఆచారము [పారంభమై యుండెను. 


'దస్తా9లున్‌ మసి బు|రలున్‌ కలములున్‌ 
దార్కాన్న చింతంబళుల్‌” 


అన్న (శ్రీనాధుని చాటువునుండి పె విషయము విశదమలునది. హంస 
వింశతి కాలములో “దవతి% *శాయి' మరింత వ్యా ప్పిలోనికి వచ్చెను, 
రసికుడె నటి కాలంపు ర కవాను 
ఒా- టి అంక 
తనర [బహ్మాండమును పెద్ద దవతిలోన 
కాయినిండార బోసిన చందమునను 
కారుతిమిరంపు గుంపు నిండారబర్వ, 


(దవతి యనునది దవాత్‌ అను ఫార్సీ పదము; మసిబ్యుర అని 
యర్థము కాయి అనునది సియామ్‌ అను ఫార్సీ పదము. నల్పనిర౦గు అని 
యర్థము, ఈ రెండు పదాలను తెలంగాణా వారు విశేషముగా వాడుదున్నారు.) 


హంసవింశతి గంథాదిలో నే నానావిధములగు ఉపాహారములను, భక్ష్యము 

లను, పిండివంటలను, చిరుతిండ్లను బేర్కొన్నాడు, అదొక పెద్ద పట్టిక యగు 
౧ 2 ల 

టచే ఉదాహరించుటకు వీలులేదు. (౧-౧౦౫) 


ఇంకా గంటలుచూపు పాళ్ళాత్య గడియారములు వళ్చి యుండలేదు. 
హంసవింశతికారుని కాలములో విజ్ఞులు ఎండలో పాదచ్భాయను కొలిచి కాల 
మును గు_్టించుచుండిరి. పెద్దపెద్ద పట్టణములలో గడియలను కొట్టు ఏర్పా 
టుండెను, 


'ఆ సమయము కాదటంచు పాదచ్చాయ 
లొనరించి (వేశ్లించికొనుచు 


కీ॥ శగ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 865 


యూర గడియార మిడలేదోయని - 
వీధి పీద్ధి వెంబడి వెదికిచూచుి (3-౧౫౬) 


పెన గడియార మనునది గడియను తెల్పునట్టిదే. గంటలు తెలుపు 
పాక్చాక్య గడియారా లింకా దిగుమతిలయై యుండలేదు. 


నారాయణకవినాటి జనుల వినోదములు కొన్ని యిట్లుండెను రంగులు 
వేసి చితపటములు (వాయు వా రుండిరి. సంపన్నుల యిండ్హ గోడలమీదను, 
దేవాలయపు గోడల మీదను చిత్తరువులు [వాయుచుండిరి. 


హరిత హారిద కృష్ణర క్రావదాత 

శబల పాటల ధూమల శ్యామక విల 

వర్ణములగూర్చి చిప్పల వాగెలునిచి 

చిత్తరువు [వాయు గుళ్ళలో చితఘనుడు. (3-౮) 


౧౫౦ ఎండ్ల (కిందట మన తెనుగువారి ఆటలనుగూర్చి కవి విపులముగా 
ఒక పెద్ద సీసమాలికలో ఆట లన్నింటిని ఒకపట్టికగా చెర్చి తెలిపినాడు, 
అందు సగముకంటె ఎక్కువ ఆట లెట్టివో మన కిప్పుడు తెలియరాదు. 
ఎవరై నా శమచేసి పరిశోధనలు చేసి ఈ ఆట వివరములను అన్నింటిని వర్షించి 
వివరించి ఒక చిన్న [గంథముగా వాసిన బాగుండును. కపి తెలిపీనఐ కొన్ని 
యెట్టివనగా 

'దూచియు జాబిల్లి బూచికన్నులకచ్చి 
గుడిగుడి కుంచంబు కుందెనగిరి 

చీకటి మొటికాయ దింతాకు చుణుదులు 
పులియాటలును చిట్ల పొట్లకాయ 
తూరనతుంకాలు తూనిగ తానిగ 
చిడుగుడు మొకమాట చిల్లకట్దై 

దాగి లిమూశలు తనుబిల్ల యాలంకి 
గుష్పట గురిగింజ కొండకోతి 
చిక్కణబిలయు జెల్లెను గొడుగును 
బిల్ల దీవులు లక్కివీక్కి దండ 
గడ్జెరబోడి యొక్కసి కొక్కుబరిగాయ 
పోటు గీరనగింజ బొంగరములు.ి (3-౧౪౭) 


$66 ఆంధుల సౌంఘిక చరిత 


ఇట్టివి చాలా (వాసినాడు. అదంతయు ఉదాహరించుటకు వీలులేదు 
ఆధిలాషలు ఈ సీసమాలికలు పూర్తిగా చదువుకొనగలరు. 

చాలామంది యిండ్రముంగిటి భాగాలలో పులి జూదపు ఆటగీతలను 
పలకరాళ్ళపె మలిపించి యుంచుచుండిరి, 


“ముంగిట పులిజూదములు గీచియుండిన 
రచ్చబండలు గొప్ప [పహరిగోడ ” (౪-౧౨౩) 
నేటికిని తలుగుదేశమం దంతటను పల్లెలలో ఈ ఆచారము మిగిలి 
యున్న ది. 
కోడి పందెములు తెనుగువారి వినోదములలో చాలా పాబీనమగు 
వినోదము. మన సారస్యతములో క్రేతనకవి కాలము నుండియు నారాయణకవి 
కాలము వరకు పలువురు కవులు ఈ పందెము౪ను వర్తించినారు. కోడి పందెపు 
శాస్త్రము కూడా చాలా [పాచబీనమైనట్టిదే. నారాయణకవి ఈ విషయములో ఇట్లు 
వర్గించినాడు : 
“కాచి పాతలు దారాలు కట్టుముళ్ళు 
ముష్టులను సీళ్ళముంతలు మూలికలును 
కతులపొదుళ్ళు మం|త్రముల్‌ కట్టుపసరు 
లనయవచ్చిరి పందెగా ళ్ళేపు రేగి 
వేగ నెమిలి పింగళ కోడి డేగ కాకి 
వన్నలై దింటి కిరులందు వెన్నెలందు 
రాజ్యభోజనగ మన నిదామరణ 
ములను విచారించి యుపజాతులను వచించి" 


ఈ పందెమును గూర్చి ఇంకా నాలుగు పద్యాలిచ్చటనే కవి వీపులముగా 


[వాసెనుః (3-౨౧౩) 
శై వభకుులలో వీరభ (ద ప ళ్ళరము లిడుట ఆచారముగొ నుండెను, 
(3-౧౮౮) 


జనులలో తాయెతులపై విశ్వాసము మెండుగా ఉండెను, ఈ తాయతు 
శబ్దము అప్పకవి నాటికే రూఢియై పోయెను. తాయెతు శబ్ధవిచార మిదివరకే 
చేసినాను. 


(కీ॥ శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు $67 


నారాయణకవి ఒకచో తాయెతు నిట్లు పేర్కొన్నాడు, 
ళం 


“ సరిపెణతో సజ్జబలు సందిటి తాయెతు 
లంగవస్త్రము........ i (౫-౯౯) 
బాలికలు ఆడుకొను ఆటలు (_పత్యేకముగా ఉండెను. 
నాచన సోమన మొదలుగా నారాయణకవి వరకు వాటిని పేర్కానుచు 
వచ్చినారు. హంసవింశతిలో ఇట్లు తెలిపినారు, 
“బొమ్మల 'పెండ్లిండ్లు బువ్యంపు బంతులు 
రా na) 
పుణికిళ్ళు నిట్టిక్కి బొమ్మరిండ్లు.......” (౫-౧౪౭) 
(అభిలాషులు పూర్తి పద్యమును చూచుకొనగలరు. ఈ మాలికలో ఆతి 
పద్యము,) 
రాటముపై పడ కుట ఇంకా విరివిగానే ఉండెను. దాని ముచ్చట పల 
తావులలో హంసవింశతిలో కలదు. 


ధనాఢ్యులై నవారు చలివేం్యదలు పెట్టి వేసవిలోని బాటసారులకు సేద 
దీర్చి పుణ్యము రట్టుకొనిరి. ఆ చలిపందిటిలో ఉత్త మజ్జిగ మాతమే ఇయ్య 
కుండిరి, 


“లవణశుంరీజం ఫలరసాను యుక్రముల్‌ 
నీరు మబ్దిగకుండ బారులమర 
లఘులయైలానూన లలిత సొరభమి|క 
కీల జలకుంభ జాతమమర 

జీరకకైె డర్య చారుగంధములొల్కు 
పలుచనియ౦ బళ్ళ పంట్లుది నర 
రవయుప్పు నీరుల్లి రసమునించిన కొళ్చు 
గంబికాగులగుంపు కడురహింప 

గంధబ ర్లిష్టలామజ క పళ స్ప కా 
యమాన మువుర్ము హుర్దాయమాన 
మందపవమాన ఘనసార బృంద వేది 
కాలయవితాన పానియళాలయొ ప్పె (౨-౧౬౦) 


868 అం|ధుల సాంఘిక చరిత 


ఆ కాలమందు (బాహ్మణులు సంస్కృృతాభ్యాసము విరివిగా చేయు 
చుండిరి, వారి పాఠ్య |పణాళిక యేమనగా, మేఘ సందేశము కువలయానం 
దము, (పబోధ చందోదయము్ము మణిసారము, సిద్ధాంతకొముది, రసమంజరి, 
కావ్య! వపకాశిక మొదలగునవి, (౨-౧౪౨) 


మనవారు ఇంగ్లీషు విద్యాపద్ధతులలో నిండుగా మునిగినది ఈ ౬౦ 
ఏండ్లలో, అంతకు పూర్వము మన దేశపు బళ్ళస్థితిని నారాయణకవి ఇట్లు 
చక్కగా వరి ంచినారు. 


నన్నయ్యవార రోనామాలు దిద్దుకొ 
మ్మనినచో కడుపునొప్పనుచు నేడ్చి 
దండంబునకు గుణింతము పెట్టరమ్మన్న 
అంగుళీవణమాయెననుచు జు థ్రిగి 
శిష్యులచే గాలు సేతులు బట్టించి తెచ్చి 
పద్యముజెప్ప దెమలరుండి 

పలక |వాయనటంచు బడికెత్తుకొనిపోవ 
బలపంబులేదని పలుకకుడి 

ఆలుక చేనుండ బుగ్గలునులిచి తిట్టి 
తొడలు వడిపెట్టి కోదండ మడరగట్టి 
రెట్టలెగ బెట్టి బట్టించి రెపుమాపు 

కొట్టు బెట్టుగ సజ్జల కోలదెగను (3-౧౪౧) 


గద్దించి తిట్టిట దిద్దుమంచును వేలు 
బట్టించినచట'నే బట్టకుందు 

పలుమారు లోయని పల్కు మంచునుగొబట్టి 
చెప్పిన శిలవృ తి దప్పకుందు 

ఒక టికి సెలవియ్యనురికి చీకటిదాక 
పసులగాపరుల వెంబడినపోదు 

జనని అడుకొని చదువుకోబొమ్మన్న 
వినక వేమరు వెక్కి చెక్కి యేడు 
సారెపద్యపు బలుక పై చమురుపూతు 
ఎప్పుడును పెద్దపలక పొక్కెత్తదేతు 


కీః శ; ౧౭౫౭ నండి ౧౮౫౭ వరకు $69 


బాలరామాయణము పు స్తకాలుదాతు 

వేయు సజ్జనకోలలు విరిచివై తు (3-౧౪౩) 
చరికుండ పగులగొట్టుదు పరుపడి 

సూతంబు తెంచి పారగవై తున్‌ 

మరిమరి బలవములిచ్చిన పొరినమలుదు 
బగులగొట్టిపోయెనటందున్‌, (3-౧౪౩) 


నన్ను బీంగీలు పెట్టించునాడె యయ్యవారు 

నిదింపగాజూచి చేరి యచట 

చింత వేల్‌ కొమ్మ వంచుక సిగకుగట్టి = 

విడిచి యురికితినయగారు మిడికికూయ (౧-౧౪౪) 

పల్లె బళ్ళలో మధ్యాహ్నము ఆయ్యవారు బడిలో గురిపెట్టి నిదించుట 

వాడుక. ఎండకాలము చింతచెట్ల కింద బడి సాగెడిది. పెద్ద పలక అన కి 
పలక; బలప మన మెత్తని కోవు బలపము. పొగాకువాడుక దేశమందు విరివిగా 
వ్యాపించిపోయెను. బట్టసంచిలో పొగాకు పెట్టుకొని వెంట తీసికొని పోవు 
చుండిరి. దాసిని పొగాకు తితి యనిరి (౨-౭౬), (గామ కరణాలు కూడా 
పొగాకు చుట్టలు తాగుటకు బాగా అలవాటుపడిరి, వారి వేషముకూడా గమనింప 
దగినది. 


తెలితలపాగ, చొక్క, మొలతి కత్రి, భుజంబున జల్వపచ్చడం, 

బలచిటి వేల ము దిక, యొయారముమీర పొగాకుచుట్ట సొం 

పలరెడు కావిదోవతి, పదాబ్బ యుగ౦బుగ ముచ్చెలొప్పుగా 
నలనిభుడంత |గామకరణం బటకై చనుదెంచె నంతటన్‌. (9-౯౨) 


చొక్కా అనునది తెనుగుపదము కాదు. తెనుగు వేషముతో జొరబడిన 
అరవీ పదము. “గొగాౌ” అని నిలువుటంగీకి అరబీలో పేరు కలదు, అడే 
చొక్కా అయినది, స్రీలు కూడా పొగాకును వక్క తమలపాకులతోపాటు 
నమలుటకు అలవాటు పడిరి (౪-౧౫౮). శుక సప్తతి కవి కాలమునాటికి 
(కీ శ. ౧౬౦౦) నారాయణకవి నాటికి స్రీల భూషణములలో భేదము 
రాలేదు. శారాయణకవి తెలిపిన కొన్ని భూషణము లేవనగా 


(47) 


870 ఆం|ధుల సాంఘిక చరి(తి 


కుప్పె, రాగడిబిళ్ళ కుంకుమరేఖ 
పాపటబొట్టు కమ్మలు, బావిలీలు, 
లలిసూర్య చందనంకలు, సూసకము, 
కెంపు రవలపల్లిరుబూవు. రావి రేక, 
బుగడలు, నొన్‌దీగె, సొగ సెన మెడనూలు 
కుతికంటు, సరపణ, గుండ్ల పేరు, 

సరిగ, ముక్కర, బన్నసరము, లు త్తం 
డాలు కంకణంబులు, తట్టు, కడియములును 
సందిదండల్కు ఒడ్డాణ మంద మైన 
ముదదికలు, హాంసక ౦బులు, (మోయుగశ్జై, 
లలరు బొబ్బిలకాయలు గిలుకు మెథ్రి 
లాదియగు సొమ్ముదాల్చి యయ్యబల మెరయు (౨-౩౯౧) 


మన పూర్వుల ఆటలవళినే సొమ్ములుస్నూ చాలావరకు మనకు తెలియ 
రాని వై పోతున్నవి* అభిమానులు వాటిని వర్ణించి చ్మిత్రింపజేసి తెలుపుట 
మంచిది, ముఖ్యముగా నిఘంటుకారులు ఇట్టి పదాల కర్ణము (వాయునప్పుడు 
భూషణవిశేషణము ఆని [వాయుచుందురు, అంతమాతమందరికిని తెలియును. 
ఇక నిఘంటుకారు లొనర్చిస ఘనకార్య మేమి? 


ఏనుగుల వీరాస్వామయ్య ఆనువారు మదాసులో పెద్దఉద్యోగమందు౦ 
డినవారు, ఆతని కాలములో ఇంకా. రైళ్ళు ఏర్పడి యుండలేదు. ఆతడు మ దాసు 
నుండి కాశీకి సకుటుంబ పరివారముగా (పయాణము చేసి పల్లకీలో కీ॥ళ॥ 
౧౮౩౦-౩౧ లో |పయాణము చేసెను. అతడ కడప, కర్నూలు, జట(పోలు 
వనపర్తి, పామూరు, హై|దావాదు, నిజామాబాదు మీదుగా కాశీచేరి తిరుగా 
ఉత్తర సర్కారుల తీరము మీదుగా మదాసు చేరుకొనెను. కాన ఇంచుమించు 
తెనుగు సీమలో ముఖ్య భాగాలన్నింటినీ అతడు చూచి, అందలి జనుల ఆచార 
వ్యవహారాలను ఉన్న వున్నట్లుగా తన డె రీలో _వౌనుకొనెను, అందుచేత ఆతని 
'కాశీయా[త చరి|త' మన సాంఘిక చరి[తకు (కీ, శ, ౧౮౦౦--౧౮౫౦ కాలము 
వరకు చాలా ఉపకరించును. 


వీరాస్వామి కాలములో తెనుగుదేశము ఇంగ్లీమవారి పరిపాలన లోనికి 
వచ్చెను. హై దాబాదులోని తెలంగాణా నిజాం పరిపాలనములో ఉండెను, 


కీ॥ శ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 871 


ఇంగ్లీషు వారు ఇంకా తమ రాజ్యాలను స్థిర పణచుకునే యత్నమ.లోనే యుండిరి, 
అందుచేత దేశమందు శాంతి భదతలు ఏర్పడలేదు. అయినను బిటిషిండి యా 
లోని భాగాలలో నిజాం రాజ్యములోని భాగాలకం౦పే కాంతి భదత లెక్కు.వగా 
ఉండినవని కాశీయా[త చరిత నుండి |బిల్లామీ (వాసిన Hisiorical and 
descriptive sketches of Hyderabad State గంథము నుండి మనక 
తెలియవస్తున్న ది, 


తెనుగుదేశములోని యిండ్లు ఒక్కొక్క (పాంతములో ఒకొక్క 
విధముగా నుండెను, రాయలసీమలోని వ్యనసాయకుల యిండ్లలో పకువులున్నూ 
మనుమ్యలున్నూ నివాసము చేయుదురు, ఇది నేటికిని మారకుండా వచ్చిన దురా 
చారము. కర్నూలు జిల్లాలోని బండాత్మటూరు చేరి వీరాస్వామి యిట్లు (వాసెను. 
పశువులకు తాము కాపుర ముండే యిండ్లకందే చక్కగా కొట్టములు కట్టి, బాగా 
కాపాడుచున్నారు, అవులకు పాలు పితుకుటలేదు. ఎమపపాడి సహజముగా 
ఉన్నది. (పుట ౧౧) 


రాయలసీమలో ఎద్దుల వృద్ధి నాటికీ నేటికీ లేదు. “ఎద్దులు నెల్లూరిసీమ 
నుంచి వచ్చేవారి వద్ద హమెషా వారికి కొనవలసి యున్నది. తడవకు ౧౦-౨౦ 
వరహాలు సెట్టి యెద్దులను కొనుచున్నారు, (పుట ౧౪) 


కర్నూలు జిల్లాలో బియ్యము చాలా తక్కువ. “చేదలు జొన్నలతో 
నున్న, ఆరికె యన్నముతోనున్ను కాలము గడుప్పచున్నారు, (౨౩) 


కన్చష్టాజిల్లాలోని ఎద్దులవంటి యొద్దులు ద&ీణ హిందూస్థానములో 
మరెందును కానరావు. (3౫౮) 


మచిలీబందరువారిని గూర్చి యిట్లు [వాసినాడు, 


మనుష్యులు నిండా ఆరోగ్య దృఢగా్యకులుగా లేరు. స్త్రీలు అలంకార 
పురస్సరముగా కోభాయమానులై వున్నారు. చెవులకు నిడుపు గొలుసులు 
చేసికొని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పురుమలు చాయవేసిన వస్త్ర పియులళ్రై. 
యున్నారు (పుట ౩౫౦) 
"ఈ దేశ స్థులు(బందరువారు క చేరీ సహితముగా విందుచే స్తే ఆ వుత్సవాన్ని 
మేజువానీ లంటారు. ఇప్పుడును ఉత్తర సర్కారులో బోగపు సానుల పాట 


872 ఆం|ధుల సాంఘిక చరిత 


క్‌ు. 


కచ్చేరీని మేజువానీ అంటారు. ఇది ఉర్హూ' మేజుబానీ” నుండి వచ్చిన పదము, 
అనగా విందు అని యర్థము, విందులో బోగమాట ముఖ్యము, 

“కృష్ణానదికి వు తరము తూర్పు సమ్ముదపర్యంతము దేశస్థులు మాట్లాడే 
తెనుగు మాటలు రాగ సంయుక్తముగానున్న అక్షరలోపము గల (హస్వ 
శబ్బములుగా వుంటున్నవి, శ్రీలు నోటిని ఆవరించే పాటి ముక్కరలు చాలా 
లావుగా చేసి ధరించుతారు.” (పుట 8483-3౫౪) 


'నెలూరుసీమ పురుషులు స్రీలు దేహ పటుత్వము కలవారుగా నును, 
యథోచితమైన కురుచరూపము గలిగి సౌందర్యవతులుగా తోచుచున్నది. కాని 
దేహవర్ణము నలుపు కలసిన చామనగా తోచుచున్నది. గుణము నిషా, పట్యమని 
చెప్పవచ్చునుం" (పుట ౩8౯౩) 

'రాజమహేందవరము ధవశేశ్వరము (ప్రాంతములో స ప్రగోదావరీ భూమిని 
కోనసీమ అందురు. ఆక్కడ |బాహ్మణులకు భూవసతులు చాలా ఉన్నవి, 
(పుట ౩౪౩) “అచ్చటి బాహ్మణులు చాలా అధ్యయన పరులు, యజ్ఞయాగాది 
కొర్మ్కములయెడల చాలా (శద్ధాభ_్రి కలిగివున్నారు.” (పు-౩౪౪) *కళింగాం ధ 
దేశములలో తెలగాలనే వెలమలు కలరు.” (పు-౩౪౪) తెలగాలు వెలమలు ఒకే 
జాతి వారని వీరాస్వామి [వాసినాడు! 


“చినగంజాం మొదలుగా సము[దతీరమందు వుప్ప పయరుచేయడము 
విసారము కనుక వుప్పరజాతి స్రీలు దోటి ముక్కరలు ధరింతురు. ఇప్పట్లో 
దక్షిణ దేశము పడమటి దేశము పొడవుగా భూమి తొవ్వడానకు నెగడి 
వుండేవారు, ఈ దేళపు వుప్పరవాండ్లున్ను ఓ ఢదేశపు వొడ్డెవాండ్లుగా తోచినది.” 

(3౫౬) 
అందుకు సందేహ మక్కరలేదు ! 

“జగన్నాథ కే తములో జోగీ జంగము మొదలయిన ైౌవులను తురకల 
వలెనే నిషిద్ధ పజచి గుడిలోనికి రానియ్యరు. హిందువులలో చాకి లిజాతిని 
చండాలురను గుడిలో పలికి రానియ్యరు.' (3౧౦) 

ఈ రెండు వాక్యాలు తెనుగుదేళానికి సంబంధించ కున్నా ఉ తరసర్కారు 


లకు సమీపముననుండు రాయలసీమలో ఆనాటి యాచా!€ ములు తలియ వచ్చును. 
అందు చాకలివారిని చండాలురవలె చూచినది గమనించదగినదిం 


క్రీ॥ శ॥1 ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు $78 


“దావిడ దేశములో ఘాదులనున్నూ ముఖ్యముగా చండాలురనున్ను 
ఆగౌరవపరుస్తూ హద్రులదృష్టిని చండాలుర సమీప వ ర్రిత్వమున్నూ కూడదని 
నిండా అగౌరవ పరచడముచేత వేల పర్యంతము (ప్రజలు (క్రీస్తుమతస్టులుగా 
పెదవాళిము మైలాపూరు (క్రీస్తు గుళ్ళ వుత్సవాదులలో చూడ ఐడుచున్నారు, 


(౧౬౫) 
వికాఖ పట్టణం బిల్లా వారిని గూర్చి ఇట్లు [వాసినాడు. 


“కు దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్ష 
ణము కలవారుగానున్ను ఆగుపడుతారు. జాఫరా విత్తుల వర్ణము వేసిన బట్టలు 
వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వయ్యడం౦ కలిగి వున్నది. (98౫) 


బాలకొండ నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరుకు ౬ కోసుల దూరములో 
ఉన్నది. “హైదరాబాదు వదలినది మొదలుగా పాలు పెరుగు మాతము తంబళ 
జాతివారీ గుండా ఊరూరిలో సమృద్ధిగా దొరుకును.... ఈ దేశములో తంబళ 
జాతివారు పుష్పాలు, పాలు పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. 
మంగల జాతివారు మషాల్‌ వేయుచున్నారు.” (పు ౪౬) 


తెలంగాణా చాకలివారు దివిటీలు పట్టుదురు. వీరు మంగళ్ళ కాపని 
నిచ్చినారు. ఇవి ఆనాటి తెనుగుజనులను గూర్చిన ముచ్చట. 


ఇక మన తెనుగు భాషాస్థితి ఒక్కొక్క. (ప్రాంతమం దెట్టుండెనో కను 
గొందము. “కడప వదలినది మొదలుగా ఆరవభాష తెలిసి మాట్లాడతగినవారు 
సకృత్తుగా ఉన్నారు. తెలుగుమాటలు సర్యసాధారణముగా రాగసరళిగా చెప్పు 
చున్నారు. (పళ్నపూర్వకముగా ఉత్తర |పత్యుత్తర మిచ్చేటప్పుడు శబ్దముల 
సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్టాగంటే యీయూరు ఆయాూరికి ఎంత 
దూరమంటే నాకు యేమి యెరుక అని _పత్యుత్తరము పుట్టుచున్నది. పండు 
కొన్నాడు అనడానికి పండినాడని అమచున్నారు. హిందూస్థానీ తురకమాటలు 
తరుచుగా తెనుగు భాషలో కలిపి మాట్లాడుచున్నారు.' (౪౮-౪౯) 


ఇవి రాయలసీమను గూర్చి చెప్పినమాటలు. తెనుగు దేశానికి దకీణమున 
క్‌డప జిల్లా ఒక హద్దని ఇతని అభిిపాయము. ఆదిలాబాదుకు ఉత్తరమున ౧౦ 
[కోసుల దూరముపై మేకలగండి అను ఘాటు కలదు. తర్వాత వరదానది దాట 
వలెను, “హైదరాబాదు సరిహద్దు దానితో తీరిపోయిండి' అని వీరాస్వామి 


574 ఆం|ధుల సాంఘిక చరి[త 


వాసెను. వరదానది ఆనల నాగపూరు రాజ్యమని తెలివీనాడు, “ఆక్‌ డ్‌ 
కాయరా అనే యూరు మొదలు తెనుగు సకృత్తుగా ఉన్నది.” (౫౬) 


విశాఖపట్టణము జిల్లాలోని తెనుగు భాషను గూర్చి యత డిట్లు వాసెను. 


సర(సాధారణముగా ఈ దేశమందు తెనుగు భాష [పచురముగానున్నది. 
మాటలు దీర్గ ముగానున్ను, దేశీయమై రహస్యముగానున్ను పలుకుతారు. తెనుగు 
అక్షరములు గొలుసు మోడిగా _వాస్తారు. మనుష్యులు స్వభావముగా దౌష్ట్యములు 
చేయతలచినా మంచి తియ్యని మాటలు మాత్రము వదలరు.” (83౫) 


'గంజాము జిల్లా తెనుగు సీమకు మరొక హద్దు, గంజాం మొదలుగా 
కళింగదేశము ఆరంభ మవుటచేత ఇండ్లు, మనుష్యుల ఆలంకారాలు, దృష్టి 
దోషపు పాటింపులు దక్షీణదేశము వలెనే యావత్తు కలిగి ఉన్నవి. చిన్న 
యిండ్లకు కూడా వాకిట పంచ తిన్నెలు పెట్టి కట్టినారు. (పతి స్రీ బులాకులు 

లా ఠా లు 
ముక్కుర ధరించి వున్నారు. సమీపమున వుండే మాలురూ అన్న వూరిలో 
యెవరికిరాని తెనుగు భాష యక్కడ అందరికి వచ్చినది.” (3౩౧౯) 


“నెల్లూరు దకిణములో తెనుగు సీమకు మరొక హద్దు. నెల్లూరు మొద 
లుగా అరవమాటలు వింటూవస్తారు. ఈ దేశములో పడమటినుంచి కన్నడము 
వచ్చి కలిసినది. దక్షిణమునుండి అరవమువచ్చి కలిసినది, ఉ త్రరమునుంచి 
తెనుగు అదే రీతిగా వచ్చి కలిసినద. కనుక యూ మధ్యదేశపు భాష (ఉత్తర 
దక్షణ వినాకినీల నుధ్య దేశభాష) యీ మూడు భాషలు మిశమయి యీ 
మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆయా దేశములలోకి వెళ్ళి మాట్లాడ 
పోతే ఆయా దేశస్థులు హాస్యము చేయసాగుతారు. (3౬౧) 


చెన్నపట్టణమును గూర్చి, అందలి భాషలను గూర్చి వీరాస్వామి గారిట్లు 
తలీపినారు. 


“౨౦౧౦ ఏండ్ల [కిందట (అనగా ౧౮౭౧ కి ౨౦౦ వండ పూర్వము) 
చం(దగిరిలో బీజానగరపు (విజయనగరపు) సమస్మానాధిపతి యయిన శ్రీరంగ 
రాయడు దొరతనము చేయుచుండగా 'డే అనే దొర యీ సముదతీరమందు 
ఒక రేవు బందరు కట్టించవలెనని యత్నముచెసి శ్రీరంగరాయుణ్ణి అడిగి 
వుతరువు తీసుకొని యీ [పాంతాలకు జమీందారుడైన దామర్గ వెంకటాది 
నాయఢిపేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటా[దినాయడు డే దొరకు కృత 


(క్రీ॥ శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 876 


పరిచయుడు కనుక (శ్రీరంగరాయడు తన పేరు పెట్టి (శ్రీరంగరాయ పట్టణము 
ఆని రేవుబందరు కట్టి మన్నా వెంకట్నాదినాయడు తన తండియెన చెన్నప 
నాయడి పేరట చెన్నపట్టణమని పేరుపెట్టి కట్టడమేకాక తానే స్నాధానాధిపతి 
గనుక ఆదే నామకరణము ఆరంభములో చేసినందున చెన్న పట్టణము పేరు కలిగి 
నది, తత్పూర్వము ఈ రేవును ఇంగ్లీషువారు మదిరాసు ఆంటూవచ్చినారు.” 
మదాను రేవులో ఇంగ్నీషువారు గుట్టగా క ధైలకుప్పను తమ కోట నిర్మాణానికి 
వేసియు౦డిరి. అప్పుడు ఆ (పాంతమందు౦డిన డచ్చివారు తమ భాషలో కక్‌ 
కుప్పకు మదారై అందురు. కాన దానిని మదారైెస్‌ అనిరి. అదే మదాసు 
అయ్యెను. (3౩౬౯) 


“ఇక్క డివారు | చెన్నపట్టణమువారు) (పకృళలు ఉపాయ వేత్తలుగాని 
సాహసులగారు. (దావిడాం ధ క ర్హాటదేశాల మధ్య యో (ప్రదేశము వండుటచేత 
బాల్యాదారభ్య దేశ్యములైన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనము చేసిన 
వారి తురకభాష యిప్పుడు దొరతనము చేసే యింగ్నీషువారి భాషయున్నూ 
నోట నానడము చేతనున్ను. పదార్థములుగా కొన్ని సంస్కృత వాక్యాలు అభ్య 
సించుట చెతనున్నూ ఇక) డివారి ఉచ్చారణ సృుటముగా ఉంటూ వచ్చుచున్నది. 
ఇక్కడి త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషులవట్ల నిండా చొరవ జేసుకోగల 
వారుగానున్ను ఆగుపడుతారు, ఆయితే వస్తాభరణ పియులేకాని నె జగుణమెన 
సాహసము నిండా కలవారుగా తోచలేదు. (3౭౩) 


తెలంగాణా పరిగ్ధితి 


హై,దాబాదు రాష్ట్రములో తెలంగాణాను గురించి వీరాస్వామి తాను 
వెళ్ళిన దారిలో తగిలిన పదేశాలలోని విశేషములను తెలిపినందున దీనిని గూర్చి 
(పత్యేకముగా వాయవలసి యుష్నది. 

“ హైదాబాదులోని కొల్దాపుర వనప్పర్షి సంస్థానాలవారు తరుచుగా తగవు 
లాడి ఒకరి గామాలను ఒకరు కొల్ల పెట్ట రైతులను హింసించి [గామాదులు 
పాడుచేయుచున్నారు ఈలాగున కలహమలు పొనగినప్పుడు న్యాయము విచా 
రించి యొకరికొకరికి సమరస పెట్టకుండా చందూలాలు [పభృతులు (దవ్య 
కాంక్షచేత ఉభయులకున్ను కలహములు పెంచి వేడుక చూచుచున్నారు ” 


(౨౪-౨౫) 


876 ఆం|ధుల సాంఘీక చర్‌ త 


'జమీందారులు-వారి ఆధీనములో నుండే భూమిని పూర్ణమైన స్వాతం 
(త్యము కలిగి ఆయా భూములలోని కాపురస్తులను భర్త భార్యమీద చెల్లించే 
అధీకారముకంటే ఎక్కు డయిన అధికారముతోనే యున్నారు.” (3౨) ఈ వాక్య 
ములు [వాసి ౧౨౦ సంవత్సరాలు గడిచిపోయినను ఇప్పటికిని హైదాబాదు 
జాగీర్లలో రైతులు సర్వ'రహితులు"గా నున్నారు. జాగీరారులు ఆ 'రహితులి పై 
భర్తలు భార్యలపై చెల్లించుకొనే దర్చముకంటే మించిన దర్పాన్ని సాగించు 
కొంటున్నారు. ఇాగీర్దార్ల దౌర్హన్యాలను గూర్చి బిల్లాామీ ఇట్లు _వాసెను. 


“పతి [గామములో జాగీర్తార్టు వ్యాపారులను బాధించి సరకులపె 
సుంకాలు లాగుకొ నేవారు, అందుచేత tr థీ, ౧౮౦౨ నుండి ౧౮౫౫ వరకు 
రాష్ట్రములో వ్యాపారము నశించి పోయెను.” 


“హై(_దాబాదులో మనుష్యులందరున్ను ఆయుధపాణులై, మెత్తనివారిని 
కొట్టి నరుకుచున్నారు" (కాశీయ్యాత ౩౪). షహరులో (హై దాబాదు నగరంలో) 
చంపినా అడిగే దిక్కు లేదు. బీదలు ఎ చెట్టు వేసినా వాటిఫలమును క్షేమముగా 
ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమే యళస్సుగా భావించుకొని యుండే 
లోకులు ఆనుభవింపనీయరు. సాత్విక పభుత్వము కల రాజ్యములో మెదిగిన 
వారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆ రాజ్య సందారమున్ను భయపదములుగా 
ఉందున్నవి. (కా, ౩౬) తుదిమారుగా రజాకారు లీ పెళాచిక (పదర్శనము 
చేసినది వీరాస్వామి నాటి యవస్థావరిణామమే! “నాగపూరు నివాసస్థులు కృతి 
ములు కాని హైదరాబాదు షహరువారి..లె మాటకు మునుపు ఆయుధములు వాడే 
వారు కారు.” ఉత్తరసర్కారులలో నిజాంగారి జమీందారులు చాలా దౌర్జన్యాలు 
చేసిరి. (బిల్గాంమి సంపుటం ౨ పు ౨౨) విండారీలు. మరాటీదండు డేళాన్ని 
కొల్లగొట్టుతూ ఉండను. (౨౦-౨-౩౦) 


హైదాబాదు రాష్ట్రములో (ప్రతిదినము బందిపోటు దొంగతనాలు జరుగు 

చుండెను. రోపిలా గుంపులు, దోంగ గుంపులు [గామాలను దోచుకొనుచుండెను. 

(బిల్లాంమీ ౨-౧౨౭) బందిపోటు దొంగలలో ఎక్కువ రోపాలాలే యుండిరి. 
(బి. ౨-౧౬౯) 


హైదాబాదు. రాజ్య మిట్టి దుస్థితిలో నుండుటచేత రాష్ట్రమంతటా 
వ్యాపారము _స్తంభించి వ్యవసాయము నాశనమై, పలుమారు కరువులు వచ్చి, 


(క్రీ॥ శ॥। ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 877 


జనులు ఈగ లవలె' రాలిపోతూవవ్చిరి, రాష్ట్రములోని కొన్ని కరువుల వృతాం 
తము చాలా ఘోరముగా ఉండెను. 


(కీ. శ. ౧౬౨౯-౩౦ లోని కరువులో రొ ట్టెయి స్తే కన్నబిడ్డను దానికి 
మారుగా యిచ్చువారుండిరి. జానేబనానే “ఒకరొబ్టెకు ఒక మనిషి” అని ఫార్సీలో 
అనిరి. కుక్కల మాంసమును మేకమాంసమని అమ్మి నవారుండిరి. చచ్చిన 
పాణుల యెముకలను పిండిచేసి ధాన్యము పిండిలో కలిపి అమ్మిరి. కొందరు 
మనుష్యులు ఇతర మనుష్యులను తినిరి. మరల ౧౬౫౯లో, ౧౬౮౧ లోను 
ఇమాలు సంభవించెను. (బిల్‌ ౨-౧౬-౧౭) ౧౭౦౨లో, ౧౭౧౩లో, 
౧౭౪౯లో ౧౭౮౭లో తామాలు వచ్చెను, ౧౭౬౯.౯౩ లో తెలంగాతాలో 
ఘోరషామము కలిగెను. హా దాబాదు నగరములో ౯౦౦౦౦ మంది చచ్చిరి* 
ఇండ్లలో చచ్చినవారి లెక్క లేనేలేదు. రాయచూరు జిల్లాలో ౨౦౦౦ సాలె 
వాం౦డ్డలో ౬ మంది మాత్రము క్షామానంతరము మిగిలినవారై రి, దేశమంతా 
చచ్చినవారి పురెలతో నిండెను. అందుచే దాన్ని పురైల కరువు అనిరి (బిల్‌ 
౨-౨౫), డీ. శ, ౧౮౦౪ లో మరల క్షామము కలిగెను. రూపాయికి ౬౦ 
సేర్ణమ్మే రాగులు రెండున్నర సేరు _పకారమయ్యెను. కొందరు మనిషిమాంస 
మును తినిరి బి. ౨-౨౯). మరల ౧౮౩౧లో కామము వచ్చెను. “పిడికెడు 
గింజలకు వీల్రలను తం డు లమ్ముకొనిరి. జొన్నలు రూపాయికి ౩ లేక ౪ సేర్ష 
మ్మెను. చెట్ల ఆకులను జనులు మేయదొడగిరి (బి. ౨-౨౯-౪౦). మరల 
౧౮౫౪లో మరొక కామము వచ్చెను. వీధులలో వీనుగలు నిండియుండెను. 


శామాల ఫలితముగా జనులు అప్పులపాలై రి. అఆప్పులిచ్చేవారిలో 
మార్యాడీలే ఘనులు. కాని వారికంటె “ఘోరులున్నారు. కాని అదేలనో వారి 
నెవ్వరున్నూ స్మచించరు అరబ్బులు, రోహిలాలు హై(దాబాదు రాజ్యములో 
౨౫౦ ఎండ్లనుండి జనులకు అప్పులిచ్చి |పపంచములో కని విని యెరుంగని 
వడ్డీని వసూలు చేన్తూ వచ్చినారు. ఈనాడు కూడా వారు నూటికి ౪౦౦ రూపా 
యిల వడ్డీని వసూలు చేస్తున్నారు. అప్పుల పోతులు బాకీ యియ్యకుంటే జంబి 
యాలతో పొడిచి వసూలు చేసేవారు. 


'రై తుల ధాన్యాన్ని మార్యాడీలే కొని కోఠాలలో పెట్టి, ధరలు పెంచి 


అమ్ము చుండిరి, ఆకాలములో మార్వాడీలను గూర్చి యిట్టనుచుండిరి. “ఒక 
48) 


878 ఆంధ్రుల సాంఘిక చరిత 


లోటాతో, దానికొక చిన్న (తాడుతో, ఒకకట్టు ధోవతితో నర్మదాను ఒక 
మార్వాడీ దాటి హై(దాబాదు చేరుకొనిన కొన్నేండ్తలోపల వాడు విపరీతపు 
వడ్డీ వ్యాపారమువల్ల ధనికుడి బండెడు బంగారు భదర్తీతో మార్యాడు చేరు 
చుండెను (బి. ౨-౫౬). “అరబ్బులు రాజారాం బము అను పూర్వ మంతికి 
బాకీ లిచ్చిరి. ఆతడు బాకీలు చెల్లించకపోతే అరబ్బులు ఆతన్ని చాలా ఘోర 
ముగా కష్టపెట్టగా తట్టుకొనలేక అతడు నిజాం దేవిడీలోనే దాగుకొనెను. 
(బి. ౨-౫౯): అరబ్బుల దౌర్జన్యాలు విపరీత మై పోయెను. వారు అప్పులిచ్చి 
హింసించి వసూలు చేనుకొనుచుండిరి. అప్పుల పోతులను తమ జమాదార్ల 
యిండ్లలో మూసివేసి కూడు నీశ్శియ్యక కష్టపెట్టి బాకీలు వసూలు చేసుకొను 
చుండిరి. పఠానులు, అరబ్బులు జాగీర్దారుల కప్పులిబ్చి ౮౦ లక్షల ఆదాయం 
కల జాగీర్లను తమ వశములో ఉంచుకొనిరి (బి. ౨-౧౧౮). “పూర్వం కోర్టులు 
లేకుండెను. కోమట్లకు వ్యాపారులకు అప్పులు రాకుంటే వారు రోహిలాలను 
అరబ్బులను పంపేవారు. వారు జంబీయాలతో వసూలు చేసియో లేక సామాను 
లను లాగుకొనియో వచ్చుచుండిరి. రోపిలాలు ఆరబ్బులు తమ సొంత అప్పు 
లను ఇయ్యనివారి పై బండలు మోపి వాతలు వేయుచుండిరి. బాకీ వడినవాడు 
పారిపొయ్యెటట్ట్లు కనబడితే వానిపై తమవారి నిద్దరి ముగ్గురిని కాపలా పెట్టి 
ఆ కావలి కూలీ కూడా వసూలు చేయుచుండిరి. కామిచ్చిన దాని కంటే చాలా 
యెక్కువ వసూలు చేస్తూ ఉండిరి. (బి. ౨-౧౬౩) 


జనులు తమ పిల్లలను అమ్ము కొనుచుండిరి. అట్టి వ్యాపారాన్ని tr శ 
౧౮౫౬లో నిషేధించిరి (బీ. ౨-౧౯). హైదాబాదు రాజ్యములో (కీ.శ. 
౧౮౪౮లో సహగమనమును ఆవి వేయించిరి. (బి, ౨-౫౮) 


తెలంగాణములోని భూములన్నీ గుత్త కిచ్చుచుండిరి. గుత్తేదారులు 
రై తులవద్ద ధాన్యభాగము తీసికొని సర్కారుకు రూపాయలు చెల్లించు చుండిరి. 
భూములకు నిర్ణయమగు పన్నులు లేకుండెను. దేశముఖులు, దేశ పాండ్యాలు 
పన్ను వసూలుచేయు అధికారులు. భూమిపన్నే కాక మగ్గం పన్ను, కడప 
పన్ను, కలాలి, ధన్లర్‌ పట్టి, దేడ్‌ పట్టీ, కులాలపన్ను, పెండ్లిపన్ను, తోళ్ళపన్ను, 
హట్బాజరీ (కూరగాయలు), పీనుగులపట్టి తోకపన్ను ఆదంపట్టి (హిందూ 
పారిశ్రామికులపై పన్ను) మున్నగు ౨౭ విధాల చిల్లర పన్నులను (పజల 
నుండి లాగుచుండరి. (బి. ౨-౫౩) 


bn శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు $79 


తెలంగాణములో బాలా పరిశమలుండెను. ఇంగ్లీమవారి వ్యాపారము 
మూలాన దేశమందలి ఆరాచకమువలన ౧౮౦౦.౧౮౫౦ |పాంతమున వాటి 
తీణదళ [పారంభమయెెను. వరంగల్‌ జంభానాలు, తీవాసీలు కాకతీయుల పత 
నమునాటి నుండి (పసిద్ధిగాంచినట్టివి. బిదరులో బిదరీ సామానులు బిదరుసుల్తా 
నుల కాలమునుండి వృద్ధికి వచ్చినవి. తెలంగాణము [ప్రధానముగా నూలుబట్టలకు 
[పపంచ (ప్రభ్యాతి గన్నట్టిది. మార్కొపోలో ర్ముదమదేవి కాలములోని సన్నని 
బట్టలను జూచి అవి సాలెపురుగుల దారాలా అని భమపడెను. 


వరంగల్‌ తివాసీలను, జంభాణాలను ౧౮౫౧లో ఇంగ్లండుకు [పదర్శ 
నార్థ మంపిరి, ఇనుమును కరిగించి ఇనుపవస్తువులను చేయుచుండిరి. వరంగల్‌, 
కూన సము[దము, దిందు ర్హి, కొమరపల్లి, నిర్మల్‌, జగిత్యాల, అనంతగిరి, 
లింగంపల్లి, నిజామాబాదు మున్నగు స్థలములలో ఈ పనులు జరుగుచుండెను, 
నిర్మలవద్ద నుండు కూన సముదములో శేష్టమైన ఉక్కును సిద్ధము చేస్తూ 
వుండిరి. ఎల్లందల్‌ ఇ|బహీం పట్టణము, కొనాపూరు, చింతల పేట మున్నగు 
స్థలాలలోను మంచి ఉక్కు సిద్ధమగుచుండెను. కూన సము[దము ఉక్కువంటి 
దానిని పర్ష్యాలో చేయుటకు చాలా [ప్రయత్నము చేసి ఏఫలులైరి, కత్తులను 
హై(దాబాదు, గద్వాల, వనపర్తి కొల్లాపురములలో ౧౮౯౦ వరకు కూడా 
విశేషముగా తయారు చేయుచుండిరి, ౫ రూ, మొదలు ౧౫ రూ. వరకు 
వాటి నమ్ముచుండిరి. బంగారు నీరు పోసిన కతులు ఖమ్మములోని జగదేవ 
పూరులో తయారగుచుండెను. గద్వాలలో తుపాకీలు కూడా సిద్ధము చేస్తుండిరి. 
రోహిలాలు పటే పెద్ద తుపాకీలను వనపర్తి, గద్వాల, నిర్మలలో చేసిరి. 
౨౦ రూ. నుండి ౬౦ రూ. వర కమ్ముతూవుండిరి. నూలు, పట్టు కలిపి నేసిన 
మషూ అను బట్టలను “హె(దాబాదులో గద్వాలలో నేసిరి. టస్సర్‌ పట్టుబట్టలను 
వరంగల్‌, నారాయణపేట, మట్వాడా, హసన్‌పర్తి, కరీంనగరు జిల్లాలోని 
మాధాపరంలో నేయుచుండిరి. ఇందూరు(నిజామాబాదు), మెదక్కు హై(దాబాదు 
లోను, మహబూబు నగరుకు ౧౦ మైళ్ళ దూరములోనున్న కోయిల కొండలోను 
కాగితములు సిద్ధము చేయుచుండిరి, (బీల్లా?మి సం॥ ౧ పు॥ 8౯౫-౪౨౫) 


కడప జిల్లాలో దువ్వూరు అను [గామము కలదు. 'దువ్యూరు' మొదలు 
కొని (పతి (గామమందున్ను కొండకరమల వాండ్లు ఇనుప రాళ్ళతో 
ఇనుము చేయుచున్నారు. (కా యా ౬) గుంటూరు జిల్లాలో చేరిన వేటపాలె 


880 ఆం|ధుల సాంఘీక చరిత 


ములో “౧౦౦౦ నేతగాండ్లుండిరి. తోపు ఇల్లాలు, రుమాలా తానులు, చీరలు 
వగైె రాలు నేసి అనేక దేళాలకు వుపయోగ మయ్యేటట్టు చేసి జీవించుచున్నారు.” 
(కా ౩౫౫) బాలకొండలో (వేములవాడ వద్ద) “మేనాసవారలు గంజీఫాబీట్లు 
ఇవి మొదలై నవి చేసి హైదరాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. ఈ 
యూరిలో జీని గెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.” (కొ. ౪౬) 
“నిర్మల పంచపాతలు ఈ పాంతములో బహు (పసిద్ధిగా నున్నవి. నిండా 
కంచర యిండ్లున్నవి. (కా. ౫౦) 


అప్పటి జనుల ఆచార వ్యవహారాలు కోన్ని వీరాస్వామి యిట్లు తెలిపి 
నాడు. “హైదరాబ్లాదులో గొప్పవారందరున్నూ పండుటాకులు (తమలపాకులు) 
వేసుకొనుచున్నారు. బాలకొండలో పండుటాకులు దొరకును. కడప మొదలుగా 
గోదావరీ తీరమువరకు (నిజామాబాదుకు ఉ త్తరములో) అమ్మే వక్కలు ముడి 
వక్కలు, ఈ దేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు, 
వక్కలు మాత్రము నములుతారు. పహూదులచేతి హుక్కాలు ఇతరులు తాగు 
చున్నారు.” (కొ. ౪౮) హైదరాబాదులో పండ్లు దొరకును. కాని “చెన్న పట్ట 
ణము కంటే మూడింతల వెల యివ్వువలసినది. కూరగాయలు ఆ (పకారమె 
(వీయమైనా మహో రుచికరముగా నున్నవి, (కొ. ౩౪) “కూరగాయల రుచికి 
హైదరాబాదు సమముగా యీవరకు నేనుచూచిన భూమిలో యేదిన్నీ కూడ 
చెప్పలేదు. (కా. ౨౭౪) 


ఆ కాలమున హిందూదేవాలయముల యుక్మయు, హిందూమతము 
యొక్కయు స్థితి కోచనీయముగా ఉండినది. హిందువులలో కులాల తత్త్వము 
వెరి రూపాల దాల్బను. మదాసులోని కులకక్షీలను గూర్చి యిట్లు కాశీ 
యాత్రలో తెలిపినాడు. "అప్పట్లో అనేక తెగలు దేశముల నుంచి యక్కడికి 
వచ్చి చేరినందున యెడమచెయ్యికక్ని అని, కుడి చెయ్యి కక్షి అని రెండు పక్ష 
లుగా యక్షడివాడు చీలి యింగ్లీషువారికి చాలాశమను కలుగ జేసిరి.' (3౩౭౦) 
దేవాలయాల ఆదాయాన్ని ఇంగ్నీమ వారున్ను నవాబులున్నూ తాము పాలించే 
|పదేశాలలో తీసుకొంటూ ఉండిరి, వెంక టేళ్వరునికి పార్థనలు చెల్లంచే లోకుల 
వలన కుంఫిణీవారికి సాలుకు సుమారు లక్షరూపాయలు వచ్చు చున్నవి. కొండమీద 
యే ధర్మకార్యము చేసుకొనుటకున్ను సర్హారుకు రూకలియ్యవలెను.” (కా. ౪) 
“అహోదిలములో ఉత్సవకాలమందు ౪౦౦ వరహాలు హోాళ్ళీలు ఆగుచున్నవి. 


bu శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు $881 


వాటినంతా కందనూరు నవాబు పుచ్చుకొని వెనగ గుళ్ళసంగతినే విచారింపడుం 
[కా.౧౦] “తీశై లయా(తకు తీసే హాళ్ళీలు కందనూరు నవాబుకు చేరుచున్నది. 
(కా.౧౩) 'ఆగుడి వోళ్ళీలు మూలకముగ్గా సంవత్సరము ౧ కి ౧౮౦౦౦ కండ 
నూరు నవాబుకు వచ్చినా గుడి యేగతి పొందేఏన్ని పచారించ డు,(కా. చిం). 


హైదరాబాదు 'షహరు చుట్టున్నూ చిన్న తిప్పలుక్నవి. అనేక తిప్పల 

కొనలయందు మశీదులు కట్టబడియున్నపి. హిందూ దేవాలయములు లేవ. అవి 
న ఖ్‌ 

యున్నా వృద్ధికి రానియ్యరు, (కా. ౩౫) 


“ఇందలవాలు అను ఠామస్థలము చేరినాను, [కామారెడ్డి దాటిన తర్వాత 
ఇందల్వాయ వచ్చును.! ఈ తురకల రాజ్యమందు ఈ స్థఃము కుంపటిలో 
తామర మొలచినట్టున్నచది. తిరుపతి వదలిన వెనక రాజోవచారములతో ఆరాధన 
చడిచేగుడి యిది యొకటే చూచినాను, నా విచారణతో నున్ను వేరే లేవని 
తెలిసినది. (కా. ౪౩) 


ఈ పధముగా ఇంగ్లీషవారి యొక్టయు, కర్నూలు నవాబుల యొక యు 
హై|దాబాడు నవాబుల యొక యు పరిపాలనలో ఆంధ దశమందలి హిందూ 
మతమునకు వీణదళ సం|ప్రా పించి యుండెను, దాని కనుగుణ్యముగా హిందు 
వులలో కులంతప్పులు, ఎచ్చు తచ్చులు, కొత్త కొత్త ఆచారాలు, ఆంక్షలు 
కొల్లలుగా పెరిగిపోయెను, జనులకు మత బోధ చేయు పీఠాధిపతు లేమూల 
నుండిరో యేమో? ఆచార్య తయము తర్వాత వారి పీఠాల'పై ఎభాజమామ 
లగుచూ వచ్చిన పీఠాధిపతుల స్మరణ యెచ్చటను కానరాదు, అట్టి అంధకార 
ములో తత్వాలు బోధించే కొందరు భక్తులు మాత్రము తమకు చేతనైనంత 
సంస్రారము చేస్తూవచ్చిరి. మస సమీజు కాలములో (బహ్మాసందయోగి, కంబ 
గిరి, ఇర్యదపీఠి |బహ్మన్న, చిత్తూరు నరసింహదాసు, వఠనారాయణదాను, 
పరశురామ నరసింహదాసు, ఆది కేళవులు, వీరాస్వామి, శివయోగి, తోటగజేం 
(దుడు, అంగప్ప మున్నగువారు పామరజనులలో మత పచారము చాలా చేసిరి. 


కర్నూలు నవాబులు మతావేశపరులై చాలా దేవాలయాలను మసీదులుగా 
మార్చిరి. కర్నూలులోనే పెద్ద దేవాలయాలు పెద్ద మసీమలయ్యెను. కొందర్‌ 
హిందువులను తురకలనుగా జేసిరి. మహారాష్ట్ర దేశములో శివాజీకాలములో 
ముసల్మానులైన పలువురి హిందువులను శుద్ధిచేసి మరల హిందువురినుగా 


$82 ఆం(ధుల సాంఘిక చరి [త 


జేసిరి, (కః ళజ ౧౭౫౬. లో కర్నూలు జిల్లాలోని ప త్తికొండను బసాలత్‌ 
జంగు అను నవాబు చిన్న తిమ్మన్న అనునతనికి జాగీరుగా నిచ్చెను. అతడు 
పైకము చెల్లించలేక తన భార్యను పిల్లలను జామీనులుగా బసాలత్‌ జంగువద్ద 
వదిలెను. బసాలత్‌ జంగు ఆ త్రీని పల్ల లను బలవంతముగా ముసల్మానులచేత 
వండించిన అన్నమును తినివీంచెను. ఆ సంగతిని పీష్వాతో చెప్పుకొనగా వారిని 
విడిపించి శుద్ధి చేయించెను. కాని వాసప్పఆను పిల్పవాన్ని మా(తము బసాలత్‌ 
జంగు భార్య వదలక తురకనుచేసి రహ్మతలీభా అను పేరు పెట్టి తనకొడుకుకు 
దివానుగా చేసెను (కర్నూల్‌ మాన్యుయల్‌). 


ఇస్తాం మతవ్యా ప్రి తగ్గుతూవచ్చెను. కెంస్తవ మతవ్యా ప్రీ 'పాచ్చుతూ 
వచ్చెను. కై) స్తవులు ముసల్మానులవలె క త్తితోకాని తుదకు తుపాకీతో కాని 
మత|పచారము చేయలేదు. కాని వారు బహువిధోపాయముల నవలంబించిరి, 
కై) స్తవమిషనుల నేర్పాటుచేసి “ఫాదిరీలను [126% ] నియమించి మత 
ప్రచారము చేసిరి. ఆ ఫాదిరీలు భారతదేశమం దన్ని [పాంతాలలో వ్యావీంచు 
కొని తాముండు (పొంతీయభాషను నేర్చుకొని తమ బైబిలును అన్ని దేశీ భాషల 
లోనికి అనువదించి ముదించి ఉచితముగా పంచి పెట్టిరి. వారు ఖిల్లు, సంతాల్‌, 
ముండా, గోండు కోయ, సవర, తోడ, నాగ, చెంచు మున్నగు ఆటవికు 
లందును నివసించి వారి భాషలు నేర్చుకొని _పచారముచేసిరి. ఆటవికభాషలకు 
వ్యాకరణాలు, వాచకాలు వారు [వాసి ఆ భాషల నుద్ధరించిరి. 


మిషినరీలు మొదటినుండియు హిందువులను వారి మఠాన్ని, వారి 
ఆచారాలను దూషించి ద్యుష్పబారముచేసి ఆపకీర్తిపాలు చేస్తూవచ్చినారు. 
హిందువుల కులాలనుండి ముఖ్యముగా అంటరానితనమును౦డి వారు చాలా 
లాభము పొందిరి. లత్షలకొలది అసృళ్యవర్గాలను తమమతములో కలుపు 
కొనిరి, అందేతప్పును కానరాదు. హిందువులు అంటరాని తనమును నెలకొల్పి 
తమకాళ్ళను తామే నరుకుకొన్నవారు. ఆ పాప ఫలితము నింకా అనుభవిస్తు 
న్నారు. కాని కై) స్తవ మత (పచారకులు హిందువులలో నాగరికతలేదని, వారు 
దయ్యాలను మంత్రాలను ఆళయించిరని, వారి స్రీలు బానిసలని, శికహంత 
కులని మూర్భ విశ్వాసాలతో నిండినారని, వారి మతమంతయు నిస్పార మైనదని 
। వాసి [ప్రచారముచేసి అపచారము చేసిరి. మెకాలేవంటి మహా మేధావి హిందూ 
వేదాలు ఈసస్‌ కథలకు సరిరావనెను, కట్టి వాతావరణములో రాజా రాను 


శ్రీః; ళ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 888 


మోహన రాయలు బయలుదేరి (బ్రహ్మ సమాజస్థాపనముచేసి హిందూ సాం[ప 
యములలో జొరబడిన దురాచారాలను సంస్కరింప బూనెను. అంతకుముందే 
రామదాసు, కవీరు. గురుగోవిందు, మున్నగు వారు సంస్క రణలు (పవేళ పెట్టి 
యుండిరి. వేమన, వీర|బహ్మము, యాగంటయ్య, మున్నగు యోగులు తెనుగు 
దేశమందు దురాచారాలను కులాలను, విభేదాలను, త్రీ వముగా ఖండించిరి. కాని 
పీఠాధిపతులుమత మెన్నడును సంస్క రణవిధాన మవలంబించినట్లు [క్రీ శ. 
౧౫౦౦ నుండి నేటివరకు ఈ ౫౦౦ ఏండ్లలో మనకు చరిితలో నిదర్శనాలు 
కానవచ్చుటలేదు. 


అరాచక ము 


మొగలాయి స్నామాజ్యము తటాలున కూలిపోయెను, నామకార్థప్పు 
చ(కవర్తిని మాహాదజీ సింధియను ఆ కాలపు పీరాధివీరుడు ఇంచుమించు తన 
బందీగా నుంచుకొని హిందూ సామాజ్యమును ఢిల్లీలో పతిష్టావించెను, ఆది 
కొలదికాలమువర కే ! కాని స్థావించినాడు ! అంతలో ఇంగ్లీషు వారి విజృంభణము 
శరవేగముగా పెకి వచ్చెను. బెంగాలు, బీహారు, మదాసు, ఒరిస్పాభాగాల 
నాకమించుకొని మరాటిలను కూడా ఓడించిరి. మహారాష్ట్రా గనాయకుడగు 
మాహాదజీ సింధియా ఇంగ్లీషువారి యుద్ధతంతంమును బాగుగా గుర్తించి 
పూర్వపు మొగలాయి విధానాన్ని తన సేనమండి తొలగించి పూర్తిగా 
యూరోపు విధానాన్నే డీబాయిన్‌ అను (ఫెంచి సేనాని శిక్షణములోనే స్థావించి 
(పబలుడయ్యెను, కాని అంతలోనే ౧౭౯౪ లో సింధియా మరణించెను. 
మహారాష్ట్రంలలో కక్షలు, కలహాలు, కలతలు హెచ్చెను. వారిది దోపిడిరాజ్యమే 
కాని సురాజ్య మెన్నడునూ కాదు, అందుచేత (పజావలంబనము లేకుండెను. 
వారు రాజపుతులతో సఖ్యముచేయుటకుమారు వారిని బాధించి ఓడించి 
తామును దుర్చలులయిరి. ఈ పొరపాట్లచే వారు రంగమునుండి ౧౮౧౩ 
తర్వాత మాయమైరి. మహారాష్ట్ర) సేనలోని వారు పలువురు తమ పూర్యమర్యా 
దను మరువజాలక పిండారీలుగా మారి దేశమును దోచిరి, పిండారీలఘాటు 
తెలంగాణము పైనను రాయలసీమ పైనన్తు ఉత్తర సర్కా రుల పైనను సమాన 
ముగా పడెను. వారు ౨౧౦ నుండి ౫౦౦౦ వరకు గుంపుగా బయలుదేరి, 
(గామాలు ధ్వంసము చేసి దోచుతూ పోయెడివారు. వారు గురాలమీద సవారి 
చేసి అతివేగముగా (గామాలమీద పడేవరకు జనులకు వారిరాక తెలియకుండె 


984 ఆం(ధుల సాంఘిక చరిత 


డిది. వారికి ముల్లిమూటల చీదార ముండకుండెను. సులభముగా తీసుకొని 
పోగలిగిన విలువగల వస్తువుల నన్నింటిని లాగుకొనెడివారు. వానకాలపు కారు 
లందలి వానలవలె వారు వో ఏటేట (గ్రామాలకు దర్శనమిచ్చి పొయ్యే 
వారు. పంటలు కోతల కెప్పుడు సిద్దమయ్యేది రైతులకంటే ముందుగా పిండారీ 
లకే గుర్తు. కాన వారు తీరా కోతసమయానికి _పత్యతమై ధాన్యము నున్నగా 
ఊడ్చుకొని పోయెడివారు. 


ఇంగ్లీషువారు బెంగాలు వీహారులను దోచుకొనుటలో నిమగ్నులై యుండిరి. 
తమ భాగాలలోనికి పిండారీలు రానంతవరకు వారికి చీమకుట్టినట్లు కాలేదు, 
అందుచేత విండారీలు ఇంచుమించు ౫౦ ఎండ్లవరకు నివాఘాటముగా తమ 
ఉద్యమమును సాగించిరి, ఆప్పుడు [పజలే తమకు తోచినట్లు ఆత్మరక్షణము 
చేసికొనిరి. తెనుగు దేశములోని చాలా (గామాలలో [గామస్వరూపము మారి 
పోయిను. [గొమాలకు నాలుగు దిక్కులా బురుజులను కట్టి వాటికి మధ్య పెద్ద 
గోడలను నిర్మించి ఊరవాకిలి పెద్దగ వని తలుపులతో గడ|మానితో నిర్మించిరి. 
చీకటి పడీ పడక మునుపే తముకువేసి ఊర వాకీండ్లు బంధించేవారు,. అచ్చట 
తలార్లు బేగారీలు సేత్సందీలు కావలి కాసేవారు. కాని పిండారీలు పగలే వచ్చే 
వారు, అందుచేత బురుజులపై మచ్చెలువేసి కావలికాసి దూరాన దుమ్మురేగుట 
కానరాగానే నగారా వాయించి పొలాలలోనుండు జనులను [గామాలలోనికి 
రప్పించి ఊరవాకీలి బంధించి జనులు బురుజులపై గోడల పె నెక్కి యుద్దానికి 
సిదపడేవారు. 


థి 

*వ్సిండ్రారీల సెన్యము ౧౮౧౪లో ౨౦౦౦౦ గుర పుదళము, ౧౫౦౦౦ 
కొల్చలము, ౧౮ తోపులు క లద య్యను. ౧౮౧౬లో వారు ఉతర సర్కారు 
లలో సగము భాగములో పదకొండున్నర దినాలపాటు ౩౩౯ [గామాలు 
దోచిరి. ఆ రేడు వేలమందిని చచ్చుదెబ్బలుకొట్టి, దాచిన ధనము జాడలు 
తెలుసుకొనిరి. వారిదెబ్బ ఎక్కువగా గుంటూరు జిల్లాపె బడెను. వారి ఘోరా 
లకు తాళలేక నూర్గకొలది జనులు తమ ఆలువిల్లలతో సహో తమగుడిసెల నంటు 
బెట్టి అగ్నిలో పడి చచ్చిరి, అదు తప్పించుకొన్న కొందరి బాలుర వల్ల ఈ 
వార్తలు ఇంగ్నీమ కంపెనీ సర్కారుకు తెలియవచ్చెను. నూర్గకొలది న్రీలను 
విండారీలు చెరచగా వారు అవమానాన్ని భరింపలేక బావులలో పడి చచ్చిరి. 


(కీ॥ శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 885 


యువతులను ముగ్గురి నల్లురి కలగట్టి మూటలవలె తమ గురాలవై వేసి బానిస 
లుగా అమ్ముకొనుటకు తీసికొని పోయిరి.” (R.-Williams P. 141-43.) 


పిండారీలు స్త్రీలను వారి భర్తలయెదుటనే చెరిచెడివారు. తాము తీసుకొని 
పోజాలని వస్తువులనైన వదలక వాటిని ధ్ర్వంశముచేసీ పోయెడివారు. ధనము 
దాచిన తావులు చూపనివారిముఖొనికి ఉడుకుడుకు బూడిదను సంచులలో నింపి 
కట్టి వీప్పన (గుద్ది ఆ బూడిద వారినోళ్ళలో ముక్కు లలోపోసి ఊపిరి తిరుగకుండు 
నట్లు చే సెడివారు. తర్వాత వారు చాలాకాలము |[బదుక కుండిరి. జనులను వెల 
కిల పండబెట్టి ఎదలవై పెద్దపలకలబెట్టీ వాటిపై జనులచే _తొక్కించెడివారు. 
ఇట్టి అమానుషకృత్యా లెన్నో చేసిరి. పిండారీలలో మరాటి లెక్కు వై నను వారితో 
బాటు మొగల్‌ రాజ్య సేనాభిప్పులును, దోపిడీల రుచి గొన్నవారును నగు 
ముసల్మానులు పెక్కుండిరి. వారి స్రీలు వారివెంట నుండిరి. హిందూ న్ర్రీలవలె 
వేషాలు వేసుకొని హిందూ దేవతలనే కొలిచెడివారు. [బహుశా వారు పూర్వము 
హిందువులై బలవంతముగా ఇస్లాం మతము పుచ్చుకొన్న వారి సంతతియై 
యుందురు |. వారు సవారిచేసి బయళ్ళలో సంచరించి కర్కశ కాయలై మగంగులై 
మగవారి నెత్తి దన్నినవారైన లంకిణీలు మగవారికంటే వారే రాకాసి పనులు 
చేసి కరుణ అన్న దే కోళమందును కాసంతయు లేనివారై (ప్రజల హింసించు 
చుండినందున జనులు వారిని చూస్తే నిలువున నీర య్యేతవారు. ఈ “ఘూారాలు ఎక్కు 
వగా కంపెనీ ఇలాభాలలో కావడము చేత తుదకు హేస్టింగ్సు గవర్నరు జనరల్‌ 
౧ ౨౦,౦౦౦ సైన్యమును సమీకరించి వారిని ధ్వంసము ఒ నను 


విండారీపీడ దేశానికి తప్పెను కాని మరొక ఈతిబాధ దేశానికి తగు 
లొనెను. ఆది థగుల బాధ. తెకుగులో టక్కు, టక్కరి ఆన్న పదము 
కలదు. “వట్టుకొని చాగర గొన్న బలే యెరుంగు, టక్కరి, బలుమోపు మోచు 
నయగారితనం బది యుట్టి గట్టినన్‌ ” ఆని ౧౩౦౦ [పాంతమందుండిన నాచన 
సోమన వాడెను, ఠగ్‌, లేక మరాటీఠక్‌ అను పదాలకు మన టక్కుకు టక్కు 
రికి యేమైన సంబంధముండునా! థగ్గు వృ త్తిచర్చ కీస్తుశకము ౧౩వ శతాబ్దము 
లోని ఫీరోజు ఖిల్జీ ఢిల్లీ సులానుల కాలమందు కలదు. అతడొకమారు ౧౦౦౦ 
మంది ఠగ్గుల శిక్షించెను. అనగా ఆంతకంటే పూర్వము నుండియే యీ విధాన 
ముండినది. ఆది మన సమీక్ష కాలపు అరాచక స్థితిలో విజృంభించెను. ఆందు 
తురకలునూ ఉండిరి. ఆందరును కాళీ పూజకులే. సంఘములో చేరు వారికి దీక్ష 

(49) 


858 ఆం[ధుల సాంఘిక చరిత 


యిచ్చెడివారు, వారిలో సంకేతము లుండెను. వారు నానా వేషాలతో బాటసారు 
లలో కలిసి వెళ్ళి వారిని చంవి దోచేవారు. వారి ఆయుధము రెండు మూరల 
దస్తీబట్టయే. దాని నొక మూల ముడివేసి మనిషి గొంతులో వేసి లాగి ఊపి 
రాడకుండా గుటుక్కు. మనునట్లు చంపేవారు. ఆ [కీయ యంతయు రెండు 
తణాలలోనే ముగిసేది. వారిలో నివాముద్దీన్‌ జౌలియా అనే పసిద్ధ భక్త 
ఫకీరు కూడా ౧౪౦౦ [పాంతములో చేరి యుండెను. వారికి ధనికులు జమీం 
దారులు ఆశ్రయమిచ్చి వారు తెచ్చినదానిలో భాగము పొందిరి. అట్టి ఠగ్గులు 
ఉత్తర హిందూస్థానములో అధికముగా నుండినను వారి బాధ రాయల సీమలో 
కొంతవరకు, హై|దాబాదు రాజ్యనులో చాలావర కుండికు. హై దాబాదు 
నగరములోని కారవాన్‌ సరే, చెన్నరాయని గుట్ట, షాలీబండా పాంతాలలో 
వారు నివసించి పయాణీకుల వెంటనంటి చంపేశారు. నిజామాబాదు, ఆదిలా 
బాదు |పాంతాలలో వారు మరీ హెచ్చుగా నుండిరి, వారి చరిత వివరాలను 
మెడోస్‌ మెయిలర్‌ [ Canfessions ofa Thug | _వాసెను. అమీరలీ అను 
వాడు ౭౧౯ మందిని చంపి యుండెక5నియి వాడు ఠగ్గులలో అ గనాయకుడసనీ 
అతడు [వాసెను. తుదకు “ఠగ్గీ' స్టిమన్‌ అను బిరుదము పొందిన స్టీమన్‌ ఆను 
ఇంగ్లీషు అధికారి ౧౮౩౧ ను౦డి ౧౮౩౭ వరకు (పత్యేక ఠగ్గు విచారణ క్రర్తయయె 
3౩౨౬౬ థగ్గులను పట్టి వారిలో చాలామందిని ఉరికంబ మెక్కించి దెళాన్ని 
వాది నుండి రచించెను. 


బందిపోటు దొంగతనా లెక్కువగా పెరిగిపోయెను. తెలంగాణములో 
ఆరబ్బులు, రోహలాలు నిరంతర మీ పనిలోనే యుండిరి. [ఆ వివరాలకై 
బిల్లామీ [గంథము చూడదగినది. | 


పంచాయతీల విధ్వంసము 


రాజ్యాలు నాశనం కాన్కీ సా్కామాజ్యాలు మారనీ, రాజవంశాలు ధ్వంసము 
కాన్కీ కొత్త వంశాలు రాజ్యానికి రానీ లేశమాతమైస వాటిముచ్చట |గామాలకు 
కాబట్టకుండెను, తమ పంచాయతీ రాజ్యము చల్ల గానుంచే అదే మనపూర్వులకు 
పదివేలు. అదే వారికి శ్రీరామ రక్ష. ఆదే వారి రామరాజ్యం. పంచాయతీ 
రీర్పులలో కొన్ని మార్పుల న్యాయాలుండెను. అట్లు లేకుండిన పంచాయతీ రాజ్య 
మునకు వైకుంఠానికి భేదముండదు గదా! లోపములేని మానవసృష్టి యుండునా? 


(క్రీ॥ శో ౧౭౫౭ నుండీ ౧౮౫౭ వరకు 837 


కాని అవి ఇంగ్లీషు వారి కోర్దులకంచే అక్షరాలా వేయింతలు మేలై నవి, 
దక్షిణములో గమిళ రాజ్యములోను ఏటేట ప:.చాయతీ పెద్దల యెన్నికలు 
జరిగెను. ఆ పెద్దలు సివిల్‌ కీమిసల్‌ | ధనోద్భవ, హింసోద్భవ | ఆఅధియోగా 
లను విచారి చిరి. పన్నుల వసూలు, (గామపారిశుద్ధ;ము, విద్య, ఆరోగ్యము, 
దేవతా నిలయములను స తాలను సాగించుట మున్న గునవన్నియు వారి ఆధీనమే. 
ఇంగ్లీషువారు మనదేశమను గెలిచి మనము అనాగరికులమని మకు సభ్యతయే 
లేదని, మన మతము ఆటవిక మతమనీ, మన విద్యలు చెత్తలనీ 
భావించిరి. పెగా కమ ఆచారాలు, తమ విధానాలు, తమ విధ్యలు, తమ ఆధి 
క్యత మనపై మోపుటకు నిశ్చయించిరి. అందుచేత మన పంచాయతీలను 
తొలగించి తమ అదాలతులను, సదవరదాలతులను, దీవానీలశు, తర్వాత కోరు 
లను స్థావీంచిర. స్తాంపు, ఫీసు, ముడుపులు, సాక్షులభత్యాలు కోరులకు 
(ప్రయాణాలు, అ పమాణాలు, వకీళ్ళ తర్కాలు, కుత, లు. వితండవాదాలు, 
భానూనుల పేచీలు బారీకులు, అన్నియు _పబలెను. పంచాయతీలతో నే మన 
పూర్వధర్మాలుహడా మాయమయను. పూర్వము హింసలు అపరాధములు 
చేసిన (గామమందే విచారణ జరిగెను, కాన అబద్ధాలకు కూ టసాక్ష్యాలకు వీలు 
తక్కువగా నుండెను. ఆ సమాజము చేయుట వంశనాశన హేతువని జనులు 
భయపడెడివారు. పంచాయతీ పెద్దలును ధర్మాసనమందు కూర్చుని ధర్మముగా 
తీర్పులు చెప్పిరి. అవన్నియు కోర్టులద్వారా ధ్వంసమయ్యెను. ఇప్పుడు మరల 
పంచాయితీలను అడ్డాడిడ్డిగా ఉద్ధరింప జూస్తున్నారు. కాని జాతిలోనే సంపూర్ణ 
మగు మార్పు వచ్చినందున వాటికి జయము కలుగునన్న ఆశ తక్కువేం 


ఆదే విధముగా జమీందారీ విధానమువల్ల, రైతువారీ విధానము వల్ల 
[గామసొముదాయిక వ్యవసాయ సంఘాలు | Village Communities | నాళన 
మయ్యెను. ఈ వివరములను మెయిన్‌ అను ఇంగ్లీషు (గంథక ర్త | Village 
Communities in Ancient India | అను [గంథమంగు చాలా విరివిగా 


[వా సెను, 


తెలంగాణములోను మరాట్వాడాలోను (ప్రభుత్వము |గామాలను పట్టీ 
లుగా కూర్చి వాటి భూమి పన్నును గుతేదారులకు వేలం వేసిరి. అట్టి గుత్తా 
లలోనే వనపరర్హివంటి సంస్థానా లేర్పడెను. తర్వాత సర్‌ సాలార్జంగు కాలములో 
[ఇంచుమించు ౧౮౪౦ ప్రాంతములో | బిల్లా బందీ యేర్చడెను. 


$88 అంధుల సాంఘీక చరిత 


ఈ కాలములో ఆం|ధ చ్మితకళ తన (ప్రత్యేకతను గోల్పోయెను. మనకు 
(ప్రాచీనుల చి(తాలు లభించలేదు. లేపాక్షిలోని కుడ్యచ్చితాలు కొన్ని మా|తము 
శిథిలావస్థలో ఇటీవల బయలుపడినవి. అవి చాలా సుందరమైనవి. వాటిలో విశిష్ట 
తయు [పత్యేకతయు కలదు. విజయనగర కాకతీయ చితాలు ముసల్మానుల 
విధ్యంసన |క్రియవల్ల మనకు లభ్యము కాకపోయెను. వేమన కాలములో చిత 
కారులు “ఇంగిలీక మహిమ హేమింపనేరకొ ఇంగిలికాన్ని రంగులకు వాడిరి, 
(పాచీన చితకారుల పేర్లు కాని శిల్పాచార్యుల పేర్లుకాని మనకు తెలియవు. 
చి తకారుల వంశములు తీణిన్తూ ఈ సమీశాకాలములో మిగిలిన జమీందారుల 
న్మాశయించెను. మొగల్‌ చితకళా విధానమే భారతదేశ మంతటను వ్యాపించెను. 
తెనుగు చ్నితకారులును దానినే అనుసరించిరి. రెండవ నిజాం దర్చారును బంగారు 
నీరుతో నానావర్ణములతో అతిసుందరముగా “వేంకటయ్య” అను చితకారు డీ 
కాలమందే చి[తించెను. దాని మూల(పతి నవాబ్‌ సాలార్భంగు బహద్దరుగారివద్ద 
కలదు. దానినే పిక్టోరియల్‌ హెదరాబాదు అను దానిలో మ్యుదించిరి. ఆ 
పటము మీద వెంకటప్పయ్య రచన అని మాతమున్నది. పేరునుబట్టి అతడు 
న్పష్టముగా ఆం,ధుడే, ఇదే సమీకాకాల మందు కర్నూలు నవాబుల నాళ 
యించిన కొందరాం[ధ చితకారుల వంకాలు౦డెను. వారి చి.తాలను జూచి ఆ 
కళకు కర్నూలు కళ (Kurnool School of Painting) అని కొంద రాధునిక 
నిష్పణులు పేరుపెట్టిరి. కర్నూలు నవాబుల పతనం ౧౮౩౫ తో పూర్తి 
ఆయ్యెను. దానితో ఆ చి తకారుల పతనమున్నూ జరిగెను గద్వాలలో 
సోమన్నాచి అను మహావీరుడు ౧౭౬౦ (ప్రాంతములో నుండెను, ఆతని చి త్తరు 
వులు అతని తర్వాతివారి చి తములు ౫౦ ఏ:డ్డ (కిందటి వరకు గద్వాలలోని 
చిత్రకారుల వంశమువారు రచించిరి, వారు గద్దయీకల మూలములలో ఉడుత 
తోక వెం[టుకలను కుచ్చుగా కట్టి, సన్నని చిత్రరేఖలను వాటితో తీర్చెడివారు. 
౨౦౦ ఏండ్ల (కిందట గద్వాలలో కట్టిన కేశవాలయములోని ఒక గోడపై గచ్చు 
చేసి దానిపై పురాణ చితములను [వాసినారు. కాని ఎషరమన్ను సున్నమే తమ 
ముఖ్య వర్ణములుగాగల తర్వాతి దేవాలయాధికారులు వాటిలో కొంత భాగాన్ని 
సున్నమపూసి చెరిచినారు. చాలా ప్రాంతాలలో పూర్వపు చిత్తరువులపె 
శిల్చములపై గచ్చుమెత్తి ఎరమన్ను సున్నము పభ్రైలు పెట్టట కానవస్తున్నది. 
గద్వాల సంస్థానము వారు ౨౫౦ ఏండ్డ [కిందట సంస్కృృతలిపిలో భారతోద్యోగ 
పర్వాన్ని (వాయించి, ఆ్య|గంథము నిండుగా చిత్తరువులు [వాయించి నారు. 


శీ; శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 889 


(ఆ (పతి యిప్పుడు రెడ్డిహాస్టలులో కలదు) అవి సుందరముగా నే యున్న వి. 
కాని ఫీష్యడు జౌరంగజేబువలె, ధర్మరాజు అకృరువలె, భీముడు మాహాదశీ 
సింధియావలె, |దౌపది ముమ్తాజ్‌ బేగంవలె, గాంధారి అహల్యాబాయివలి 
ఉన్నారు. అనగా అంతా మొగలాయిలే! పెద్దాపుకము సంస్థానములోని కొన్ని 
చితరుపుల నిటీవల భారతిలో _పకటించినారు. వాటిని చూచినను అదే భావన 
కలుగును. బొబ్బిలి (పసిద్ధికల సంస్థానము కదా. అందు చి తరువు లుండినచో 
(పక టించుట చాలా యవసరము. తాండ పాపారాయని చిత్తరు వుండినచో 
దాని కెంతెన విలువ యుండును, ఉత్తర సర్కారు జమీందారీలలోని 
చిత్త రువులు. | గంథాలయ విశేషాలు, పాచీరాయు వాలు, ఉడుపులు, మున్నగు 
వెట్టివో తలివీిశ దాగుంఈను హై దాబాదులోని రాజా శివరాటి బహద్బను 
సంస్థానములో సాలార్జంగు ఎస్టేటులో, వలువురాం ధుబ చాలా సుందరమగు 
చి త్తరువులను చితి నట్టు పతీతి, 3౦౦ ఎండ్రనుండి చి తిందిన చితాలు వేల 
కొలదిగా విదేశాలప పోయెను. దేవిడీలనుండి దొంగిలించిన చి తాలు హై దాబాడు 
టబుమేరాత్‌ (దొంగ) బజారుకో (ప్రతివారం ఆల్బ కయాలకే ఆమ్మె వారు, 
నేటికిని దవ్యమున్న వారు హై(దాబాదులో ౨౦౦ ఎండ్ల నాటి, ౧౦౦ ఎండ్లనాటి 
చిత్తరువులను విచ్చితశిల్ప వస్తువులను సేకరింపగలరు. ఏటి సమృద్ధిని బట్టి 
హైదాబాదులో క్రళ్ల లత్యంతముగా పోషితమె యు౨ఎడెననుట నాకయము, 
తంజావూరిలోని చిత్తరువులు కొన్ని ముదితమైనవి. ఆవి మనకు చాలా ఉపక 
రించినవి. వాటివల్లనే మనము త్యాగరాజును, వేమనను, తంజావూరి కొందరి 
రాజులను చూడగలిగినాము, 

కలంకారీ అద్దకపు సూచన పూర్వ (పకరణాలలో చేయనై నది. ఈ యడ్డ 
కము తెలుగుదేశ మంతటనూ నుండెను, కాని ఉత్తర సర్హారులలో కృషాజిల్లా 
లోను అందునూ బందరులోను వాటికి _పసిద్ధి కలిగెను. కలంకారీ అద్దకానికి 
దేశీరంగులనే గట్టిరంగులనే వాడిరి. “పె టై రంగులు జర్మనీనుండి కారుచౌకగా 
దిగుమతియైన యీ ౫౦ ఏండ్లలో మన దేశీ రంగులు తక్తిన పరిశ్రమలతో 
పాటు మాయమయ్యను* ౧౯౯౨౦ [పాంతములో సర్‌ (పపుల్ణి చం|దరాయిగారు 
దేశీరంగ్‌ అను పుస్తకమును |వాసిరి అఏిప్పు డెందరివద్ద కలదు? మన అడ్డ 
కమువారు దాని నెరుగరు. అద్దకమువారిని ఉర్జూలో రం గేజీ (రంగు వేయు 
వాడు అని యుర్ధము, ఇది ఫార్సీ పదము) అనిరి. ఆదొక కులమై, ఆదే పేరుతో 
నిలిచినది. కర్నూలులో వారి దొక వీధియే కలదు. వారినే జీన్‌గర్‌ అనిరి 


890 ఆం[ధుల సాంఘిక చరిత, 


అదియు ఉర్దూ పదమే. కొన్ని [పాంతాలలో వారినీ డఉనుపులవారు ఆనిరి, 
తెలంగాణములో రం|గేజీ వారు కొల్లలుగా కలరు. వారు పూర్వము నీలి, ఎరుపు, 
లత్తుక్క మున్నగురంగుల వాడిరి, పెగా మైకావంటి తళుకులను వాడిరి. ఈ 
తళుకులను ముసల్మాను లెకువగా పసందు చేసేవారు. ధ%కులు బంగారు వెండి 
రేకులను రంగులతోపాటు చీరల కద్దించువారు. ఉతికినను పోనట్టుగా నిపుణతతో 
వాటి నద్దువారు. ఆధునిక కాలములో పూర్వపు కథ్రైదిమ్మె లతోపాటు రాగిసీసము, 
టింకు పోతదిమ్మె లనుకూడా ఆదికముగా నారు వాడుతున్నారు. వాది రంగు 
లన్నియు నిప్పుడు విదేశీ రంగులే. 

ఈ సమీఇుకాలములో ఒక్ష హంసవింశతి తప్ప మన సాంఘిక చరి. తకు 
పనికివచ్చు (పబంధములేదు, ఉత్తమ కవిత సన్నగిల్లెను. తంజావూరుకు 
తెనుగుసీమ కవులు కళావిదులు వలసపోయిరి. కాని ఇంగ్నీ[మువారు తంజావూరును 
గూడా దిగ[మింగిరి. కవితలో ఉత్తమరచన లీకాలమందు లేకున్నను ఒక్క త్యాగ 
రాజు మాత్రము ఈ కాలమందు సంగితమున కఖండ జ్యోతిగా దక్షిణా పథ 
మందు వెలిగెను. త్యాగరాజు కీ, శ. ౧౭౫౯ నుండి ౧౮౪౭ వరకు ఇంచు 
మించు ౮౮ ఏండ్లు జీవించినవాడు, అతడు తంజావూరు జిల్లాలోనివాడు, చిన్న 
తనమందు సొంటి వెంకటర మణయ్య ఆను (పసిద్ధాయ్యధ గాయకుని వద్ధ సంగీత్ర 
మభ్యసించెను. త్యాగరాజు రామభక్తుడు. నిజమగు త్యాగి. మాధుకరముచే 
బీవించెనేగాని రాజుల పార్థనల నంగీకరించి వారి నాళ యించినవాడు కాడు, 
అతన్ని తంశావూరి మరాటారాజగు శర భోజియు,తిరువాన్యూరు రాజున్నూ తమ 
ఆస్థానాలకు రమ్మనికోరిరి. కాని “పదవి సద్భడీ" ఆనే పాట పాడి రాముని 
పాదాలే తన యాస్థానమని వారి పార్భనల నిరాకరించెను, 

ఈ సమీకాకాలనుందే కృష్టా జిల్లాలో నారాయణ తీర్గులను ఆ| శమ 
స్వీకారము చేసిన అం ధుడుండెను. ఆతడు కృష్ణలీలాతరంగిణిని సంస్కృత 
ములో రచించెను. ఆ తరంగాలు తెనుగుదేశమందే కొంత వ్యాప్రిగన్నవి. ఆతని 
పుస్తకమును తెనుగు లిపిలోనే (వావిళ్ళలో దొరకును) ముుదించిరి, నాగర 
లివిలో లేనందున దేశాంతరఖ్యాతి రాకపోయెను. అది జయదేవుని గీతగోవిండ 
మున శక్రేమా!తమున్నూ తీసిపోదు. దాని కెక్షవ ప్రచారము, కావించుట 
ఆం|ధుని ఏధి, 

ఇదే కొలమందే శేతయ్య తన పదములను వాసెను. అవి జావళీలు 
శృంగార భూయివ్టములు* దేశమందు వ్యాప్తిలో నుండినట్టివి. శ్నేత్రయ్యపదాలు 


t శ॥ ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు $91 


ముదిత మేకాని శృంగారమంటే భయపడే అధికారుల భయానికేమో దానికి 
చ్యా ప్తి కానరాడు. 


సారంగపాణి పదాలు అసునవి కలవు. సారంగపాణి రచసలను రెండు 
మూడు తావులలో 1పచురించివారు. అందుచేత పాఠ్యభదాలు వచ్చినప్‌, (నావద్ద 
నున్న ౫౦-౬౦ ఏండ్లనాటి పతి వేరుచో ము[దితమగు పతితో కొంత ఖిన్నిస్త 
న్నది) ఈ పదాలుకూడా చాలా చక్ష నివి. దక్షిణమున తంజావూరులోను మధు 
రలోను పాటల నెక్టువగా రచించిరి. ఆవంత [పళ _స్టమెనవి కాకున్నను సమ 
కూర్చదగినవి, ముద్దుపళ 3 ఆను నామ రాధికాసాంత్యన మను [పబంధము 
[వౌసెను. అండు చాలా వచ్చి శృ3గారమున్నదని శ్రీ వీరేశలిం్శముగారు నిర 
సించిరి. పచ్చిది గర్హింపదగినది. శ్రీనాథాదులలో లేని దిందు హెచ్చుగా లేదను 
కొందును. ఆమె అష్టపదులు అను పాఓఆ రచించెను. ఆందు కొన్ని శృంగార 
1గంథమండలివారు రచించిరి, కాని అన్నియు సేకరించి ముదించుట అవ 
సరము. 

అ చ్చు 


ఆచ్చును మొదట కని పెట్టినవారు చీనావారని యందురు. కాని చార్మిత 
కముగా (కీ, శ, ౧౬ వ శతాబ్దిలో ఇంగ్లండులో కాక్‌స్టన్‌ (౮౭౫0౧) అను 
వాడు కనిపెట్టినదే _పసిద్ధము. అవ్బుతో నూతన సారస్వత యుగ మారంభ 
మాయెను, మనదేశనులో ఉత్తరమున భూర్ణ ప్యతాలలోను, దక్షిణమున తాటా 
కులలోను (వానిరి. గంటము తో తాటాకులపై అక్షరాలు సొంకముగా చెక్కుట 
ఒక కళ యయ్యెను. అందుచేత అదే వృత్తిగా వాయసకాం |డెర్పడిరి. ఒక్క 
మహాభారతమును పూర్తిగా _వాయవలెశంటే ఆరుమాసాలయినా పళథ్రైది. అందు 
లకుగాను ౬ తూముల జొన్నలయినా ఖర్చయ్యే వి. ఒకొక్క. [గంథాని కీ 
విధముగా వ్యయము చేయవలెనంటే ధనిపలయినా కావలెను, లేక పండితులై 
యావజ్జీవము వ్రాసుకౌనువారై నా కావలెను. [వాయువారి యవస్థను గురించిన 
యొక లోకమును పూర్వము చాలా (గంథాలతుదిలో యిట్లు [వాసేవారు. 

భగ్న సృష్టః కట్నిగీవః స్తభ్ధ వృష్టి రథోముఖం 

కేన రివితం గంథం యత్నేన పరిపాలయేత్‌. 

ఈ నష్టకష్టాల నన్ని టిని అచు పచ్చి పోగొట్టి జనులను రక్షించినది, 
మనదేశములోనికి అచ్చు వచ్చుట కీ శ. ౧౫౭౭ లో, ఆ సంవత్సర మండు 


89 ఆం|ధుల సాంఘిక చరిత 


జెసూయిట్‌ కై సవులు మలబారులో తమ బై బిల్‌ [గంథమును మళయాళీ 
లిపిలో అచ్చువేసిరి. ౧౬౭౯ లో కొచిన్‌లో తమిళ నిఘంటువు నచ్చువేసిరి. 
తెనుగుభాషలో మొదటి అచ్చుపు స్తకముకూడా బై బిలే ఆయియుండును కాని 
మనకు తెలియదు. |కీ.శ, ౧౮౦౭లో తెనుగు వ్యాకరణ మచ్చుపడెను. ౧౮౫౬ 
లో కాళ్టైెల్‌ అను ఇంగ్లీషు పండితుడు తమిళమును అభ్యసించి *'దావిడ 
భాషల వ్యాకరణము” అను భాషా తత్వశాస్త్రమును (వాసెను, ఈనాడు 
దానిని తప్పులు పట్టువారు బహుళము, కొని ఒక విదేశిపండితుడు మన భాషల 
నేర్చుకొని వాటిని చళ్ల గా [గహించి పరిశోధించి ఒక భాషాశాస్త్రమును ౯౦ 
ఏండ్ల (కిందట [వాసెనని అతని (పజ్జ ఆతనియు వజ్ఞ శతథా |పశంసింపతగి 
నవి. ' ఇదే కాలములో |బౌన్‌ అను ఇంగ్నీషువాడు మన తెనుగులో చాలా గొప్ప 
పా౦డిత్య మును సంపాదించి ఆల్గధ నిఘంటువును, వ్యావహారిక కోశమును 
[వాసెను. (పాచ్య లిఖిత పు స్తకాగారానికి అతడే జనక స్థానీయుడు, ఆతని 
పుణ్యమా అన్నట్లు ఎన్నో ఉతమ [గంఠాలు సేకరింపబడి రక్షింపబడెను, 
అతడు మెచ్చుకొన్న [గంథము వేమన పద్యాలు, వాటిని ఇంగ్లీషమలోనికి అను 
వదించి [పకటించెను. ఇదే కాలములో మెకంజీ అను ఇంగ్లీషవాడు లోకల్‌ 
రికార్డులను (స్థానిక కై ఫీయత్తులను) ఆంధ|పాంతాలనండి సమకూర్చి 
తెప్పించి యుంచెను. అచ్చుయంతాలకు మదాసు ముఖ్యస్థానమయ్యెను. నేటికినీ 
తెను గచ్చునకు మదాసే (పసిద్ధికాంచినది, ఇదేకాలమందు గద్వాలలో, వన 
పరిలో తెను గచ్చు యంతాలు స్థావితమై [గంథాలు ముదిత మయ్యెను. ఈ 
రండు సంస్థానములలోని ఆచ్చు యం(తాలు యించుమించు ౮౦ ఎండ్ల కింద 
టివి. ఈ రెండు సంస్థానాలున్నూ తెనుగు భాషకు చాలా గొప్ప సేవజేసినవి, 

ముదణ విధానము మన సారస్వతాని కొక నూతన యుగము, దానితో 
మన భాషాభివృద్ధి విరివిగా అవుతూ వచ్చినది, కాన మన తాతల తరమువారు 
ఆచ్చుయొక్ష గొప్పతనాన్ని ఏలనో గుర్తించి స్పతించినవారు కారు* 
నస్యముపె, పొగాకుపై, నల్లిపె పద్యాలు |వాసినవారు అమృపై కొన్ని 
ఆల్లిరముం౦డరాదా? ఈ విషయాలను గురించి (శ్రీ మారేపల్లి రామచంద్రశా శ్రీ గారి 
“తెనుగు తోబుట్టువులు” అను [గంథమును, కాల్‌ డ్వెల్‌ గారి Grammar of 
‘Dravidian languages అను [గంథమును చదువవలెను. 


Eu $1 ౧౭౫౭ నుండీ ౧౮౫౭ వరకు 898 


గొప్ప మార్పులు 


ముసల్మానుల కాలములో హిందువులం౦దు మార్పు ఎకు_వగా కానరా 
లేదు. ముసల్మాను |పభువులు ఇస్లామ్‌ వ్యాప్తికి, హిందూవినాశనానికి అంద 
రున్నూ (అక్బరుతోసహా) పరి శమించినవారే, పైగా హిందువుల అభివృద్దికి 
కావలసినన్ని నిరోధాలు కాసించిరి. జహంగీరు, షాజహాన్‌, బౌరంగజేబు దేవా 
లయ నిర్మాణాలకు సెల వియ్యలేదు ముసల్మానులయినవారు తిరిగి హిందువు 
లలితే ఘోర శిక్షల నిచ్చుచు, నిరోధక ళాఫనాలు చేసిరి. జౌరంగజేబు బళ్ళను 
కూడా పెట్టుకొన నియ్యలేదు. హిందువులకు కొన్నితప్ప ఎ యుద్యోగాలున్నూ 
ఇయ్య లేదు. కావున హిందువులలో మార్పు కానరాలేదు. 

ఇంగ్నీష వారు తా మధికులమని వచ్చిరి. ఈ సమీశాకాలములో దేశీయుల 
కుదోగా లియ్యక పోయిరి. తమ ఆచార వ్యవహారాలకు మోవిరి. ఇంగ్లీషు 
విద్యనే చెప్పించవలెనని మెకాలే పెద్ద నివేదిక సమర్పించెను, బెంటిక్‌ గవర్నరు 
జనరల్‌ దాని నంగీకరించెను. ఈ సమీక్షాకాలములో విద్యకై ఇంగ్లీమవా రేమియు 
వ్యయము చేయలేదు. తుదకు ౧౮౫౫ లో మ దాసు, కలకత్తా బొంబాయి 
విద్యాపీఠాలను నెలకొల్పిరి. జనులు ఫార్సీకి వీడ్కోలు సలాము కొట్టి ఇంగ్రీషుకు 
(వెల్క-_0) స్వాగతం చేసిరి. కంపెనీ కాలములో మన విద్యల నెట్లు నాశనము 
చేసిరో ఆ వివరాలను చాలా విపులముగా మేజర్‌ బాసూగారు (EdUCation 
under the E. 1Co. అను పుస్తకము రో) వాసిరి, అభిలాషలు దానిని 
చూడగలరు, 


ఇంగ్లండులో స్టీం యం|తాలు విరివియయ్యెను, రైల్వేలు, స్టీం నావలు 
వాడుకలోకి వచ్చెను. టప్పాతంతీ ఏర్పాట్లు జరిగెను. కాని వాటిని వారు వెంటనే 
హిందూస్తానములో [పవేళ పెట్టలేదు, చాలాకాలము తర్వాత (ప్రారంభించిరి, 
[పారంభించినను తమ మిలిటరీకి, తమ వ్యాపారాని కవసర మగునంత వరకే 
చూచుకొనిరి “ఆనంశౌ కీబపతితౌ" అని కుల మత భవ్యలకు హిందువులు 
తండి ఆస్తిలో భాగము లేదనిరి, అడి క్రై) స్తవ మతవ్యాప్తి కాటంకమని 
౧౮౫౬ లో ఆ యాటంకమును తొలగించి భాగ మివ్పీంచు శాసనము చేసిరి, 
కొన్ని రోడ్లు, కొన్ని కెనాలులు నిగ్మించిరి. ౧౮౫౩ లో తంతీ (టెల్మిగాం) 
స్థాపించిరి, అంతకు కొద్ధి మాందుగా టప్పా ఏర్పాటు చేసిరి రైల్వే నిర్మాణము 

(50) 


894 ఆంధుల సాంఘిక చరిత 


కూడా డరల్‌హోౌసీ కాలములో పారంభించిరి. ౧౮౫౬ వరకు ౨౦౦ మెళ్ళ 
రైల్వే లైను వేయబడెను. 


సతీ-సహగమనము అను భయంకర దురాచారము హిందువులలో [పబలి 
యుండెను, అది బెంగాలు, బీహారు, రాజపు[త స్థానములలో హెచ్చుకాని తెనుగు 
సీమలో అరుదై యుండెను, రాజా రామమోహనరాయల [పోదృలముతో 
౧౮౨౯లో దానిని నిషేధించిరి. దేశమును జిల్లాలుగా విభజించి లేక పూర్యము 
వాటినే జిల్లాలుగా పరిగణించి ఇంగ్నష్లు కలెక్టర్ల నేర్పాటు చేసిరి. ఈ విధమగు 
చిల్లర మార్పులు మరికొన్ని జరిగెను. ఇట్లు తిన్నగా మనము ఆధునిక యుగ 
ములో పడినవార మయితిమి. ౧౮౫౬ లో వితంతూద్వాహ శాసనము చేసిరి, 


డల్‌హొసీ ౧౮౫౬ లో వెళ్ళిపోయెను. హిందూ మసల్మానులు--ా 
అందెక్కు వగా ముసల్మానులే-తమ ఆధిక్యత పోయననియు ఆందరును పరా 
ధీనులయిరనియు, తమ మతాలకు ఆచారాలకు ఆఘాతము కలుగజొచ్చెననియు 
గ్రహించిరి, దాని ఫలితమే ౧౮౫౭ నాటి సుపసిద్ధ విస్తవము. అది జాతీయ 
వికాసమునకు మొదటి | పయత్నము, ఈ సమీక్షా కాలములో ఆం|ధుల పతనము 
సంపూర్ణ మయ్యెను, వాజ్ఞయము, కళలు, పరి|క సులు అన్నియు ఇంచుమించు 
కూన్యస్థితికి వచ్చెను. ౧౮౫౭ భారత చరిత్రలో ముఖ్యాతి ముఖ్యఘట్టము, 
దానితో మనము ఆధునిక యుగములోనికి వచ్చిరాము. 


ఈ [పకరణానికి ముభఖ్యాధార ములు 


౧, అయ్యలరాజు నారాయణకవి . హంసవింశతి, ఇతడు అడుగడుగున 
మొదటినుండి తుదివరకు శుకస ప్రతి ననుకరించినాడు, అయినను కొన్ని, 
కొ త్రవిషయాలు తెలిపినాడు, ఇతడు ౧౮౦౦ [పాంగమువాడు, ఇతడు 
నెల్లూరివాడని వావిళ్ళవారు, కర్నూలు వాడని శృంగార [గంథమండలి 
రాజమండివారు పీఠికలలో (వాసినారు. ఉభయలు ఆధారాలు చూప 
లేదు. శృంగార [గంథమం౦డలివారి పీఠిక ఉత్తమమైనది. వావిళ్ళవారి 
పీఠిక మంచిదికాదు, 


౨ భాషీయ దండకము ;-ాగండూరు నరసింహకవి. ఇతడు కర్నూలువాడు. 
౧౮౦౦ (పాంతమువాడు, భాష కర్నూలు (గామ్యము, ఇందు కొంత 
హాస్యము, అపహాస్యము, బూతులు కలవు, దీనిని రామా అండుకోవారు 


(కీ॥ శ; ౧౭౫౭ నుండి ౧౮౫౭ వరకు 895 


ము[దిం బినారు, నావద్ద ౫౦ ఎండ కింద టి ము[దిత (పతి కలదు. నొ 
[పతిలో ఎక్కు వభాగాలు, భిన్నపాఠాలు కలవు. రెంటిని కివి సమన్వ 
యించి పీఠికతో కర్నూలు వ్యవహారికమున కర్భాలతో ము[దించుట అన 
సరము, 

3. India under Early British Rule R. C. Dutt 

౪. *- Smith-Oxford History of India 


౫. కూచిమంచి తిమ్మకవి ;చాకుక్కు టేశ్వర శతకము. ఇతడు బహు [గంథాలు 
[వాసినాడు, కాని అన్నియు పిచ్చివిచ్చి పాతకాలపు అష్టాదశ వర్ణనలే. 
ఇదొక శతకమే మనకు కా స్త పనికివచ్చేది. 

జ చు ల 
౬. గువ్వల చెన్నశళ తకము :--ఇది బాలా పనికివచ్చునట్టిది. 


౭. ఏనుగుల వీరాస్వామి :--కాశీయాత చరిత. ఇతడు సవన పాశ్చాత్య పద్ద 
తిని ఇంగ్లీషు మితుల _పోత్సాహముతో [పవేశ పెట్టెను. ఇది అతని 
యా(తకు సంబంధించిన డె రీ (దినచర్య). ౧౦౦ ఎండ్లకిందటి మ।దాసు 
తెనుగున అతడు (వౌసినాడు, ఇది మన చరిత కత్యంతముగా ఉపక 
రించును, 


౮. Historical and Descriptive Sketch of the Nizam’s Dominions 
Bilgrami 2 vols. ఈ [గంథము చాల విలువకలది. 


రావ (పకరణము 


(రం శ ౧౮౫౭ నుండి ౧౯౦౭ వరకు 


భారతీయుల కత్తి ౧౭౫౭ లో ప్లాసీయుద్ధములో లొంగిపోయెను. ౧౮౫౭ 


విప్పవములో విరిగిపోయెను. మరల ౧౯౪౭ లో మనక త్తి మనచేతికి 
వచ్చెను, ౧౮౫౭ లో ఇంగ్లీషరాజ్యము దేశమంత టను స్థిరపడిపోయిను, ఇది 
మనదేశచర్మితలో ముఖ్యమగు ఘట్టము, మన మానాటినుండి ఆధునిక యం|త 
యుగములోని కి [పవేశించినాము. ఈ ౬౦ ఏండ్ల చర్నిత విద్యావంతుల కందరి 
కినీ బాగా పరిచిత మెనదే. ఆందుచేత ఈ భాగముగు ౧౯౦౭ వరకు ముగించుట 
బాగని తలపనయినది. అనగా విప్టవము తరువాత ౫౦ ఎండ్ల సాంఘిక చరిత 
సం[గహముగా నీ (పకరణమున [వాయబడును. 


౧౮౫౭ కు పూర్వుముండిన మస్తిం మతవ్యా ప్రి ఆనాటితో ఆగిపోయెను, 
ఇంగ్లీషువారు క్రైస్తవులు. కాన క్రైస్తవ మతవ్యాపక సంఘములు (మిషనులు) 
ఆనువయిన స్థలములందంత టను స్థాపిత మయ్యెను. మిషనరీలు నానావిధములగు 
'సేవలద్వారా జనులను తమ మతములోని కాకర్షించిం. వారు విద్మాలయముల 
స్థావించిరి. వైద్యాలయముల నెలకొల్పి ఉచితముగా మందు లిచ్చిరి. తమ 
బై బిల్‌ మత [గంథమును భారతీయ భాష లన్నింటిలోనికి పరివర్తనము చేసి 
ము;దించి ఉచితముగా పంచిపెట్టిరి. వారి మతమలోనికి విశేషముగా అంటరాని 
తెగలవారు చేరిపోయిరి. తెనుగు దేశమందు ౨౦౦ ఏండ్రనుండి క్రై) స్తవ మత 
[పబారము సాగుతూ వచ్చినది, క్రె9 స్తవ మతములో చేరిన పై జాతులవారు 
తమ కులాలను మరచిపోజాలరయిరి. గుంటూమజిల్లాలో వేలకొలది రెడ్డి కుటుం 
బాలు కై) సవమతం పుచ్చుకొనెను. కాసి వారు అదే మత మవలంబించిన మాల 
మాదిగ మంగలి మున్నగు తక్కువ జాతులతో బాంధవ్యము నేటివరకు చేయుట 
లేదు. ఆందింకొక చిత మేమన హిందువులగు రెడ్డు తమకన్యల ఆ రెడికె9_స్త 
వులకిచ్చి పెండ్రిచేయుదురు. కాని కై స్తవ రెడ్లు మాతము తమ పిల్లల 
హిందూ రెడ్డ కీయరు. 


tl శ॥| ౧౮౫౭ నుండి ౧౯౦౭ వరకు 397 


మిషనరీలు, ఫాదీలు, తమ మతము గొప్పదనియు _పచారము చేసుకొను 
టలో తృ ప్రినొందక హిందువుల కులాచార లోపములను మూర్భ విశ్వాసములను 
సంఘములోని కుళ్ళును బయట పెట్టి ద్ముష్పచారము చేసి జనులలో హిందూ 
మతముపై విశ్వాసమును భక్తిని ఆదరముమ పోగొట్టుళూ వచ్చిరి. అందుచేత 
ఇంగ్లీషు విద్య వేర్చినవారిలో తమ మతముపై అభిమానము తగ్గిపోయి తమ 
కొంచెపుతనమునకు తాము లజ్జింప మొదలిడిరి, అట్టి సన్నివేశములో భారత 
రంగముపై ఒక మహావ్య క్రి ఆవిర్భవించెను ఆః డే మహర్షి శ్రమ ద్దయానంద 
సరస్వతీ భగవత్పాదులు, వారి కింగ్గి షమి యు రాశండెను, సంస్కృత మందు 
పారమందినవారు. వేదళాస్త్రములను సంపూర్ణముగా స్వాధీన పరచుకొనరి, అత 
డాధునిక కాలపు దృష. ఆత డార్యసమాజమును స్థాపించి హించువులలోని 
ఆచార లోపాలు మధ్య వచ్చినవే కాని వెదమూలకములు కావని నిరూపి=చి 
ఇస్లాంకైె9 స్తవముతాలలో కణ ఆధ్యాత్మి కాధిభౌతిక లోపాలను సవితర్మముగా 
సిరూవించి పాందువులకు ధైర్యము. సంస్కాారావకాళము, ఆత్మగౌరవము కలి 
గించెను, తెనుగు దేశమందు నిన్న మొన్నటి వరకు ఆర్యసమాజ [ప్రచారము 
సాగినదికాదు. 


ఆర్యసమాజానికి ముందే రాజా రామమోహనరాయల (బహ్మ సమాజ 
శాఖలు కృష్టా గోదావరి జిల్లాలలో కొన్ని స్థాపిత మయ్యెను. కాన వానికి 
వ్యాప్తి లేక ఆగిపోయెను. అయినను ఆర్య (బహ్మ సమాజముల భావములు జను 
లలో బాగా వ్యావించిపోయెను, (బహ్మ సమాజములో చేరినట్టి కందుకూరి ఏరేళ 
లింగం పంతులుగారు ఒక అసాధారణ వ్య ర్‌. మహానుభావుడు. “వీరాః పడిత 
కవయశ' అన్న నూ, క్తికి లక్ష్యభూతుడు అతడు కులముల తా-తమ్మములమీద 
మూఢ విశ్వాసాలమీద, అవై దక మగు మూర్రిపూజలమీద దె్బతీసెను. 
త్రీలపె జరుగు హత్యాచారముల ముఖ్యముగా వితంతువులకు పునర్వివాహము 
చేయక నిరోధించుటను పతిఘటించి వితంతూద్వాహములను చేయించి, వితంతు 
శరణాలయమును నెంకొల్పెను. ఆయన (పచారము వలన తెనుగుదేశమం 
దపూర్వ సంచలనము కలిగెను. పూర్వాచారపరులు ఆంక్షలుపెట్టి, అల్లరులు చేసి, 
దౌర్జన్యాలు చేసి, వీభత్సము చేసినను అతడు మరింత విజృంభించి తనదీక్షను 
సాగించెనే కాని విరమించుకొన్న వాడు కాడు. 


హిందువులలో ఇంచుమించు ౧౦౦౦ ఏండ్దనుండి అనగా ముస్లిములు 
దేశమందు (ప్రవేశించిన కాలమునుండి అనేక దురాచారాలు పబలిపోయెను, 


898 ఆం|ధుల సాంమిక చరి[త 


బాల్యవివాహాలు, వితంతూద్యాహ నిషేధము, సహగమకము, బహువిధ 
మూర్తుల పూజ, అనేక శకుల పూజలు, దేనర్ల కొలువులు, మంతతంత విశ్వాస 
ములు, సముదయాన నిషేధము, కుల బహిషా్యర దౌర్జన్యాలు, గహచార 
విశ్వాసము, గిహళ్రాంతులు శుభాశుభ శకునాల పాటింపులు, అంటరానితనము, 
దృవ్షిలోపాలు తాం[తిక వామాచారాలు, మున్నగు ననంత లోపాలు సంఘమందు 
స్థిర పడియుండెను. ఈలోపాలవల మనలో ఐక మత్యము,నాగ రికతా థివృద్ధి, నిర్మాణ 
కౌశలము నించి, రాజకీయ పతనము సంభవించెనని విద్యావంతులు తలచిరి. 
అందుచేత పారతం|త్ర్య విము క్రికి ముఖ్యసాధనము సంఘలో పముల సంస్కార 
మని తలచిరి. దానికై సంఘ సంస్కార మహాసభలు విరివిగా కావించిరి. 


ఇది యిట్లుండ (క్రీ; శ॥ ౧౮౮౫ లో అఖిలభారత జాతీయ మహాసభ 
(నేషనల్‌ కాంగెను) స్థాపితమయ్యెను. ౧౮౫౭ తర్వాత అతిముఖ్యమగు ఘట్టి 
మీ కొం|గెసు సంస్థాపన, భాగత జాతీయత (Nationalism ) ఆనాటి నుండి 
పారంభ మెనదన్నమాట. భారత దేశమును సృష్టికర్త తన పరిశీలన గృహము 
(లేబరేటరీ) గా బహుంళా నిర్ణయిం చుకొన్నా డేమో. ఏవిధ జాతులు, కులాలు, 
మతాలు,భాషలు-ఇచ్చటనే సమకూడినవి. వేద కాలమునుండి భారతీయులలో అఖండ 
జాతీయత యెన్నడును కలిగి యుండళేదు. కావున కాంగెగసు అవతరణ యీ 
జాతీయతకు పునాదివేసెను. యూరోపులోని జర్మనీలో |ఫెడరిక్‌ (The Great) 
తోను, ఇటలీగారి బార్లీ, మాక్లినీలతోను, ఫాన్ఫులో ౧౭౮౯ నాటి విప్లవము 
తోను సంయు కామెరికాలో ౧౭౭౬ తోను జాతీయత ఏర్పడెను. మన కొంగెసు 
మొదట సంఘ సంస్కారమునకు పూనుకొనలేదు. దాని వార్షిక సభలతోపాటు 
వేరుగా స,ఘ సంస్కార సభలు జరుగుచుండెను. 


ఇంగ్లీమ పరిపాలనము అఆర్థికముగా దేశానికి గొప్పనష్టము కలిగించెను, 
మన దేశములోని పర్మిశమలు నాశనమయ్యెను. కొత్త పరిశమలను ఇంగ్లీమవా 
రణగ (దొక్కిరి. అందుచేత జనులు ఆత్యధికమగా భూమిపై వ్యవసాయముపై 
ఆధారపడిరి. దేశమందు శామములు అభివృద్ధియై జననష్ట మపారమయ్యెను. 
విలియం డిగ్బీఅను ఆంగ్లేయుడు ౧౮౯౧లో పార్గ మెంటు సభ్యుల పేర ఒక 
విజ్ఞప్తి (ప్రకటించెను, అఆందిట్లు (వా సెను. “౧౮౦౨ నుండి ౧౮౫౪ వరకు ౧౩ 
శామాలు సంభవించి ౫౦ లక్షలమంది చచ్చిరి. ౧౮౬౦ నుండి ౧౮౭౯ వరకు 
౧౬ శామాలు సంభవించి ౧ కోటి ౨౦ లతల మంది చచ్చిరి. ౧౮౬౮ లో 


bn శ॥ ౧౮౫౭ నుండి ౧౯౦౭ వరకు 899 


దాదాబాయి నొరోజిీ లెక్కించి పరిశోధించగా మదాసు రాజధానిలో మనిషికి 
సగటున సంవత్సరాదాయము ౧౮ రూపాయలే అని తేల్చెను. ఉ త్తరార్కాటు 
జిల్లా కలెక్టరు తన జిల్లాలో ఆపారమైన దార్మిద్యము జనులలో నిండినదని 
[వా నెను. “నెల్లూరు జిల్లాలో అపగాధులు జెయిళ్ళలో పడిన తరాషత బాగా బలిసి 
రనియు ప్రనలకు తిండికొరత విపరీతముగా నుండెననియు టిల్లాడాక్టరు అభి 
[పాయ మిచ్చెను. 

థాన్యాల యొక్కయు తిండి పదార్థాల యొక్కయు ధరలు చాలా తచ్చుగా 
నుండెను. కృష్ణాబిల్లావారగు పెద్దిభొట్ల వీరయ్య అను వకీలుగారు ఇంచుమించు 
౨౭ ఏండ్ల కిందట ఆంధవతికలో ఇట్లు _పకటించెను. 

“ఇప్పటికి ౬౦ సుంవత్సరమలకు పూర్వము (౧౮౬౦ లో) మచిలీ 
పట్టణములోనుండి ధరలు తెలియగల కాగితమొకటి నేను చూడ తటస్థించినది* 
రలు. లో బందరులో జరిగిన ఒక వివాహమప్పు డుంచబడిన 
జాబితా సంగతు లిందు తెలియజే యుచున్నాను 


వస్తువు ధర రూ. అ. షె, పరిమాణము 
బియ్యము ౧౯ ౦-౦ 8.౨ సేర్లు 
కందులు ౧ా ౦-0 80 ,, 
సిసలు ౧-- ౦-౦ D౨ 33 
మినుములు ౧--౧- ౨ ౧౯ + 
మిరప ౧-౬-౧ మణుగు 
నెయ్యి ౪-౨-౦ 9 
ఆముదం ౧ ౦-౦ ౪ వీసెలు 
నూనె ౧-౧౦-౦ $ 9 
చింత పండు 0-౧౩- ౬ మణుగు 
బెల్లం 0--౧౧-- ౮ 19 
పసుపు ౧-౦-౦ క షన 
మెంతులు ౧ా ౦-౦ ౪౦ సేర్ల 
జీలక(ర న ర ము 3 
కొబ్బరికాయలు 0౧-- 8-- అ ౧౦ కాయలు 


సొారకాయలు ౦౨౦ కి ,, 


400 ఆం(ధుల సాంఘీక చరిత 


క రైలు 6- 3-0౦ ౧౫౦ మడక (రలు 
వి_స్తళ్ళు 0- ౧-౪ ౧౦౦ 
తమలపాకులు ౦౧౯ ౧౦౦ 
దోసకాయలు ఏ-౨=౦ మణుగు 
సంకాయలు ౧౪ ౨=౦ మణుగు 

ఇంగువ 6- ౦-౧౦ తులం 

అటుకులు థజు తజ ర ౧౬ సేర్లు 

చేటలు అ= ౧౧ ౬ ల 

తాటి ఆకు బుట్టలు తరణ. క్ర ౬ 


పై యంశములు అనాటి [పజల యార్ధికస్థితి తెనుగు దేశమం దెట్లుండెనో 
తెలుసుకొనుటకు సహాయపడును. ౧౮౭౬ లోను ౧౮౭౮ లోను బొంబాయి 
మ।దాసు రాష్ట్రాలలో అనగా దక్కనులో నంతేటను మవాోక్షామ మేర్పడెను. 
ఆ కామము దెబ్బ తెనుగుసీమపై విశేషముగా పడెను, నేటికిని ౮౦ ఏండ్ల 
వృద్దులా “ధాత కరువును గురించి ముచ్చటిస్తూ వుందురు, ఆ సంవత్సరమే 
“పగటి చుక్కలు రాలొను అని చెప్పుదురు. అనగా సంపూర్ణ [గహణము 
తెనుగు సీమలో అయ్యెనన్ననూట, ఆదే సంవత్సరము “ఎరగాలి” వీచెనందురు. 
ఆకొళమ౦తయు వ్నీరని ధూళితో నిండి దేశమంతటను నిండిపోయనట. ధాత 
కరువులో జనులు లక్షల కొలదిగా తెనుగు సీమలో చనిపోయిరి. కర్నూలు జిల్లా 
లోని కోయిలకుంట్ల తాలూకాలోని ఉయ్యాలవాడ ఆను [గామమందు బుడ్డా 
వెంగళరెడ్డి అను ఆపరకర్దు డప్పుడు వెలసెను. అతడు తన సర్వస్వము 
కోల్పోయి అప్పులు చేసి చందాలెత్తి తన ధాన్యమునంతయు ఇచ్చివేసి వేనవేల 
ఇుమబాధితులకు అన్నము పెట్టి రక్షించెను. నేటికిని కర్నూలు జిల్లావారా 


దాతను మరువలేదు, 
బుడ్డా వెంగళ రెడ్డి 
ఉండేదే ఉయ్యాలా వాడా 


ఆని పాటలుకట్టి బీచ్చగా౦డ్డు పాడుతూ వుందురు, ఇట్టి దాత లీంకెంద 
రుండీరో ఆయా |పాంతాలవారు తెలిపితే బాగుండును. ధాత కరువులో దక్క 
నులో ౫౦ లకీలకన్న హెచ్చు మంది చచ్చిరని ఇంగ్నీమ చరి(త్రకారులే 


(వాసినారు, 


(క్రీ॥ శో॥ ౧౮౫౭ నుండీ ౧౯౦౭ వరకు 401 


ఈ సమీక్షా కాలములో జనుల ఆచార వ్యవహార విశ్వాసాలలో చాలా 
గొప్ప మార్పులు జరిగెను ముసల్మానులు హింసామార్గము తో హిందువుల 
నాకర్షింప జాలిన వారు కారు. హిందువులు ముసల్మానులను మరింత దూరముగా 
పరిహరించిన వారైరి, కాని ఇంగీమవారు తమ నూతన భావాలతో హిందువుల 
లోనే కాక ముసల్మానులలోను మార్పులను గావించిరి కాని ముసల్మానులకన్న 
హెచ్చుగా హిందువులలో మారులు కలిగను. జుట్టు ఎగిరిపోతూ వచ్చెను, 
కాపులు బహుళమయ్యును. బొందెల అంగీలు పోయెను, ఇంగ్లీషమ అంగీతో 
పాటు కోట్లుకూడా వచ్చెను, టోపీలు విరిపియయ్యును. మొదట మొదట 
సముద (ప్రయాణము చేసిన వారిని బహిష్మ్కంరించిరి. తర్వాత ప్రాయళ్సి త్రముతో 
స్వీకరించిరి. తర్వాత ఏ యాటంకముస్నూ లేకపోయెను. వివిధ కులాల వారు 
కలసి భుజించుటకు మొదలు పెట్టిరి. దీనికి హోటళ్ల దోహదమిచ్చెు. రైళ్ళు 
కూడా కులం కటు బాట్టను సడలించెను. అంతళ్శాఖా వివాహాలు, వితంతూద్యా 
హాలు (పబలెను. బాల్యవివాహాలు [క్రమక్రమముగా తగ్గను. ఇంగ్లీషు విద్యావంతు 
లలో కొందరు ఇంగీష వేషములను సూటుబూటు కాలర్‌ టై ధరించుట గౌరవ 
హేతువని భావించిరి. 


ఇంగ్లీష్‌ (ప్రభుత్వము [పజల యొ త్రిడియైనప్పుడే [పజాలీష్టము నెర వేర్చు 
నట్టిది* సంఘ సంస్కారుల కోరికలను అప్పుడప్పుడు మన్నిస్తూ బాల్య వివాహ 
ములకు సరిహద్దులు మార్చుచూ వచ్చెను. మొదట ౧౦ ఏండ్లలో పల బాలబాలిక 
లకు వివాహము చేయరాదని శాసించిరి ౧౮౯౦ [ప్రాంతములో ౧.౨ ఎండ్ల 
లోపల బాల్యసివాహములు చేయరాదని కాసించిరి. ౧౮౫౦ పాంతమందే 
పోస్టు (టప్పా) ఎర్చాటయ్యెను. ౧౮౫౩లో తంతీలేర్పాటయ్యెను. కమ క్రమ 
ముగా ఈ రెండు చాలా విరివిగా స్టాపింపబడెను, ౧౮౮౫లో రిప్పన్‌ గవర్నరు 
జనరల్‌ మనిసిపాలిటీలను స్థానిక స్వపరిపాలనమును పార ౦భించెను, 


టప్పా రై త్వేతంతీ సౌకర్యాలు వృద్ధియగుకొలది పతికలు కూడా 
వృద్ధియయ్యెను. కాని తెనుగు దేశములో ప|తికలవ్యా ప్రీ చాలా తక్కువగా 
నుండెను. ౧౯వ శతాబ్ది మధ్యకాలమందు బళ్ళారిలో “శ్రీ యక్షిణి” అను వార 
పిక |పారంభమయ్యెను. అదే తెనుగువారి మొట్టమొదటి పృతిక. ఆంధ 
ప్మతిక వారపత్రికగా మహారాష్ట్ర/లుండు బొంబాయి నుండి వెలువడుట చాలా 
చిత్రము, కాని తర్వాత ఆది మదాసుకు మారెను. దిన పతికను కూడా కాశీ 


(51) 


402 ఆం|ధుల సాంఘిక చరిత 


నాథుని నాగేశ్యరరావుగారు [పార ౦భించిరి, అది నిత్యాభివృద్ధిగా ఆం|ధుల సేవ 
నేటికిని చేయుచున్నది. ౧౯ాఎంలో కృష్ణా ప పతిక [పారంభమయ్యను, అదియు 
ఆవిచ్చిన్నముగా సాగుచున్నది. 


ఇంగ్నీషువారి |పభావము భాషపై చాలాపడను, అదేమి చిత్రమో తెను 
గులో యక్షగానాలు తప్పితే వేరు నాటకాలు లేకుండెగు. ౧౬౦౦ తర్వాత 
తెనుగు కవిత కూడా నీరసమై అప్పకవీయ శాసనబద్ధమై, అష్టాదశ వర్ణనలను 
వెరిమొరి రోకటి పాటలతో కూడినదై, జుగుప్సాకరమైనదయ్యెను. అందు 
శబ్రాడంబర మే యుండెను. వచన |గంథాలు ఎకామ9)నాథుని [పతాపచరి[తత, 
కై ఫీయత్తులు స్త్టానాపతి విజయనగర క్రెఫీయత్తు, తంజాపురీ కవుల వచన 
భారతాదులు మున్నగునవి కొన్ని తప్ప మరేవియు లేకుండెను. ఇంగ్లీషు చదివిన 
విద్వాంసులగు కందుకూరు వీరేశలింగముగారు, కొమరాజు లక్ష్మ ణరావుగారు, 
గాడిచర్ల హరి సర్వో తమరావుగారు కట్టమంచి రామలింగారెడ్డిగార్కు గిడుగు 
రామమూర్తిగారు ఆం|ధవాజ్మయ పంథను త్రిప్పీవేసిరి, కట్టమంచివారి కవిత్వ 
త_త్త్వవిచారము సనాతనపు కోటలో గుండుపడినట్టయ్యెను. ఆది పెద్దసంచలనము 
కలిగించెను, వారు ౧౯౦౦లో ముసలమ్మ మరణము అను ఉత్తమ బలిదాన 
కథను కొ తరీతుల వాసిరి. నిజముగా భావకవితకు ఆతడే మార్గదర్శి యన 
వలెను, వీరేశలింగ |పతిభ సర్వతోముఖవ్యా ప్తి యయ్యెను, ఆతడు నాట 
కాలను, ఉత్తమ వచన |గంథాలను, నవలలను, హాస్యములను, కవుల చరి 
తమ, స్వీయచర్శితను, ఆంగ్లగీర్వాణ భాషలందలి యు త్రమ విషయాల అను 
కరణములను రచించి అపారమగు సేవను చేసెను. కొమ్మరాజు లక్ష్మ ణరావుగారి 
వ్య_కీత్వము అసాధారణమైనట్టిని®, అతని పట్టుదల, నిర్వహణమ్ము విధానము 
విషయ విజ్ఞానము, దానిని పిల్లలకును ఆర్జమగునట్టు రచించు నేర్పు, ఇతరు 
లందు కానవచ్చుట అరుదు. వారును గాడిచర్హవారును, హైదాబాదు రావిచెట్టు 
రంగారావుగారును (అనగా ఉ_తర సర్కారు, రాయలసీమ, తెలంగాణా (పతి 
నిధులు.) కలిసి ౧౯౦౭లో విజ్ఞాన చందికా [గంథమాలను హై(దాబాదులో 
స్థావించిరి. ఈ (గ్రంథమాల మొట్టమొదటి (పచ్చురణము గాడిచర్లవారి అబ్రహాం 
లోంకన్‌ చరిత, దానికి కొమ, రాజు వారు పీఠిక (వాసీరి, త, చరిత్రాత్మక 
మైనది. మనలో లేనివి కావలసినవి బంగాలీలు మరాటీలు ముందుకు చాలా 
దూరము సాగిపోయిన విధానము వారు చాలా చక్కగా నిరూపించిరి. వారిట్లిం 
కను (వాసీరి, 


డీ శ ౧౮౫౭ నుండి ౧౯౦౭ వరకు 


“భాషాభివృద్ధికి గద్య |గంథము లత్యంతావశ్యకంబులని మొట్టమొం 
కని పెట్టినది చిన్నయసూరి; అతడు గద్యనన్నయః రెండవవౌరు కం. 
వీరేశలింగము; వారు గద్యతిక్కన. పూర్వ మొకప్పుడుండిన పురుషార్థ (పదా 
యిని, ఆంధ భాషాసంజీవన్హి మందార మంజరి, చింతామణి, శ్రీ వై జయంతి, 
మొదలై న మాసపతికలును, |పసుతమున్న సరస్వతి, మంజువాణి, మనోరమ, 
సువర్గలేఖ, సావితి, హిందూ సుందరి జనానా పతిక మొదలగు మాసపతి 
కలు, ఆం|ధ|పకాశిక, శశిలేఖ, కృష్ణా ప్మతిక, ఆర్యమతిబోధిని, నత్యవాది, 
మొదలగు వార్తాషతికలును తెకుగునం దొకవిధమైన యుప మోగకరమగు 
వాజ్మ యమును పుట్టించి నవి. కాని తెలుగుబాస యొక నాగరికభాష యనిపించు 
కొనుటకు ఇపుడు జరిగిన [పయత్న మొక సహసాంశమెనను కాదు” మన 
భాషలో చరితలు, కధలు, శ్రా స్త్ర (సైన్సు) (గ ౦థాలు ఎవియు లేవని వారు 
వాపోయిరి, ఆయు త్తమ పీఠిక అత్యంతముగా విలువయైనట్టిది. వారె త్తీచూపిన 
లోపాలను తొలగించుటకై విజ్ఞాన చందికా [గ్రంథమాల ద్వారా చాలా కృష 
చేసి, సిద్ధ సంకల్పుల్లె రి. మన దురవృష్ణము చేత వారు ౧౯౨౨ లోనే మర 
ణించిరి. వారి యనంతరము [గంథమాల నానాటికి తీసికట్టుగా సన్న గిలి 
మాయమైపోయెను. 


౧౯౦౦ నుండి తెనుగులో ఇంగ్లిషు సంస్కృత పద్ధతులపై నాటకాలు, 
నవలలు, వచన (గం౦థాలు, చరితలు, పిమర్శలు, ఖండకావ్యాలు, విరివిగా 


బెంగాలును కర్ణన్‌ 'వె(సాయి రెండు భాగాలుగా విభజించెను. హిందూ 
ముస్టిములనా భిిన్నించుటకై అత డట్టు చేసెను. ఆందుపె బెంగాలులో జాతీ 
యోద్యమము త్మీవరూపము దాల్చెను. వందేమాతరం జాతీయ గీతమయ్యెను, 
హింసాత్మక చర్యలతో బెంగాలీలు |పతిఘట్లించిరి. ఆ జాతీయోద్యమపు గాలి 
తూర్పుతీర మందలి ఉత్తర సర్కారులను తెనుగు జిల్లాలపై వఏీచెను, ఆ 
సందర్భములో “స్వదేశీ” విధానోద్యమము బయలుదేరెను. అదే సందర్భములో 
బందరులో జాతీయ కళాశాల స్టాపితమయ్యెను. అదొక ముఖ్యఘట్టము. మన 
పూర్వ సంస్కృతి యంతయు గర్వింపదగినది కాదనియు ఇంగ్నీషువారి దంతయు 
ఉత్తమమనియు భావించిన వారిలో కొంత పరివ ర్రనము కలిగెను. మన 
సంస్కృతిని కాపాడుకొనుచు కాలానుసరణమగు మార్పులు చేసుకొనుటయే సరి 


408 ఆంధ్రుల సాంఘిక చరిత 


యని యీ జాతీయ కళాశాల నిరూవించెను. పూర్వకాలపు చితలేఖన పద్ధతి 
మారెను రంగులు మారెను, భావౌలు మారెను. తెనగుదేశమందు నూతన 
చి[త లేఖన పద్ధతి కీ కళాళాలయే దోహద మిచ్చినట్టిదిం 


ముసల్మాను [పభువులలో గోలకొండ సుల్లానలలో ఒక్క ఇ|బహీం 
ఖుతుద్దాయు, ఆతని యుద్యోగియగు ఆమీను భానున్నూ తెనుగు భాషను 
పోషిందిరి, ఆసఫ్‌జా వంశమువారు తెనుగు నాదరించకపోగా దానికి విఘా 
తములే కల్పించిన వారయిరి. తెనుగు దేశాన్ని పాలించిన యీ ఖుతుద్దా 
అసఫ్‌జా వంళాలవల్ల తెనుగుభాష కేమిన్ని సహాయము కలుగలేదు. ఇంగ్లీషు 
పరిపాలనలో ఇంగ్లీషు [పభుత్వము దేశములోని తాటాకు _గంథాలను సేకరించి 
మ్మదాసులో | పాచ్యలిథిత పు సకాలయమును స్తాపించి, అందు వాటినుంచి అంత 
రించిపోనున్న బహు [గంథాలను రక్షించిరి. పలువురు ఇంగ్లీషు వారు మన 
భాషను నేర్చుకొనిరి. ఆందు (టౌన్‌ ముఖ్యుడు, ఖు తుద్దాలు, ఆసఫ్‌జాలు 
అందఠిసి ఒక్క (పక్క పెట్టి | బౌనుదొర నొక్కదిక్కు పెట్టి తూచిన |బౌను 
దిక్కా [తాసు ముల్లు సూపును, ఆతడు తాటాకు [గంథాలు సేకరించియుంచెను. 
వేమన పద్యాలను మెచ్చుకొని వాటిని ఇంగ్లీషులోని కనువదించెను. తెనుగు 
నిఘంటువులు రెండు రచించెను. ఆందొకటి వ్యావహారిక పదకోశము. నేటికిని 
ఇవి చాలా యుపయోగపడుదున్నవి. మెకంజీ అను నింకొకడు కైఫీయత్తులను 
వాయించి తెప్పించియుంచెను. కాల్టెల్‌ అను మరొకడు దావిడ భాషాళాస్త్రమును 
(వాసెను, మొత్తముపై ఇంగ్లీషు భాషా[పభావము తెనుగుభాషపై సంపూర్ణముగా 
పడెను, తెనుగులో బహుముఖ వికాసము క్రలిగెను. ఇంగ్లీమ వారు భాషతోపాటు 
[పావీన శిల్పములను కాపాడిరి. తురకలు విధ్యంసము చేసిరి. ఇంగ్లీమవా రుద్ద 
రించిరి. హంపీ శిథిలాలను ఆమరావతీ సూపాలను, ఇతర (పాచీన దేవాలయా 
లను కోటలను మరమ్మతుచేసి, దిబ్బలు తవ్వి, శిల్పశకలాలను బయటికితీసి, 
మిగిలినవాటిని విధ్వంసము కాకుండా రక్షించిరి. |బిటిషిండియాలోని యీవిధా 
నమును హైదరాబాదులో అవలంబించక తప్పినదికొదు. అందుచేత తనుగుసీమ 
హద్దు వరకు ఓరుగల్లు శిథిలాలు, రామప్పగుళ్లు, పిల్లలమ్మరి, పొనుగల్లు 
(నల్చగొండ) మున్నగు తావులలోని తెనుగు శిల్పాలను రజి ంపవలసినవారయిరి. 


౧౮౫౭ విప్లవానంతరము తెనుగుసీమలో ఉత్తర సర్కా రులలో నే 
యెక్కువగా' పురోభివృద్ధి కలిగినది, వారికంటే రాయలసీమవారు వెనుకబడిన 


EL శ|॥ ౧౯౮౫౭ నుండి ౧౯౦౭ వరకు 40% 


చారు. ఆ రాయలసీమ కన్నను మరీ చాలా వెసుకబడినవారు తెలంగాణావారు. 
వారి పాలిట బడిన [పభుత్వమే వారి పురోభివృద్ధికి ముఖ్యకారణ మనవలెను. 


అంధుల ౯౦౦ సంవత్సరాల సాంఘిక చర్మిత సం[గహముగానే 
తెలుపనయినది. |వాయచగిన విషయము లింకను కలవు. అందుకు తగిన పండి 
తులు కృషిచేసి మన సాంఘిక చరితలు |వాసిన మనలో సాంఘిక చరితలు 
లేని లోపము తొలగిపోవును. 


సీ, పరిపూర్ణ పావనాంభస్త రంగో ద్వేగ 
గౌతమీ గంభీర గమనమునకు 
ఆల:పురీ సందనారామ వి(భాజి 
మల్గొణఫ లరాజమధురరుచికి 
ఆంధ్రీకుమారీ సమాయు క్ర పరిపూత 
తుంగా వయస్సు మాధుర$ముకకు 
ఖండళర్కరజాతి, ఖర్జూర, గోక్షీర్య 
[దావాదియుత రామర సమునకును 
అమృత నిష్యంది వల్లకీ హ్లాదమునకు 
రాగిణీదివ్య సమ్మో హరాగమునకు 
తేనెతేటల నవకంపు సోనలకును 
సాటియగును మా తెనుగు భాషాతల్తి, 
(మదీయము) 

(ఆం|ధ్రీనది= తుంగభ ద రుపనది, రామరసము = మహారాష్ట్రల 
మధుర రసము, జాజికాయ, జాపథతి, ఏలకులు, బాదాము, |దాక్ష, పాలు, 
దోస, సొర, కరెపుచ్చ మున్నగువాటి విత్తులు, సొంఠి, చక్కెర, కుంకుమ 
పువ్వు ఇంకా చాలావస్తువులు నూరి కలిపిన దాన్ని రామరస మందురు, ఆల౦పూరు 
బనగానపల్లె రెండును ముల్లోబ్క దిల్‌ పసందు అను (ఛేష్టమగు మామిడి పండ్లకు 


శో జో త ad 
పనీద సలా .) 
మ్‌. సస లు 


అనుబ౦వదవుం౧ 
ఆం|(ధ(పభ సంపాదకీయ ము 
$949 నవంబర్‌ 22, మంగళవారం. 


మన తాత ము తాతలు 


గ్‌రాజు ఎప్పుడు పాలించాడు! ఎక్కడ? ఏవిధంగా? ఆతడు ఎన్ని యుద్ధా 

లను చేశాడు? ఎవరెవరిని గెలిచాడు? లేదా, ఎవరిచేతిలో ఓడిపోయాడు? 
అత డెందరిస వివాహ మాడొడు? మరెందరిని ఉంపుడు క త్తెలను చేసుకున్నాడు? 
బహుభార్యాత్యపు సాధక బాధకాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు--ఇదే ఇప్పటి 
వరకు మన చరిత, 


తోనా దిమ్పుః పృథ్యపతిః౯” అని విశ్వసించబడినంత వరకు రాజుల రాజూ 
స్థానాల కథలే, రాణుల, రాణి వాసాల గాథలే చరిత కావడం ఎవరికీ 
ఎబ్బెట్టుగా తోచలేదు కూడా. 


కోని, రాజు దై వాంశసంభూతుడన్న గుడ్డినమ్మకంరోజులు పోయాయి 
చివరకి జపానులో కూడా (మొన్నటి యుద్ధము తర్వాత) హిరోహిటో సయితం 
సౌక్షాతు అపర(బహ్మ స్వరూపుడన్న మూఢ విశ్యాస ప్రాబల్యం సడలింది. 


రాజుల రోజులు పోయినందున, | పజలే రాజులౌతున్నందున, ఇక చరిత 
స్వరూపమే మారిపోవాలి, ఇక మీదట చర్శితకారులు మనకు చెప్పవలసింది 
ముసలిమగడు రాజరాజ నరేం్యదుని పడుచు పెండ్లాం చిత్రాంగి సవతికుమారుని పై 
కన్ను వేసిందో, లేదో--ఈ సంగతి కాదు. (పతాప ర్నుదుని ఉంపుడుకత్తె 
((నతాపరుదుని ఉంపుడుక త్రె చరీతను "ఆడుదురు నాటకంబుగ నవనిలోన” 
అన్నాడు (క్రీడాభిరామకర్తి) విషయమై కాదు. కృష్ణదేవరాయల దేవేరుల విష 
యమై కాదు; ఆ దేవేరుల మధ్య వివాదాలను గురించి అంతకంటె కాదు. 


ఆనుబ౦ధము ద 407 


ఈ |పజాయుగంలో వెలువడవలసినవి |పజాచరితలు, వీటికే మరొక 
చేరు-“సాంఘక చర్మితలు”, 


నామమ్మాతానికి మన దేశంపై ప్రస్తుతం బ్రిటిష్‌ రాజుకు మిగిలివున్న 
పెద్దరిక ంకూడ . తొలగిపోనున్న ఈ సమయంలో, కొన్ని శతాబ్దాల తర్వాత 
ఆంధ్రులకు తిరిగి ఒక | పత్యేక పభుత్వం ఏర్పడనున్న ఈ సమయంలో ఇట్టి 
కిక చరిత (గంథం వెలువడ్డం ఎంతె నా సమయోచితం, 


దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు (కీస్తుశకం 1050 నుంచి 
1907 వరకు) తెలుగుజాతి ఏ విధంగా |ణతికిందో ఈ చరిత్ర కళ్ళకు 
కట్టినట్లు చితిస్తున్నది® మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో; 
మన అవ్యలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యట్టి అలంకరణములతో 
నుండిరో మన పూర్వు లే దేవరలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగి 
యుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు 
చేసినప్పుడు శామా దీతిబాధలు క లిగినప్పు డెటుల రత్షణము చేనుకొనిరో, 
జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు పీతి కలవారై యుండిరో, 
ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో” ఇట్టి అనేక విషయాలు ఈ చరితలో 
వర్ణిత ౦. 

తప్పెట్లు, కాహళముణు, కాలి కొమ్ములు, డమాయీలు, బూరలు 


శంఖములు, సన్నాయీలు, డోళ్లు, రుంజలు, చేగంటలు--ఇవి చేరగా ఏర్పడినడే 
మున పూర్వీకుల మిలిటరీ బ్యాండ్‌. 


తుమ్మెదపదాలు, పర్వతపదాలు, శంకరపదాలు, నివాళిపదాలు, వాలేశు 
పదాలు, వెన్నెల పదాలు, రోకటి పాటలు, బొమ్మలాటలు, కోలాటం, గొండి, 
చిందు, జక్కి-ణీ, పేరణి, పేంఖణము, ఉప్పెన పర్తిలాట, బొంగరాలాట, 
కోళ్ళపందెము, పులిజూదం, పచ్చీసు, సిడి=--ఇవి మన పూర్వీకుల గాన 
నృత్య (కీడావినోదాలు, 


ముక్కర, నె బిళ్ళలు, దండెకడెములు వంకీలు, జోమాల దండలు, 
తాటంకములు, ముత్యాల కమ్మలు, కాంచీ నూపురకంకణములు, |తిసరములు, 
మొరవంక రడియములు, వడ్డాణము, ముక్కు నత్తు - ఇవి మన అవ్వలు 
పెట్టుకొన్న నగలలో కొన్నిమాత్రం, 


409 ఆం(ధుల సాంఘీక చర్మిత 


వెంజావళి జయరంజి, మంచు పుంజము, మణికట్టు, భూతిలకము, 
(భ్రీవన్నిమ్మ చీని, మవిచీని, పట్టు పొంబట్టు, నెరపట్టు, వెలిపట్టు, పచ్చని 
పట్టు, న్మేతంపుపట్టు, సంకుపట్టు, భావజతిలకము, రాయశేఖరం రాయవల్లభం, 
వాయుమేఘం, గజవాళం, గండవర౦, వీణావశి_ఇట్టి వన్ని ఒకనాడు మన 
తెలుగునాట వేయబడిన వస్త్ర విశేషాలు. 


ఒకనాడు మన తెనుగుపీమలో (పతి దబాహ్మణ గృహంలో ఒక్‌ [గంథా 
లయం వుండేది. ధనికులు తివాసీ.పై కూర్చునేవారు. “బురునీసు దుప్పటులు 
కస్పుకొనేవారు, అప్పులవారిని “సడ దండల”తో శిషీంచేవారు. దొంగలను 
పట్టి “బొండకొయ్యలో” వుంచేవారు; రెండవ భార్యను చేసుకొంటే, ఆమెకు 
“సవతి కడెముూ” తొడిగేవారు: యుద్ధంలో ఓడినవారు “*ధర్మధార” పట్టేవారు; 
తాంబూలం వేసుకోడానికి “పాన్‌ దానులు ఉపయోగించేవారు; రైతులు ఏరు 
వాకను, “వింతటి పండుగను" చేసుకొనేవారు; కరణాలు “వహి” అనే 
పుస్త్సకాలలో లెక్కలను [వాస్తుండేవారు; పీనుగులను కాల్చిన బూడిద మచ్చు 
మందుగా పనిచేస్తుందని దొంగలు నమ్ము తుండేవారు- ఈ రీతిగా శ్రీ [పతాప 
రెడ్డిగారు [వాసిన “సాంఘిక చరిత్ర” మన పూర్వీకుల జీవిత విధానాన్ని గురించి 
చెప్పే విశేషాలకు అంతేలేదు. 


ఈ చరి[త దాదాపు ఒక జీవిత కాలపు పరిశోధనా ముక్తాఫలం. 
సౌంఘిక చరి|తకు పనికివచ్చే [గంథాల సంఖ్య పరిమితమైశా, ఇందుప కాస 
నాల ఉపయోగం నానుమ్మాతమైనా. ఆచార వ్యవహారాలకు, ,[కీడా ష్‌నో 
దాలకు సంబంధించిన అనేక |పాంతీయ పదాల విషయంలోను, పారిభాషిక 
పదాల విషయంలోను నిఘంటుకారులు “ఒక భక్ష్యవి శేషం” “ఒక [కీడావిశేషం” 
అని అర్థం చెప్పి, నిరర్థకులవలె వ్యవహరించినా, ఇట్టి పతిబంధకా లన్నింటిని 
అధిగమించి, ఆంధజాతి చరితను |పతిఖభా పూర్వకంగా చ్చిళించిన శ్రీ) రెడ్డీ 
గారు సం స్తవనీయులు. 

ఆం|ధజాతి గత చరిత్రను తెలునుకొనడానికి ఉపకరించడమే కాక, 
ఏయే కారణాలు దాని అభ్యుదయానికీ తోడ్పడినవో, మరేవేవి దాని పతనానికి 
దోహదమిచ్చినవో సందర్భానుసారంగా వివరిస్తున్న ఈ మహద్ధ్యంథం ఆంధు 
లకు భావిక రృవ్య పథాన్ని నిర్దేశిస్తున్నది కూడా. 


“నాకే యీ [గంథము తృవ్లి నొసగలేదు” అనే విచారం శ్రీ రెడ్డి 
గారికి కూడదు. సకలాంధావనికి వారి రచన అపారతృ ప్తి నివ్వగలదు, 


అ శ 


అనుబంధము ఎ౨ 


1185, కృవ్ణమూ ర్రిపురం 
మైసూరు 80-10-49 


మహారాజ శ్రీ మామ్యలు సురవరం [పతాపరెడ్డిగారి సన్నిధికి, 
మిితుండు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ చేయు మనవి :._ 


తాము దయతో పంపిన “ఆం|[ధుల సాంఘీక చరిత! కృతజ్ఞతతో అందు 
కొన్నాను. విడిచే బుద్ది పుట్టక పూర్తిగా చదివితిని. ఇట్లు ఏకధారగా నన్ను 
చదివించిన గంథము ఈ మధ్యలో ఇదొక్కటే, 


చాలా గొప్పపని చేసితిరి. ఇందు సేకరించి మీరు జతపజచిన విష 
యాలు చాలా అమూల్యములు. ఎన్నోవత్సరాలుగా ఏకాాగతతో చదివి సంగ 
హింపనిది ఈ పని నిర్వహింపగల్లుట కాదు, స్వాతం త్యము సిద్ధించిన తరువాత 
ఆంధ సాహిత్యంలో వెలువడిన ఆనర్హ |గంథాలు కొన్నింటిలో ఈ [గంథము 
ఆ్మగగణ్యమని నమ్ముతాను. 


చదివినప్పుడు నాకు స్ఫురించిన కొన్ని భావాలను తమ పునరాలోచన 
కోసము ఇందు సం|గహముగా మనవి బేయుదును. ఇది సూచన మాత మే; 
విమర్శ కాదని [గహింప వేడితిని. 


(౧) “పులి జూదములు, దొమ్మరి ఆటలు తెలు(గు వారివే” (పీఠిక 7) కాని, 
కన్నడ దేశమందును ఇవి ఆంతే వ్యావ్రి గల్లియున్నవి. మొదటిది 
“హులికల్లు" అను పేరుతో నున్నది. మరి “దొమ్మరి' వారినీ, డొంబ, 
దొంద - అని కన్నడు లంటారు. “రో అనునది, (దావిడ బహువచన 
(పత్యయము. తెనుగు _పకృతికి చేరిన దేమో అమర వ్యాఖ్యాత క్షీర 
సామి (11 వ శతకం) స్వవచ జాతులలో 'డోంబి జాతిని చేర్చినా(డు. 
డోంబర్‌ అనేదే దొంబర-దొమ్మ్యర -దొమ్యరి-అయి యుండును. 


(52) 


॥ 410 


(౨) 'వైవ్షవము కన్న శెవమే ఆరవదేశ మందు పాచీన తరము” ఆన్నారు. 


ఈ సిద్ధాంతము ఇంకా విమర్శనీయము. పరమ (ప్రాచీన దావిడ 
వాజ్మయములో శివ కేళవు లిరువురును గలరు. మరి ఆళ్వార్ల కాల 
మింకను నిస్సంశయముగా నిళ్చితం కాలేదు. పరస్పర స్పర్థతోను, 
సమరసంగానూ ఈ రెండు మతాలూ పవహాంచిన ప్రే ఆదినుండి కాన 
వచ్చుచున్నవి. పు, 20. 


అభ్రే థ్రీ రామానుజుల కాలమునకు చాలా ముందే చేంక టేళ్యరులను 
విషుమూర్తిగా ఆరాధించి పాడిన ఆళ్వార్ల సాత్యుం సులభముగా తోసి 
వే యరానిది. (శ్రీపతి పండితుల భాష్యం పలు సందేహాల కాస్పద 
మయినది. మరియు చాలా ఆధునికము. రామానుజాచార్యులు చేసినదెల్ల 
అన్యాకాంత మైన మూర్తిని పనస్సాధించడ మేనని వారి చరిత. వేంక టేశ 
మూర్తిలో శైవ, వీరభద, స్కంధ, శ క్తి చిహ్నాలు కొన్ని కలవనుట 
సత్యము, దాని నిశ్చిత స్వరూప మిదియని (పకృత౦ నిర్ణయించడం 
కొంత తొందరపనేమో. 


(౩) మాహురమ్మకు నగ్నత్వం జైన సం|పదాయమునుండి వచ్చిందేమో అని 


(౪) 


శంకించినారు. జైనులలో నగ్న పురుషులున్నారు కాని స్రీ దేవతలు 
అట్టివారొక్కరూ లేరు. ఇదిగాక మన దేశమందలి నగ్నపూజ తాంతి 
కము దకీణాబారము కన్న [పాచీనమైన ఈ వామాచార తంత పంథ 
బౌద్దుల మూలాన పరదేశములనుండి మనలో వచ్చి చేరుకున్నదని 
శోధకులు భావిసాారు. పు. 26, 


“కర్ణాట కిరాట కీచకులు” అని నా పాఠము. కిరాటులు కోమట్లు, లోభు 
లన్నమాట. బోయజాతికి . అందును పల్లకీ మోసేవారికి = పస క్రి 
లేదనుకొందును, పు. శీ0. 


(౫) “పాలెము' పు, 88. దాశ్నీణాత్య పదమను తమ మాటకు ఉ త్తరదేశ మందు 


(=) 


వ్యవనోరంలో లేనిదని అర్థమనుకొ ౦టాను, ఇది |దావిడపదం కాదు. 
పాల్య-పాలింపదగిన -ళబ్దిము. 'కావలి' అనే అర్థం తామేేవాసినారు, పు 8. 
“యథార్థముగా (బాహ్మణులయందే అన్ని విద్యలు కేం[దీక్సృతములై. 
యుండెను. ఇది తమవంటివారు చెప్పవలసిన అతిశయోక్తి కాదని 


(౭) 


(౧౦ 


స 


411 


మనవి; ఇట్టి వాక్యములను అక్షరశః (గపాంచే అల్పబుద్ధు లెందరో 
యుందురు కాన, సంస్కృతి, తత్వము = వీరికి సంబంధించిన విద్యలు 
తప్ప వక్కిన వ్యావహారిక విద్యలన్నీ ఆందరికీ అందుబాటులో నుండి 
నవే, కనుక రాజులు ఆవవాదభూతులు కావలసిన దెప్పుడూ లేదని 
తలంతును పుట ౪2. 


'ఆంతరాళిక యతి [గామాభిరామంబుగా” ఆన్న చోట యతుల సము 
దాయమనే ఆర్థము చెప్పుట మేలు. గురులఘు(మతాది తాళొంగము 
లను ఒక అంద మైన రీతిలో కూరుట యతి. ఇది ఆళదకళ (పాణము 
లలో నొకటి, పలువధములు గలది ఆంతేకాని “జత్మిగామ విధాని 
మను విశిష్టపద్ధతి నా దృష్టికి రాలేదు. పుట 122. 


వీర ౦టాలు శబ్దమునకు మీ వ్యాఖ్యయె న్యాయము. సోమ శేఖర శర్వ 
గారి అరిం సతి శబమునకు వలె తాత్పర్యం కావచ్చును. పర్యంత 
శబ్దం పాకృతంలో “'పేకంతంి అయి తెలుగులో పేరంటము - పేరట 
ముగా మారింది. పెరంటాలు ఆశగా ఇరుగు పొరుగు స్రీ. |కమంగా 
శుభాహ్వానానికి తగిన ముత్తైదువ అని భాయార్థం కలిగింది. చేసే 
శుభానికి * పేరంటము'” పేరై నది, పుట 6898, 


యక్షకిన్నగశాదులు ఆనార్యులన్నారు, జక్కులు అనునది యక్ష శబ 
భవమని పాకృతవాజ్మ యం తెలుపుతుంది. కన్నడంలోగూడా “జక్క” 
అనే రూపం. అమరసింహుడు - 4వ శతాబ్దంలో యక్షులు దేవయోను 
లన్నాడు. పరమ |పాచీన జైన బౌద్ధవాజ్మ యంనిండా యక్షీయకీణుల 
[ప్రచారం ఎక్కువగా ఉన్నది. కనుక జక్కులు తెలుగు దేళంవారే 
అనుట విచారక్షమం కాదేమో. మరియు ఆర్యానార్య శబ్దాలు మన 
యిప్పటి విజ్ఞానంలో చాలా జాగ త్తగా వాడవలసిన వకుకుంటాను. 
టిబెటులో “జాక్‌ అనబడు అడవిజాతుల వారున్నారం౦దును, యయలదీ 
ఉత్తర దిగ్భాగమే. ఏమో! పుట 15. 


కృష్ణదేవరాయలు హేళనము చేసిన “రెడ్లు సామాన్యపు పల్లె కాపు 
లనుకొంటాను.  రెడ్డిజాతిని ఆయన పరిహసించెనని తలపనక్కరలేదు, 
సోమళర్మవంటి కొందరు (బాహ్మణబువులను గూడ నితడు పరిహ 
సించెను. కాని ఆతని _బాహ్మణ భక్తీ పసిద్ధము. పుట 210. 


౧0౨ 


412 


'పడవాట్లి సరియైనరూపము. “పడతాలు' అచ్చుతప్పని తలంతును, 


భటుడు ఆనియే యర్థము. పుట 216, 


౧౨. సా త్తిన-సా తిని అనునవి అర్చకుల కాఖలుగావు, వై వవులలో ద్విజ- 


ద్విజేతర భేద సూచకములు. కా త్రిన-ళాతాద అను ఆరువ పలుకుబడి 
కిది తెలిగింపు ధరించిన=ధరింపని- అని యర్థము, జందెమని శేష 
మూహ్యము. కనుక సాత్తిన వారు |బ్రాహ్మణులు, సాత్తని వారు 
ఆశీ అవి 
ఇతరులు. కాబర్లై ఏష్టుచిత్తుని వెంట సరకులను మోసికొనివచ్చిన ఆ 
వెష్షవులు “విధిని షేధంబు లెరింగి తే” నన్నాడు రాయలు. సాత్తని వారే 
ఇప్పటి సాతానులు. ఈ యిద్దరికిని తామిచ్చిన లక్షణ మెక్క-డిదో 
యెొజుగను. పుట 221, 


శంఖఫలకము అరవములో “చంగప్పలహై' అను దాని పరివర్హనము. 
మధురలోని |పాచీన (ద్రావిడ 'సంఘి సంపదాయములకు చేరినది. 
ఆరవ[వాత 'చంకి అనే యుండునుగదా. తెలుగులో అది సంస్కృత 
వాసనతో “ళంఖ'గా మారిందేమో. ఈ మార్పు ధూర్జటి కాలానికే 
వచ్చిందేమో. ధూర్జ్డటే స్వతం్యతంగా చేసిన [ప్రయోగాలో. ఆచ్చువేసిన 
వారు అవివేచనగా చేసిన రూపాలో కాళహస్తి మాహాత్మ్యంలో ఎన్నో 
యున్న వికదా. పుట 224. 


ఇడుమ కట్టు= చేతులు కాళ్లు ఆడించ వీలు లేకుండా కట్టిన బంధన మన 
వచ్చును. 'ఇంటి ముందటి అను నర్థము సుగహం కాదు. పుట 281. 


'గర్భమంటపీ*త్యాది పద్శము ఇంకొకమారు తాము చూడ చేడినాను. 
మాలదాసరికి అభిషేక తీర్థహజాత లేదు; ఆతని కిచ్చు తీర్ధము నేల 
కడిగిన నీళ్ళే. దానినిగూడ ఇచ్చువాడు 'తివర్దేతర జాతివాడే. 'గుడి 
వెడలి వచ్చు' ఆ మురికి నీటినిగూడా తాకుటకు ఆతని కర్ణతలేదు 
ఇంతేకాని ఆ ఘట్టములో మీరు సూచించిన వైష్టవసంస్కార వియత్వ 
మునకును శూ(దార్చక త కమునకును అవకాశము కానరాదు. పుట 2లళికీ, 


(౧౬) “కూచి మారమనోజ,..కామ సిద్ధాంతములు” 'నాట్యము'లా? పు, 247. 


(౧౭) “రఘునాథ మేళ” అనునది వీణ, రాగముగాదు. పుట. 250. 


418 


(౧౮) “'హుసివోవగా” అంటే అసత్య ముకా(గా-వ్యర్థముకా(గా = అని యర్థము, 
కన్నడంలో ఇదే అర్థం “పుసి అని [ప్రాచీనరూపం తెలుగులో “ముసి” 
అని మారింది. శ-ర-చూడుడు. 'అధికముకాగా' అనే అర్థము స్వంత 
మగును. పుట 2/7. 


(౧౯) “తొక్కుడు బొమ్మ” ఏదో నాకూ తెలియదు. కాని చరణాభజుకాళ్ళ 
కాంతి, దానిమీ(ద, ఐచ్చెనజవన్నె-ఘటింప వడికిరని అర్థము సరసంగా 
లభిస్తుంది, చరణాభ బచ్చెన-రాట్నపు సామానులు కావు. పుట 282, 

(౨౦) “పొప్పశి' అన్న పదము మా ప్రక్క 'చౌకపు ఇండ్లు అనే అర్ధంలో 
వాడుదురు. పొప్పళి చీరలు నేటికిని ఈ దేశం కోమటి స్రీలకు చాలా 
(వియం. పొప్పాయికాయతో డీనికి సంబంధం మృగ్యం, ఈ పదం 
కన్నడ-లోనూ కలదు. కదరీపతి కన్నడదేశానికి సమీపంలోనివాడు, 
పుట 80260, 


(౨౧) “జక్కి-ణి' సరియెన రూపమే దక్షిణ నాట్య పద్ధతులలో నొకడు గాటోలు, 
పుట 810. 

(ల. వేణుగోపాల శతకం పదాల సారంగపాణి [వాసినదని విన్నాను, 
అతడు తిరుపతికి దగరివాడు. పుట ల8£+5, 


తమ [గంథం నిజంగా నా కెన్నో నూతన విషయాలను తెలిపినది. 
మరల ఎన్నోమారులు పరింపవలసి యున్నాను. ఆ గౌరవమే పె భిన్నాభి 
|పాయములను ప్రీ పునర్విమర్శకొ ఆకు నన్నా ఇట్లు [వాయ (బేరించినది. మీ 
రన్యధా భావింపరని నే నెజుగుదును, 

మీ గంథం చేతికందిననాడే మా అన్నగారు గోపాల కృష్ణమాచార్యులు 
ఇక్క డనుండి కొంత పఠించి నావలెనే చాలా సంతోషించిరి. ఆనాడే వారు 
వెళ్ళవలసియుండి పూర్తిగా చూడలేరై రి. ఇంతలోనే వారు హైదాబాదుకు 
వత్తురు. తమ దర్శనము చేయదలచిశారు, జ్యాతిషమందు వారెక్కువ పరిశ 
మించినవారని తాము వినియుందురని నమ్మెదను. మరియు విజయనగర చరిత 
వారి కభిమానపా,తము, సాహిత్యమందు చక్కని పాండిత్యము. 


చి త్తగింపుండు, మీవాడు 
రా. అనంత కృష్ణశర్మ 
ణ 


శీ1కీ 


వై వాటిలో కొన్నింటికి కొంత సమాధాన మవసరమైనది. సంఖ్య (౪) 
తెలంగాణములో బోయీలు అను జాతివారు నేటికిని కలరు. వారిప్పటికీ పల్ల 
కీలు మోయుదురు. రాయలసీమలో రాయచూరు గుల్బర్గా జిల్లాలో (బేండర్‌ ) 
బోయ జాతి కలదు. ఆది విజయనగర సైన్యాలలో ముఖ్యమైనదిగా నుండెను. 
కీ. శ. ౧౬౦౦ |[పాంతములందు కాక మానమూ ర్తి తన రాజవాహన విజయ 
మందు యుద్ధ సైనికులలో బేండర్‌ బోయలను వర్ణించినాడు, 


కర్ణాట కిరాటకీచకులు ఆను శబ్ద్బములను వాడినందున ఈ ఆపో హకు 
తావు కలిగినందున ఈ తడవ కర్గాటకిరాతులు అని వివరించినాను. భోయి, 
బోయ అను భిన్నజాతులను నేను వివరించినాను ; అంతే. 


సంఖ్య (౬) - |బాహ్మణులలో అన్ని విద్యలు కేందదీకరించి యుండెను. 
అనుటలో విద్యలనగా. వేద వేదాంగములను నర్భములలో వాడితిని, మెలకువ 
తక్కు వగుటబచే ఆతివ్యా ప్రదోషము చుట్టకొని (పేమస్వరూపులగు మిత్రుల 
సుకుమారపు మందలి.పునకు గురి అయినాను, 

సంఖ్య (౯) జక్కులు-యయలు తెలుగు దేశమువారు కారేమో అని 
నాకును స్ఫురించియుండెను. _|క్రీస్తుశ కారంభములో అంతకు పూర్వమందు 
మంగోలియా [పాంతమందు యభీ (Yh) అను జాతి [పబలమై యుండెను 
వారే యకులేమో ఆని తలచినాను. టిబెటులో “జాక్‌” అనునది జడలబ_రెకు 
చేరు. కాన ఆది కాదనుకొందును. యయులు ఆక్సస్‌ లేక జక్సార్చీసు నదీ 
(పాంతీయులై నను ఆయి యుందురు, 


సంఖ్య (౧౦) కృష్ణరాయలు రెడ్లను సేళనము చేసెననుట తపు పట్టు 
టకు కాదు. ఆయినను ఆ మాటను గంథమునుండి తొలగించినాను, 

నంఖ్య (౧౩) శంఖ శబ్దార్థము ఉ_త్తమసూచన, 

సంఖ్య (౧౬) నాట్యమనుట నా స్టాలిత్యమే. సవరించుకొన్నాను. 

సంఖ్య (౧౭) రఘునాథమేళ అనునది రాగమని పిలుతురు. |వాసినదే 
(వాసితిని. ఇప్పుడు శ్రీ శర్మగారినే [ప్రమాణముగా తీసుకొన్నాను, 


సంఖ్య (౨౦) పొప్పడికాయ మనదేళానిది కాదు. దక్షిణ అమెరికా 
నుండి (కీ, ఈ. ౧౭ శతాబ్దాంతమందు మనదేశానికి వచ్చెను. కాన కదిరీపతి 


శ్తీ15 


కాలాని కది లేదని తెలిసియు ఏదో సమాధానము |వాసితిని, ఇప్పుడు శ్రీ కర్మ 
గారి నూచన సరిపోయినది. 


సంఖ్య (౨౧) “జక్కి ణి" దేవర్ల కొలుపులు ఆని రాయలసీమలో బహు 
పాంతములందు చేయుదురు. ఎవరైన ఒకయింటిలో హఠాన్మరణ మొందిన ఆ 
యింట కలుగు విపత్తులకా మృతినొందినదయ్య మే కారణమని ఆమెను “జకి, అ 
దేవరగా నిలుపుకొని ఆ యింట వివాహములకు ముందు ఆ దేవరను గొలుతురు, 
ఒక చిన్నముంత దానికి మూతగా బొంగరమువంటి ఒక చిన్న మట్టిపిడత క్‌ 
ఇట్టవి మూడు జతలు పెట్టి టక్కీ-ణి చిందులతో, వాద్యముతో, పాటలతో 
కొలుపులు కొలుచువారిని విలిపించి దేవర్షను కొలుతురు. ఆ కొలుపులోని ఆటకే 
జక్కి_ణి అన్నానేమో అని యిప్పుడు నాకు స్ఫురిస్తున్నది, 

ఈ కొద్దిపాటి సమాధానము ఆత్మ సమర్గనమునకుగాక ఇప్పుడు తోచిన 
భావాలను వెల్ల డించుకొనుటకే యని మనవి. 


UNIVERSITY OF HYDERABAD 
LIBRARY 
HYDERABAD (A.P.) 


1. Books / Journals should be 
returned on the due date. 


2, Borrowers are responsible for 
every book / journal taken by 
them and will be expected to 
pay for any book / journal 
damaged, defaced or lost. 


Help to keep the book fresh and clean